-
రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
Shantanu Naidu New Tata Safari Facelift: దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో హారియర్, సఫారీ ఫేస్లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. ప్రీ-ఫేస్లిఫ్ట్ వెర్షన్ల మాదిరిగానే అద్భుతంగా ఉన్న ఈ మోడల్స్ చాలా మంది కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రతన్ టాటా మేనేజర్, గుడ్ఫెలోస్ వ్యవస్థాపకుడు 'టాటా సఫారీ ఫేస్లిఫ్ట్' (Tata Safari Facelift) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతంలో టాటా నానో కారుని ఉపయోగించే రతన్ టాటా మేనేజర్ 'శంతను నాయుడు' (Shantanu Naidu) తాజాగా ఖరీదైన సఫారీ ఫేస్లిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వైట్ కలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారులో ఇప్పటికే 1000 కిమీ ప్రయాణించినట్లు, దానికి 'యుకీ' అని పేరు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. టాటా సఫారీ ఫేస్లిఫ్ట్ రూ. 16.19 లక్షల ప్రారంభ ధరలో దేశీయ విఫణిలో లాంచ్ అయిన సఫారీ ఫేస్లిఫ్ట్ మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. సఫారీ ఫేస్లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్, 350 న్యూటన్ మాటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. కాస్మిక్ గోల్డ్, గెలాక్సీ సఫైర్, లూనార్ స్లేట్, స్టార్డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్నోవా కాపర్ వంటి ఆరు కలర్ ఆప్సన్లలో లభించే ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. -
రతన్ టాటా తర్వాత గ్రూప్ సారథులు వీరే..?
దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో దాదాపు రూ.20 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతోంది. అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పుతున్నట్లు జీక్యూ ఇండియా ప్రచురించింది. టాటాగ్రూప్ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది. లేహ్ టాటా నోయెల్ టాటా పెద్ద కుమార్తె. మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా తన కెరియర్ ప్రారంభించారు. సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాయా టాటా లేహ్ టాటా సోదరి మాయా టాటా. మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన కెరియర్కు మొదలుపెట్టారు. ఆమె పోర్ట్ఫోలియో మేనేజర్గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్గా పని చేశారు. యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు. టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు. నెవిల్లీ టాటా నోయెల్ టాటా చిన్న కుమారుడు. నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ట్రెంట్ హైపర్మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్లైన వెస్ట్సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థగా ఉంది. ఇదీ చదవండి: ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్! టాటా గ్రూప్ సంస్థల స్వరూపం టాటా గ్రూప్ సంస్థలను 1868లో జెమ్షేడ్జీ టాటా స్థాపించారు. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో 30 కంపెనీలు ఉన్నాయి. ఆరు ఖండాల్లోని 100 కంటే ఎక్కువ దేశాలలో సేవలందిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ, డిజిటల్ వ్యాపార సేవలందిస్తోంది. టాటా స్టీల్ సంవత్సరానికి 33 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. టాటా మోటార్స్ కార్లు, యుటిలిటీ వెహికల్స్, బస్సులు, ట్రక్కులు, డిఫెన్స్ వాహనాలను తయారుచేస్తోంది. టాటా కెమికల్స్ బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేస్తోంది. టాటా పవర్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ. ఇండియన్ హోటల్స్ టూరిజం, ట్రావెల్ ఇండస్ట్రీలో ప్రపంచస్థాయి సేవలందిస్తోంది. టైటాన్ కంపెనీ ద్వారా ఆభరణాలు, కళ్లద్దాలు తయారుచేస్తున్నారు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రూ.3 లక్షల కోట్లు దాటింది. టాటా ఎలెక్సీ ఇంజినీరింగ్ డిజైన్, సాంకేతిక సేవలు అందిస్తోంది. టాటా డిజిటల్ ద్వారా వినియోగదారుల అవసరాలు తెలుసుకుని మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 నాటికి టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,71,467 కోట్లుగా ఉంది. -
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు భారీ ఊరట!
సింగూర్ నానో ఫ్లాంట్ వ్యవహారంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్కు ప్రతిఫలం దక్కింది. మధ్యవర్తిత్వ అవార్డు (arbitral award) కింద అసలు, వడ్డీ మొత్తం రూ.766 కోట్లు పొందనుంది. వెస్ట్బెంగాల్ సింగూర్లో ‘టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) ఆటోమొబైల్ మ్యానిఫ్యాక్చరింగ్ ఏర్పాటు కోసం కేటాయించిన కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో నష్టపోయాం. ఈ వ్యవహారంలో ఎట్టకేలకు ఊరట లభించింది. వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబీఐడీసీ)..టీఎంఎల్కు అసలు, వడ్డీ చెల్లించేలా ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్ ట్రిబ్యూనల్స్ బృందం తీర్పు వెల్లడించారు’ అని టాటా మోటార్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. ట్రిబ్యునల్ నిర్ణయంతో.. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా సెప్టెంబర్ 1, 2016 నుంచి అసలు, ఏడాదికి 11 శాతం వడ్డీతో రూ.765.78 కోట్ల మొత్తాన్ని అందుకోనున్నారు. టాటాకు వెయ్యి ఎకరాల భూమి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం టాటా మోటార్స్కు నానో కార్లను తయారు చేసుకునేందుకు సుమారు 1,000 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. అయితే, ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులు, రైతుల నుండి తీవ్ర నిరసనతో టాటా మోటార్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్కు అప్పటికే టాటా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. దీంతో పెట్టుబడులు విషయంలో తమకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టకేలకు ఈరోజు ట్రిబ్యూనల్ టాటా మోటార్స్కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇక నాటి పరిస్థితుల దృష్ట్యా టాటా మోటార్స్ నానో కార్ల తయారీ ప్లాంట్ను పశ్చిమ బెంగాల్ నుంచి తయారీ యూనిట్ను గుజరాత్లోని సనంద్కు మార్చింది. అక్కడే టాటా నానో తయారైంది. -
రషీద్ ఖాన్కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారా?
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషిద్ ఖాన్కు రూ.10 కోట్ల వరకు ఆర్ధిక సహాయం చేసినట్లు సోషల్ మీడియాలోని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వార్తల్ని రతన్ టాటా కొట్టిపారేశారు. గత వారం ప్రపంచకప్లో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చిన ఆ జట్టు.. పాక్పై పంజా విసిరింది. పాకిస్తాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆఫ్గాన్ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్గాన్ క్రికెటర్ రషిద్ ఖాన్ ఇండియన్ ఫ్లాగ్ను ప్రదర్శించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. రషిద్ ఖాన్కు ఐసీసీ రూ.55 లక్షల జరిమానా విధించిందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రతన్ టాటా..రషిద్ ఖాన్కు భారీ మొత్తంలో ఆర్ధిక సహాయం చేసేలా హామీ ఇచ్చారంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి. I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players. I have no connection to cricket whatsoever Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official… — Ratan N. Tata (@RNTata2000) October 30, 2023 ఆ కథనాల్ని రతన్ టాటా ఖండించారు. తనకు క్రికెట్తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఏ క్రికెటర్కి రివార్డ్ ఇవ్వలేదని, అలా ఇచ్చేలా ఐసీసీకి సైతం ఎలాంటి సూచనలు చేయలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. తన అధికారిక ప్లాట్ఫారమ్ల నుండి వస్తే తప్ప వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్లు, తప్పుడు వీడియో కథనాల్ని నమ్మొద్దని రతన్ టాటా నెటిజన్లను కోరారు. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
రతన్ టాటా కలల కారు ‘నానో’ ఈవీ కారుగా వచ్చేస్తుందా? అందులో నిజమెంత?
రతన్ టాటా ! పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ధీశాలి. పద్మ అవార్డుల గ్రహీత. మంచితనం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శం. నమ్మకంతో కూడిన నాయకత్వం, నైతిక విలువలు, ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. రూ. వేల కోట్ల సంపద ఉన్నా కూడా సాధారణ జీవితం గడుపుతున్న అసామన్యుడు. అలాంటి రతన్ టాటాకు ‘నానో’ కారంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ కారే భారత మార్కెట్లో తిరిగి ఎలక్ట్రిక్ వెహికల్గా విడుదలవుతుందుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నానో ఎలక్ట్రిక్ కారుగా రాబోతుందా? సోషల్ మీడియా పోస్టుల్లో నిజమెంత? త్వరలో, టాటా గ్రూప్ నానో ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తుందంటూ నానో’ పోలికతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు, టాటా నానో న్యూ అవతార్. కారు ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుందనే ఆ ఫేక్ సోషల్ మీడియా ఫోటో సారాశం. ఇంతకీ నానో తరహాలో ఉన్న ఆ కారును ఏ ఆటోమొబైల్ కంపెనీ తయారు చేస్తుందనే అనుమానం రావొచ్చు. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా 998 సీసీ పెట్రోల్ ఇంజిన్తో ‘టయోటా ఐగో’ హ్యాచ్బ్యాక్ కారును అమ్ముతుంది. కానీ ఈ కారు భారత్లో మాత్రం అందుబాటులో లేదు. గత కొన్నేళ్లుగా భారత్లో ఈవీ కార్ల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వాటి బడ్జెట్ ఎక్కువ కావడంతో వాహనదారులు టాటా గ్రూప్ బడ్జెట్ ధరలో ఈవీ కారును అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదిగో అప్పటి నుంచి టాటా సంస్థ నానో ఈవీ కారు వస్తుందనే ప్రచారం జోరందుకుంది. తాజాగా, టాయోటా ఐగో కారు ఫోటోల్ని చూపిస్తూ.. ఇదే టాటా నానో ఈవీ కారు అంటూ ఫోటోలు విడుదలయ్యాయి. అయితే, ఆ ఫోటోలు ఫేక్ అని తేలింది. నానో కారు ఇలా పుట్టిందే నానో కారు.. 15 ఏళ్ల క్రితం ఆటోమొబైల్ రంగంలో అదో పెను సంచలనం. రతన్ టాటా ప్రతి రోజు తన కారులో వెళ్లే సమయంలో స్కూటర్లపై వెళ్లుతున్న తల్లిదండ్రుల మధ్యలో కూర్చొవడం గమనించాను. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నాకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలాగే ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. అలా పురుడు పోసుకుందే నానో కారు. ప్రపంచంలో అత్యంత చౌకైన కారు.. కానీ 2008 జనవరి 10న టాటా మోటార్స్ ‘నానో’ కారును విడుదల చేసింది. సామాన్యుల కోసం టాటా కంపెనీ అతి తక్కువ ధర అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా గుర్తింపు పొందింది. అయితే క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోయి పూర్తిగా కనుమరుగైంది. చదవండి👉ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
ఆనంద్ మహీంద్రను దాటేసి మరీ టాప్లోకి రతన్ టాటా
పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వ్యాపార దక్షతతో మాత్రమే కాదు, తనదైన వ్యక్తిత్వం, దాతృత్వంతో ఆయన ప్రత్యేకతే వేరు. అందుకే సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇదే విషయాన్నిమరోసారి నిరూపించుకున్నారు రతన్ టాటా. మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు. భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో టాప్లో ప్లేస్ కొట్టేశారు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్లో ఎక్స్( ట్విటర్) ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు. ఆ తరువాతి స్థానంలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు. ( కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక) ఈ జాబితాలో టాప్ టెన్లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ సత్య నాదెళ్ల, వ్యాపార వేత్తలు నందన్ నీలేకని, రోణీ స్క్రూవాలా, హర్ష వర్థన్ గోయింగా, కిరణ్ మజుందార్ షా, ఉదయకోటక్ నిలిచారు. దీంతో పాటు, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల 12వ వార్షిక లిస్ట్ను కూడా హురున్ వెల్లడించింది. వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సంపదలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్లోకి దూసుకొచ్చారు. గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంబానీ సంపద ఈ కాలంలో భారీగా పుంజుకుని దాదాపు రూ.8,08,700 కోట్లకు చేరింది. గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. సీరం ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావల్లా రూ. 2,78,500 కోట్ల మొత్తం సంపదతో మూడో స్థానంలోఉన్నారు.ఈ జాబితాలో రూ.2,28,900 కోట్ల సంపదతో శివ నాడార్ నాల్గవ స్థానంలో ఉన్నారు, గోపీచంద్ హిందూజా , అతని కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్ల సంపదతో దిలీప్ షాంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు. -
ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!
ఆధునిక కాలంలో ఫుడ్, కూరగాయలు వంటి వస్తువులను డోర్ డెలివరీ పొందుతున్నారు. వీటి కోసం ప్రస్తుతం అనేక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ (పెట్రోల్ అండ్ డీజిల్) కూడా డోర్ డెలివరీ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కల్చర్ పెరిగిపోతోంది. కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. స్విగ్గి, జొమాటో తరహాలోనే వాహన వినియోగదారులకు అవసరమైన పెట్రోల్ డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఒక భార్యాభర్తల జంట (చేతన్ వాలుంజ్ & అదితి భోసలే) రెపోస్ ఎనర్జీ (Repos Energy) ప్రారంభించారు. రెపోస్ ఎనర్జీ పెళ్లి తరువాత ఎలాగైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో అదితి, చేతన్ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అనుకున్నట్లుగానే సంస్థను పూణేలో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది భారతదేశం మొత్తం మీదే సుమారు 65 నగరాల్లో విస్తరించి ఉంది. డోర్ టు డోర్ పెట్రోల్ డెలివరీ చేసి బాగా ఆర్జిస్తున్నారు. రెపోస్ ఎనర్జీ ద్వారా వినియోగదారులకు, కంపెనీలకు పెట్రోల్ సరఫరా చేసి నెలకు రూ. 2.2 కోట్లు వరకు సంపాదిస్తున్నారు. ప్రారంభంలో వీరి ఆదాయం నెలకు రూ. 70,000 మాత్రమే. ఈ జంట చేస్తున్న బిజినెస్ చాలామంది పెద్ద పారిశ్రామిక వేత్తలను కూడా ఆకర్శించింది. వీరి కొత్త ఆలోచనకు ముగ్దుడైన రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. దీంతో వారి బిజినెస్ మరింత వేగంగా ముందుకు వెళ్లడం ప్రారంభించింది. గతేడాది వీరి ఆదాయం రూ. 65 కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 200 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రెపోస్ ఎనర్జీ ప్రస్తుతం టాటా గ్రూప్తో మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ ఎలక్ట్రికల్, లార్సెన్ & టబ్రో, షిండ్లర్, జేడబ్ల్యు మారియట్ హోటల్, ఫీనిక్స్ మాల్, ది వెస్టిన్ హోటల్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలను కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి.. మరింత లాభాలు పొందటానికి సంస్థ సన్నద్ధమవుతోంది. -
రతన్ టాటా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి.. ఎవరీ నవాజ్బాయి టాటా!
దేశీయ దిగ్గజ సంస్థ టాటా (TATA) గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే ఈ కంపెనీ 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. నేడు ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ నేడు సుమారు రూ. 24 లక్షల కోట్లు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఒకప్పుడు మహిళ డైరెక్టర్గా పనిచేసిందని చాలామందికి తెలియకపోవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్ 1925లో టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్గా 'నవాజ్బాయి' పనిచేసింది. ఆమె తన భర్త రతన్జీ టాటా మరణానంతరం కంపెనీకి సారథ్యం వహించి 1965లో మరణించే వరకు దానిని నడిపించింది. కంపెనీని నడిపించడమే కాకుండా ఈమె తన జీవితకాలంలో ఎన్నో దానధర్మాలు చేసింది. దీనికోసం 1928లో ఒక సంస్థను స్థాపించించింది. ఈ సంస్థ ప్రస్తుతం సర్ రతన్ టాటా ఇన్స్టిట్యూట్ (RTI) అనే పేరుతో పేద మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. కుకరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ లాండ్రీ విభాగాలలో వారి స్వంత జీవనోపాధికి శిక్షణ ఇస్తుంది. నవాజ్బాయి టాటా స్వయంగా రతన్ టాటా గ్రాండ్ మదర్. రతన్ టాటా చిన్నప్పుడు ఈమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడినని గతంలో చాలాసార్లు వెల్లడించాడు. రతన్ & నవాజ్బాయి టాటా ఇద్దరూ కొన్నేళ్లు ఇంగ్లాండ్లో నివసించారు. వీరికి కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మేరీ వ్యక్తిగత స్నేహితులు. ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్మైట్రిప్ కో-ఫౌండర్ టాటా సంస్థ పురోగతికి నవాజ్బాయి ఎంతో కృషి చేసింది. జమ్సెట్జీ టాటా నిర్దేశించిన సూత్రాలు, ఆదర్శాలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తుందని ఆమె నిర్ధారించేవారు. ఈ సంఘటనలు రతన్ టాటా గతంలో కూడా చాలా గొప్పగా వెల్లడించారు. -
ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే. అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! 2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
వ్యక్తిగా వినమ్రుడు... వ్యవస్థగా త్రివిక్రముడు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎనభై ఆరేళ్ల రతన్ నావల్ టాటాను పరి చయడం చేయడమంటే సూర్యుణ్ణి దివిటీతో చూపే ప్రయత్నం చేయటం. టాటా గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవడం ఎందుకంటే క్యాలెండర్ మారిన ప్రతిసారీ ఆయన కొత్తగా కనిపిస్తారు. పారిశ్రామిక రంగాన్ని సమస్యలు చుట్టిముట్టిన ప్పుడల్లా ఆయన సరికొత్తగా వెలుగులీనుతారు. తోటి పారి శ్రామికవేత్తలకు మాత్రమే కాదు, సమాజం మొత్తానికి భరోసాగా నిలుస్తారు. బడా పారిశ్రామికవేత్తగానే కాదు... వ్యక్తిగా కూడా రతన్ టాటా సమున్నతుడు. చదువయ్యాక అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒకమ్మాయిపై రతన్ మనసు పారేసుకున్నారు. ఆమె కూడా ఆయన్ను ప్రేమించింది. ఈలోగా 1962లో భారత–చైనా యుద్ధం వచ్చింది. అంతే! ఈ వివాహానికి తొలుత అంగీకరించిన ఆమె తల్లిదండ్రులు భయంతో మీమాంసలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో నాయనమ్మ నవాజ్ బాయ్ టాటాకు ఒంట్లో బాగోలేదని కబురంది రతన్ భారత్ వెళ్లాల్సి వచ్చింది (రతన్కు పదేళ్ల వయసున్నప్పుడే తల్లితండ్రులు నావల్ టాటా, సూనీ టాటా విడాకులు తీసుకున్నారు. అందుకే రతన్ నాయనమ్మ పెంపకంలో పెరిగారు). అంతా సవ్యంగా పూర్తయి అమెరికా వెళ్లేసరికి ప్రియురాలు తల్లితండ్రుల మాట విని వేరే పెళ్లి చేసుకుంది. పర్యవసానంగా రతన్ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ! ‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనది అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నాడాయన ఒకసారి. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 40 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు బ్రాండ్ విలువ 2,600 కోట్ల డాలర్లు. మొన్న మార్చి నాటికి ఆ గ్రూపు మార్కెట్ వ్యాల్యూ 21.1 లక్షల కోట్లు. ఆయన నెట్వర్త్ అక్షరాలా రూ. 8,250 కోట్లు! ఇది ముఖేశ్ అంబానీ నెట్వర్త్ రూ. 9,610 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువే కావొచ్చు. మరో పారిశ్రామికవేత్త అదానీ నెట్వర్త్ 5,510 కోట్లతో పోలిస్తే కొంచెం ఎక్కువే కావొచ్చు. కానీ రాజకీయ రణరంగంలో ఆ ఇద్దరి పేర్లూ తప్ప రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదు. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు... అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. అందుకే ఇద్దరు పిల్లలున్న మధ్యతరగతి కుటుంబం ఒక స్కూటర్పై ఇరుక్కుని కూర్చుని హోరు వానలో ప్రయాణిస్తుండగా చూసి తనకు ‘నానో’ కారు ఐడియా వచ్చిందని రతన్ చెబితే దేశం విశ్వసించింది. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి. ఇంకో సంగతి ప్రత్యేకించి చెప్పుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఈ మధ్య ఒక అంటువ్యాధిలా మారిన లే–ఆఫ్లకు టాటా గ్రూపు అనుబంధ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ పూర్తి వ్యతిరేకం. టాటా గ్రూప్లో సాల్ట్ నుంచి స్టీల్ వరకూ ఉన్న సంస్థల్లో సైతం ఎక్కడా సిబ్బందిని అన్యాయంగా తొలగించారన్న నింద ఏనాడూ రాలేదు. దేశ నిర్మాణంలో, మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో చేసిన గణనీయమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించి గౌరవించింది. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
రతన్ టాటా తొలి రెజ్యూమ్, ఎలా సిద్ధం చేశారంటే..
155 ఏళ్ల టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా ప్రపంచంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చాలామంది మాదిరిగానే రతన్ టాటా కూడా ఉద్యోగిగా తన కెరీర్ను ప్రారంభించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన సారధ్యంలో టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్ల వ్యాపార సంస్థగా ఎదిగింది. రతన్ టాటా తొలినాళ్లలో ఉద్యోగం కోసం రెజ్యూమ్ను ఎలా సిద్ధం చేశారు? ఉద్యోగం ఎలా దక్కించుకున్నారు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రతన్ టాటా మొదటి రెజ్యూమ్ అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. అయితే అతని గురువు, బంధువు అయిన జేఆర్డీ టాటాకు ఇది సంతృప్తి కలిగించలేదు. నాటి రోజులను రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు, ‘అతను(జేఆర్డీ టాటా) ఒక రోజు నాకు ఫోన్ చేశారు. మీరు భారతదేశంలో ఉంటూ, ఐబీఎంలోనే ఎందుకు ఉద్యోగం చేయడం?’ అని అడిగారు. దీంతో టాటా గ్రూప్లో ఉద్యోగం చేసేందుకు రతన్ టాటా తన రెజ్యూమ్ను జేఆర్డీ టాటాకు అందజేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో అతని వద్ద రెజ్యూమ్ లేదు. వెంటనే రతన్ టాటా తాను పనిచేస్తున్న ఐబీఎం కార్యాలయంలోని ఎలక్ట్రిక్ టైప్రైటర్ సాయంతో తన రెజ్యూమ్ను రూపొందించారు. తాను ఐబీఎం ఆఫీస్లో ఉన్నానని, తనను జేఆర్డీ టాటా రెజ్యూమ్ అడిగారనే విషయం తనకు గుర్తుందని ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పనిచేస్తున్న ఆఫీసులో ఎలక్ట్రిక్ టైప్ రైటర్లు ఉండటంతో ఒక రోజు సాయంత్రం ఆ టైప్ రైటర్ సాయంతో రెజ్యూమ్ టైప్ చేసి అతనికి ఇచ్చానని తెలిపారు. 1962లో మొదటి ఉద్యోగం రెజ్యూమెను అందించిన తర్వాత రతన్ టాటాకు 1962లో టాటా ఇండస్ట్రీస్లో ఉద్యోగం వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం తర్వాత, 1991లో జేఆర్డీ టాటా మరణానంతరం రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలోని ప్రముఖ బిలియనీర్లలో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో పట్టభద్రుడయ్యారు. నాటిరోజుల్లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో స్థిరపడాలని రతన్టాటా భావించారు. అయితే తమ అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా? -
లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?
టాటా గ్రూప్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు 'రతన్ టాటా' (Ratan Tata). భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు ఈయన పేరు సుపరిచయమే. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ పారిశ్రామిక దిగ్గజం కంపెనీ బాధ్యతలను త్వరలోనే తమ తరువాతి తరం టాటాలకు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా గ్రూప్ సంస్థ బాధ్యతలను 'మాయా టాటా' (Maya Tata)కు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ. 20,71,467 కోట్ల విలువైన కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా.. అని ఇప్పటికే చాలామందిలో తెలుసుకోవలసిన ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు సమాధానంగా మాయా టాటా పేరు వినిపిస్తోంది. నిజానికి ఇటీవల కాలంలోనే 'మాయా టాటా' మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఈమె మాత్రమే కాకుండా ఆమె సోదరుడు నెవిల్లే, సోదరి లేహ్ కూడా కంపెనీలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కూడా రతన్ టాటా ఆధ్వర్యంలో వ్యాపార పాఠాలు నేర్చుకున్న వారే. ఇదీ చదవండి: గుడ్న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు - వారికి మాత్రమే! రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా & అలూ మిస్త్రీ దంపతుల కుమార్తె ఈ 'మాయా టాటా'. ఈమె యూకేలోని బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నట్లు సమాచారం. ఆ తరువాత కాలంలో టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తరువాత టాటా డిజిటల్ కంపెనీలో పనిచేసింది. ప్రస్తుతం టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు మెంబరుగా ఉన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ బాధ్యతలను మాయా టాటా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 34 సంవత్సరాలకే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించనున్న మహిళగా రికార్డ్ సృష్టించనుంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఇంకా దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు టాటా గ్రూప్ సామ్రాజ్యాధినేత ఎవరనేది తెలిసిపోతుంది. -
రతన్ టాటాను చంపాలనుకుంది ఎవరు?
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటాం. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో టాటా గ్రూప్ ఛైర్మన్గా రతన్ టాటా తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించాడని, ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్కు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. శాంతి మంత్రమే అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు.రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. ఎక్కడా తలవంచలేదు ఇలా, లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో.. దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. టాటాను చంపేందుకు కుట్ర జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన కాంపిటీటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. టాటా మోటార్స్ లేబర్ ఎన్నికలు సజావుగా జరిగేలా గ్యాంగ్స్టర్తో వ్యవహరించేటప్పుడు రతన్ టాటా కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నా..శాంతి యుతంగా తాను ఆ సమస్య నుంచి బయటపడిన విధానం, తీసుకున్న నిర్ణయాల పట్ల తానెప్పుడు చింతించలేదని రతన్ టాటా ఆ వీడియోలో మాట్లాడారు. చదవండి👉 మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి? -
ఎయిరిండియా లుక్ మారింది.. అదరగొడుతుంది
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చేతికి చేరిన విమానయాన సంస్థ ఎయిరిండియా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త బ్రాండ్ గుర్తింపుని, విమానాల లుక్, లోగోను గురువారం ఆవిష్కరించింది. ది విస్టా పేరిట తీర్చిదిద్దిన కొత్త లోగో.. అపరిమిత అవకాశాలు, పురోగతి, భవిష్యత్పై సాహసోపేత అంచనాలను ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్రాండ్స్కి ప్రత్యేక రూపునిచ్చే ఫ్యూచర్బ్రాండ్ కంపెనీతో కలిసి దీన్ని రూపొందించినట్లు వివరించింది. ఈ ఏడాది డిసెంబర్లో వినూత్న హంగులతో ఏ350 విమానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రయాణికులు కొత్త లోగోను చూడవచ్చని ఎయిరిడియా వివరించింది. మరోవైపు, ఎయిరిండియా అనేది తమకు మరో సాధారణ వ్యాపారంలాంటిది కాదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మానవ వనరులతో పాటు ఎయిర్లైన్ని అన్ని విధాలుగా అప్గ్రేడ్ చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. -
హీరోలా ఉన్న ఈ బిజినెస్మెన్ ఎవరో గుర్తుపట్టారా?
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక వేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఈ రోజు ఎలా ఉంటాడనేది అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యువకుడుగా ఉన్న సమయంలో ఎలా ఉండేవాడని చాలా మందికి తెలియకపోవచ్చు. టాటా గ్రూప్ ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఈయన యంగేజ్లో హీరోలా ఉండటం ఇక్కడ చూడవచ్చు. కరోనా సమయంలో దేశ ప్రజల కోసం వేల కోట్లు వెచ్చించిన ఈ నిరాడంబరురుని సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను కూడా ప్రధానం చేసింది. సామాన్య ప్రజలకు సైతం కారు అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో నానో కారుని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈయన సొంతమే. ఇదీ చదవండి: ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ ప్రస్తుతం టాటా నానో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకావడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలైతే బడా సంస్థలకు కూడా గట్టిపోటీ ఇస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా దేశం కోసం ఆలోచించే మహానుభావుడు రతన్ టాటా అనటంలో ఎటువంటి సందేహం లేదు. -
లెజెండ్ రతన్టాటాకు ‘మహా’ గౌరవం: ప్రశంసల వెల్లువ
టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను మరో అవార్డు వరంచింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న అవార్డును ఆయన దక్కించు కున్నారు. తమ సరికొత్త అవార్డుతో ఆయనను సత్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. (ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) ఈ ఏడాది నుంచి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు పాల్గొన్న సమావేశంలో ఈ ఏడాది పారిశ్రామికవేత్తకు తొలి ఉద్యోగ రత్న అవార్డుకు రతన్ టాటాను ఎంపిక చేశారు.విశిష్ట వ్యక్తులకు అందించే అత్యున్నత రాష్ట్ర గౌరవం మహారాష్ట్ర భూషణ్ అవార్డు సంప్రదాయాన్ని అనుసరించి, ఈ సంవత్సరం నుండి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యువ పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త, మరాఠీ పారిశ్రామికవేత్తలకు కూడా అవార్డులు అందించనుంది.మహారాష్ట్ర ఉద్యోగ రత్న అవార్డును వ్యాపారం, పరిశ్రమలు, విద్య, రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, బ్యాంకింగ్, ఐటీ, ఆహార రంగాలలో అపారమైన కృషి చేసిన వ్యక్తులు , సంస్థల ప్రయత్నాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఈ అవార్డును తొలి గ్రహీత టాటా గ్రూపు నిలిచింది. అయితే రతన్ టాటా తొలి అవార్డు దక్కించుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే లెజెండ్ రతన్ టాటాకు మహా అవార్డుపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రతన్ టాటా విశిష్టమైన కెరీర్లో అనేక ఇతర ప్రశంసలతో పాటు, భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు పౌర పురస్కారాలు: 2008లో పద్మవిభూషణ్, 2000లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. (ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!) ఉప్పు నుంచి విమానాల దాకా సేవలందిస్తూ దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో టాటా గ్రూపు. కంపెనీని విజయపథంలో నడిపించిన,ఇప్పటికీ గ్రూపు గౌరవ ఛైర్మన్గా కొనసాగుతున్న రతన్ టాటా జీవన శైలి ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి దాయకం. టీసీఎస్, టాటా ఎయిరిండియా లాంటి ఎన్నో సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. -
రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?
Ratan Tata Dream Car: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి 'రతన్ టాటా' (Ratan Tata) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన కలలు కారుగా ప్రసిద్ధి చెందిన 'టాటా నానో' (Tata Nano) గత కొంతకాలంగా దేశీయ విఫణిలో ఉత్పత్తికి నోచుకోలేదు. అయితే ఇది మళ్ళీ ఇండియన్ మార్కెట్లో కొత్త హంగులతో విడుదలవుతుందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నానో ఎలక్ట్రిక్ కారు.. నివేదికల ప్రకారం, టాటా కంపెనీ తన ఐకానిక్ కారు నానో గురించి ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఈ చిన్న హ్యాచ్బ్యాక్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా అడుగెట్టే అవకాశం ఉంది. ప్రతి భారతీయుడు కారు కలిగి ఉండాలనే అభిప్రాయంతో రతన్ టాటా దీనికి ఊపిరి పోశారు. ఇప్పటి వరకు కూడా మనదేశంలో అతి తక్కువ ధరకు లభించే కారు టాటా నానో. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) ప్రారంభంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కారు క్రమంగా అమ్మకాల విషయంలో వెనుకపడిపోయింది. అయితే దీనిని ఎస్ఆర్కే (SRK) డిజైన్స్ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కారుగా తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది పట్టణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ టాటా నానో ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఏంటి అనే అధికారిక సమాచారం రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
మా నాన్నను అవమానిస్తే ఊరుకునేది లేదు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తోన్న ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చిన అజిత్ పవార్ రాజకీయ నాయకుల వయసు ప్రస్తావన తీసుకొచ్చి వినూత్న వాదనకు తెరతీశారు. వయసు మీదపడ్డ శరద్ పవార్ ను తప్పుకుని కొత్తనీరుకి దారినివ్వాల్సిందిగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఘాటుగా సమాధానమిచ్చారు ఎన్సీపీ తిరుగుబాటు వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు మార్గదర్శకమని, 75 ఏళ్ళు దాటిన రాజకీయ నాయకులు రాజకీయాల్లో కొనసాగడం ఆ పార్టీలో ఉండదని చెబుతూ ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లను ఉదహరించారు. ప్రస్తుతం మీ వయసు 83.. కాబట్టి ఇంక చాలు రిటైర్మెంట్ ప్రకటించండి.. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము మీ దీర్గాయుష్షును కోరుకుంటామని.. అలా చేయడం వలన కొత్త తరం కొత్త ఉత్సాహంతో పనిచేస్తుందని అన్నారు. #WATCH | Maharashtra Deputy CM Ajit Pawar says, "You portrayed me as a villain in front of everyone. I still have deep respect for him (Sharad Pawar)...But you tell me, IAS officers retire at 60...even in politics - BJP leaders retire at 75. You can see the example of LK Advani… pic.twitter.com/T2XqCzEH89 — ANI (@ANI) July 5, 2023 అజిత్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎంపీ, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందిస్తూ.. ‘‘అమితాబ్ బచ్చన్ వయసు 82 ఏళ్ళు.. ఇప్పటికీ ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీకోపం మాపైనే కదా. కాబట్టి మమ్మల్ని తిట్టినా సహిస్తాం. కానీ మా నాన్నగారిని అమర్యాదగా మాట్లాడితే మాత్రం సహించబోమని అన్నారు. ఎదుటివారి వయసు పెరిగింది మమ్మల్ని ఆశీర్వదించమని అడిగే ముందు అసలెందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించుకోవాలి. రతన్ టాటా సాహెబ్ కంటే కేవలం మూడేళ్లే పెద్దవారు. అయినా దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడంలేదా అని అడిగారు. అవినీతిని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వంపైనే మా పోరాటం. అసలైన ఎన్సీపీ పార్టీ శరద్ పవార్ తోనే ఉందని మా గుర్తు మాతోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. #WATCH | "Disrespect us, but not our father (Sharad Pawar). This fight is against the BJP government. BJP is the most corrupt party in the country," says NCP Working President Supriya Sule, in Mumbai. pic.twitter.com/BxrUYpU6WI — ANI (@ANI) July 5, 2023 ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు -
రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..
రతన్ టాటా గురించి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు బాగా తెలుసు. కేవలం దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. దేశం కోసం తనదైన రీతిలో సేవ చేస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా కూడా. ఈయన ఇటీవల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రతన్ టాటా పోస్ట్.. వర్షాకాలం మొదలైంది, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వాహనదారులు హడావిడిగా వాహనాలు నడుపుతూ ఉంటారు. అయితే కొంత మంది చేసే చిన్న తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వర్షం పడే సమయంలో మూగజీవాలు వాహనాల కింద ఉండే అవకాశం ఉంటుంది. కావున వాహనాలను తీసేటప్పుడు తప్పకుండా కింద ఏమైనా ఉన్నాయా అని గమనించండి, లేకుంటే అవి తీవ్రంగా గాయపడి అవకాశం ఉంటుందని, కావున వాటికి ఆశ్రయం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we… pic.twitter.com/BH4iHJJyhp — Ratan N. Tata (@RNTata2000) July 4, 2023 ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. నిజానికి రతన్ టాటా ఇలాంటి అభ్యర్థన చేయడం ఇదే మొదటిసారి. మూగ జీవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు మూగ జీవాల పట్ల ఎంత ప్రేమ ఉందొ మనకు ఇట్టె అర్థమైపోతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) రతన్ టాటా పెంపుడు శునకాల్లో ఒకటైన టిటోకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల 2018 లండన్లోని బకింగ్హామ్ ప్యాలస్లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి అందుకునే పురస్కారానికి కూడా వెళ్ళలేదు. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. -
‘దయ చేసి నమ్మకండి.. అవన్నీ అవాస్తవాలే’!
రతన్ టాటా..పరిచయం అక్కర్లేని పేరు. భారత్లోని దిగ్గజ పారిశ్రామికవేత్త. గొప్ప మానవతావాది..దాతృత్వం కలిగిన వ్యక్తి. టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నా.. టాటా ట్రస్ట్కు ఛైర్మన్గా కొనసాగుతూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా, ఆన్లైన్లో తన పేరుతో జరుగుతున్న మోసాలపట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని రతన్ టాటా కోరారు. ‘దయచేసి అప్రమత్తంగా ఉండండి. నేను ఏ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టలేదు. ఏ క్రిప్టోకరెన్సీ సంస్థలతో సంబంధం లేదు’ అని అన్నారు. క్రిప్టోకరెన్సీ కంపెనీలతో తనకు సంబంధం ఉందని ఏవైనా కథనాలు లేదా ప్రకటనలను మీరు చూసినట్లయితే, అవి పూర్తిగా అవాస్తవమని, పౌరులను మోసం చేయడానికి ఉద్దేశించినవి అని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. క్రిప్టో మోసాలకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్ను షేర్ చేశారు. I request netizens to please stay aware. I have no associations with cryptocurrency of any form. pic.twitter.com/LpVIHVrOjy — Ratan N. Tata (@RNTata2000) June 27, 2023 చదవండి👉 రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం? -
నమ్మరు కానీ రతన్ టాటా తమ్ముడితడే.. చిన్న అపార్ట్మెంట్లో..
Ratan Tata Brother Jimmy Naval Tata: భారతీయ ఆటో మొబైల్ రంగానికి ఆజ్యం పోసిన టాటా కుటుంబం గురించి అందరికి తెలుసు. అయితే ఇప్పుడు టాటా గ్రూప్ అనగానే 'రతన్ టాటా' గుర్తుకు వస్తాడు. అయితే రతన్ టాటాకి వివాహం కాలేదు, కానీ తోబుట్టువులతో కూడిన ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో చెప్పుకోదగ్గ వ్యక్తి రతన్ టాటా తమ్ముడు 'జిమ్మీ నావల్ టాటా'. రతన్ టాటా తమ్ముడంటే ఆయన మాదిరిగానే వ్యాపార లావాదేవీలు బాగా చూసుకునే వ్యాపార వేత్త, బిలీనియర్ అని ఊహిస్తారు. కానీ ఆలా ఊహిస్తే మీ ఊహ తప్పే అవుతుంది. ఎందుకంటే జిమ్మీ నావల్ టాటా వారి వ్యాపార సామ్రాజ్యానికి దూరంగా సాధారణ ప్రజలలో ఒకరుగా కలిసి జీవిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ముంబైలో ఒక 2BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. జిమ్మీ నావల్ టాటా మీడియాకి దూరంగా ఉండటమే కాకూండా, వ్యాపారాలన్నింటికీ కూడా దూరంగా ఉంటూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. నావల్ టాటా కుమారుడు, రతన్ టాటా తమ్ముడై ఉండి ఇలాంటి జీవితం గడుపుతున్న జిమ్మీ నావల్ టాటాను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. 90వ దశకంలోనే జిమ్మీ నావల్ తన తండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన వస్త్ర వ్యాపారంలో వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక టాటా ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలలో పనిచేసి అనతి కాలంలోనే విరమణ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక చిన్న ఫ్లాట్లో సామాన్యుడిలా జీవిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) ఈ ఏడాది ప్రారంభంలో రతన్ టాటా తన తమ్ముడు జిమ్మీ టాటాతో కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'అవి సంతోషకరమైన రోజులు, మా మధ్య ఏమి రాలేదు' అని ఇందులో రాసారు. ఆ ఫోటో 1945లో తీసుకున్నట్లు ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?) రతన్ టాటా ఆస్తులు సుమారు రూ. 3500 కోట్లకంటే ఎక్కువ. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలియని జిమ్మీ నావల్ రతన్ టాటా కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఎందుకు ఈయన వ్యాపారాల మీద ఆసక్తి చూపడం లేదు అనేదానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకోవడం వల్ల అన్నింటికీ దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) Did you know of Ratan Tata's younger brother Jimmy Tata who lives a quiet reticent life in a humble 2 bhk flat in Colaba, Mumbai! Never interested in business, he was a very good squash player and would beat me every time. Low profile like the Tata group! pic.twitter.com/hkp2sHQVKq — Harsh Goenka (@hvgoenka) January 19, 2022 RGP ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయాంక్ గతంలో షేర్ చేసిన ఒక ట్విటర్ పోస్ట్లో జిమ్మీ టాటా ఒక చిన్న ఫ్లాట్లో ఉన్నారని, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. అంతే కాకుండా అతడు మంచి స్క్వాష్ ప్లేయర్ అని తనని (గోయెంకాను) ఎప్పుడూ ఓడించేవాడని చెప్పుకొచ్చాడు. కొన్ని వార్తా పత్రికలు అందించిన సమాచారం ప్రకారం.. జిమ్మీ టాటాకు మొబైల్ ఫోన్ లేదని, కేవలం వార్తాపత్రిక ద్వారా అతని అన్ని అప్డేట్లను పొందుతారని తెలిసింది. -
బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే..
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి.. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు. శాంతాబెన్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్రీ బిర్లా ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్తో సత్కరించింది. సూని టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్బాయి టాటా చేరదీసి పెంచారు. ఇందిరా మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు. -
మెట్గాలాలో బిలియనీర్లు అంబానీ, మస్క్, రతన్ టాటా, ఆనంద్ మహీంద్ర: ఫోటోలు వైరల్
సాక్షి,ముంబై: మెట్గాలాలో బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు సందడి చేశారు. అదేంటి ఫ్యాషన్ ఈవెంట్లో వ్యాపారవేత్తలకు ఏం పని అనుకుంటున్నారా? ఇదంతా ఏఐ ఆర్ట్ మహిమ. ఏఐ ఆర్టిస్ట్ అబూ సాహిద్ బుర్రలో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ చిత్రాలు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఇంట్రస్టింగ్ ఫోటోలతో ఇన్స్టాలో పాపులర్ అవుతున్నారు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ట్విటర్ అధినేత, ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్జుకర్ బర్గ్ మెట్ గాలాకు హాజరవుతున్నట్లు ఊహించి ఈ ఫోటోలను సృష్టించారు. మిడ్ జర్నీ సాయంతోరూపుదిద్దిన ఈ ఫోటోల్లోబాబా రాందేవ్, అజీం ప్రేమ్జీతో పాటు, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజాల ఫోటోలు కూడా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి మెట్గాలా. ఈ ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ను న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రతీ ఏడాది నిర్వహిస్తుంటారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా కృత్రిమ మేధస్సుతో (ఏఐ) రూపొందించిన చిత్రాలు ఇంటర్నెట్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు , డిజిటల్ ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇండియన్ డిజిటల్ ఆర్టిస్ అబూ సాహిత్ ప్రముఖంగా నిలుస్తున్నారు. ఇన్స్టాలో ఆయనకు 21.6వేల గ్రామ్ ఫాలోవర్లున్నారు. ఆయన పేజీ నిండా ఇలాంటి ఫోటోలు చాలానే ఉన్నాయి. View this post on Instagram A post shared by SK MD ABU SAHID (@sahixd) -
వీడియో: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా కార్
-
1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) ఈ రోజు ప్రపంచం గర్వించే స్థాయిలో ఉంది. అయితే ఈ స్థాయికి రావడానికి కంపెనీ ఎన్నో అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. టాటా ఇండికాతో మొదలైన కంపెనీ ప్రయాణం ఎలా సాగింది? ఇందులో రతన్ టాటా పాత్ర ఏవిధంగా ఉందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1998 ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టిన టాటా ఇండికా అప్పట్లోనే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ దృష్టిని తనవైపు మరల్చుకుంది. ఫ్యామిలీ హ్యాచ్బ్యాక్గా అమ్ముడైన ఈ కారు కోసం కంపెనీ ''ఇంకెప్పుడూ చిన్న కారుతో బాధపడాల్సిన అవసరం లేదు'' అనే చిన్న యాడ్తో ఎంతో మంది ప్రజలను ఆకర్శించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో రతన్ టాటా 'టాటా ఇండికా'ను డ్రైవ్ చేయడం చూడవచ్చు. WildFilmsIndia అప్లోడ్ చేసిన ఈ వీడియోలో ఇండికా తయారు చేసే విధానం కూడా చూడవచ్చు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం కోసం 'టాటా ఇండికా'ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ప్రజల అవసరాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఉత్పత్తి నాణ్యతలో లోపాలు ఉన్నట్లు తెలిసింది. నిజానికి టాటా కంపెనీ ప్యాసింజర్ వెహికల్ తయారు చేయడం అదే మొదటిసారి. అంతకు ముందు కంపెనీ ట్రక్కులు, బస్సులు మాత్రమే తయారు చేసేది. (ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..) టాటా ఇండియాలో ఏర్పడిన నాణ్యత లోపాలను కంపెనీ పరిష్కరించగలిగింది. ఆ తరువాత ఇండికా వి2 పేరుతో రీబ్యాడ్జ్ వెర్షన్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది కేవలం దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా ప్రవేశించిన మొదటి వాహనం కూడా ఇదే. అనేక సంవత్సరాలుగా డీజిల్ ఇంజన్తో నడిచే ఏకైక వాహనం ఇండికా కావడం విశేషం. ఇందులోని 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 60 bhp పవర్ 104 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1998 డిసెంబర్ 30 న ప్రారంభమైన టాటా ఇండికా కేవలం 1,15,000 బుకింగ్స్ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 2.59 లక్షలు, టాప్ ఎండ్ డిఎల్ఎక్స్ ధర రూ. 3.9 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి.