-
లోక్సభ స్పీకర్ రేసులో ఆ ఇద్దరు?!
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ, మిత్రపక్షాల కేంద్రమంత్రులు భేటీ కానున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ ఎంపీలే స్పీకర్లుగా బాధ్యతలు చేపట్టారు. 16వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్ (2014), 17వ లోక్సభ స్పీకర్గా ఓంబిర్లా (2019) సేవలందించగా, ఏఐఏడీఎంకే నేత ఎం.తంబిదురై డిప్యూటీ స్పీకర్లుగా పనిచేశారు.అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శనతో కేవలం 240 స్థానాల్ని దక్కించుకుంది. ఇతర పార్టీలైన జేడీయూ, టీడీపీల పొత్తుతో మూడో దఫా అధికారం చేపట్టింది. దీంతో లోక్సభ స్పీకర్ పదవి తమకూ కావాలంటూ జేడీయూ, టీడీపీలు పోటీ పడుతుండగా.. కమలం అగ్రనాయకత్వం మాత్రం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలనే స్పీకర్లుగా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.రేసులో ఆ ఇద్దరులోక్సభ ఎన్నికల ముందు ఒడిశా నుంచి బీజేపీలో చేరిన కటక్ ఎంపీ ఎంపీ భర్తృహరి మహతాబ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఓం బిర్లానే మరోసారి లోక్సభ స్పీకర్గా నియమించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ప్రొటెం స్పీకర్గారాజ్యాంగ నిబంధనలు ప్రకారం.. కొత్త లోక్సభ మొదటి సారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించడానికి సీనియర్ సభ్యుడ్ని ప్రొటెం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రొటెం స్పీకర్,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఈ రోజు సాయంత్ర ఎన్డీయే, దాని మిత్రపక్ష పార్టీల కేంద్రమంత్రుల సమావేశం అనంతరం స్పష్టత రానుంది. -
BJLP నేత ఎవరు..?
-
రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
దేశంలో ప్రతిష్ఠాత్మక మూల స్తంభాలలో ఒకటైన ఎన్నికల కమిషన్ తన స్ఫూర్తిని కోల్పోతోందా? ‘ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్’ (స్వేచ్ఛగా, పారదర్శకంగా) ఎన్నికలు నిర్వహించటం భారత ఎన్నికల సంఘం కర్తవ్యం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత అవశ్యం. కానీ ఆ కర్తవ్యం గాడి తప్పితే? ఆ స్ఫూర్తి మసకబారితే? ఫలితం ఏమవుతుంది?ప్రస్తుత ఎన్నికల కమిషన్ పోకడలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సంస్థల లాగే ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందని వినవస్తున్న విమర్శలకు అనేక సంఘటనలు ఊతమిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న వేళ విపక్షాల నుంచి కుప్పల కొద్దీ సాక్షాధారాలతో సహా ఫిర్యాదులు అందుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పుడప్పుడు ఈసీ పేపర్ టైగర్లా గాండ్రించడమే తప్ప కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో పలుచోట్ల జరిగిన అల్లర్లను ఉదాహరణగా చెప్పవచ్చు. ఆశ్చర్యం ఏమిటంటే, అల్లర్లు జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ కమిషన్ శుద్ధపూసలంటూ ప్రత్యేకంగా నియమించిన పోలీసు అధికారులు ఉన్న ప్రాంతాలే కావడం గమనార్హం! కూటమి, అందులో భాగస్వామురాలైన బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇచ్చిన అధికార్ల చిట్టాను కించిత్తు వెరపు లేకుండా ఈసీ స్వీకరించి తదనుగుణంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రౌడీ మూకలు రెచ్చిపోతుంటే పోలీసులే నిర్లిప్తంగా వ్యవహరించటం, సాక్షాత్తూ్త పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలోకి చొరబడి సీసీ కెమెరాలు పగలగొట్టడం, అటు పోలీసు వ్యవస్థ ప్రతిçష్ఠను, ఇటు ఈసీ వ్యవస్థను దిగజార్చిందని చెప్పాలి. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం, పాక్షిక దృష్టితో కొంతమంది కేసుల్లో పది రోజులు దాటిన తర్వాత క్రొంగొత్త సెక్షన్లను పొందుపరచడం గమనార్హం. ఎవరి ఆదేశాల మేరకు ఈసీ ఈ పనిచేస్తుందో చెప్పాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో టీఎన్ శేషన్ ఎన్నికల సంస్కరణలకు తెర తీసి తన నిక్కచ్చితత్వంతో చరిత్రలో మిగిలిపోయారు. 1977 పోస్ట్ ఎమర్జెన్సీ ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరుకి యావత్ భారతదేశం జేజేలు పలికింది. వాజ్పేయి అనంతరం సరిగ్గా 25 ఏళ్ల తర్వాత 2014లో బీజేపీ మోదీ నేతృత్వంలో అధికారాన్ని కైవసం చేసుకున్నాక ఈసీ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతూ వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. గతంలో బ్యాలెట్ బాక్స్లు ఉపయోగంలో ఉన్నప్పుడు కొన్ని సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ బూత్ల స్వాధీనం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోయడం, బాక్స్లు ఎత్తు్తకెళ్ళిపోవడం వంటి సంఘటనలు జరిగేవి. అయితే ఈవీఎంలు వచ్చిన తరువాత ఈ అక్రమాలకు తెరపడ్డాయని చెబుతున్నా... ఎన్నికలు సజావుగా నిర్వహించవలసిన ఎన్నికల కమిషన్, సిబ్బంది, అందులో ప్రధానంగా పోలీసు వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తే ఇక ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా స్వామ్యవాదులను కలవరపెడుతున్నాయి. ఏకంగా బహిరంగంగా పోలీసులు, బాబు కూటమి కలసి తెగబడి అల్లర్లు ఆందోళనలు సృష్టిస్తే ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం దారుణం. ఢిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తే తప్ప కనీస మాత్రం స్పందన లేదంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎలాంటిదో గమనించవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 171 ప్రకారం ఓటర్లను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం శిక్షార్హం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 123 ప్రకారం భయపెట్టినా, ఓటర్లను ప్రలోభపెట్టినా కూడా శిక్షార్హమే! అయినా జాతీయస్థాయిలో అధికార పార్టీ అండ చూసుకొని అనేక చోట్ల ఈ శక్తులు పెట్రేగిపోతున్నాయి. అరాచకాలను గమనించిన భారత అత్యున్నత న్యాయస్థానం శాసన సభ, పార్లమెంటు సభ్యులపై నమోదయ్యే కేసులను సత్వరం విచారించి శిక్షించడానికి ప్రత్యేక కోర్టులు ఉండాలని ఆదేశించింది. ఫలితంగా తెలంగాణలో ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకి 395 కేసులు బదిలీ అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే... ఇందులో కేవలం 14 కేసులకు మాత్రమే నామమాత్రపు శిక్ష పడింది. మిగతా వాటికి సాక్ష్యాధారాలు సరిగా లేవని కొట్టివేయడమైనది. అదీ పవర్ పాలిటిక్స్ అంటే! ఎన్నికల కమిషన్ ప్రకటనలు అయితే చాలా ఆర్భాటంగా ఉంటాయి. ఈసారి గతంలోలా కాదు చాలా కఠినంగా వ్యవహరిస్తాం... నిష్పాక్షికంగా వ్యవహరిస్తాం అంటూ ప్రకటనలు అయితే ఇస్తారు. అంతేనా? ఏకంగా ప్రజలను కూడా అంటే ఓటర్లను కూడా నిఘా వ్యవస్థలో భాగస్వాములను చేస్తాం అంటూ ఘనంగా ‘సీ విజిల్ యాప్’ రూపొందించారు. దీని ప్రకారం, ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్టు ఓటర్ ఫిర్యాదు చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ 100 నిమిషాల్లో ఆ నియోజకవర్గ పరిధిలోని అధికారులకు సూచనలు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటుంది. ఇది వినడానికి అయితే అద్భుతంగా ఉంది కానీ వాస్తవంలో జరిగిందేమిటి? అనేక చోట్ల ఎస్సీ, ఎస్టీ మహిళలు ఓట్ వేయడానికి వెళితే వాళ్ళని బెదిరించి, పరిగెత్తించడం పోలీసుల సమక్షంలో గూండాలు వ్యవహరించిన తీరు వీడియోల్లో రికార్డ్ అయింది. ఫిర్యాదులు చేసి రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యం. వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం పక్షపాతంగా వ్యవహరించే పోలీసులకు విధుల్లో కొనసాగే హక్కు లేదని, ఓటర్లను భయపెట్టే నేతలపై అనర్హత వేటు వేయాలన్న ‘లా కమిషన్’ సిఫార్సులు అమలు చేయాలి. కానీ కనుచూపు మేరలో అలాంటిదేమీ కనిపించడం లేదు. సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ సూచించిన విధంగా మచ్చ లేనివారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించాలి. కానీ ఇవన్నీ జరిగేదెప్పుడు? సగటు ఓటరుకు రక్షణ ఎప్పుడు? అయితే ఒకటి మాత్రం నిజం. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల రణక్షేత్రంలో వీరులు సగటు ఓటరులే! వారి తీర్పుకు తిరుగులేదు. వారి పైన ఆంక్షలు తాత్కాలిక చంద్ర గ్రహణాల వంటివి. అంతిమంగా పున్నమి వెలుగులు జగన్మోహనంగా విస్తరించక మానవు. పి. విజయబాబు రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
-
అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం
పురందేశ్వరి కుట్ర రాజకీయాలు ఆమెకు ఎసరు తెచ్చిపెట్టనున్నాయా.. ఎన్నికల సమయంలో చిన్నమ్మ రాజకీయాలతోనే ఏపీలో బీజేపీ మరింత బలహీనపడిన పడిందని భావిస్తున్న సీనియర్లు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా.. ఏపీ బీజేపీలో ఇపుడు గ్రూపు రాజకీయాలకి పురందేశ్వరి వైఖరే కారణమని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఎన్నికల వేళ పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన సమయంలో ఆమె వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు పార్టీని బలి చేశారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది. పురందేశ్వరి ఓడితే ఆమె రాజకీయ భవిష్యత్కి బ్రేక్ పడినట్లేనా...ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ భవితవ్యం అయోమయంగా ఉంది. ఎన్నికల ఏడాదిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి తన వైఖరితో పార్టీలో గ్రూపు రాజకీయాలకి ఆజ్యం పోశారు. అప్పటివరకు సోము వీర్రాజు నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన పార్టీని రెండు గ్రూపులుగా మార్చేసారు. ఏపీలో గడిచిన మూడేళ్లగా సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ క్షేత్రస్ధాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా నిత్యం ప్రజలలో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించేవారు.అయితే పురందేశ్వరి గత ఏడాది ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట నుంచి బీజేపీలో ఉన్న నేతలపై గురి పెట్టారు. సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాల అధ్యక్షులని కావాలని మార్పు చేశారు. దీంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలని తొలగించి మరీ తన సొంత టీంని నియమించుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభమైన గ్రూపు రాజకీయాలు ఎన్నికల సమయానికి తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు వరకు ఏపీలో బీజేపీ, జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తుందని భావించిన నేతలు. .ఆ దిశగానే ప్రయత్నించారు.జనసేన.. టీడీపీతో కలిసిన తర్వాత ఒంటరి పోరు వైపే మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఉండాలనే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని.. అందు కోసం ఒంటరిపోరే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాలలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలుసుకుని ఎన్డీఎలో చేరడం వెనుక పురందేశ్వరి చక్రం తిప్పారని బీజేపీ నేతలు చెబుతుంటారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సొంతపార్టీ కంటే సొంత బంధువర్గానికి ప్రాదాన్యతనిచ్చారనేది జరిగిన పరిణామాలే చెబుతున్నాయి.చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్ని ఢిల్లీకి తీసుకెళ్లి హోంమంత్రి అమిత్ షాని కలిపించడం వెనుక పురందేశ్వరే ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ జత కట్టడం.. టిక్కెట్లు ఖరారు ఇవన్నీ బీజేపీ కనుసన్నల్లో కంటే చంద్రబాబు చెప్పినట్లుగానే జరిగాయని విమర్శలున్నాయి. గత నాలుగన్నరేళ్లగా క్షేత్రస్ధాయిలో బీజేపీ బలోపేతంగా ఉన్న స్థానాలను తీసుకోవాల్సిన సమయంలో పురందేశ్వరి మాట్లాడకపోవడం ఏపీ బీజేపీకి మైనస్గా మారింది. ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కనీసం 25 అసెంబ్లీ స్ధానాలు, ఎనిమిది పార్లమెంట్ స్దానాలలో పోటీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆశించారు. ఇందుకోసం టీడీపీతో గట్టిగా సంప్రదింపులు చేయాలని సీనియర్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు.అయితే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే మైకంలో ఉన్న బీజేపీ పెద్దలకి ఏపీ బీజేపీలో పరిస్ధితులని పట్టించుకోలేదు. .ఇదే సమయంలో టీడీపీతో పొత్తులో భాగంగా పురందేశ్వరి చంద్రబాబు ఆశించినట్టుగా వ్యవహరించి కేవలం ఆరు ఎంపీలు, పది అసెంబ్లీ స్ధానాలకి పరిమితం చేశారు. ఆ తర్వాతైనా బీజేపీ పట్టున్న స్ధానాలను కోరుకుందా అది కూడా లేదు.. బీజేపీ ఓడిపోయే స్ధానాలను బిజెపికి అండగట్టినా కూడా ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి పెదవి విప్పలేదు... సరికదా తనకు ఎంపి టిక్కెట్ వస్తే చాలని ఊరుకున్నారు.దీనికి తోడు బిజెపితో పొత్తుకు ముందే కొన్ని స్ధానాలను టిడిపి ప్రకటించడం కూడా ఎపి బిజెపిలో మొదట నుంచి నేతలకి నచ్చలేదు.. బిజెపిలో మొదటి నుంచి సీనియర్లకి అవకాశం ఇవ్వాలని...బిజెపి గెలిచే స్ధానాలను తీసుకోవాలని సీనియర్లు నెత్తీ నోరూ బాదుకున్నా కూడా పురందేశ్వరి తన మరిది చంద్రబాబుతో కలిసి చేసిన కుట్రలు ఎపి బిజెపి భవితవ్యాన్ని పూర్తిగా చిదిమేశాయివిశాఖపట్టణం ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు చివరి వరకు ప్రయత్నించారు.బిజెపి జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు విశాఖలో ఇల్లు కొనుక్కుని ఆ పార్లమెంట్ పరిధిలో బిజెపి బలోపేతం కావడానికి మూడేళ్లకి పైగా కృషి చేసిన జివిఎల్ ఆ స్ధానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే పురందేశ్వరి కనీసం టిడిపి, బిజెపి ఉమ్మడి చర్చలలో విశాక సీటుని కనీసం ప్రస్తావించలేదని తెలుస్తోంది. విశాఖలో పార్టీ బలంగా ఉందని..ఆ సీటు బిజెపికి ఇవ్వాలని పురందేశ్వరి గట్టిగా పట్టుపట్టకపోవడంతోనే ఆ సీటు టిడిపి తీసుకుందని చెబుతున్నారు.కేవలం తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యాసంస్ధల చైర్మన్ భరత్ కోసమే జివిఎల్ కి టిక్కెట్ రాకుండా చేశారని చెబుతున్నారు.ఆ తర్వాత విజయనగరం లేదా అనకాపల్లి కోసం జివిఎల్ ప్రయత్నించినా కూడా అవి కూడా దక్కలేదు.దీంతో జివిఎల్ పురందేశ్వరి వైఖరిపై అలిగి ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు.ఇక అనకాలపల్లి ఎంపి స్ధానంపై మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆశలు పెట్టుకుంటే ఆయనని కాదని కడప నుంచి సిఎం రమేష్ కి టిక్కెట్ ఇప్పించారు.ఇది కూడా చంద్రబాబు డైరక్టన్ లో జరిగిందని బిజెపి సీనియర్లు విమర్శిస్తున్నారు.ఉత్తరాంద్రలో ఉన్న బిసి నేతలకి అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల తర్వాత టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్ కి టిక్కెట్ ఇవ్వడం ఉత్తరాంద్ర బిజెపిలో వివాదం రాజేసింది. బిజెపిలో ఉంటూ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండే సిఎం రమేష్ అభ్యర్ధిత్వాన్ని ఉత్తరాంద్ర బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోయారు.ఇక రాజమండ్రి స్ధానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావించారు. రాజమండ్రిలోనే పుట్టి నాలుగన్నర దశాబ్ధాలగా బిజెపిలో ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి ఎంపి టిక్కెట్ ఆశిస్తే పురందేశ్వరి చక్రం తిప్పి టిక్కెట్ ఆమె దక్కించుకున్నారు.ఇక సోము వీర్రాజుని అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సూచించినా ఓడిపోయే స్ధానంలో పోటీచేయలేనని తిరస్కరించారు.ఇక ఏలూరు స్ధానం కోసం దశాబ్ధకాలంగా బిజెపిలో పనిచేస్తున్న తపనా చౌదరికి కూడా టిక్కెట్ ఇప్పించడంలో పురందేశ్వరి విఫలమయ్యారు.ఈ సీటుని బిజెపికి ఇవ్వకుండా టిడిపి తీసేసుకుని కడప జిల్లాకి చెందిన యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ని రంగంలోకి దింపారు. ఇక హిందూపూర్ ఎంపి కానీ కదిరి అసెంబ్లీ కానీ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా టిక్కెట్ దక్కలేదు.ఇలా వరుసగా పార్టీనే నమ్ముకుని దశాబ్ధాలగా రాజకీయాలు చేసిన సీనియర్లెవరకి కూడా టిక్కెట్లు దక్కలేదు కానీ టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతలకి టిక్కెట్లు దక్కడం సీనియర్లకి తీవ్ర నిరాశ కలిగించింది.దీంతో పాటు అనపర్తి టిక్కెట్ విషయంలో మాజీ సైనికుడికి అన్యాయం చేస్తూ రాత్రికి రాత్రి టిడిపి ఇన్ చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం...బద్వేలులో కూడా ఉప ఎన్నికలలో పోటీ చేసిన బిజెపి నేతని పక్కన పెట్టి టిడిపి ఇన్ చార్జి రోషన్ ని ముందు రోజు బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం బిజెపిలో తీవ్ర వివాదాస్పదమైంది.అలాగే ఎన్నికలకి ముందు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ ని బిజెపిలో చేర్చుకుని తిరుపతి ఎంపి టిక్కెట్ ఇవ్వడం కూడా పార్టీలో వ్యతిరేకత తెచ్చింది.ఇలా ఉద్దేశపూర్వకంగా బిజెపిలో మొదట నుంచి పనిచేసిన నేతలని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి టిక్కెట్లు ఇవ్వడం వెనుక పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించారని సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.టిడిపి నుంచి బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చే బదులు ఆ సీట్ల స్ధానంలో బిజెపి వేరే సీట్లని తీసుకోవాలని... దీని వల్ల బిజెపి నష్టపోతోందంటూ మాజీ సిఎం బిజెపి సీనియర్ నేత ఐవిఆర్ కృష్ణరావు పలుమార్లు ట్విట్లర్ వేదికగా ప్రశ్నించారు. ఇలా పురందేశ్వరి పెట్టిన చిచ్చుతో ఎన్నికల సమయంలో ఎపి బిజెపి రెండుగా చీలిపోయింది.ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎవరూ కూడా ప్రచారంలో పాల్గొనకపోవడానికి పురందేశ్వరి వైఖరే ప్రధానకారణంగా తెలుస్తోంది.ఇక రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాదిరిగానే అక్కడా సొంత టీం నే ఏర్పాటు చేసుకున్నారు.స్ధానికుడైన సీనియర్ నేత సోము వీర్రాజుని పురందేశ్వరి ఎక్కడా కలుపుకుపోలేదు. నామినేషన్ రోజున మాత్రం సోము వీర్రాజుతో కలిసి ర్యాలీగా వెళ్లి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.ఆ తర్వాత సోము వీర్రాజు ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడానికి పురందేశ్వరి వైఖరే కారణమని తెలుస్తోంది. సోము వీర్రాజు స్ధానంలో రాజమండ్రి టిక్కెట్ దక్కించుకున్న పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కూడా కనీసం సోము వీర్రాజు ఇంటికి వెళ్లకపోవడం...ఎన్నికల ప్రచారానికి ఆయనను పిలవకపోవడంతోనే ఆయన ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. దీనికి తోడు రాజమండ్రిలో సోము వీర్రాజు హయాంలో కట్టిన బీజేపీ కార్యాలయాన్ని కాదని ఎన్నికల వేళ పురందేశ్వరి ప్రత్యేకంగా వేరే చోట ఎన్నికల కార్యాయాల్ని ప్రారంభించడం కూడా సోము వీర్రాజుకి తీవ్ర మనస్తాపం కలిగించినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యాయాలన్ని కాకుండా ప్రైవేట్గా వేరేచోట ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేయడం కూడా ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలను రాజేసింది. ఇలా సొంత పార్టీ కార్యాలయాన్ని.. సొంత పార్టీ నేతలను నమ్మకుండా టీడీపీ నేతలను పురందేశ్వరి నమ్మడం కూడా ఆమెకు మైనస్గా మారిందంటున్నారు.ఇలా వరుస తప్పిదాలతో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందంటున్నారు. ఒకవర్గం పురందేశ్వరి అనుకూలంగా ఉంటే...మరొక వర్గం పురందేశ్వరిని వ్యతిరేకిస్తోందంటున్నారు.ఇలాంటి పరిణామాలు గతంలో ఎపుడూ ఏపీ బీజేపీలో చోటుచేసుకోలేదని.. కేవలం పురందేశ్వరి వైఖరి కారణంగానే బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని అంటున్నారు.ఇపుడా గ్రూపు రాజకీయాలే పురందేశ్వరికి ఎసరు తెచ్చేలా కన్పిస్తున్నాయంటున్నారు.రాజమండ్రితో పాటు బిజెపి పోటీ చేసిన మొత్తం ఆరు ఎంపి స్ధానాలు, పది అసెంబ్లీ స్ధానాలలో కనీసం సగం సీట్లైనా బిజెపి గెలిస్తేనే పురందేశ్వరి రాజకీయ భవితవ్యానికి ఇబ్బంధి ఉండకపోవచ్చునంటున్నారు. కానీ బిజెపి గెలుపొందే స్ధానాలను కాకుండా ఓడిపోయే స్ధానాలను తీసుకునే ఓటమిని ముందే డిసైట్ చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు మాట తర్వాత కనీసం పురందేశ్వరి అయిన రాజమండ్రిలో గెలుస్తోందో లేదోనేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ రాజమండ్రిలో పురందేశ్వరి ఓడిపోతే ఆమె రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆమె ఓడిపోతే ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెకు శాపంగా మారి బీజేపీ అధ్యక్షరాలి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఇప్పటికే ఎన్నికల సమయంలో పురందేశ్వరి కుట్ర రాజకీయాలపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంటున్నారు. ఇలా వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఆమె ఓడిపోతే శాశ్వతంగా పురందేశ్వరి చేజేతులా రాజకీయ భవిష్యత్ని నాశనం చేసుకున్నట్లేనని చెబుతున్నారు. కాంగ్రెస్లో దశాబ్ధకాలం పాటు ఎంపిగా.. కేంద్ర మంత్రిగా పనిచేయడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హవా ఆమెకు కలిసివచ్చిందని.. ఇపుడు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమె భవితవ్యాన్ని సమాది చేస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ గప్ చుప్గా ఉంది.. నేతలెవరూ కూడా ఎన్నికల తర్వాత పెదవి విప్పడానికి సాహసించడం లేదు.. గెలుపుపై నమ్మకం లేక ఏ నేతా కూడా మీడియా ముందుకురావడానికి ఇష్టపడకపోవడం ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు.. తాజా పరిస్థితులను తెలియజేస్తున్నాయంటున్నారు. -
దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..
-
మార్చినచోటే మారణకాండ
సత్తెనపల్లి: రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్ బూత్లను స్వా«దీనం చేసుకుని ఈవీఎంలను ధ్వంసం చేయాలనే లక్ష్యంతో టీడీపీ దాడులకు తెగబడిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బూత్ నంబర్లతో సహా ఈ వివరాలను వెల్లడించి రీ పోలింగ్ నిర్వహించాలని కోరితే అవసరం లేదని ఎన్నికల కమిషన్ చెబుతోందన్నారు. ఈ దారుణానికి కారకులెవరో నిగ్గు తేల్చాలని సిట్ను, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు ఉన్నతాధికారులను మార్చిన ప్రాంతాల్లోనే హింస చెలరేగిందన్నారు. చంద్రబాబు ప్రోద్భలంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు మేరకు పల్నాడు, అనంతపురం ఎస్పీలను ఎన్నికలకు ముందు ఈసీ బదిలీ చేసిందని గుర్తు చేశారు. పల్నాడుతోపాటు అనంతపురం, తాడిపత్రిలో చెలరేగిన హింసను నియంత్రించలేక పోలీసులు చేతులు ఎత్తేశారన్నారు.మంత్రి అంబటి ఆదివారం నరసరావుపేటలో ‘సిట్’ అధికారులను కలసి ఎన్నికల హింస, కొందరు పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై ఫిర్యాదు చేశారు. అనంతరం గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణతో కలసి సత్తెనపల్లిలో మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. చరిత్రలో చూడని విచిత్రం రాయలసీమ, పల్నాడులో గతంలో ఇంత హింస చెలరేగిన సందర్భాలు లేవు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు బాధ్యతలు చేపట్టాక టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశాయి. పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్ సీపీ చాలా బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఏడుకు ఏడు సీట్లు గెలవడం, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉన్నందున దాడులకు తెగబడ్డారు. తాము నియమించిన ఐపీఎస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించారని ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం చరిత్రలో ఎప్పుడూ చూడని విచిత్రం.సత్తెనపల్లి రూరల్ సీఐపై ఫిర్యాదు నరసరావుపేటలో సిట్ అధికారుల బృందాన్ని కలిసి వాస్తవాలను తెలియచేశా. రుజువులు, ఆధారాలు నివేదిక రూపంలో సమర్పించాం. పోలీసులే కౌంటర్ కేసులు పెట్టిస్తున్నారు. తప్పుడు కేసులతో బాధితులనే బెదిరిస్తున్నారు. సత్తెనపల్లి రూరల్ సీఐ మీసాల రాంబాబుపై ఫిర్యాదు చేశా. కొందరు పోలీసులు టీడీపీ నేతలకు డబ్బులకు అమ్ముడు పోయారు. కన్నా లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు ఇచ్చిన డబ్బులకు లొంగిపోయినట్లు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరా. తొండపిలో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు పల్నాడు జిల్లా తొండపి గ్రామంలో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని కొత్త ఎస్పీని కోరుతున్నా. ముస్లింల ఇళ్లు, బైకులు తగలబెట్టారు. ముస్లిం మైనార్టీలు ప్రాణ భయంతో ఊరు వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. వారికి పార్టీ తరపున అండగా ఉంటాం. వైఎస్సార్ సీపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుంది. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారు.యథేచ్ఛగా విధ్వంసం.. పోలింగ్ రోజు తలలు పగిలి పోతున్నా పోలీసులు రాలేదు. అల్లరి మూకలు అలసిపోయే వరకు యథేచ్ఛగా మారణకాండకు తెగబడ్డాయి. నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వి కార్లు ధ్వంసం చేశారు. నార్నెపాడులో ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న నా అల్లుడు ఉపేష్ కారును సైతం ధ్వంసం చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫిర్యాదు తీసుకోవాలని కోరినా స్పందించలేదు. ఓటమి భయంతో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరించారు. అధికారం దక్కదని పసిగట్టిన ప్రతి సందర్భంలోనూ ఆయన హింసను నమ్ముకున్నట్లు చరిత్ర చెబుతోంది. -
వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
ఏపీ పోలీస్ అబ్జర్వర్ పై మెరుగు నాగార్జున ఫైర్
-
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
-
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
-
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలకు చురకలంటించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బీజేపీ పురంధేశ్వరి కావాలనే సోము వీర్రాజును పక్కనబెట్టారు. అలాగే, ఎల్లో మీడియా పెద్దలు ఓటమి భయంతో రాత్రి పూట నిద్రపోవడంలేదని ఎద్దేవా చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ఏమాటకామాట! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును వదిలేసి ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, సొంత మనుషుల ద్వారా ప్రచారం నిర్వహించడం మొదటి నుంచి పార్టీలో ఉన్న కేడర్ను నమ్మకుండా అవమానించడమేనని అంటున్నారు. ఏమాటకామాట! బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి గారు కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు గారి మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2024 ఎన్నికలలో టీడీపీ (తప్పుడు)ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదంట. ఈ ఆఖరి పోరాటంలో బాబుకు ఓటమి తప్పదనే ‘కమురు వాసన’ అక్కడివరకు వ్యాపించడం వారిని కలవరపాటుకి గురిచేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికలలో టీడీపీ (దుష్)ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదంట. ఈ…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2024 -
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
వరుసబెట్టి పదేపదే ఫిర్యాదులతో..మేం 2024 మార్చి 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ) విధానంలో ఫింఛన్ల పంపిణీకే పాధాన్యం ఇవ్వండి. లేదంటేనే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న సీఎస్కు ఈసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం. (ఏప్రిల్లో దివ్యాంగులకు ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులిచ్చిది) విలన్ నంబర్–1 పింఛను లబ్ధిదారుల్లో బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పి వస్తున్నాం. బ్యాంకు అకౌంట్లు లేని వారికి సచివాలయం వద్ద పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పాం. దివ్యాంగులకు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చు. – 20 రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలివీ. (ఇతను చంద్రబాబు ఏజెంట్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.)విలన్ నంబర్ 2 కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ(నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ) రూపంలో అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పింఛన్ డబ్బులను అలా ఎందుకు పంపిణీ చేయదు? – 10–15 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్(ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే.) సహాయ పాత్రధారులు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఖాతాల్లోనే పెన్షన్ వేయాలి. మిగిలిన వారికి ఇళ్లకే వెళ్లి ఇస్తే సిబ్బందికి శ్రమ తగ్గుతుంది. ఏప్రిల్ 28న ఏపీ బీజేపీ నేతల సూచనసాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి ఐదేళ్లుగా ప్రతి నెలా ఠంచన్గా ఇంటివద్దే చేతికి ఇస్తున్న పెన్షన్లకు అడ్డుపడి రచ్చ చేసిన పచ్చ బృందం సచివాలయాల్లో అందిస్తున్నా శాంతించలేదు! మండుటెండల్లో తిరగలేక పండుటాకుల ప్రాణాలు విలవిల్లాడే పరిస్థితికి తెచ్చిది. అవ్వాతాతల ఉసురు మూటగట్టుకుంటూ పెద్ద ప్రాణాలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా వికృత రాజకీయాలకు బాబు బృందం తెర తీసింది! అవ్వాతాతల ఫించన్ల కష్టాలకు చంద్రబాబు, ఆయన సన్నిహితులు, మిత్ర పార్టీల నిర్వాకాలే కారణం. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటూ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, కొందరు ఏపీ బీజేపీ నాయకులు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లోనే పింఛను డబ్బులు జమ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. పింఛన్దారులకు ఇళ్ల వద్ద కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి తానే చెప్పానంటూ ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన అనంతరం నిమ్మగడ్డ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇలా ఈసీకి వరుస ఫిర్యాదులతోపాటు ఉన్నతాధికారులను బెదిరించేలా ఎల్లో మీడియాలో కథనాలు వెలువరించేలా చంద్రబాబు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మరోవైపు ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ అవే అవస్థలుఐదేళ్ల తర్వాత మళ్లీ అవ్వాతాతలు పింఛన్ల కోసం అవస్థ పడుతూ ఊరు దాటారు! తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు చేరుకుని చాంతాడంత క్యూలో నిలబడి నానా అగచాట్లు పడ్డారు. గత 58 నెలలుగా ప్రతి నెలా ఏ కష్టం లేకుండా కరోనాలో సైతం ఠంఛన్గా ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా పింఛన్ మొత్తాన్ని అందుకున్న లక్షలాది మంది పింఛన్దారులు ఈసారి కొత్తగా బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్గా అందే ఆ డబ్బులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఖాతాల్లో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు చేరుకోవడంతో గురువారం రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు పింఛన్ లబ్ధిదారులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ మంది అవ్వాతాతలు బ్యాంకులు తెరవక ముందే ఉదయం 9 గంటల నుంచే చేరుకుని ఎదురు చూస్తూ ఉండిపోయారు. బ్యాంకు అందుబాటులో లేని గ్రామాలకు చెందిన వారు పనులు మానుకుని 10 కి.మీ. దూరంలోని ప్రాంతాలకు తరలి వచ్చారు. పలుచోట్ల ఊళ్లకు ఊళ్లే తరలిరాగా పింఛను డబ్బులు పడ్డ బ్యాంకు ఖాతాలు చాలా కాలంగా వినియోగంలో లేని కారణంగా ఇన్ యాక్టివ్లో ఉన్నట్లు తెలుసుకుని ఉసూరుమన్నారు. బ్యాంకు అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు ఒకేసారి వందల మంది రావడంతో బ్యాంకు సిబ్బంది సైతం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. బాబు సేవలో వీర విధేయులు.. పింఛను డబ్బులు బ్యాంకుల్లో జమ చేయాలంటూ ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైన నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. 2020లో మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకు నోటిఫికేషన్లు జారీ చేయగా ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు ఏకగ్రీవంగా గెలుస్తున్న పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా నిలిపివేశారు. చంద్రబాబు కుటుంబ బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ పొత్తులో దక్కిన సీట్లను 20–30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా చంద్రబాబు వీర విధేయులుగా ముద్రపడ్డ బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకు ఇచ్చారు. దీనికిపై సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేయడంలోనూ నిమ్మగడ్డ, పురందేశ్వరి లాంటి వారిని ముందు పెట్టి చంద్రబాబు రాజకీయ డ్రామాలకు తెర తీశారు.మొదలు పెట్టిందే టీడీపీరాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంఛన్గా లబ్ధిదారుల ఇంటి వద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే దీన్ని అడ్డుకుంటూ చంద్రబాబు సన్నిహితులంతా వరుసపెట్టి ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు సామాజికవర్గం పరంగా, రాజకీయ ప్రయోజనాల పరంగా వివిధ సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ తన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఫింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్గా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీకి బ్రేక్లు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిది. టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదుల మేరకే వలంటీర్లు పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు వినియోగించే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్లో పింఛను డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చేపట్టారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్న అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు ఏ కష్టం లేకుండా పింఛను తీసుకున్న వారికి ఈ నిర్ణయం కాస్త కష్టంగా అనిపించినా కేవలం ఐదు రోజులోనే అందరికీ సజావుగా డబ్బులు చేతికి అందాయి. అయినా సరే ఆగకుండా టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు ఉమ్మడిగా గత నెల రోజులుగా దాదాపు రోజు మార్చి రోజు పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు వెలువరించి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై నెపం వేస్తూ చంద్రబాబు, టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారు.చంద్రబాబు మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు పది కిలోమీటర్ల దూరం నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు జంగారెడ్డిగూడెం వచ్చా. ఉదయం 9 గంటలకే ఇక్కడకొచ్చిన నేను పింఛన్ సొమ్ము తీసుకుని ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది. మండుటెండలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిది. చంద్రబాబు ఎన్నికల ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. దాని పర్యావసానాలు చంద్రబాబు అనుభవించాల్సిందే. – రాయల మునేశ్వరరావు, పింఛన్ లబ్ధిదారుడు, కేతవరం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా ముసలివాళ్లపైనా మీ ప్రతాపం ప్రతినెలా 1వ తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. గత నెల సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకున్నాం. ఈ నెల బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చిది. మండుటెండలో ఎలా వెళ్లగలం. చంద్రబాబు, ఆయన మనుషులు చేసిన ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు అందకుండా పోయాయి. ముసలివాళ్లపై ఇలా అక్కసు చూపడం తగదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఉసురు తగులుతుంది. – పెసర పోలమ్మ, పాలమెట్ట, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లానా అకౌంట్ రన్నింగ్లో లేదంటున్నారు సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా వలంటీర్ను మా ఇంటికి పంపించి పింఛన్ డబ్బులు ఇచ్చేవాడు. వలంటీర్లను ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈ నెల పింఛన్ డబ్బు బ్యాంకులో వేశారని చెప్పారు. ఇండియన్ బ్యాంకుకు వెళ్లి అడిగితే నా అకౌంట్ రన్నింగ్లో లేదని చెప్పారు. ఎండలోనే వెళ్లి ఎండలోనే ఇంటికి తిరిగివచ్చా. ప్రతినెల మందులు వాడుతున్నా. ఇప్పుడు పింఛన్ డబ్బులు రాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. – షేక్ గాలిబ్సాహెబ్, పింఛన్దారుడు, పెండ్యాల, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లాచంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో నా వయసు 70 ఏళ్లు పైనే. పింఛన్ తీసుకోలేకపోతున్నా. ఈ నెల పింఛన్ బ్యాంకులో జమ చేసినారంట. అక్కడికెళ్లాలంటే.. రెండు కిలోమీటర్లు నడిసి హైవే కాడికి పోవాల. ఆటి నుంచి బస్సో, ఆటోనో ఎక్కి మళ్లీ 5 కిలోమీటర్ల దూరంలోని వెల్దుర్తి మండల కేంద్రానికి పోవాల. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరం బస్సులో డోన్కి పోవాల. అక్కడ బ్యాంకులో పింఛన్ జమ చేసి ఉంటే సరి. లేదంటే నేను ఎన్ని తిప్పలు పడాలో. ఎన్నికల సమయంలో మళ్లీ ఆ చంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో ఏమో పింఛన్ తీసుకోవడానికి ఈ ఎండల్లో సచ్చి బతుకుతున్నాం – సుబ్బయ్య, అల్లుగుండు గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లామా ఉసురు తగలకపోదు నా వయసు 70 సంవత్సరాలు. గతంలో 1వ తారీఖు తెల్లవారుజామునే తలుపుతట్టి వలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడంటగా.. మాకు ఇంటి దగ్గరకొచ్చి పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ కోసం ఎండలో వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్నా. గంటల కొద్దీ లైన్లో నిలబడాలంటే వయసు సహకరించడం లేదు. ముసలోళ్లపై కక్ష గట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగలకపోదు. – దిబ్బమ్మ, నాగెళ్లముడుపు, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లాపింఛన్ కోసం తిరగలేక అల్లాడుతున్నాం వృద్ధాప్య పింఛన్ను ప్రతి నెలా ఇంటికే వచ్చి ఇచ్చేవారు. అయితే చంద్రబాబు కుట్ర ఫలితంగా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే ఇక్కడ కాదు.. బ్యాంకులో జమవుతుందన్నారు. దుత్తలూరులోని యూనియన్ బ్యాంక్కు వెళ్తే నగదు జమ కాలేదని తెలిపారు. ఈ రోజంతా ఇలానే గడిచిపోయింది. ఎండలో అవస్థలు పడాల్సి వచ్చిది. ముసలోళ్లను ఇంత ఇబ్బందికి గురిచేసిన వారికి తగిన బుద్ధి చెప్తాం. – దుగ్గినబోయిన పెద్దగురవయ్య, చింతలగుంట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
చిన్నమ్మ.. వెన్నుపోటులో పెద్దమ్మ..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చిన్నమ్మ..తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. ఎన్టీఆర్ కుమార్తెగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు పురందేశ్వరి. మెట్టినిల్లు దగ్గుబాటి ఇంట అడుగిడి రాజకీయ అరంగేట్రం చేశారు. రెండుసార్లు కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. వీటితోపాటు తాజాగా ఆమె ఘనతలో మరోసారి ‘వెన్నుపోటుదారు’అనే అలంకారం చేరింది. అదికూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న బీజేపీ నుంచే కావడంతో చిన్నమ్మ మరింత చిన్నబోయారు. నాడు–నేడు బాబుకే చేదోడు సీఎం పీఠం కోసం అవమానకరంగా ఎన్టీఆర్ను పదవీచ్యుతుణ్ని చేసిన నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారునిగా అందరి నోళ్లలో నిత్యం నానుతూనే ఉన్నారు. ఈ వెన్నుపోటు వ్యవహారంలో పురందేశ్వరి భర్త, బాబుకు తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనవంతు పాత్ర పోషించినట్లు పలు సందర్భాలలో బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన అంకంలో భర్తను గట్టిగా ప్రోత్సహించి, మరిది బాబుకు చేదోడువాదోడుగా నిలిచారని పురందేశ్వరి గురించి అయినవారంతా చెప్పుకుంటారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పొత్తుల ముసుగులో తన పార్టీకన్నా టీడీపీకే మద్దతిస్తున్నారని కమలం నేతలు గుర్రుగా ఉన్నారు. అధ్యక్షురాలిగా ఈ స్థాయిలో పార్టీకి వెన్నుపోటు పొడవటాన్ని అంతర్గత సమావేశాల్లో నాయకులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. 5 ఎన్నికలు... 4 స్థానాలు పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం గమనిస్తే కాంగ్రెస్కు వ్యతిరేకంగా తన తండ్రి టీడీపీని స్థాపించి అధికారంలోకి వస్తే.. ఈమె హస్తం పంచన చేరి, 2004 ఎన్నికల్లో బాపట్ల లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. బాబు తమ కుటుంబానికి చేసిన మోసం వల్లే కాంగ్రెస్లో చేరినట్లు సమరి్ధంచుకున్నారు. అదే వాస్తవమైతే ఇప్పుడు చంద్రబాబుకు అంతలా వత్తాసు ఎలా పలుకుతున్నారన్నది విశ్లేషకుల ప్రశ్న. బాపట్ల రిజర్వుడు స్థానం కావడంతో 2009లో విశాఖ నుంచి పోటీచేశారు. రెండుసార్లూ దివంగత మహానేత వైఎస్సార్ హవా తన విజయానికి బాటలు వేసింది.కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. రాష్ట్ర విభజన సాకుతో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్కు బద్ధశత్రువైన బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి ఎన్డీయే అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్రెడ్డి చేతిలో దారుణ ఓటమి చవిచూశారు. 2019లో విశాఖ నుంచి బీజేపీ అభ్యర్ధిగా 33,892 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీయే అభ్యర్ధిగా బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీ స్థానంలో పోటీకి దిగారు. స్వార్థమే పరమావధిగా... 2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయగా పురందేశ్వరి విశాఖ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది. డాక్టర్ దగ్గుబాటికి నాయకునిగా ప్రత్యేక గుర్తింపు లేకపోలేదు. గత ఎన్నికల తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. చిన్నమ్మ కోసం పరోక్ష రాజకీయాలు చేస్తూ తెరమరుగవ్వాల్సి వచ్చిందని ఆయన వీరాభిమానులు వాపోతున్నారు. ఆయన మాత్రం తనకు రాజకీయాలంటే విముఖతని చెప్తూనే.. పురందేశ్వరి కోసం తాజాగా రాజమండ్రిలో తిష్ట వేయడం గమనార్హం. ఎన్టీఆర్ను మించిన నటి చిన్నమ్మ: నందమూరి లక్ష్మీపార్వతి ‘అవును, నేను చెబుతున్నది యదార్థం. ఎన్టీఆర్ స్క్రీన్పై కనిపించి మహానటుడిగా వినుతికెక్కారు. చిన్నమ్మ తెరవెనుక నటనలో మహానటిని మించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు వ్యవహారంలో కుటుంబపరంగా పురందేశ్వరి పాత్రను తెలుసుకున్న ఎన్టీఆర్ అభిప్రాయమిది. ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందునే ఈ మాటలు చెప్పగలుగుతున్నానని’ నందమూరి లక్ష్మీపార్వతి ’సాక్షి’కి తెలిపారు. ‘చంద్రబాబు, రామోజీల వెన్నుపోటు కుట్ర గురించి దగ్గుబాటికి తొలుత తెలియదు.బాబుకు సహకరించే క్రమంలో పురందేశ్వరే కుటుంబ సభ్యులను కూటమి కట్టేలా చేసింది. భర్తను దగ్గరుండి వైశ్రాయ్ హోటల్కు పంపింది. ఆ వెంటనే ఎన్టీఆర్ వద్దకు వచ్చి పక్కన కూర్చుంద’న్నారు. చిన్నమ్మ నాటకాలు ఆ సమయంలో గుర్తించలేకపోయినా ఆ తరువాత వెన్నుపోటుకు సంబంధించిన వాస్తవాలన్నీ తెలిశాయని, నటనలో తనను కూతురు మించిపోయిందని ఎన్టీఆర్ పలు సందర్భాలలో ప్రస్తావించారని లక్ష్మీపార్వతి వివరించారు. బీజేపీకి భారీ వెన్నుపోటుటీడీపీ, జనసేనతో జట్టు కట్టిన బీజేపీ ఆరు లోక్సభ, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుండగా, ఆయా స్థానాల ఎంపిక, అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో మరిది బాబుతో కలిసి చిన్నమ్మ ఆడిన డ్రామాలను ప్రజలు గమనించకపోలేదు. అనపర్తిలో మాజీ సైనికుడు శివకృష్ణరాజును కాదని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కట్టబెట్టారు. కడప జిల్లా బద్వేలు అభ్యర్థి రోశన్న టీడీపీ కండువా తీసేసిన మరునాడే బీజేపీ టికెట్ దక్కింది. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, ఎన్.ఈశ్వరరావులు ఏ పార్టీ వారో అందరికీ తెలుసు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించారు. అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీచేస్తున్న సీఎం రమేశ్ చంద్రబాబు జేబులో మనిషి. కాపులకు బీజేపీ నుంచి ఒక్క టిక్కెట్ కూడా దక్కకపోవడానికి పురందేశ్వరే కారణమని ఆ వర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. తన కళ్ల ముందు ప్రధాని మోదీ ఫ్లెక్సీలను కొందరు టీడీపీ కార్యకర్తలు చింపుతున్నా, కనీసం వారించకుండా మౌనం వహించిన చిన్నమ్మ వైఖరి బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది. -
ఏపీ బీజేపీని ముంచేసిన పురందేశ్వరి
ఏపీ బీజేపీని పూర్తిగా ముంచారు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి. బీజేపీ తరపున టికెట్ కావాలంటే వారు టీడీపీ నుంచి వచ్చిన వారైనా అయి ఉండాలి లేదంటే మనోళ్లు అయినా అయి ఉండాలి. ఈ రెండూ కాకపోతే మాత్రం టికెట్పై ఆశలు పెట్టుకోవలసిన అవసరం లేదు. చంద్రబాబు పార్టీకి బీజేపీని బ్రాంచి కార్యాలయంగా మార్చేశారని పురందేశ్వరిపై బీజేపీ వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా చంద్రబాబు ఆదేశించడమే ఆలస్యం బీజేపీ నేతకు కేటాయించిన సీటును కూడా వెనక్కి తీసుకున్నారు పురందేశ్వరి. దీనిపై నిన్నటిదాకా ప్రచారం చేసిన నాయకుని అనుచరులు నిప్పులు చెరుగుతున్నారు. పురందేశ్వరి తీరుతో ఏపీ బీజేపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ట్వీట్ చేశారు. మరో నేత ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇదేం పొత్తుల ధర్మం అంటూ ట్వీట్ చేశారు.ఏపీ బీజేపీలో మొదట్నుంచీ ఉన్న సీనియర్ నాయకులు జీవిఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి వారికి టికెట్లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు పురందేశ్వరి. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానంలోనూ చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఒరిజినల్ బీజేపీ నేతకు ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకుని.. ఆ సీటును చంద్రబాబు నాయుడి పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టారు.అనపర్తి నియోజక వర్గంలో టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణకు టికెట్ ఇవ్వకుండా ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. దీనిపై నల్లమిల్లి వర్గం నిప్పులు చెరిగింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేయాల్సిందే అని నల్లమిల్లిని ఆయన అనుచరులు పట్టుబట్టారు.తమకి కేటాయించిన ఈ సీటులో బీజేపీ నాయకత్వం మాజీ సైనికుడు బీజేపీకి మొదట్నుంచీ విధేయుడు అయిన శివరామ కృష్ణంరాజుకు కేటాయించారు. అప్పట్నుంచీ శివరామకృష్ణంరాజు నియోజక వర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. నల్లమిల్లి రామకృష్ణ వర్గం తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు కంగారు పడ్డారు. నల్లమిల్లిని దూరం చేసుకోవడం ఎందుకనుకున్న చంద్రబాబు బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటులోనూ తమ అభ్యర్ధినే బరిలో దింపాలని అనుకున్నారు. అంతే పురందేశ్వరితో మంతనాలు జరిపి అనపర్తి సీటులో టీడీపీ నాయకుడైన నల్లమిల్లికి బీజేపీ కండువా కప్పి టికెట్ కేటాయించాల్సిందిగా సూచించారు.చంద్రబాబు నాయుడి కోసమే ఏపీ బీజేపీ పనిచేయాలని అనుకుంటోన్న పురందేశ్వరి మరో ఆలోచనే చేయకుండా నల్లమిల్లికి టికెట్ ఇవ్వడానికి సై అన్నారు. ప్రచారం చేసుకుంటోన్న బీజేపీ నాయకుడు శివరామ కృష్ణం రాజును ఇక ప్రచారం చేయద్దని ఆదేశించారు.రాజమండ్రి రూరల్ సీటు విషయంలోనూ ఇంతే. నిజానికి అక్కడ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వాలి. అయితే ఆయన బీజేపీ చీఫ్గా ఉండగా నిత్యం చంద్రబాబును విమర్శించేవారు. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వద్దని పురందేశ్వరిని ఆదేశించారు చంద్రబాబు. ఆ సీటును ముందుగా జనసేనకు కేటాయించిన చంద్రబాబు.. జనసేనకు కూడా వెన్నుపోటు పొడిచి ఆ సీటును తమ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారు.హిందూపురం సీటు ఆశించిన పరిపూర్ణానంద స్వామికి కూడా చివరి నిముషంలో చుక్కెదురైంది. ఆయన్ను పక్కన పెట్టి ఆ సీటును టీడీపీకి వదులు కున్నారు పురందేశ్వరి. దీంతో కుత కుతలాడిపోతోన్న పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. విశాఖ ఎంపీ స్థానాన్ని ఆశించిన జీవీఎల్ నరసింహారావుకు మొండి చెయ్యి చూపించి తమ బంధువు, తన తమ్ముడి అల్లుడు అయిన గీతం భరత్కు కేటాయించారు పురందేశ్వరి. రాయలసీమలో విష్ణువర్ధన్రెడ్డికి కూడా ఇలానే మోసం చేశారు. సంప్రదాయ బీజేపీ నేతలు ఎవరికీ టికెట్లు కేటాయించలేదు పురందేశ్వరి.పురందేశ్వరి వైఖరితో ఏపీ బీజేపీ భూస్థాపితం అయ్యేలా కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు మండి పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ బ్రాంచి కార్యాలయంగా మారిపోయిందని.. చంద్రబాబే ఏపీ బీజేపీకి అనధికార సిఇఓగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి. -
పురందేశ్వరిపై ఫైర్ ఐన పరిపూర్ణానంద స్వామి
-
శివరామరాజుకు బీజేపీ వెన్ను పోటు..
-
పొత్తు చిత్తే! బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
► చంద్రబాబు కాళ్లబేరం.. బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్లు కుదుర్చుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడా పొసగడం లేదు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన మూడు పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణే ఎదురవుతోంది. ఆ పార్టీల అగ్ర నేతల హడావుడే తప్ప, కింది స్థాయిలో ఎక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ► సీట్లు దక్కని నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పని చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు సభలు పెట్టినా, వారు ఆ ఛాయలక్కూడా వెళ్లడం లేదు. ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టారు. ►చంద్రబాబు సభల్లో చాలా చోట్ల బీజేపీ,జనసేన నాయకులను వేదికపైకి రానివ్వడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నచోట మొక్కుబడిగా పిలుస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో వారిని దరిదాపుల్లోకి సైతం రానీయడం లేదు.టీడీపీ అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడంలేదు. ►అనంతపురం జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన యాత్రలో జనసేన, బీజేపీ జాడే కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు ఒక్కడే నిర్వహిస్తున్న సభలతోపాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న కూటమి సభలు కూడా అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి. ఆ సభలకు జనం రావడం గగనమవుతోంది. దీంతో చంద్రబాబు ఒక్కడే వచ్చింనా, కూటమిగా వచ్చింనా ప్రయోజనం మాత్రం శూన్యమేనని ఇట్టే తెలుస్తోంది. ►నాయకులే కలవనప్పుడు ఇక ఆ పారీ్టల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది విశ్లేషకులు ప్రశ్న. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పేరుకు మాత్రమే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. నేతలు, కార్యకర్తల మధ్య ఏ దశలోనూ పొసగడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, టీడీపీ పూర్తిగా సహకరించడం లేదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ.. క్యాడర్ ఎవరూ జనసేనకు సహకరించకుండా కట్టడి చేసి తానొక్కడే పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతూ ఆయన కోసం పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. కింది స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా జనసేన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంది. తమ సీటును తాడూ బొంగరం లేని పార్టీ ఎగరేసుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును అన్యాయంగా జనసేనకు వదిలేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఇటీవల వర్మను ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నిలదీసి వెళ్లగొట్టారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పి.గన్నవరం, అమలాపురంలో సంయుక్తంగా నిర్వహించిన సభలకు జనం రాలేదు. రావులపాలెంలో నిర్వహించిన సభకు 3 వేల మంది కూడా రాలేదు. కూటమి తొలి సభే తుస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగిన కూటమి తొలి సభే తుస్సుమంది. ఆ సభకు 6 లక్షల మంది జనం వస్తారని హంగామా చేసినా, వచ్చింది వేలల్లోనే. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సభ ప్రారంభం నుంచి చివరి వరకు సగం పైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన కూటమి సభలు పేలవంగా జరిగాయి. పాలకొల్లు సభలో చంద్రబాబు జనసేన రాష్ట్ర నేత బన్నీ వాసును ప్రచార రథం ఎక్కనీయక పోవడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. తణుకులో బాబు, పవన్ల నిలదీత ఈ నెల 10వ తేదీన తణుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను జనసేన పార్టీల నేతలు అడ్డుకుని నిలదీశారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోగా, నిలదీతతో ఇద్దరు నేతలు ఖంగుతిన్నారు. తనకు ప్రకటించిన సీటును టీడీపీకి వదిలేశారని ఆగ్రహంతో ఉన్న జనసేన ఇన్ఛార్జి ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు సభకు గైర్హాజరవ్వగా ఆయన అనుచరులు సభా వేదిక వద్దకు చేరుకుని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే టీడీపీ, జనసేన కార్యకర్తలు తోపులాటకు దిగారు. గుంటూరు జిల్లా తాడికొండలో చంద్రబాబు నిర్వహిచిన సభలో జనసేన నాయకులను ప్రచార వాహనంపైకి ఎక్కంచి బీజేపీ నేతలను పక్కకు తోసివేశారు. తెనాలిలో పవన్కళ్యాణ్ సభకు అక్కడి టీడీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టి నాదెండ్ల మనోహర్ కోసం తాను పని చేసేది లేదని చెప్పకనే చెప్పారు. ప్రధాని మోడీ వచ్చింన సభే విఫలం గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన కూటమి సభ విఫలమవడం పొత్తు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం అనుకున్న స్థాయిలో రాకపోగా సభను నిర్వహించడంలో టీడీపీ నేతలు విఫలమవడంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో మోడీ.. టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 6న చంద్రబాబు క్రోసూరు, సత్తెనపల్లిలో చేపట్టిన ప్రజాగళం సభల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించలేదు. సత్తెనపల్లి సభ జనం లేక అట్టర్ఫ్లాప్ అయ్యింది. టీడీపీ తీరుపై జనసేన, బీజేపీ నేతల ఆగ్రహం బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు ప్రజాగళం సభలు జరగ్గా ఒక్కటీ విజయవంతం కాలేదు. బాపట్ల, వేమూరు, రేపల్లెలో జరిగిన సభలకు జనం కరువయ్యారు. ఆ సభలకు జనసేన, బీజేపీ నేతలు ఒకరిద్దరిని ప్రచార వాహనంపైకి పిలవడమే తప్ప కార్యకర్తలు ఎక్కడా కనిపించ లేదు. టీడీపీ తమకు సభల గురించి చెప్పడం లేదని, అస్సలు తమను పట్టించు కోవడంలేదని జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గత నెల 31న జరిగిన చంద్రబాబు సభలో పెట్టిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అంతటా అదే తీరు ► ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 14న చంద్రబాబు నిర్వహించిన సభకు బీజేపీ నేతలు హాజరు కాలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి సహా జిల్లా నాయకులెవ్వరూ హాజరవకపోడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నాయకుల జాడ కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటనకు పెందుర్తి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. చివర్లో చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడినా బండారు శాంతించలేదు. ►తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఆశించిన స్థాయిలో జరగలేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరులో జరిగిన సభలో కూటమి నాయకులు కనిపించలేదు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన సభకు బీజేపీ, జనసేన నేతలు వెళ్లలేదు. ఈ నెల 10వ తేదీన నిడదవోలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సభకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ను ప్రచార వాహనంపైకి పిలిచి ఆ సీటును త్యాగం చేసిన టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో శేషారావు అనుచరులు గొడవకు దిగారు. ►నెల్లూరు జిల్లా కావలిలో గత నెల 29న చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సభ నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు బస్సులోనే ఉండిపోయారు. ఈ నెల 29న ఉదయగిరిలో జరిగిన సభకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గైర్హాజరాయ్యారు. ►కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల 31న చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి.. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎవ్వరినీ ఆహ్వనించ లేదు. కర్నూలులోనూ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. కూటమి పార్టీలను పట్టించుకోకుండా ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు, బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. గత నెల 28న చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన సభలో బీజేపీ ఊసే లేదు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం సభలోనూ బీజేపీ వాళ్లు ఎవరూ లేరు. తమకు ఆహ్వనం లేదని స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, సభకు దూరంగా ఉన్నారు. -
నారా.. దగ్గుబాటి మధ్య రాజీ కుదిర్చింది రామోజీయేనా?
కప్పుకునేది కాషాయం కండువా చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బీజేపీని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో.. తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి..ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టీడీపీ వర్గాలంటాయి. రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టీడీపీ లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ను ఎదుర్కోలేమని రామోజీరావే రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతులు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం రా అన్నారట. ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాల కోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి తన వంతు సాయం అందించారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టీడీపీతో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బీజేపీలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అను నిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు. తాజాగా టీడీపీ నేతల అవినీతి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి. ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు.. వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే సిఫారసు చేస్తూ జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టీడీపీ గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని.. తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు. -సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం -బొత్స
-
ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారంట..!
-
"ఎంపీ పదవి కోసం..నాడు చంద్రబాబు చేసిన మోసం మర్చిపోయి.."
-
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
ఆమె భ్రమ.. గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదు..!