-
లోకేశ్ కనకరాజ్పై రజనీ ఆగ్రహం?
సినిమా రంగంలో కోపతాపాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు సహజం. ఈ మధ్య నటుడు అజిత్ దర్శకుడు విఘ్నేశ్శివన్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది. అందుకు కారణం చిత్ర కథను అనుకున్న టైంలో రెడీ చేయడంలో దర్శకుడు విఘ్నేశ్శివన్ విఫలం అయ్యారన్నదే. దీంతో ఆ చిత్రం నుంచి విఘ్నేశ్శివన్ను తొలగించారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ చిత్రమే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విడాముయర్చి. ఇదే పరిస్థితిని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఎదుర్కొంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఈయన చేసిన చిత్రాలన్నీ(లియో చిత్రం మినహా) సంచలన విజయాలను సాధించాయన్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ నుంచి, టైటిల్ ప్రకటన వరకూ అనూహ్య క్రేజ్ను తెచ్చుకున్నాయి. కూలీ చిత్రాన్ని జూన్ రెండవ వారంలో ప్రారంభించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ తన 170వ చిత్రం వేట్టైయాన్ను త్వరగా పూర్తిచేసినట్లు సమాచారం. అయితే కూలీ చిత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడంతో దర్శకుడు లోకేశ్ కనకరాజ్పై రజనీకాంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూలీ చిత్ర కథనాన్ని మూడు నెలలుగా రాస్తున్నారట. ఇంకా పూర్తికాకపోవడంతో షూటింగ్ ఆలస్యమైందని సమాచారం. ఆయన స్క్రిప్ట్ పక్కాగా పూర్తి అయిన తరువాతనే సెట్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో కూలీ చిత్రం జూలైలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
కొలువుదీరిన కొత్త మంత్రివర్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా మరో 24 మంది బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. గన్నవరం ఐటీ పార్కు వద్ద కేసరపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముందుగా చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ సహా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, రజనీకాంత్, చిరంజీవి సహా పలువురు సినీ స్టార్లు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు, చంద్రబాబు దంపతులు ఆశీనులయ్యారు. వేదికకు ఎడమ వైపు కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు కూర్చోగా, కుడివైపు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు కూర్చున్నారు. చంద్రబాబుతో ఉదయం 11.33 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం చంద్రబాబును వేదికపైనే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖుల వద్దకెళ్లి చంద్రబాబు నమస్కారం చేశారు. చంద్రబాబు తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. అనంతరం పవన్ ప్రధాని, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు తన సోదరుడు, మెగా స్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. ఆ తర్వాత వరుసగా నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి. బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబు సహా 24 మంది దైవ సాక్షిగా ప్రమాణం చేయగా, ఎన్ఎండీ ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పదాలను ఉచ్ఛరించడంలో ముగ్గురు మంత్రులు తడబడ్డారు. వాసంశెట్టి సుభాష్ తడబాటుకు లోనై కొన్ని పదాలు పలకలేకపోయారు. కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్థన్రెడ్డి కూడా తడబాటుకు లోనయ్యారు. ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు మంత్రివర్గ సభ్యులతో ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయన్ను ప్రత్యేకంగా సన్మానించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ వేదికపై తన సోదరుడు ఉన్నారని చెప్పగా ప్రధాని మోదీ చిరంజీవి వద్దకు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులను పైకి లేపి సభికులకు అభివాదం చేయడం విశేషం. చంద్రబాబు రజనీకాంత్ను చూపించగా మోదీ ఆయనకు నమస్కరించి పలకరించారు. వేదికపై ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర కేంద్ర మంత్రులకు మోదీ అభివాదం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత పలువురు మంత్రులు తనకు పాదాభివందనం చేయబోతుండగా ప్రధాని వారించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన సమీపంలోని ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఒడిశాకు పయనమయ్యారు. హాజరైన ప్రముఖులు వీరే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జితన్ రామ్ మంజి, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంత్ చౌదరి, అనుప్రియా పాటిల్, రామ్దాస్ అథవాలే, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తదితరులు కూడా హాజరయ్యారు. -
నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు గన్నవరం ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది. మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చేలా ప్రమాణ స్వీకార వేదికపైనే సంబంధిత ఫైలుపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు సంబంధించిన అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. హాజరుకానున్న ప్రధాని, రాజకీయ ప్రముఖులుఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్షా, నడ్డా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులను తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అతిథులుగా ఆహ్వానించగా చిరంజీవి కుటుంబంతో సహా ఇప్పటికే విజయవాడ వచ్చారు. ఐటీ పార్కు ప్రాంగణం సిద్ధం ప్రమాణ స్వీకారానికి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాల్లో నాయకులు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, వెలుపల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటుకు సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునే సౌకర్యం కల్పించారు.వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. నాయకులు, కార్యకర్తల కోసం 36 గ్యాలరీలుగా విభజించారు. ఈ కార్యక్రమానికి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాల కోసం గన్నవరం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ సమన్వయాధికారి ప్రద్యుమ్న ఐఏఎస్లు, ఐపీఎస్లతో సమావేశం నిర్వహించారు.రద్దీగా మారిన గన్నవరం ఎయిర్పోర్టుప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది వీఐపీలు వస్తుండడంతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీగా మారిపోయింది. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్టుల నుంచి పలు ప్రత్యేక విమానాల్లో అతిథులు రావడంతో గన్నవరం ఎయిర్పోర్టు సందడిగా మారింది. బుధవారం ఉదయం ఇంకా రద్దీగా మారే పరిస్థితి ఉండడంతో ఎయిర్పోర్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఎయిర్పోర్టు అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని, కానీ ముందుగా ఎయిర్పోర్టుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.తిరుమల వెళ్లనున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
నెహ్రూ తర్వాత మోదీనే అంటూ ఢిల్లీ బయల్దేరిన రజనీకాంత్
నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి దేశంలో మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్లో నేడు (జూన్ 9) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును ఆయన సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించి మరోసారి మోదీ అధికారం అందుకున్నారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముఖ్య నేతలు, ప్రముఖులు హాజరవుతున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, మారిషస్తో సహా దేశాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో సౌత్ ఇండియా స్టార్ హీరో రజనీకాంత్ కూడా ప్రత్యేకంగా పాల్గొననున్నారు. ఢిల్లీకి బయల్దేరిన రజనీ విమానాశ్రయానికి వెళ్లే ముందు బోయిస్ గార్డెన్స్లోని తన నివాసం ఎదుట విలేకరులతో ఇలా మాట్లాడారు.'ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నాను. 'జవహర్లాల్ నెహ్రూ తర్వాత మోదీ మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. భారత రాజకీయాల్లో ఆయన సాధించిన ఘనత అని చెప్పవచ్చు.' అని ఆయన అన్నారు.హిమాలయాల పర్యటన ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిన రజనీకాంత్ ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటించబోతున్నాడు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. -
రజనీకాంత్ ఇంట్లో శరత్కుమార్ కుటుంబం.. పెళ్లికి రమ్మని ఆహ్వానం
తెలుగులో టాప్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఏడడుగులు వేయబోతోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. జూలై 2న థాయ్ల్యాండ్లో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. అప్పుడే వీరి ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి.పెళ్లికి ఆహ్వానంపెళ్లి పత్రికల పంపిణీ మొదలైంది. గురువారం (జూన్ 6న) రజనీకాంత్ను కుటుంబసమేతంగా కలిసి తన పెళ్లికి రమ్మని ఆహ్వానించింది. ఈ మేరకు రజనీకాంత్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తలైవా సర్ను, లతా ఆంటీని కలిసి పెళ్లికి ఆహ్వానించాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్యూ సర్. ఐశ్వర్య రజనీకాంత్.. నువ్వెప్పటిలాగే ఎంతో ప్రేమగా మాట్లాడావు అని రాసుకొచ్చింది. ఫోటోలో రజనీకాంత్ దంపతులతో పాటు వరలక్ష్మి తల్లిదండ్రులు రాధిక- శరత్కుమార్ ఉన్నారు.సినిమాల సంగతులు..వరలక్ష్మి శరత్కుమార్.. పొడా పొడి సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. అయితే హీరోయిన్గా మాత్రమే చేయాలని రూల్ పెట్టుకోలేదు. పవర్ఫుల్ పాత్ర అయితే చాలనుకుంది. అందుకే సహాయకనటిగా ఎక్కువ సినిమాలు చేసింది. తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ, జాంబి రెడ్డి, నాంది, యశోద, వీరసింహా రెడ్డి, మైఖేల్ చిత్రాలతో తెలుగువారినీ అలరించింది. ఇటీవల హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ అందుకుంది. Got to meet our thalaivar @rajinikanth sir and invite him and latha aunty...thank you sir for always being so warm and loving..thank you @ash_rajinikanth for veinf so sweet as always..the apple didn't fall far from the tree..❤️❤️@realsarathkumar @realradikaa #chayadevi… pic.twitter.com/X2alVW8VoD— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 6, 2024చదవండి: Manamey X Review: ‘మనమే’ టాక్ ఎలా ఉందంటే.. -
రజనీకాంత్ బాటలో విజయ్
రజనీకాంత్ బాటలో నటుడు విజయ్ నడుస్తున్నారా? ఇదే చర్చ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సూపర్స్టార్గా వెలిగిపోతున్న నటుడు రజనీకాంత్. అయితే ఇప్పుడు ఆ బిరుదుకు నటుడు విజయ్ ఎసరు పెట్టినట్లు ఇటీవల పెద్ద ప్రచారమే జరిగింది. తాజా సూపర్స్టార్ విజయ్ అంటూ వారీసు చిత్రం ప్రమోషన్ సమయంలో పెద్ద చర్చనే జరిగింది. విజయ్ చిత్రాలు జయాపజయాలకతీతంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఆ మధ్య విడుదలైన బీస్ట్ చిత్రం ప్లాప్ అయినా మంచి వసూళ్లనే సాధించింది. అదే విధంగా వారీసు చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా లాభాల బాటనే పడింది. ఇక సమీపకాలంలో వచ్చిన లియో చిత్రం పూర్తిగా విమర్శలను ఎదుర్కొన్నా ఇటు నిర్మాతకు, అటు బయ్యర్లకు లాభాలనే తెచ్చి పెట్టింది. కాగా ప్రస్తుతం విజయ్ తన 168వ చిత్రం గోట్లో నటిస్తున్నారు. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ను విజయ్ పూర్తి చేశారు. తదుపరి 169వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని తరువాత ఆయన నటనకు స్వస్తి పలికి రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని విజయ్ పెట్టిన విషయం తెలిసిందే. 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో పోటీకి విజయ్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే నటుడు రజనీకాంత్ తరహాలో విజయ్ తాను నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత కొన్ని రోజులు విదేశీయానం చేయడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. అలా తాజా గోట్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసిన విజయ్ ప్రస్తతం అమెరికాలో మకాం పెట్టారు. కొన్ని రోజులు అక్కడ గడిపిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చి తన 169వ చిత్రంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్న ట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదన్నది గమనార్హం. ఇకపోతే ఈయన గతంలో నటించిన గిల్లీ చిత్రం ఇటీవల రీరిలీజ్ అయ్యి భారీ వసూళ్లను సాధించింది. కాగా ఈ నెల 22 వ తేదీ విజయ్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విజయ్ నటించిన మరో సూపర్హిట్ చిత్రం పోకిరిని రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. -
'దేవర'కి పోటీగా సూపర్ స్టార్ రజినీకాంత్.. కావాలనే ఇలా!
సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం హిమాలయాల పర్యటనలో ఉన్నారు. త్వరలో తిరిగి చెన్నైకి వచ్చి 'కూలీ' షూటింగ్లో పాల్గొంటారు. మరోవైపు 'వేట్టాయాన్' అనే మూవీ కూడా చేస్తున్నారు. 'జై భీమ్' పేమ్ టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుందని, తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. అక్టోబరు 10న థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా)అయితే దసరా కానుకగా అదే అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తామని 'దేవర' టీమ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల పరంగా ఎన్టీఆర్ మూవీకి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ తమిళనాడు, కేరళలో మాత్రం థియేటర్లని పంచుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వసూళ్లలో 'దేవర' కాస్త తగ్గొచ్చు! ఒకవేళ ఏమైనా కాస్త ముందుకు జరిగి 'దేవర'.. సెప్టెంబరు 27న వస్తే మాత్రం 'వేట్టాయాన్'కి లైన్ క్లియర్ అయిపోవచ్చు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?) -
వారం తర్వాత కూలీగా...
‘కూలీ’గా మారిపోవడానికి రెడీ అవుతున్నారు రజనీకాంత్. ఆయన హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో సత్యరాజ్, శోభన కీలక పాత్రల్లో నటించనున్నారని, కమల్హాసన్ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. కాగా ‘కూలీ’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఆధ్యాత్మిక గురువు దగ్గర పేర్కొన్నారు రజనీకాంత్.తొలి షెడ్యూల్ చిత్రీకరణ చెన్నైలో ప్రారంభం కానుందని తెలిసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ‘కూలీ’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన మరో చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నట్లుగా చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా ‘వేట్టయాన్’ను అక్టోబరు 10న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా రజనీకాంత్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక ప్రయాణం
ఒక సినిమా షూటింగ్ ఆరంభించే ముందు... లేదా సినిమా పూర్తయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేస్తుంటారు రజనీకాంత్. ఆయన ఎక్కువగా హిమాలయాలకు వెళ్లే విషయం తెలిసిందే. అక్కడి మహావతార్ బాబాజీ గుహలో రజనీ ధ్యానం చేస్తుంటారట. తాజాగా రజనీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. దాదాపు పది రోజులు హిమాలయాల్లో గడిపి, తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. చెన్నై చేరుకున్న వెంటనే తన తాజా చిత్రం ‘కూలీ’ చిత్రీకరణలో పాల్గొంటారు రజనీకాంత్.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. మరోవైపు రజనీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వేట్టయాన్’లో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ ఏడాది అక్టోబరులో ఈ చిత్రం విడుదల కానుంది. -
హిమాలయాలకు బయల్దేరిన రజనీకాంత్.. ఎన్నికలపై కామెంట్
సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. బుధవారం చెన్నై నుంచి విమానంలో ఆయన బయల్దేరారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయనున్నారు. చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యం.. హిమాలయాలకు వెళ్లిన ప్రతిసారి కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. అందుకే తాను ప్రతి ఏటా వెళ్తున్నట్లు అన్నారు.ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని రజనీకాంత్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలు దేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళతానని.. ఇప్పుడు కూడా బద్రీనాథ్, కేదార్నాథ్లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు. గతేడాది జైలర్ సినిమా విడుదలకు ముందు కూడా హిమాలయాలకు రజనీకాంత్ వెళ్లిన విషయం తెలిసిందే.ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీ తప్పుకున్నారు. అలాగే, రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, బాబాజీ గుహతో సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు సమాచారం. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ సినిమాలో తన భాగం చిత్రీకరణని పూర్తి చేశారు రజనీ. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చిందని రజనీ తెలిపారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
ఆసియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్ గా రజనీ..ఆ విషయంలో అందరికంటే టాప్..
-
38 ఏళ్ల తర్వాత రజనీతో నటించనున్న కట్టప్ప
రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్లో కూలీ అనే భారీ చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ శోభన.. రజనీకాంత్తో కలిసి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో శృతిహాసన్ రజనీకాంత్కు కూతురిగా నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. ఇందులో రజనీకాంత్ గెటప్ ఆయన అభిమానులు అదుర్స్ అనేలా ఉంది. 38 ఏళ్ల తర్వాత..ఇకపోతే ఇందులో నటుడు సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తాజా సమాచారం. వీరిద్దరూ 38 ఏళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించనున్నారన్నమాట. ఇంతకు ముందు రజనీకాంత్, సత్యరాజ్ కలిసి తంబిక్కు ఎంద ఊరు, మూండ్రు ముగం, పాయుం పులి, నాన్ సిగప్పు మణిదన్, మిస్టర్ భరత్ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నింటిలోనూ సత్యరాజ్ విలన్గానే నటించారు. అప్పుడు తండ్రిగా.. ఇప్పుడు..మిస్టర్ భరత్ చిత్రంలో రజనీకాంత్కు తండ్రిగా నటించారు. అందులో ఎన్నమ్మా కన్ను సౌఖ్యమా అనే పాట సూపర్హిట్ అయ్యింది. తొలిసారిగా కూలీ చిత్రంలో రజనీకాంత్కు మిత్రుడిగా పాజిటివ్ పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. దీంతో పడయప్పతో కట్టప్ప అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కూలీ చిత్రానికి గిరీశ్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది -
Rajinikanth: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న రజినీకాంత్ (ఫొటోలు)
-
రజనీకాంత్కు గోల్డెన్ వీసా.. స్నేహితుడి వల్లే ఈ గౌరవం దక్కిందంటూ..
సౌత్ ఇండియా స్టార్ హీరో రజనీకాంత్కు మరో గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తోంది. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలో రజనీకాంత్ చేరారు. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్టర్మ్ వీసా 10 ఏళ్ల కాలపరిమితో ఉంటుంది.2019లో యూఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వీసాను చాలామంది భారతీయ ప్రముఖలకు యూఏఈ అందించి గౌరవించింది. ఇప్పుడు రజనీకాంత్ను కూడా ఆ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో గౌరవించింది. వీసా పొందిన అనంతరం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆయనకు ఈ గోల్డెన్ వీసాను అందించడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్ తనకు గోల్డెన్ వీసా మంజూరు చేసినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. యూఏఈ ప్రభుత్వంతో పాటు తన స్నేహితుడు లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే ఇది సాధ్యమైనట్లు రజనీ తెలిపారు. పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, నటులు వంటి వారికి గోల్డెన్ వీసా ఇస్తారు. 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిని వారందరూ పూర్తి ఓనర్షిప్తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.ఇప్పటికే గోల్డెన్ వీసా పొందిన ప్రముఖులుభారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న జాబితా ఇదే.. షారుక్ ఖాన్, అల్లు అర్జున్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, సంజయ్ దత్,ఊర్వశి రౌతేలా, త్రిష, అమలాపాల్, మోహన్లాల్, మమ్ముట్టి,మీరా జాస్మిన్, టొవినో థామస్,విజయ్ సేతుపతి,కమల్ హాసన్, విక్రమ్, యువన్ శంకర్ రాజా,టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ ఈ జాబితాలో ఉన్నారు.Thalaivar #Rajinikanth receives THE Golden Visa from the UAE (DUBAI) govt, through chairman and MD of LULU group. Benefits:* He can own a property. * He can visit any time. * He can reside for 10 years. * Can sponsor family members & even domestic staff. And many more 🔥 pic.twitter.com/2y8F6k3yvJ— Rana Ashish Mahesh (@RanaAshish25) May 23, 2024 -
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నేడు రజనీకాంత్ పేరు కాసులు వర్షం కురిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్పై ఆయన పేరు కనిపిస్తే చాలు అభిమానులు కేరింతలు వేస్తారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రజనీ కాంత్ మెచ్చిన హీరోయిన్ ఎవరు..? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..?14 ఏళ్లకే ఎంట్రీ1970, 80వ దశకంలో దక్షిణ భారతదేశంలో మరింత ప్రతిభావంతులైన నటీమణులు వచ్చారు. ఈ కాలంలో సినీ రంగ ప్రవేశం చేసిన నటీమణులు చాలామంది నేటికీ సుపరిచితులే. అయితే, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన జయలక్ష్మి 14 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 16 ఏళ్లకే స్టార్ డమ్ వచ్చింది. 22 ఏళ్లకే 66 సినిమాల్లో నటించి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది.'అంతులేని కథ' చిత్రంతో పాపులర్1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో 'అవల్ ఒరు తొదర్ కథై' విడుదలైంది. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో జయలక్ష్మి మెప్పించింది. ఆ పాత్ర ఊతపదం 'ఫటాఫట్'. దీంతో సౌత్ ఇండియానే ఈ పదం ఊపేసింది. అలా ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు రావడంతో 'ఫటాఫట్ జయలక్ష్మి'గా స్థిరపడిపోయింది. ఇదే సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు. అలా ఆయనతో ఆమె పలు సినిమాల్లో కనిపించింది. మరో చరిత్ర, కాళి, న్యాయం కావాలి, జ్యోతి,స్వర్గం నరకం,తిరుగులేని మనిషి,రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె మెరిసింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ఇద్దరు అమ్మాయిలు' సినిమాలో ఆమెకు తొలి ఛాన్స్ దక్కింది. ఆ సమయంలో జయలక్ష్మి వయస్సు కేవలం 14 సంవత్సరాలు.మాజీ ముఖ్యమంత్రి బంధువుతో పెళ్లిజయలక్ష్మి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటికే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా 60కి పైగా చిత్రాలలో నటించింది. చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాంటి సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీ రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కుమారుడు సుకుమార్ను ప్రేమించింది. అప్పటి వరకు జీవితంలో సక్సెస్ అయిన భర్త వల్ల కొద్ది రోజులకే వ్యక్తిగత జీవితంలో అపజయాన్ని చవిచూసింది. భర్త వల్ల చాలా భాదలు పడిందని చెప్పేవారు. 1980 నవంబర్ 21న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆరోజుల్లో పెద్ద షాకిచ్చింది.అసహజ శృంగారం కారణంగా మరణందక్షిణాది సినిమాలో అగ్ర హీరోలు చిరంజీవి,కమల్ హాసన్, నాగేశ్వరరావు, రజనీకాంత్, కృష్ణ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన జయలక్ష్మి 22 ఏళ్ల వయసులో గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు కనిపించింది. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుందని, అసహజ శృంగారం కారణంగా మరణించిందని పలు కథానాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ.. ఆమె చావుకు కారణం ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు. ఓ ఇంటర్వ్యూలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ నటి జయలక్ష్మి అని రజనీకాంత్ చెప్పడం విశేషం. -
రజనీకాంత్ మనవడి బర్త్డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్తో.. (ఫోటోలు)
-
మనవడి బర్త్డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన రజనీకాంత్
సూపర్స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసు దాటినా ఎంతో హుషారుగా సినిమాలు చేస్తున్నాడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ భాషల్లో కలిపి 170 చిత్రాలు చేశాడు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమా చేస్తున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు విన్నాడు. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి పెద్ద పీట వేస్తుంటాడు.కూతురి కోసమే ఆ సినిమాలో..తన కుమార్తెలంటే రజనీకి ఎనలేని ప్రేమ. వారికోసం ఏదైనా చేస్తాడు. అందులో భాగంగానే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ, పాత్ర గురించి ఆలోచించకుండా కేవలం కూతురి కోసమే ఆయన ఈ సినిమా చేశాడని అభిమానులు భావించారు.రజనీ పంచప్రాణాలురజనీ పంచప్రాణాలైన ఇద్దరు కూతుర్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. ఐశ్వర్య.. ధనుష్ను పెళ్లి చేసుకోగా రెండేళ్ల క్రితమే అతడితో విడిపోయింది. చిన్నకూతురు సౌందర్య 2010లో అశ్విన్ రామ్కుమార్ను పెళ్లాడింది. వీరికి 2015లో వేద్ కృష్ణ జన్మించాడు. ఆ మరుసటి ఏడాదే భార్యాభర్తలిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు. 2017లో విడాకులు మంజూరయ్యాయి. తర్వాత ఆమె 2019లో నటుడు, బిజినెస్మెన్ విషగన్ను పెళ్లాడింది. వీరికి 2022లో వీర్ అనే కుమారుడు జన్మించాడు.వేద్ బర్త్డేతాజాగా సౌందర్య మొదటి కుమారుడు వేద్ బర్త్డే సెలబ్రేషన్స్ చెన్నైలో ఘనంగా జరిగాయి. క్రికెట్ థీమ్తో పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ బర్త్డే ఈవెంట్కు రజనీ భార్య లతతో హాజరై మనవడితో కేక్ కట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.#Thalaivar at his grandson Ved birthday celebration ❤️❤️#Rajinikanth | #SuperstarRajinikanth | #superstar @rajinikanth | #Coolie | #Vettaiyan | #Jailer pic.twitter.com/tKvGGWrfjo— Suresh Balaji (@surbalu) May 19, 2024చదవండి: కమెడియన్తో రెండో పెళ్లి.. ఈ వయసులో అవసరమా? అని విమర్శలు.. స్పందించిన నటి -
రజనీ 172వ సినిమా లైన్లో..! గ్రీన్ సిగ్నల్ పడితే..!
సూపర్స్టార్ రజనీకాంత్ ఇటీవలే తన 170వ చిత్రం వేట్టైయాన్ను పూర్తిచేశారు. ఇందులో ఈయన మాజీ పోలీస్ ఎన్కౌంటర్గా నటించినట్లు సమాచారం. అమితాబ్బచ్చన్, రానా వంటి ప్రముఖ నటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే రజనీ 172 మూవీ!ప్రస్తుతం రజనీకాంత్ తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్పైకి వెళ్లనుంది. తాజాగా రజనీకాంత్ 172వ చిత్రానికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. దీన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శింబు గురించి ఏమన్నారంటే?ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన ప్రస్తుతం హిప్హాప్ ఆది హీరోగా పీటీసార్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు గురించి అడిగిన ప్రశ్నకు ఐసరి గణేశ్ బదులిస్తూ శింబు తన చిత్రం 'కరోనాకుమార్'లో నటిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు.గ్రీన్సిగ్నల్ ఇవ్వగానే షురూఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే త్వరలో రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన గ్రీన్సిగ్నల్ ఇవ్వగానే తలైవా 172వ చిత్రం ప్రారంభం అవుతుందని ఐసరి గణేశ్ పేర్కొన్నారు. -
అబ్రాడ్కు వెళ్లిపోయిన రజనీకాంత్
కోలీవుడ్ స్టార్ రజనీకాంత్కు తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం ఆధ్యాత్మికత పర్యటనలకు వెళ్లడం పరిపాటి. అలా హిమాలయాలు, హరిద్వార్, ద్వారకేష్ వంటి ప్రదేశాలకు వెళ్లి ఒకటి రెండు వారాలు ధ్యానం, యోగా వంటి మానసికంగా నూతనోత్సాహాన్ని పొంది వస్తుంటారు. ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శతక్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నటుడు అమితాబ్ కీలక పాత్రను పోషించిన ఇందులో నటి దుషారా విజయన్, రిత్వికాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్ను ఇటీవలే పూర్తి చేశారు. తదిపరి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఫస్ట్ ఆఫ్ కథను సిద్ధం చేసి.. సెకండ్ ఆఫ్ పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో రజనీకాంత్ రిలాక్స్ కోసం తాజాగా అబ్రాడ్కు వెళ్లారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి అబుదాబి వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మరో కొన్ని వారాలు అక్కడ గడిపిన తరువాత రజనీకాంత్ చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం. சென்னை விமான நிலையத்திலிருந்து எதிஹாட் ஏர்வேஸ் விமானம் மூலம் அபுதாபி புறப்பட்டு சென்றார் நடிகர் ரஜினிகாந்த்...#Chennai | #Airport | #Actor | #Rajinikanth | #SuperStar | #AbuDhabi | #PolimerNews pic.twitter.com/j9JJvxcLlt— Polimer News (@polimernews) May 16, 2024 -
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
-
మూడు వారాల తర్వాత కూలీగా...
జస్ట్ చిన్న బ్రేక్... ఆ తర్వాత కూలీగా కూల్గా సెట్లోకి అడుగుపెట్టడానికి రజనీకాంత్ ప్లాన్ చేసుకున్నారట. ‘వేట్టయాన్’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ని పూర్తి చేసిన రజనీకాంత్ ఓ మూడు వారాలు విరామం తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత జూన్ 6 నుంచి తన మరో చిత్రం ‘కూలీ’ షూటింగ్లో పాల్గొంటారట.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం చెన్నైలో భారీ సెట్ రూపొందించారట. ఆ సెట్లోనే కొత్త షెడ్యూల్ ఆరంభించనున్నారని కోలీవుడ్ టాక్. కాగా ఈ చిత్రంలో శ్రుతీహాసన్ నటించనున్నారు. రజనీ కుమార్తె పాత్రలో ఆమె కనిపిస్తారట. ఈ పాత్ర కథకి కీలకంగా ఉంటుందని తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. -
రజినీకాంత్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో ఇతర రాష్టాలకు చెందిన స్టార్స్ను తీసుకురావడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా జైలర్ చిత్రంతోనే ఇది మొదలైందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్ వంటి వారు అతిథి పాత్రల్లో మెరిసి జైలర్ చిత్ర విజయానికి కారణం అయ్యారనే చెప్పాలి. ఇకపోతే తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ నటుడు రాణా వంటి వారు నటిస్తున్నారు.కాగా రజనీకాంత్ త్వరలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన 171 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ చిత్రానికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్ర టైటిల్తోపాటు ఫస్ట్లుక్ పోస్టర్ను, టీజర్ను వరుసగా చిత్ర ప్రారంభానికి ముందే విడుదల చేసి హైప్ను తీసుకొచ్చారు. కాగా కూలీ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో రజనీకాంత్కు జంటగా శోభన నటించనున్నారు.అలాగే నటి శృతిహాసన్ కూడా ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కూడా కూలీ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా నటుడు నాగార్జున ఇప్పటికే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం కుబేరాలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మరి కూలీ చిత్రంలో ఈయన పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. పలు ప్రత్యేకతలతో కూడిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. -
ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ప్రముఖ సంగీ త దర్శకుడు ఇళయరాజా వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు ఆయన వ్యవహార ధోరణిని తప్పుబడుతున్నారు. తాజాగా నటుడు రజనీకాంత్ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. దీనికి రజనీకాంత్ ఎలా స్పందించారో తెలుసా?రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చి త్రం వేట్టైయాన్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రజనీకాంత్ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సీన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశా రు.కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్ హీరోగా నటించిన తంగమగన్ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్ వా పాట ట్యూన్నే మార్చి రూపొందించారని.. అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్ను ప్రశ్నించగా.. అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. -
ముంబైలో వేట్టయాన్
ముంబైలో అమితాబ్ బచ్చన్ను కలిశారు వేట్టయాన్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ‘వేట్టయాన్’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది.రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన ‘వేట్టయాన్’ షూటింగ్ షెడ్యూల్లో రజనీ, అమితాబ్ కాంబినేషన్ సీన్స్ తీశారు. ఇప్పుడు ముంబైలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ను తీస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)