-
కుక్క కోసం ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్.. రతన్ టాటా మంచి మనసు
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఒక కుక్కకు రక్తదానం చేసేందుకు మరో ఆరోగ్యకరమైన కుక్కను కనుగొనాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబయి ప్రజలను కోరారు. రక్తదానం చేసే శునకానికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉండాలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. తన కోసం ఏదీ కోరని ఆయన ఒక కుక్క కోసం ఈ పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ముంబయిలో యానిమల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ఇటీవల ఏడు నెలల కుక్కను అడ్మిట్ చేశారు. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి వెంటనే రక్తం కావాలని కోరారు. ఆ విషయం రతన్ టాటా దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.‘ముంబయి..నాకు మీ సహాయం కావాలి. మా యానిమల్ ఆసుపత్రిలో ఉన్న ఏడు నెలల కుక్కకు అత్యవసరంగా రక్తమార్పిడి చేయాల్సి ఉంది. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. మాకు అత్యవసరంగా ముంబయిలో డాగ్ బ్లడ్ డోనర్ కావాలి. రక్తం ఇచ్చే కుక్క వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. 1 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 25 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండాలి. కనీసం గత ఆరు నెలలుగా కుక్కకు పూర్తిగా టీకాలు వేయాలి. డీవార్మింగ్(నులిపురుగులు) చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు’ అంటూ పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్కు స్పందిస్తూ చాలా మంది వ్యక్తులు కుక్క కోసం సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఆయన మంచి మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. ‘దేని కోసం పోస్ట్ చేయని లెజెండ్, తనది కాని కుక్క కోసం సహాయం కోరుతున్నారు. వినయం గురించి తెలిపే గొప్పపాఠం ఇది’ అని ఒకరు కామెంట్ చేశారు. అయితే రతన్ టాటా పోస్ట్ చూసి చాలామంది డాగ్ బ్లడ్ డోనార్లు సంప్రదించారని తెలిసింది. ‘సహాయం చేసిన వారికి నా అభినందనలు’ అంటూ రతన్ టాటా పోస్ట్లో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata)రతన్ టాటాకు మూగజీవులపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. వీలైతే ప్రతిఒక్కరు ఒక కుక్కను దత్తత తీసుకోవాలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూంటారు. టాటా గ్రూప్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రాంతం చుట్టూ నివసించే వీధికుక్కల కోసం ప్రత్యేక కెన్నెల్ను(సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేశారు. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్గా భావించే స్మాల్ యానిమల్ హాస్పిటల్ను టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 200 కంటే ఎక్కువ జీవులకు వైద్యం అందించేలా 5 అంతస్తుల్లో విస్తరించి ఉంది. -
మీకు తెలుసా? ప్రముఖ వ్యాపారవేత్తల ఫస్ట్ జాబ్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.గౌతమ్ అదానీభారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.ఇంద్రా నూయీ1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు.అర్దేషిర్ గోద్రెజ్గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్ నిలిచింది. -
టాటా కారుకి ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చింది ? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే..
విలాసం కోసం కాకుండా కారు అవసరం అనే యుగంలో ఉన్నాం మనం. అందుకే కాబోలు ప్రతి నగరం, పట్టణం, గ్రాముల్లో కార్ల వినియోగం పెరిగిపోయింది. అయితే నైన్టీస్లో అలా కాదు. మారుతి 800, 1000 తర్వాత 1990లలో టాటా కంపెనీ ‘టాటా సుమో ఎంయూవీ’ని మార్కెటికి పరిచయం చేసింది. నాటి నుంచి టాటా కార్లలో టాటా సుమో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ఎంతలా అంటే కేవలం మూడేళ్లలో లక్షకుపైగా అమ్ముడు పోయింది. అదే సమయంలో టాలీవుడ్ వెండితెరపై సుమోలు ఎగిరించి.. కథానాయకులతో తొడలు కొట్టించి.. మాస్ ప్రేక్షకుల్ని మురిపించిన దర్శకులు వెలుగులోకి వచ్చారు.అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన టాటా సుమో కారు వెనుక కథ ఏంటో తెలుసా? ఈ కారుకు సుమో అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి ? ఈ పేరు జపనీస్ రెజ్లర్ల నుండి ప్రేరణ పొందిందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది తప్పు. టాటాలో కష్టపడి పనిచేసి, టాటా సంస్థ విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగి పేరు మీద టాటా సుమో అని కారుకి పేరు పెట్టారు.పుకార్లు షికార్లుసాధారణంగా ప్రతి రోజు టాటా మోటార్స్ టాప్ ఎగ్జిక్యూటీవ్లు అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మూల్గావ్కర్ అలా కాదు రోజు ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత వచ్చేవారు. ఆ తర్వాత టాటా డీలర్లు మూల్గావకర్కు ఫైవ్స్టార్ హోటళ్లలో లంచ్ ట్రీట్ ఇచ్చారని, అందుకే తమతో భోజనానికి రావడం లేదనే పుకార్లు వ్యాపించాయి.ట్రక్ డ్రైవర్లతో రోడ్ సైడ్ దాబాలో ఇంతకీ ఎండీ తమతో భోజనానికి ఎందుకు రావడం లేదా అనే ప్రశ్నే ఉన్నత ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రశ్నార్ధకంగా మారేది. అయితే దీన్ని చేదించేందుకు కొంతమంది ఉద్యోగులు మూల్గావ్కర్ మధ్యాహ్న దినచర్య గురించి తెలుసుకునేందుకు రహస్యంగా ఆయన్ను వెంబడించారు. వారు ఆశ్చర్యానికి గురి చేసేలా మూల్గావ్కర్ ట్రక్ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఆహారం తింటూ కనిపించారు. భోజన సమయంలో టాటా వాహనాలు వినియోగిస్తున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులు గురించి చర్చించేవారు.లోపాల్ని సరిదిద్దే ప్రయత్నంఏ అంశాలు బాగున్నాయో, లోపాల్ని గుర్తించిన తర్వాత కార్యాలయానికి వచ్చేవారు. అందులో పనిచేస్తున్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్ అభివృద్దికి మూల్గావ్కర్ కృషి చేశారు.టాటా సుమో పేరు అలా వచ్చిందికాబట్టే టాటా ఆయన పేరు మీద ఐకానిక్ ఎస్యూవీని లాంచ్ చేసింది. సు-మంత్ మో-ఓల్గాకర్ పేరు మొదటి అక్షరాలతో టాటా సుమో పేరును మార్కెట్కి పరిచయం చేసింది. చివరగా టాటా సుమో గోల్డ్ 10 సీట్ల ఎస్యూవీ ధరరూ.5.26లక్షల నుంచి రూ.8.93లక్షల మధ్య ఉంది. -
ఆ సమయంలో కూడా 'రతన్ టాటా' భయపడలేదు: శివశంకరన్
మీరు 30 నిమిషాల్లో చనిపోతారని ఎవరైనా చెబితే మీరు ఎలా స్పందిస్తారు? కొందరు షాక్కు గురవుతారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు, కొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరణం అంచుదాకా వెళ్ళినప్పుడు కూడా రతన్ టాటా ఎలా ఉన్నారో ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ వివరించారు.'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమణి' అనే పోడ్కాస్ట్లో ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ మాట్లాడుతూ.. నేను (శివశంకరన్), రతన్ టాటా సింగపూర్ నుంచి సీషెల్స్కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఓ భయంకరమైన వార్త వినపడింది. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అయింది. రెండోది కూడా విఫలమైతే 30 నిమిషాల్లో క్రాష్ అయ్యే అవకాశం ఉందని టాటా సెక్రటరీ ఒకరు వెల్లడించారు.ఈ వార్త వినగానే మరణం చాలా దగ్గరగా ఉందని తెలియగానే నా మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే నా జీ మెయిల్ పాస్వర్డ్ను నా కొడుకుకు ఈ-మెయిల్ ద్వారా షేర్ చేస్తూ.. నేను ఇంకా ఎక్కువ రోజులు జీవించాలని అనుకుంటున్నానని చెప్పాను. అయితే నేను చనిపోతున్నానని ఆ సమయంలో రాజీ పడ్డాను అని శివశంకరన్ పేర్కొన్నారు.ఆ సమయంలో రతన్ టాటా మాత్రం నిశ్శబ్దంగా.. ఏ మాత్రం కలవరపడకుండా కనిపించరు. పైలట్లను వారి పనిని చేయనివ్వండి అని అతను చెప్పారు. అదృష్టవశాత్తూ రెండో ఇంజన్ ఫెయిల్ కాకపోవడంతో మేమిద్దరం ప్రమాదం నుంచి బయటపడ్డామని అన్నారు.విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందుగానే విమానాశ్రయంలో అంబులెన్స్లు అగ్నిమాపక సిబ్బంది నిలబడి ఉండడం చూశాను. ఎయిర్పోర్ట్లో విమానం దిగిన తర్వాత మంటలు చెలరేగకుండా రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించినట్లు శివశంకరన్ వివరించారు. -
టాటా గ్రూప్లో ఆశా కిరణం లియా టాటా!
పెదనాన్న రతన్ టాటా బాటలో టాటా గ్రూప్ లో తనదైన ముద్ర వేస్తున్నారు లియా టాటా. రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా పెద్ద కుమార్తె ఈ లియా టాటా. మంచి విద్యా నేపథ్యం, బిజినెస్ కెరియర్తో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.విద్యా నేపథ్యంటాటా గ్రూప్లో తనదైన అద్భుత కెరీర్ను ఏర్పరుచుకుంటున్న లియా టాటాకు బలమైన విద్యా నేపథ్యం ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ప్రతిష్ఠాత్మక ఐఈ బిజినెస్ స్కూల్ లో మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె కార్పొరేట్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సమకూర్చుకున్నారు.తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా 2006లో తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు లియా టాటా. కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తాజ్ హోటల్స్ లో డెవలప్ మెంట్ అండ్ ఎక్స్ టెన్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హోటల్ కంపెనీలో భాగమైన లగ్జరీ హోటల్ చైన్ వృద్ధి, వ్యూహాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.టాటా గ్రూప్లో కీలక పాత్రఇండియన్ హోటల్ కంపెనీలో అంతర్భాగమై, దాని కార్యకలాపాలు, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు లియా టాటా. ఈ ఇండియన్ హోటల్ కంపెనీ ప్రఖ్యాత తాజ్ హోటల్స్తో సహా టాటా గ్రూప్ హోటళ్ళ విస్తృతమైన నెట్వర్క్ను నిర్వహిస్తుంది. బ్రాండ్ శ్రేష్ఠత, ఆతిథ్యం వారసత్వాన్ని కొనసాగించడంలో లియా టాటా కృషి గణనీయంగా ఉంది.తాజ్ హోటల్స్ లో బాధ్యతలతో పాటు, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనకు అంకితమైన టాటా గ్రూప్ విభాగమైన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా లియా టాటా కొనసాగుతున్నారు. 2022 నవంబర్లో జరిగిన ఈ నియామకం ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన దశ. సంస్థలో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న లియా టాటాకు ఆమె వృత్తిపరమైన ప్రయాణానికి రతన్ టాటా మార్గనిర్దేశం చేస్తున్నారు. -
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
ముంబై: లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్లో ముంబైలోని ఆరు లోక్సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ముంబైలో పలువురు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబైలోని మలబార్ హిల్లో ఓటు వేశారు. #WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024 ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేశారు. అనిల్ అంబానీ ముంబైలోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఓటింగ్ ప్రారంభమయ్యే వరకు ఎదురు చూసి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Industrialist Anil Ambani stands in a queue at a polling booth in Mumbai, as he waits for the voting to begin.#LokSabhaElections2024 pic.twitter.com/UUCC9iOmyu— ANI (@ANI) May 20, 2024 ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పెద్దార్ రోడ్లోని పోలింగ్ బూత్లో కూతురు అనన్య బిర్లాతో కలిసి ఓటు వేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. The privilege of deciding who will govern us…It’s a blessing. Never turn your back on a blessing… pic.twitter.com/rkSAr2CQMh— anand mahindra (@anandmahindra) May 20, 2024 ముంబైలోని పెద్దార్ రోడ్డు సమీపంలో తన కుటుంబంతో కలిసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు వేశారు. జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, హెచ్డీఎఫ్సీ మాజీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ ముంబైలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.VIDEO | Lok Sabha Elections 2024: "I, along with my family cast our votes together. It is a very proud moment for every Indian and it is a moment of pride to participate in an election of 140 crore people," says RBI governor Shaktikanta Das (@DasShaktikanta) after casting his… pic.twitter.com/YEPMHmKCqn— Press Trust of India (@PTI_News) May 20, 2024 -
రతన్టాటా.. అణువణువూ ఆదర్శమే..!
ముంబై: లోక్సభ ఎన్నికల ఐదో దశలో ముంబైలోని ఆరు లోక్సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు.అణువణువూ ఆదర్శమే..వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఈసారి 85 ఏళ్లు పైబడిన వారికి పోలింగ్ కేంద్రానికి వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కానీ 86 ఏళ్ల రతన్ టాటా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన రతన్టాటా అక్కడి పోలింగ్ సిబ్బందితో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.అందరూ ఓటేయాలని పిలుపుముంబైలో ఓటు వేయడానికి రెండు రోజుల ముందే రతన్ టాటా నగరంలోని ఓటర్లందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. “ముంబయిలో సోమవారం ఓటింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటలకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను” అని ఆయన శనివారం ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024 -
లోక్సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం
భారతదేశంలో ఇప్పటికే నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓటర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.మే 20న ముంబైలో (ఫేజ్ 5) ఓటింగ్ జరగనుంది. ముంబై వాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. తప్పకుండా ఓటు వేస్తామన్నట్లు చెబుతున్నారు.ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ముంబై సిటీ, ముంబై సబర్బన్లోని ఆరు లోక్సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024 -
'రతన్ టాటా'కు ప్రతిష్టాత్మక అవార్డు
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా.. దాతృత్వంలో కూడా తనకు తానే సాటి. ఈయన చేసిన సేవలకుగానూ ఇటీవల ప్రతిష్టాత్మకమైన 'పీవీ నరసింహారావు స్మారక అవార్డు' లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను టాటా మోటార్స్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు మీద అందించే ఈ స్మారక పురస్కారం.. సామాజిక సంక్షేమం, మానవతా దృక్పథం పట్ల అసాధారణమైన అంకితభావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు అందిస్తారు. ఈ అవార్డు మార్చి 15న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటా పొందారు. బిలియన్ల కొద్దీ విరాళాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. టాటా ట్రస్ట్ల కింద వ్యక్తిగత స్థాయిలో లక్షల రూపాయల విరాళాలు అందించారు. రతన్ టాటా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి సహా వివిధ రంగాలకు విరివిగా విరాళాలు అందించారు. కాగా తాజాగా ఈయన పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు వెచ్చించి టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో హాస్పిటల్ నిర్మించారు. ప్రస్తుతం రతన్ టాటా.. టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పటికే ఈయన భారతదేశ అత్యుత్తమ పురస్కారాలైన పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) పొందారు. కాగా ఇప్పుడు పీవీ నరసింహారావు స్మారక అవార్డును సొంతం చేసుకున్నారు. Our Chairman Emeritus Mr. Ratan Tata was honoured with the prestigious PV Narasimha Rao Memorial award for his immense contributions in the field of philanthropy. pic.twitter.com/uow3Qv0XOG — Tata Group (@TataCompanies) March 19, 2024 -
Ratan Tata Photos: ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా టాటా.. మరెన్నో ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
రతన్ టాటా వెనుకుండి నడిపిస్తున్న కంపెనీ..!
-
రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన 'రతన్ టాటా' జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రానున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. పుస్తక రచయిత 'మాథ్యూ' (Mathew) నవంబర్ 2022లో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2022లో రతన్ టాటా బయోగ్రఫీ బుక్ విడుదలవుతుందని ఎదురుచూసే అభిమానులకు అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ తరువాత బుక్ లాంచ్ తేదీని 2023 మార్చి నెలకు మార్చారు, మళ్ళీ ఓసారి 2024 ఫిబ్రవరి అన్నారు. ఈ నెలలో కూడా బుక్ లాంచ్ సాధ్యంకాదని తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ మార్చి 30 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి.. దాతృత్వానికి మారుపేరుగా నిలిచినా రతన్ టాటాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంది. ఇటీవలే రతన్ టాటా ఏకంగా 165 కోట్ల రూపాయలతో పెంపుడు జంతువుల కోసం హాస్పిటల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. -
హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి
ఇక్కడ ఫొటోలో చూడగానే ఎక్కడో చూసామనే భావన చాలా మందికి కలుగుతుంది. పుస్తకం చేతపట్టిన సరస్వతీ పుత్రుడుగా కనిపించే ఈయన దేశం గరించదగ్గ మహానుభావుడు, ఉన్నదాంట్లో అంతా దానం చేయగల విశాలమైన హృదయం ఉన్న వ్యక్తి. ఇప్పటికే ఈయనవరో దాదాపు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే మన 'రతన్ టాటా'. ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'రతన్ టాటా' గురించి భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు తెలుసు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్కు ఛైర్మన్గా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఈయన 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు కంపెనీ కంపెనీ తాత్కాలిక ఛైర్మన్గా ఉన్నారు. 1937 డిసెంబర్ 28న పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించిన రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు విడిపోయారు, ఆ తరువాత ఆయన్ను అమ్మమ్మ నవాజ్బాయి పెంచారు. చదువు పూర్తయిన తరువాత టాటా గ్రూప్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. రతన్ టాటా చాలా వరకు ఎక్కువ మొత్తంలో డబ్బును సమాజ సేవకు వెచ్చిస్తారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేసి వాటి పురోగతికి పాటు పడ్డారు, భారతదేశంలో కరోనా విజృంభించిన సమయంలో వేలకోట్లను విరాళంగా ఇచ్చి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఇదీ చదవండి: యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా.. పారిశ్రామిక రంగంలో రతన్ టాటా చేసిన కృషి అనన్య సామాన్యం.. ఆయన దాతృత్వం అపారం. ఇవన్నీ గుర్తించిన భారత ప్రభుత్వం రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇవి మాత్రమే కాకుండా ఈయనకు 2006 మహారాష్ట్ర భూషణ్, దశాబ్దపు పరివర్తన నాయకుడు, ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి లెక్కకు మించిన అవార్డులు ఆయన్ను వరించాయి. -
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక టాటా కంపెనీలో ఉద్యోగాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఉద్యోగాల కోసం ట్రాన్స్జెండర్ అభ్యర్థుల నుంచి టాటా స్టీల్ దరఖాస్తులు కోరుతోంది. ఇంగ్లిష్లో మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో, ఏదైనా విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే.. 2022 ఫిబ్రవరిలో కూడా టాటా స్టీల్ 12 మంది క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ట్రాన్స్జెండర్లను ఒడిశాలోని కళింగనగర్ ప్లాంటు కోసం నియమించుకుంది. దీనికి ముందు గనుల్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) కార్యకలాపాల కోసం, ఝార్ఖండ్లోని వెస్ట్ బొకారో కోసం 14 మంది ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసింది. 2025 నాటికి 25శాతం లింగవైవిధ్యం కలిగిన ఉద్యోగులు ఉండేలా చూడాలని టాటా స్టీల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
జంతువుల కోసం టాటా హాస్పిటల్ - ఎక్కడో తెలుసా?
ప్రముఖ వ్యాపారవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ముంబైలో జంతువుల కోసం అత్యాధునిక హాస్పిటల్ నిర్మించడానికి సంకల్పించారు. సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ఆసుపత్రిలో కుక్కలు, పిల్లులు, కుందేళ్ళు వంటి ఇతర చిన్న జంతువులను 24x7 సేవలు అందించనున్నట్లు సమాచారం. రతన్ టాటా నిర్మించనున్న ఈ జంతువుల హాస్పిటల్ కోసం ఏకంగా రూ. 165 కోట్లు వెచ్చించినట్లు, టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారని, నా జీవిత కాలంలో అనేక పెంపుడు జంతువులను చూసాను, కాబట్టి పెంపుడు జంతువుల కోసం ఆధునిక పరికరాలతో ఒక హాస్పిటల్ కావాలనే ఆవశ్యకతను అర్థం చేసుకున్నానని రతన్ టాటా ప్రస్తావించారు. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. ఇదీ చదవండి: ఖరీదైన వస్తువులు పోతున్నాయ్.. ఆందోళనలో భారతీయ సీఈఓలు నిజానికి రతన్ టాటాకు జంతువుల మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో అందరికి తెలుసు. జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించిన 'శంతను నాయుడు' రతన్ టాటాకు దగ్గరవడానికి ప్రధాన కారణం ఇద్దరికీ జంతువుల మీద ఉన్న ప్రేమ అని గతంలో చాలా సందర్భాల్లో చాలా మంది వెల్లడించారు. -
అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ..
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7000 మంది అతిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఉన్నారు. బాలరాముని ప్రాణప్రతిష్టకు హాజరయ్యే పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా ముఖేష్ అంబానీ నీతా అంబానీ కుమార్ మంగళం బిర్లా అజయ్ పిరమల్ ఆనంద్ మహీంద్రా అజయ్ శ్రీరామ్ కె కృతివాసన్ కె సతీష్ రెడ్డి పునీత్ గోయెంకా SN సుబ్రహ్మణ్యన్ మురళి దివి ఎన్ఆర్ నారాయణ మూర్తి నవీన్ జిందాల్ నరేష్ ట్రెహాన్ అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్లో చికెన్ ముక్కలు’!
టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు. టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్పిట్లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా, మరో మహిళ వెజ్మీల్స్లో చికెన్ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్జైన్ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎక్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది. వీర్జైన్కు జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్జైన్ వెజ్మీల్స్ ఆర్డర్ చేసింది. సిబ్బంది వెజ్మీల్స్ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్లో మీల్స్ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్ సూపర్వైజర్ సోనాని ప్రశ్నించింది. వీర్జైన్తో పాటు తన స్నేహితురాలు సైతం తన వెజ్ ప్లేట్లో చికెన్ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది? అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా! -
‘రతన్ టాటా గూండాగిరి’
ఉప్పు నుంచి ఉక్కు వరకు. టీ నుంచి ట్రక్ వరకు.. వాచెస్ నుంచి హోటెల్స్ వరకు.. కెమికల్స్ నుంచి కార్స్ వరకు.. ఇలా పదుల సంఖ్యలో కంపెనీల్ని ముందుండి నడిపించిన గొప్ప లీడర్. వందల ఏళ్ల చరిత్ర.. 150 కి పైగా దేశాల్లో కంపెనీలు.. 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు.. 28 కి పైగా లిస్టెడ్ కంపెనీలు.. రూ.27.61 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ (డిసెంబర్ 26,2023 నాటికి) భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కంపెనీని నడిపిస్తూ ఇసుమంతైనా గర్వం లేని పద్మ విభూషణుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా. డిసెంబర్ 28న రతన్ టాటా 86వ జన్మదినం సందర్భంగా కోట్లాది మంది అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో రతన్ టాటా కోట్లాది మంది ప్రజల హృదయాల్ని గెలుచుకున్న సందర్భాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అవేంటంటే ఈ కుక్క మీదేనా రతన్ టాటాకి మూగజీవాలంటే ప్రాణం. ఓ సారి ముంబై వీధుల్లో గాయాల పాలైన ఓ కుక్కను గమనించారు. వెంటనే దానికి చికిత్స చేయించారు. అనంతరం ఆ కుక్క గురించి వివరాలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ముంబైలోని నా ఆఫీస్ సమీపంలో గాయాలపైన ఓ కుక్కను గుర్తించాం. అత్యవసర చికిత్స కోసం సియాన్ ఆస్పత్రికి తరలించాం. మీరు ఆ కుక్క సంరక్షకులైతే కొన్ని ఆధారాలతో reportlostdog@gmail.comకు ఇమెయిల్ చేయండి” అని పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ కుక్క ప్రస్తుతం మా సంరక్షణలోనే ఉంది. చికిత్సను చేయిస్తున్నాం అని పోస్ట్లో పేర్కొన్నారు. ఒకే ఒక్కడు.. గ్యాంగస్టర్, అతని 200 గూండాలతో రతన్ టాటా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 1980వ సంవత్సరంలో టాటా గ్రూప్ ఛైర్మన్గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన 15 రోజుల తర్వాత ఓ గ్యాంగ్స్టర్కు వ్యతిరేకంగా నిలబడ్డారు. వాస్తవానికి అప్పట్లో టాటా మోటార్స్ కంపెనీలో లేబర్ ఎన్నికలు జరిగేవి. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న కొంత మంది కార్మికులను ఒక గ్యాంగ్స్టర్ ప్రేరేపించాడు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. గ్యాంగ్స్టర్ తన అనచరులైన 200 మంది గూండాలతో కలిసి ప్లాంట్లోని 4000 మంది ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. సిబ్బంది విధులు నిర్వహించకుండా సమ్మె చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో భయబ్రాంతులైన ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు బయపడి పోయారు. దీంతో ‘‘ నాన్న పందులు గుంపులుగా..గుంపులుగా వస్తే సింహం సింగిల్ వస్తుందంటూ’’ రతన్ టాటా నేరుగా రంగంలోకి దిగి గ్యాంగ్స్టర్ను ఎదుర్కొన్నారు. రతన్ టాటా తన ఇంటిని వదిలేసి స్వయంగా ప్లాంట్లోనే కొద్దిరోజులపాటు ఉన్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ వారితో పనిచేయించారు. అయితే కొద్ది రోజుల తర్వాత గ్యాంగ్స్టర్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలా ఓ గ్యాంగ్స్టర్ను రతన్ టాటా చాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. 16 ఏళ్ల యువకుడికి సాయం.. మహరాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అర్జున్ దేశ్ పాండే 16 ఏళ్ల వయస్సులో ఉండగా తనకు ఓ హృదయ విదారకరమైన సంఘటన ఎదురైంది. దేశ్ పాండే ఓ రోజు ఫివర్ ట్యాబ్లెట్ తెచ్చుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపుకి వెళ్లాడు. అయితే ఆ షాప్ వద్ద 70 ఏళ్ల వృద్దుడు క్యాన్సర్తో బాధపడుతూ తన భార్యకు కావాల్సిన మెడిసిన్ కోసం అదే షాపుకు వచ్చాడు. తన కావాల్సిన మెడిసిన్ ఈ షాప్లో ఉన్నా.. అత్యధిక ధర కావడంతో తాను ఆ మెడిసిన్ను కొనలేకపోతున్నానంటూ బాధపడటాన్ని గమనించాడు. కానీ ఏం చేయలేకపోయాడు. ఆ బాధలో నుంచి జనరిక్ ఆధార్ అనే స్టార్టప్ పుట్టింది. అర్జున్ దేశ్ పాండే దీనిని స్థాపించాడు. ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశ్యం దేశ వ్యాప్తంగా ఉన్న 80 - 90 శాతం తగ్గింపుతో జనరిక్ మెడిసిన్ అందిస్తుంది. ఓ రోజు తనకు ఎదురైన సంఘటన, స్టార్టప్ ప్రారంభం వంటి అంశాలను అర్జున్ టెడెక్స్లో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన రతన్ టాటా సైతం వెంటనే జనరిక్ ఆధార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ టర్నోవర్ అక్షరాల రూ.500 కోట్లు. ఒక్క ఫోన్ కాల్తో భారత్లో స్టార్టప్ జపం నడుస్తోంది. ఏదైనా బిజినెస్ చేయాలంటే జనాన్ని ఆకట్టుకోవాలి. అలాంటి బిజినెస్ ఐడియా ఉంటే చాలు. పర్ఫెక్ట్ ప్లాన్తో ఆ బిజినెస్ ఐడియాను అప్లయ్ చేస్తే చాలు కోట్లు కొల్లగొట్టొచ్చు. ఇలాగే ‘రెపోస్ ఎనర్జీ’ ఫౌండర్లు, భార్య భర్తలైన చేతన్ వాలుంజ్, అతిధి బోస్లే వాలుంజ్లు అనుకున్నారు. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, నిత్యవసర వస్తువులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే క్షణాల్లో వచ్చేస్తున్నాయి. అదే వినియోగదారులకు కావాల్సిన పెట్రోల్ను మనం ఎందుకు డెలివరీ చేయకూడదు అని అనుకున్నారు. ఐడియా బాగుంది. చేతిలో తగినన్ని నిధులు లేవు. పైగా ప్రజల్లోకి కంపెనీ పేరును బలంగా తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే సాయం కోసం రతన్ టాటా ఆఫీస్ డోర్ తట్టారు. ఓ లెటర్ను రతన్ టాటాకు పంపారు. ప్రయత్నం అయితే చేశారు కానీ మనసులో ఎక్కడో చిన్న అనుమానం. టాటాకు పంపిన లెటర్ అందుతుందా? ఆ లెటర్ చదివి టాటా తమకు సాయం చేస్తారా? ఇలా ఎన్నో రకాలుగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆ అనుమానాన్ని పటాపంచలు చేశారు రతన్ టాటా. ‘మీ లెటర్ నేను చదివాను. ఒక్కసారి మనం కలుసుకోగలమా? అంటూ రతన్ టాటానే స్వయంగా చేతన్, అతిధిలకు ఫోన్ చేశారు. కట్ చేస్తే రెపోస్ ఎనర్జీ రూ.200 కోట్ల విలువైన కంపెనీ ప్రసిద్ధి కెక్కింది. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ రతన్ టాటా తన పెంపుడు కుక్కలు టాంగో, టిటో అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. టాటాకు యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్తో సత్కరించేందుకు సిద్ధమైంది. అవార్డ్ ఇస్తున్నట్లు ప్రిన్స్ చార్లెస్ టాటాకు సమాచారం అందించారు. అ తర్వాత ముందుస్తు ప్లాన్ ప్రకారం.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హోమ్ ప్యాలెస్లో అవార్డ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డ్ల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? టాంగో, టిటోల వల్లే. తాను లండన్ బయలు దేరే ముందు టాంగో, టిటోలు అనారోగ్యానికి గురయ్యాయని, వేడుకకు తాను రాలేకపోతున్నాననే సమాచారాన్ని తనతో పాటు లండన్ వచ్చేందుకు సిద్ధమైన వ్యాపార వేత్త సుహెల్ సేథ్కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇదే విషయం ప్రిన్స్ చార్లెస్కు చెప్పగా.. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ ప్రశంసలు కురిపించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. అందుకే రతన్ టాటా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. -
రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ 'రతన్ టాటా' (Ratan Tata) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన ఈయన నేటితో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రతన్ టాటా జన్మదినం సందర్భంగా ఈ కథనంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రతన్ టాటా గురించిన 5 ఆసక్తికరమైన విషయాలు 👉రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్కు వెళ్లారు. ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా. 👉రతన్ టాటా "ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా' అనే పుస్తకారు రాశారు. 👉86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. గతంలో ఈయన నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చినట్లు సమాచారం, కానీ ప్రతి సారీ ఏదో ఒక భయం, లేదా ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గారు. 👉పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధర వద్ద లభించే కారు కావడంనా గమనార్హం. చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుని లాంచ్ చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు. -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
రతన్ టాటాకు బెదిరింపులు
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు బెదిరింపులు వచ్చాయి. రతన్ టాటా ప్రాణానికి ముప్పు పొంచి ఉందని దుండగుడు హెచ్చరించాడు. ముంబయి పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. టాటా భద్రతను పెంచాలని లేదంటే ఆయనకు సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని బెదిరించినట్లు వెల్లడించారు. బెదిరింపులు రావడంతో రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించి.. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు పుణెకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నిందితుడు పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్తీ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఆయన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్తీతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
ఎయిరిండియా సిబ్బందికి కొత్త యూనిఫాం.. ఎలా ఉందో చూశారా?
డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియాని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థ తీర్చిదిద్దేలా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఆ సంస్థ లోగోని మార్చిన యాజమాన్యం.. తాజాగా అందులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ధరించేందుకు కొత్త యూనిఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. తన క్యాబిన్ సిబ్బంది, పైలట్లకు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో యూనిఫాంను డిజైన్ చేయించింది. మహిళా క్యాబిన్ సిబ్బందికి మోడ్రన్ లుక్లో ఓంబ్రే చీరలు, పురుషులకు బ్యాండ్గ్లస్, కాక్పిట్లో విధులు నిర్వహించే ఉద్యోగులు క్లాసిక్ బ్లాక్ సూట్స్ ఉన్నాయి. ఈ కొత్త యూనిఫామ్ను దశల వారీగా పూర్తిస్థాయిలో పరిచయం చేసేలా ఎయిరిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న నెలల్లో ఎయిరిండియా తొలి ఎయిర్ బస్ ఏ350 సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఆ సమయంలో ఈ కొత్త యూనిఫామ్ను ధరించి సిబ్బంది విధులకు హాజరవుతారని సమాచారం. మహిళా సిబ్బంది యూనిఫాం ఎలా ఉండబోతుందంటే? మహిళా సిబ్బందికి ఈజీగా, స్టైలిష్గా, యూనిక్ లుక్లో సంప్రదాయాన్ని మేళవించేలా ఈ కొత్త యూనిఫాం ఆకట్టుకుంటుందని ఎయిరిండియా ఓ ప్రకటనలో పేర్కొంది. సీనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది కోసం ఓంబ్రే చీరలు, వంకాయ బ్లేజర్లతో కలిపి ఎరుపు-గోధుమ రంగులో ఉంటాయి. జూనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది ఎరుపు రంగు బ్లేజర్లతో కలిపి ఎరుపు - ఊదా రంగు చీరలను ధరిస్తారు. కాక్పిట్ సిబ్బంది యూనిఫారం క్లాసిక్ బ్లాక్ డబుల్ బ్రెస్ట్డ్ సూట్ను అందంగా డిజైన్ చేశారు మల్హోత్రా. ఈ సందర్భంగా మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ “ఎయిరిండియా కోసం యూనిఫాం డిజైన్ చేసే అవకాశం నాకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ జెండాను మోసే (రతన్ టాటాను ఉద్దేశిస్తూ) వ్యక్తికి ఫ్యాషన్ విభాగం నుంచి దోహదపడటం ఆనందంగా ఉంది. నా లక్ష్యం దేశ విభిన్న సంస్కృతి, సంప్రదాయాల సారాంశం ఉట్టిపడేలా యూనిఫారాలను రూపొందించడం, ఆధునిక అధునాతన డిజైన్లను అందించడమేనని అన్నారు. -
దిగ్గజ వ్యాపారవేత్తల రైట్ హ్యాండ్స్.. వీళ్లు ఎంత చెప్తే అంతే!
ప్రతి వ్యక్తి గొప్ప స్థాయికి చేరటానికి లేదా జీవితంలో సక్సెస్ సాధించడానికి అతిని కృషి మాత్రమే కాకుండా.. మంచి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారు స్నేహితులు కావొచ్చు లేదా ఉద్యోగులు కావొచ్చు. ఇది సాధారణ వ్యక్తుల కంటే దిగ్గజ వ్యాపార వేత్తల విషయంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ కథనంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల విజయం వెనుక ఉన్న కొంతమంది వ్యక్తులు (రైట్ హ్యాండ్స్) గురించి తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ & మనోజ్ మోదీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా.. భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఈ రోజు ఇంత సక్సెస్ సాధించాడంటే దాని వెనుక ఎంతోమంది సన్నిహితుల కృషి కూడా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోదీ'. నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్లో చేరారు. ఆ తరువాత కంపెనీ ఉన్నతికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాడు. మనోజ్ మోదీ అంకిత భావానికి మెచ్చిన ముఖేష్ అంబానీ అతనికి ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ధర రూ. 1,500 కోట్ల కంటే ఎక్కువే. ఇషా అంబానీ & భక్తి మోదీ ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ కూడా వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తోంది. ఈమె ఉన్నతికి కారణమైన కొంతమంది వ్యక్తులలో ఒకరు భక్తి మోదీ. ఈమె మనోజ్ మోదీ కుమార్తె. మనోజ్ మోదీ కుమార్తె భక్తి మోదీ.. ఇషా అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్లో కీలక కార్యనిర్వాహకురాలుగా పనిచేస్తోంది. కంపెనీ ఈ రోజు వేలకోట్లు సంపాదిస్తోంది అంటే దాని వెనుక భక్తి మోదీ పాత్ర కూడా ప్రధానమనే చెప్పాలి. ఈమెను ఇషా అంబానీ రైట్ హ్యాండ్ అని పిలుస్తారు. ఇషా అంబానీ కంపెనీ ప్రధాన వ్యవహారాలను చూస్తున్న వారిలో భక్తి మోదీ కాకుండా.. 'దర్శన్ మెహతా' కూడా ఉన్నారు. ఈయన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రతన్ టాటా & శంతను నాయుడు రతన్ టాటా గురించి తెలిసిన చాలామందికి 'శంతను నాయుడు' గురించి కూడా తెలిసే ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఏర్పడ్డ వీరి బంధం చాలా మందికి ఆదర్శం. శంతను నాయుడు.. రతన్ టాటా వ్యక్తిగత సహాయకుడు. అంతే కాకుండా అతని కంపెనీలో జనరల్ మేనేజర్. 2018 నుంచి రతన్ టాటా కోసం పనిచేయడం ప్రారంభించిన శంతను నాయుడు ప్రస్తుతం కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ.. శంతను నాయుడు.. రతన్ టాటాకు ఎంత సన్నిహితుడిఫైనప్పటికీ, వ్యాపార కార్యకలాపాల్లో తనదైన సలహాలు ఇస్తున్నప్పటికీ.. కంపెనీ ఉన్నతికి దోహపడిన వారితో చెప్పగోదగ్గ వ్యక్తి 'ఎన్ చంద్రశేఖరన్'. ఈయనే రతన్ టాటా రైట్ హ్యాండ్ అని పిలుస్తారు. తమిళనాడుకి చెందిన చంద్రశేఖరన్.. కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్, తిరుచిరాపల్లిలోని ఎన్ఐటీలో ఎంసీఏ పూర్తి చేసి 1987లో టీసీఎస్లో చేరాడు. ఆ తరువాత ఈయన 2009లో సీఈవో అయ్యారు. -
రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్
గత కొన్ని రోజులుగా 'డీప్ ఫేక్' (Deep Fake) అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సినీ తారల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఈ డీప్ ఫేక్ ప్రభావానికి గురవుతున్నారు. రష్మిక మందన్న, ప్రియాంక చోప్రా సంఘటనకు మరువక ముందే.. దేశీయ వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరిట ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఒక పోస్ట్లో, సోన అగర్వాల్ పేరుతో టాటా మేనేజర్గా చెప్పుకుంటూ.. దేశ ప్రజలకు ఇదే నా సిఫార్సు. 100 శాతం గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం, దీని కోసం ఈ ఛానెల్లోకి వెళ్లండి అంటూ.. రతన్ టాటా చెప్పినట్లు ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ వీడియోపై రతన్ టాటా స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలాంటి వాటి భారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ చదవండి: యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. రోజు రోజుకి పెరుగుతున్న డీప్ ఫేక్ సమస్యను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ సమస్యను పూర్తిగా అరికట్టడానికి కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' కూడా సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని భావించవచ్చు. -
రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
Shantanu Naidu New Tata Safari Facelift: దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో హారియర్, సఫారీ ఫేస్లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. ప్రీ-ఫేస్లిఫ్ట్ వెర్షన్ల మాదిరిగానే అద్భుతంగా ఉన్న ఈ మోడల్స్ చాలా మంది కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రతన్ టాటా మేనేజర్, గుడ్ఫెలోస్ వ్యవస్థాపకుడు 'టాటా సఫారీ ఫేస్లిఫ్ట్' (Tata Safari Facelift) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతంలో టాటా నానో కారుని ఉపయోగించే రతన్ టాటా మేనేజర్ 'శంతను నాయుడు' (Shantanu Naidu) తాజాగా ఖరీదైన సఫారీ ఫేస్లిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వైట్ కలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారులో ఇప్పటికే 1000 కిమీ ప్రయాణించినట్లు, దానికి 'యుకీ' అని పేరు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. టాటా సఫారీ ఫేస్లిఫ్ట్ రూ. 16.19 లక్షల ప్రారంభ ధరలో దేశీయ విఫణిలో లాంచ్ అయిన సఫారీ ఫేస్లిఫ్ట్ మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. సఫారీ ఫేస్లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్, 350 న్యూటన్ మాటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. కాస్మిక్ గోల్డ్, గెలాక్సీ సఫైర్, లూనార్ స్లేట్, స్టార్డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్నోవా కాపర్ వంటి ఆరు కలర్ ఆప్సన్లలో లభించే ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది.