-
27 వారాల గర్భవిచ్చిత్తికి అనుమతి.. భర్త మృతితో తీవ్ర..
ఢిల్లీ: గర్భం వద్దని కోర్టును ఆశ్రయించిన ఓ మహిళా పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సదరు మహిళ 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భర్త మరణించిన ఓ మహిళ తనకు తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని.. 27 వారాల అబార్షన్ను అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పిటిషిన దాఖలు చేసిన మహిళ ఒక వితంతువని ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమె తన భర్తను కోల్పోవడంతో తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ అన్నారు. అయితే ఆమె మానసికస్థితి సరిగా లేనందున, ముఖ్యంగా ఆమె గర్భంతో ఉంటే తనకు తాను హాని చేసుకునే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా ఆమెకు 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుతిస్తున్నట్లు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పు వెల్లడించారు. దీంతోపాటు.. గర్భంతో 24 వారాలు దాటినప్పటికీ సదరు మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ ఆస్పత్రిని ఢిల్లీ కోర్టు కోరింది. చదవండి: బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్.. నాలుగు మరణాలు -
పిల్లలను కనడంపై దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్లో దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్ వీర్ సింగ్, దీపికా.. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని బెల్జియంలో ఘనంగా జరుపుకుంది. అయితే పెళ్లి చేసుకొని ఐదేళ్లు గడుస్తున్నా..ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు లేరు. వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా కొన్నాళ్ల పాటు పిల్లలను కనకుండా ఉండాలని ఈ జంట భావించిందట. అయితే ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై దీపికా పదుకొణె పరోక్షంగా స్పందించారు. పిల్లలు అంటే తనతో పాటు రణ్వీర్కు చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. అంతే కాదు తన పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా దీపికా చెప్పుకొచ్చింది. ‘నేను ఇప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయావని పొగిడేస్తుంటారు. కానీ మా బంధువులు మాత్రం నన్ను ఒక సెలెబ్రిటీలా ట్రీట్ చేయరు. సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నావో..ఇప్పుడు అలానే ఉన్నావని అంటుంటారు. మొదట నేను ఒక కూతురిని.. ఒక సోదరిని.. ఆ తర్వాతే సెలబ్రెటీని! ఫేమ్ వచ్చాక మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. మా పేరెంట్స్ నన్ను అలానే పెంచారు. మా పిల్లల్ని కూడా రణ్వీర్, నేను అలానే పెంచాలనుకుంటున్నాం. మా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలనుకుంటున్నాం’అని దీపికా చెప్పుకొచ్చింది. దీపికా సినిమాల విషయాకొస్తే.. పఠాన్, జవాన్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ 2898’తో పాటు శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లోనూ నటిస్తోంది. -
మైనర్కు అబార్షన్.. కేరళ హై కోర్టు కీలక తీర్పు
కొచ్చి: పన్నెండేళ్ల వయసున్న బాలికకు అబార్షన్ కోసం ఆమె తల్లిదండడ్రులు పెట్టుకున్న అభ్యర్థనకు కేరళ హై కోర్టు నో అన్నది. ఇప్పటికే బాలిక గర్భంలోని పిండం వయసు 34 వారాలకు చేరినందున గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేమని కోర్టు తెలిపింది. ‘గర్భంలో ఉన్న శిశువు వయసు ఇప్పటికే 34 వారాలకు చేరింది. బయటికి రావడానికి శిశువు సిద్ధమవుతోంది ఈ దశలో అబార్షన్ కుదరదు’అని జస్టిస్ దేవన్ రామచంద్రన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మైనర్ అయినందున ఆ అమ్మాయిని తల్లిదండ్రుల పేరేంట్స్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆమె గర్భానికి కారణమయ్యాడని ఆరోపణలున్న బాలిక మైనర్ సోదరుడిని ఆమెకు దూరంగా ఉంచాలని అధికారులకు సూచించింది. గతంలో బాలిక అబార్షన్కు అనుమతించాలని మెడికల్ బోర్డు కోర్టును కోరింది. బాలిక శిశువుకు జన్మనిస్తే మానసికంగా, సామాజికంగా మనోవేదనను అనుభవిస్తుందని బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈసారి ఆమె తల్లిదండ్రులు ఇదే విషయమై కోర్టుకు వెళ్లగా మళ్లీ కోర్టు నో అన్నది. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల సమ్మె..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం మద్యపానమే!వెలుగులోకి షాకింగ్ విషయాలు
ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం పురుషులు మద్యం సేవించడం మానేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేదంటే గర్భధారణ సమస్యలు లేదా పిల్లల్లో సరైన పెరుగుదల లేకపోవడం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉటాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కనీసం ఓ వారం రెండు వారాల నుంచి మద్య మానేయడం కాదని బాంబు పేల్చారు. సేవించిన మద్యం ప్రభావం స్పెర్మ్పై ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరించారు. మద్య సేవించే పురుషులకు పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలొస్తాయో తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంతవరకు గర్భధారణ, పిల్లల అభివృద్ధి విషయాల్లో తల్లి ఆరోగ్యాన్ని కీలకంగా పరిగణించేవారు పరిశోధకులు. ఆ దిశగానే పరిశోధనలు చేయడం జరిగింది. అయితే గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఆ మహిళకు పిల్లలు కనడంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే దిశగా పరిశోధనలు జరగలేదు. తొలిసారిగా ఆవైపుగా అధ్యయనం సాగించారు శాస్త్రవేత్తలు. ఆ పిండానికి ఆల్కహాల్ సిండ్రోమ్(ఎఫ్ఏఎస్)తో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయా? అనే దిశగా సరికొత్త ప్రయోగాలు చేశారు. ఆ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బరువు తక్కువుగా జననాలు, హైపర్ యాక్టీవిటీ సమస్యలు, సరైన ఎదుగుదల లేని పిల్లలు పుట్టడానికి కారణమని తేలింది. పిల్లలను లేదా ఫ్యామీలిని ప్లాన్ చేసుకుంటే మగవాళ్లని మద్యం సేవించకుండా మహిళలే చూసుకోవాలని లేదా బాధ్యత తీసుకోవాలని సూచించారు పరిశోధకులు. మద్యం సేవించిన ఎంతకాలం వరకు స్పెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు నిర్వహించారు. తండ్రి ఆల్కహాల్ అలవాట్లు పిండం అభివృద్ధిలో బలమైన ప్రభావం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. దీంతో తాము స్పెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుందో అనే దిశగా కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అందుకోసం మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా..కొన్నింటి ఆల్కహాల్కు గురిచేసి మరికొన్నింటికి ఆల్కహాల్ ఇవ్వకుండా చూడగా వాటి జన్యువుల్లో సంభించిన పలు మార్పులను గమనించినట్లు తెలిపారు. ఈ పరిశోధనల్లో కనీసం మూడు, నాలుగు వారాలు కాకుండా ఏకంగా మూడు నెలల పాటు ఆల్కహాల్కి దూరంగా ఉంటేనే వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్పై ప్రభావం ఉండదని అధ్యయనంలో వెల్లడయ్యిందని అన్నారు. అలాగే మగవారిలో స్పెర్మ్ 60 రోజుల వ్యవధిలో తయారవుతుందని మాకు తెలుసు. కానీ మద్యం మానేసిన ఒక నెలకు గానీ సెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గటం ప్రారంభమవ్వదని అన్నారు. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పడూ కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు మద్యం మానేయాల్సిందేనని సూచించారు. అప్పటి వరకు ఆగి ఫ్యామిలీని ప్లానే చేసుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు మద్యం మానేసినప్పటికీ దాని తాలుకా రసాయనా ప్రభావం శరీరంలో అలా కొనసాగుతు ఉంటుందని అందువల్ల మూడు నెలల సమయం విరామం తీసుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ సంబంధిత పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు పరిశోధకులు. (చదవండి: భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు) -
తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!
హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే!) మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. మనోజ్ని పెళ్లి చేసుకునే టైమ్కే మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి రాబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా మనోజ్ బయటపెట్టాడు. తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు. తన మామ-అత్తమ్మలు భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నట్లు ఎక్స్లో మనోజ్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్) -
ఆ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు వైకల్యంతో పుడతారా?
నాకిప్పుడు 30 ఏళ్లు. పెళ్లై ఏడాది అవుతోంది. ఈ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే చాన్స్ ఎక్కువ అంటున్నారు. నాకు భయంగా ఉంది. పిల్లల కోసం మందులు వాడాలా? నిజంగానే మానసిక వైకల్యంతో పిల్లలు పుడతారా? – మాదిరాజు శ్యామల, కొల్లాపూర్ మీకు పెళ్లై ఏడాది అవుతోంది అంటున్నారు. మీరిప్పటికిప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినా పరవాలేదు. 35 ఏళ్లు దాటిన తరువాత జన్యులోపాలు, మెదడులోపాలు.. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్తో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. లేట్ మ్యారెజెస్ వల్ల ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటిన తర్వాతే తొలిచూలు కాన్పులను చూస్తున్నాం. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ మాత్రలు, బి– కాంప్లెక్స్ మాత్రలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో స్పైన్, నర్వ్ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. మీది మేనరికం అయితే.. ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్స్ని కలవాలి. కేవలం వయసు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే అంగవైకల్యం వస్తుందనే భయాన్ని పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ని చూసే ఆసుపత్రిలోని డాక్టర్ని సంప్రదించండి. 3వ నెల, 5వ నెలల్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్తో స్కాన్స్ చేయించుకుంటే చాలావరకు కంజెనిటల్ అబ్నార్మలిటీస్ని కనిపెడతారు. 30 ఏళ్ల వయసు దాటిన గర్భిణీలకు.. 11–12 వారాల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని స్కాన్, రక్త పరీక్ష తప్పకుండా చేస్తారు. దీనిద్వారా మూడు రకాల క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ని కనిపెట్టవచ్చు. ఒకవేళ వాటి ఫలితం పాజిటివ్గా వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్స్ లాంటివి హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ని చూసే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటికే ఏమైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా రాకపోతే .. భార్య, భర్తకు కొన్ని పరీక్షలను చేయించుకోమని సూచిస్తారు. ఆ పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తేలితే అవి సరిచేసి.. ప్రెగ్నెన్సీ రావడానికి మందులు ఇస్తారు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలసి రొటీన్ చెకప్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్చేసే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందే ప్రికాన్సెప్షనల్ కౌన్సెలింగ్కి వెళితే మంచిది. ప్రాపర్ మెడికేషన్స్, సమస్యల నివారణ గురించి చర్చిస్తారు. -డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
పేరెంట్స్కి షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుందా?
మా పేరెంట్స్ ఇద్దరికీ సుగర్ ఉంది. నాకు ఈమధ్యే పెళ్లయింది. మా పేరెంట్స్కి సుగర్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో నాకూ సుగర్ వచ్చే ప్రమాదం ఉందా? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. మాధవి, హాసన్పర్తి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది ఒకరకంగా సాధారణమే. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డయాబెటీస్ .. ప్రసవం తరువాత తగ్గిపోతుంది. కుటుంబంలో .. దగ్గరి బంధువుల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటే.. గర్భిణీలో సుగర్ కనపడుతుంది. కనపడే రిస్క్ రెండున్నర రెట్లు ఎక్కువ. తల్లికి సుగర్ ఉంటే ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే చాన్స్ ఎక్కువ. తండ్రికి సుగర్ ఉంటే 30 శాతం రిస్క్ ఉంటుంది. ఇద్దరికీ 70 శాతం రిస్క్ ఉంటుంది. 10–20 శాతం ప్రెగ్నెన్సీస్లో జీడీఎమ్ ఉంటుంది. దీనికి జెనెటిక్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కారణం. వేళకు భోంచేయకపోవడం.. పౌష్టికాహారం తీసుకోకపోవడం, అవసరాని కన్నా ఎక్కువ తినడం, జంక్, ఫ్రోజెన్, ప్రాసెస్డ్ ఫుడ్, వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువ తినడం, రోజూ వ్యాయామం చేయకపోవడం, ప్రెగ్నెన్సీకి ముందే బరువు ఎక్కువగా ఉండటం, బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30 కన్నా ఎక్కువ ఉండటం.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం వంటివన్నీ జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ని పెంచుతాయి. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ‘బ్యాడ్ సుగర్’ అంటే వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీస్, మైదా, పళ్ల రసాలు, ప్రాసెస్డ్ ఫుడ్, కార్న్ సిరప్స్ వంటివాటిని దూరం పెట్టాలి. మీరు బరువు ఎక్కువ ఉంటే కనీసం పది శాతం అయినా బరువు తగ్గాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో సుగర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అరగంట సేపు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్ లాంటివి కనీసం వారానికి అయిదు రోజులైనా చేయాలి. ఫైబర్, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పొట్టు ధాన్యాలు, గుమ్మడి గింజలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జెస్టేషనల్ డయాబెటీస్ లేదా తరువాతైనా సుగర్ వచ్చే చాన్సెస్ తగ్గుతాయి. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదా? ప్రమాదమా?
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దంటారు. నిజమేనా? ఒకవేళ జ్వరం లాంటి వాటికి డోలో వంటి మందులు వేసుకుంటే ఏమన్నా ప్రమాదమా? – సి. వెంకటలక్ష్మి, బిచ్కుంద ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా కొంత పెయిన్ ఉండటం చాలామందిలో చూస్తుంటాం. పెయిన్ టైప్, తీవ్రతను బట్టి పెయిన్ స్కేల్ అసెస్మెంట్తో నొప్పిని తగ్గించే మందులు, వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ లేదా కౌన్సెలింగ్ సూచిస్తారు. అయితే వీటన్నిటికీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. NSAIDS డ్రగ్ ఫ్యామిలీకి సంబంధించిన Brufen, Naproxen, Diclofenac లాంటివి ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు వాడకూడదు. ముఖ్యంగా ఏడు నుంచి తొమ్మిది నెలల్లో. పారాసిటమాల్(డోలో, కాల్పాల్, క్రోసిన్) లాంటివి వాడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు నుంచి ఓ మోస్తరు పెయిన్ ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, వేడి, ఐస్ కాపడాలు వంటివి సూచిస్తారు. పారాసిటమాల్ని వాడవచ్చు. 30 వారాలు దాటిన తర్వాత ఎలాంటి పెయిన్ కిల్లర్స్ని వాడకపోవడమే మంచిది. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే Opiates పెయిన్ కిల్లర్స్ అంటే Morphine, Tramadol లాంటివి సూచిస్తారు. లేబర్ పెయిన్ని కూడా కొంతవరకు ఓర్చుకోగల ఉపశమనాన్నిస్తాయి. అయితే ఇవి కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే వాడాలి. కొంతమంది గర్భిణీలకు నర్వ్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పారాసిటమాల్ని ఇస్తారు. గర్భిణీ.. నిపుణల పర్యవేక్షణ, పరిశీలనలో ఉండాలి. కొందరికి Amitriptyline లాంటి మందులను కొన్ని రోజులపాటు ఇస్తారు. పారాసిటమాల్ ఒళ్లు నొప్పులను, జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీలకు పారాసిటమాల్ సురక్షితమైందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?) -
సమస్య తొమ్మిది నెలలేనా?
ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్ను నేరంగా పరిగణించడాన్ని నిలిపి వేయాలి. గర్భం వయసుపై పరిమితులు తొలగించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకునే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం 2021లో ఒక తీర్పునిచ్చింది. పిండం వయసు గరిష్ఠంగా 24 వారా లున్నా పీడిత మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. వైకల్యమున్నప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు సిఫారసుతో అబార్ష¯Œ కు అనుమతించే పాత చట్టం నుంచి వీరికి విముక్తిని ప్రసాదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు అబార్షన్కు అనుమతించే విషయంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ మార్పులు వచ్చాయి. అంతకుముందు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) యాక్ట్ (1971) ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) గర్భం ధరించిన 20 వారాల వరకూ అబార్షన్ చేసేందుకు అనుమతులుండేవి. 2021 నాటి సవరణ తీర్పు తరువాత కూడా చాలామంది మహిళలు వైద్యులు అబార్షన్కు నిరాకరించిన సందర్భాల్లో... కోర్టు నిర్దేశించిన సమయం దాటినా అఅబార్షన్కు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే ఓ వివాహిత మహిళ 26 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ తరువాత కోర్టు అందుకు నిరాకరించడం తెలిసిన విషయాలే. పాలిచ్చే సమయంలో కొంతకాలం రుతుస్రావం జరగదు. అయితే ఈ మహిళ పాలిచ్చే సమ యంలోనే గర్భం ధరించింది. ఇది సహజం అనుకోవడంతో గర్భం ధరించినట్లు గుర్తించలేకపోయింది. ఏడాది క్రితమే బిడ్డకు జన్మనిచ్చి పోస్ట్పార్టమ్ సైకోసిస్కు చికిత్స తీసుకుంటున్న ఈ మహిళ మరోసారి గర్భం ధరించడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం అంతకుముందు పిటీషన్ను అనుమతిస్తూ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. 2021 సవరణలకు ముందు అబార్షన్ కోసం కోర్టుకు ఎక్కిన కేసుల్లో అత్యధికం మానభంగం లేదా పిండాల వైకల్యం ఉన్నవారికి సంబంధించినవి. పైగా చాలావాటిల్లో గర్భం వయసు 20 వారాల కంటే ఎక్కువే. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు కొంచెం లేటైనా అబార్షన్ అనేది అవసరమవుతుంది. తొలినాళ్లలోనే అబార్షన్ చేసేందుకు వైద్యపరంగా అవకాశాల్లేకపోవడం వీటిల్లో ఒకటి. లైంగిక దాడి, గృహహింస, జైలు వంటివి ఇతర కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులు (భాగస్వామి సాయం లేక పోవడం, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగం వంటివి), శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ లేదా లాక్టేషనల్ అమెనోరియా (పాలిచ్చే సమయంలో రుతుస్రావం నిలిచిపోవడం) కూడా అబార్షన్కు తగిన కారణాలని చెప్పాలి. అబార్షన్లకు సంబంధించి 2021 నాటి సుప్రీంకోర్టు సవరణ గర్భం తాలూకూ వయో పరిమితిని పెంచింది మినహా ఇతర మార్పులేవీ చేయలేదు. దీనివల్ల ప్రయోజనం కొద్దిమందికే. తల్లి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఓ ఆర్ఎంపీ ఏ దశలోనైనా గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఉండగా చాలామంది కేసుల భయంతో ఆ పని చేసేందుకు జంకు తున్నారు. ఫలితంగా మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టులకు వెళ్లడం ఇష్టం లేని వారైతే గర్భాన్ని కొనసాగిస్తున్నారు లేదా ముతక పద్ధతులతో అబార్షన్ కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. పలుమార్లు వైద్యపరీక్షల అవసరం ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతోంది. ఒకవేళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా న్యాయవాదుల ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా ఒక సమస్య. గత వారం సుప్రీంకోర్టులోనూ ఇలాంటి స్థితి ఎదురు కావడం చెప్పుకోవాల్సిన అంశం. అబార్షన్ కోరిన మహిళ మానసిక పరిస్థితి బాగాలేదనీ, కౌన్సెలింగ్ తీసు కోవాలనీ పలుమార్లు న్యాయవాదులు సూచించారు. ఇంతటి కష్టా నికి, ఇబ్బందికి ఓర్చినా తుది ఫలితం అనుకూలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అయితే ఒక్క విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అబార్షన్కు సంబంధించి భారతీయ చట్టాలు కొంత ఉదారంగానే ఉన్నాయని చెప్పాలి. అయినా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, అబార్షన్లో అత్యుత్తమ విధానాల విషయంలో మాత్రం అంత గొప్పగా ఏమీ లేవన్నదీ సుస్పష్టం. గత ఏడాది ‘ఎక్స్’ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మధ్య జరిగిన ఒక కేసు విషయంలో వైద్యపరమైన చట్టాలను అవసరాలకు తగ్గట్టుగా అర్థ వివరణ తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించింది. ఆ కేసులో 24 వారాల వయసు గర్భంతో ఉన్న అవివాహిత మహిళకు అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ మహిళకు ఉన్న హక్కుల ఆధారంగా వైద్యపరమైన పరీక్షలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం, ఎంటీపీ చట్టాలపై లక్ష్యాధారిత అర్థ వివరణ తీసు కోవడం గమనార్హం. మహిళల వాస్తవిక జీవన పరిస్థితులు, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకుని మరీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. అబార్షన్కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్ను నేరంగా పరిగణించడాన్ని నిలిపివేయాలి. గర్భం వయసుపై పరిమితులు, ఇతర నియంత్రణలను కూడా తొలగించాలి. దీనివల్ల అందరికీ వివక్ష లేని అబార్షన్ సేవలు అందుతాయి. ఏ సమయంలోనైనా సురక్షితంగా గర్భాన్ని తొలగించేందుకు ఉన్న పద్ధతులను ఉపయోగించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచించాయి. అబార్షన్ పై అడ్డంకులు విధాన పరమైన అడ్డంకులుగా మారుతున్నాయనీ, ఏ రకమైన శాస్త్రీయ ఆధా రాలు లేనివిగా మారాయనీ కూడా అవి వ్యాఖ్యానించాయి. గత వారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్నల ముందు విచారణకు వచ్చిన కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ తీర్పుతో విభేదించిన విషయం తెలిసిందే. ‘ఎక్స్’ కేసును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న గర్భం విషయంలో ఆ మహిళకు ఉన్న హక్కును గుర్తు చేశారు. మహిళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ గర్భం అవాంఛితమైతే తొలగించుకునే హక్కు ఆ మహిళకు ఉందని స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించాలని కోరడం ఆ మహిళ ఆరో గ్యాన్ని పణంగా పెట్టడం అవుతుందనీ, ఇది ఆర్టికల్ 21, 15 (3)లను అతిక్రమించినట్లు అనీ వివరించారు. అయితే చివరకు ఈ మహిళకు ‘ఎక్స్’ మాదిరిగా అబార్షన్ చేయించుకునే అవకాశం కలగకపోవడం గమనార్హం. ‘ఎక్స్’ కేసులో అవాంఛిత గర్భం తాలూకూ ప్రభావాన్ని అర్థం చేసుకున్న కోర్టు... ఇంకో మహిళ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అబార్షన్ను తొమ్మిది నెలల వ్యవహారా నికి పరిమితం చేసేసింది. అవాంఛిత గర్భం కారణంగా ఆ మహిళ కాన్పు తరువాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది గుర్తించకపోవడం దురదృష్టకరం. వాదనల సందర్భంగానూ న్యాయమూర్తులు, ప్రభుత్వం పలుమార్లు ఈ కేసుకు ఇతర కేసులకు మధ్య తేడాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అబార్షన్కు గల కార ణాల విలువ ఒకరికి ఎక్కువ? ఇంకొరికి తక్కువగా ఉంటాయా? -వ్యాసకర్త బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) బోధకులు -
ఆమె గర్భం తొలగింపునకు అనుమతించం: సుప్రీం కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆమె విజ్ఞప్తిని భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తిరస్కరించింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని, వైద్య నివేదిక ఆధారంగా గర్భవిచ్చిత్తికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. ‘‘గర్భం 26 వారాలు మరియు 5 రోజులు. ఇది పిండం అసాధారణతకు సంబంధించింది కాదు. ఏ రకంగానూ తల్లికి తక్షణ ప్రమాదమూ లేదు. కాబట్టి.. గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ తీర్పు ఇస్తే.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లోని సెక్షన్ 3, సెక్షన్ 5లను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి.. ఆ గుండె చప్పుడును ఆపలేం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బిడ్డ పుట్టాక బాధ్యతల్ని ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారాయన. తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని.. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. ఈ పిటిషన్పై తొలుత విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. అయితే, ఆ మరుసటిరోజే ‘‘పిండం బతికే అవకాశాలు ఉన్నాయి’’ అని ఎయిమ్స్ వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఎయిమ్స్ నివేదికపై ద్విసభ్య ధర్మాసనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో.. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. ఈ క్రమంలోనే గర్భవిచ్ఛిత్తి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణ కొనసాగించింది. ‘‘తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది. బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురుచూశారు. ఇంకొన్ని వారాలు మోయలేరా? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించింది. తదనంతర వాదనలు.. పిండంలో ఎలాంటి అసాధారణతలు లేవని ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గర్భవిచ్చిత్తికి మహిళను అనుమతించబోమంటూ తీర్పు ఇవాళ ఇచ్చింది. SC declines request for Medical Termination of Pregnancy. Says foetus is 26 weeks and 5 days old and medical report shows no abnormality to it. AIIMS to conduct delivery at appropriate time @IndianExpress https://t.co/o4oNHZXzNx — Ananthakrishnan G (@axidentaljourno) October 16, 2023 భిన్న తీర్పులు.. కీలక వ్యాఖ్యలు అక్టోబర్ 9వ తేదీన మహిళ గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 10వ తేదీన ఎయిమ్స్ వైద్య బృందంలోకి ఓ డాక్టర్ కీలకాంశం వెల్లడించారు. పిండం బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. దీంతో.. ఈ అంశం ద్విసభ్య ధర్మాసనం ముందుకు మళ్లీ వచ్చింది. అయితే ఈ మధ్యలోనే ద్విసభ్య ధర్మాసనం తీర్పుపై కేంద్రం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వెళ్లింది. గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి పిటిషన్ వేశారు. ఈ పరిణామంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది సుప్రీం కోర్టు. ఇందులో ఏ బెంచ్ అయినా కీలకమే. మేం తీర్పు ఇచ్చాక.. మళ్లీ ఇదే పరిధిలోని బెంచ్ ముందుకు వెళ్లడం ఏంటి?. కేంద్రమే ఇలా చేస్తే.. రేపు ప్రైవేట్ వ్యక్తులు ఇలా చేయరా?’’ అని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో పిండం బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికపై ఇద్దరు మహిళా జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్నాగరత్న.. మహిళ మానసిక స్థితి ఆధారంగా గర్భవిచ్చిత్తికి అనుమతించిన గత తీర్పునే సమర్థించగా.. జస్టిస్ హిమా కోహ్లీ మాత్రం అంతరాత్మను అనుసరించి అందుకు అంగీకరించబోనని, గర్భంలోని పిండానికి హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్.. ప్రకారం 24 వారాల్లోపు అబార్షన్కు అనుమతి ఉంటుంది. అంతకు మించి అబార్షన్ జరగాలంటే.. దివ్యాంగులు, మైనర్ బాలికలు, రేప్ బాధితురాలు, మానసిక స్థితి సరిగా లేనివాళ్లు .. ఇలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చట్టం అనుమతిస్తుంది. -
మీతో పంచుకోవాల్సిందే, రికమెండేషన్స్ ప్లీజ్..సీరియస్లీ: రితేష్ ఎమోషనల్
ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తన జీవితంలోని ఒక గుడ్ న్యూస్ తన అభిమానులతో పంచుకున్నారు. తన భార్య గీతాన్షా సూద్ గర్భం దాల్చినట్టు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్న రితేష్ సోషల్ మీడియాలో తాము తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నామన్న వార్తను పంచు కున్నారు. టీనేజర్గా, సొంత కంపెనీ పెట్టాలన్న కలలతో కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాల్లో ఉండగా, 11 ఏళ్ల క్రితం గీత్ను కలిశాను. అలా టీనేజర్లుగా తరువాత జంటగా, ఇపుడు తల్లిదండ్రులుగా మారబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుక సంతోషిస్తున్నామంటూ ఈ శుభవార్తను అందించారు. రికమెండేషన్స్ ప్లీజ్..సీరియస్లీ అంతేకాదు న్యాపీలు, స్ట్రోలర్లు, బొమ్మల కోసం సిఫార్సులను షేర్ చేయాలంటూ అగర్వాల్ నెటిజన్లను కోరారు. మీరు ఏదైనా వినూత్నమైన స్టార్టప్ అయితే ఇంకా మంచిది. తీవ్రంగా, తండ్రి స్థాయి జ్ఞానం కోసం మార్కెట్లో ఉన్నానంటూ రాశారు. ఈ సందర్భంగా తన పోస్ట్లో తన భార్యపై ప్రశంసలు కురిపించారు కూడా.కష్టాలు,కన్నీళ్లు, సంతోషం అనేక మైలురాళ్ల ప్రయాణంలో తన వెనుక గట్టి నిలబడ్డ ఏకైక వ్యక్తి గీత్ అంటూ రాసుకొచ్చారు రితేష్ అగర్వాల్. దీంతో ఈ జంటకు ప్రశంసల వెల్లువ కురుస్తోంది. "ఓహ్! కంగ్రాట్స్!" అంటూ పాపులర్ రచయిత చేతన్ భగత్ వ్యాఖ్యానించారు.“ఆల్ ది బెస్ట్ రితేష్. పేరెంట్హుడ్ ఉత్తమమైనది, ” అని ఎడెల్వీస్ సీఎండీ రాధికా గుప్తా అభినందలు తెలిపారు.మార్చి 7న రితేష్ అగర్వాల్ గీతాన్షా సూద్ వివాహం చేసుకున్నారు. రితేష అగర్వాల్ 2013లో ఓయోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. I met Geet eleven years ago, when I was just a teenager chasing dreams, trying to convince my family that I wanted to build my own company from scratch. There was only one constant who was by my side through it all, and it was her. The highs of happiness and milestones, the lows… pic.twitter.com/cJKY2xcXPF — Ritesh Agarwal (@riteshagar) October 13, 2023 -
శిశువు ప్రాణాలు తీయలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మానసిక, ఆర్థిక సమస్యలతో 26 వారాల గర్బాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనుమతినివ్వాలంటూ ఒక వివాహిత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానసిక కుంగుబాటుతో ఉన్న తాను ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా ఇంకో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా లేనని, అబార్షన్ చేసుకునేందుకు అనుమతించాలని ఏడోనెల గర్భంతో ఉన్న మహిళ ఒకరు కోర్టును ఆశ్రయించింది. అయితే గర్భాన్ని కొనసాగించడంపై నిర్ణయం తల్లిదే అయినప్పటికీ జీవంతో కూడిన, అన్ని రకాలుగానూ సవ్యంగా ఉన్న పిండాన్ని విచ్చిన్నం చేయడం కూడా అంత సరైన నిర్ణయం కాదని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒక శిశువును చంపలేము’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తల్లిగా ఆమెకున్న హక్కులకు, బతికేందుకు ఆ శిశువుకు ఉన్న హక్కుకు మధ్య సమతౌల్యత పాటించాల్సిన అవసరముందని చెబుతూ అబార్షన్ను నిరాకరించారు. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఇరవై ఆరు వారాల గర్భంతో ఉన్న మహిళ అబార్షన్కు అనుమతించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 9న విచారించిన ధర్మాసనం అబార్షన్కు అనుమతినిచ్చింది. అయితే మరుసటి రోజు ఏయిమ్స్ అధికారులు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి లేఖ రాశారు. గర్భంలో పిండం ఆరోగ్యంగా ఉందని, విచ్చిన్నం చేసినా సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. సుప్రీం ఉత్తర్వులను రీకాల్ చేయాలని కోరుతూ కేంద్రం మరో పిటిషన్ వేసింది. ఈ కేసు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ గర్భంలోని పిండం గుండెను నిలిపివేసేలా న్యాయస్థానం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులను ఆదేశించాలని పిటిషర్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది. గర్భం ఒకరి బలవంతంమీద కొనసాగిస్తున్నా.. బిడ్డ పుడితే వచ్చే పరిణామాలను అర్థం చేసుకోలేని మైనర్ విషయంలోనైనా అబార్షన్కు అనుమతించవచ్చునని ధర్మాసనం సూచించింది. ఈ కేసులోనూ పిటిషనర్ అభ్యర్థనను మన్నిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ దశలో వైద్య నివేదికలు చెప్పిన విషయంతో ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అబార్షన్ చేయాల్సి వస్తే పిండం గుండె కొట్టుకోవడాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని వైద్య నివేదికలు తెలిపాయి. దీంతో జస్టిస్ హిమా కోహ్లీ తన మునుపటి నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బతికి ఉన్న పిండం గుండెను నిలిపేయాల్సిందిగా ఏ న్యాయస్థానమూ చెప్పజాలదని వ్యాఖ్యానించారు. అబార్షన్కు అనుమతించలేమని చెప్పారు. మరోవైపు జస్టిస్ బి.వి.నాగరత్న మాత్రం గర్భం కొనసాగింపుపై సర్వహక్కులు తల్లివే అన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో కేసు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అక్టోబరు 11వ తేదీ అంటే గురువారం దీనిపై విచారించిన చీఫ్ జస్టిస్ అబార్షన్ను తోసిపుచ్చుతూనే బతికి ఉన్న పిండాన్ని చంపలేమని, ఇరువురి హక్కుల మధ్య సమతౌల్యత పాటించాలని సూచించారు. 26 వారాలుగా గర్భాన్ని మోసిన ఆమె మరికొన్ని వారాలు మోస్తే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉందని సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది. దీనిపై ఆ మహిళతో మాట్లాడి నచ్చజెప్పాలని పేర్కొంది. ఆ బాధ్యతని పిటిషనర్ లాయర్కి, కేంద్రానికి అప్పగిస్తూ కేసుని శుక్రవారానికి వాయిదా వేసింది. దేశంలో చట్టప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 24 వారాల వరకు గర్భ విచ్ఛిన్నానికి అవకాశం ఇస్తారు. -
కత్తెర కాన్పులు ఇక కట్.. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన
మహిళలకు మాతృత్వం వరం. గర్భిణి అని నిర్ధారణ అవగానే ఆ యువతి కళ్లలో ఆనందం తొంగి చూస్తుంది. నెలలు నిండే కొద్దీ ఆ ఆనందం స్థానంలో క్రమంగా ఆందోళన చోటు చేసుకుంటుంది. తనకు సుఖప్రసవం అవుతుందా..?, సిజేరియన్ చేయాల్సి వస్తుందా..? అన్న ఆవేదనకు గురవుతుంది. ఇకపై ఆ చింత తొలగనుంది. షీ సేఫ్ విధానంతో కత్తెర కాన్పులకు చెక్ పడనుంది. ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెరగనుంది. సుఖప్రసవానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తూ అమ్మకు ఆలంబన చేకూర్చనుంది రాష్ట్రప్రభుత్వం. చిత్తూరు రూరల్: అమ్మ కడుపుకోతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షీ సేఫ్ పేరుతో సహజ ప్రసవాలకు రూపకల్పన చేసింది. గర్భిణులకు అవగాహన కలి్పంచి సిజేరియన్లు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై నిఘా పెట్టేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వాస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్సీలు, 50 పీహెచ్సీలు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు చేస్తున్నారు. గత నెల నుంచి పీహెచ్సీలు కూడా 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మాతాశిశు మరణాలు తగ్గించాలని, సహజ ప్రసవాల సంఖ్య పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాలు 70 నుంచి 80 శాతం నమోదవుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 500 పైగా ఉన్నాయి. వీటిలో 60 నుంచి 70 శాతం శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండడంతో మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. షీ–సేఫ్తో... బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అది సహజపద్ధతిలో జరిగితే తల్లీబిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహంతో అమ్మ కడుపును కోసేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్ ఆపరేషన్లు చేసేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేస్తే తప్పు కాదు, కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా ప్రైవేటు వైద్యులు శస్త్ర చికిత్సలను ప్రోత్సహిసున్నారు. సిజేరియన్కు రూ.50 వేల నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి (కోత కనబడని శస్త్రచికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్రచికిత్సలు చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్యశాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్లతో కలిగే అనర్థాలు, సహజ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు ప్రోత్సాహించేందుకు షీ–సేఫ్ విధానాన్ని రూపకల్పన చేసి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. షీ సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలన్నదే షీ–సేఫ్ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాత శిశుమరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఆఫరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తోంది. సాధారణ కాన్పు..సిజేరియన్కు తేడాలివీ.. సాధారణ కాన్పు జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితి ఆధారంగా రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్రచికిత్స చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఆపరేషన్ల కుదింపుపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా మే నుంచి ఆగస్టు వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 5,945 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వాస్పత్రుల్లో మొత్తం 3,092 ప్రసవాలు జరగ్గా, 2,173 సుఖ ప్రసవాలు, 919 మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,853 జరగ్గా.. 1,187 శస్త్ర చికిత్సలు, సాధారణ ప్రసవాలు 1,666 జరిగాయని అధికారులు వెల్లడిస్తున్నారు. సిజేరియన్ల సంఖ్యను మరింత కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనంత వరకు సుఖ ప్రసవం అయ్యేలా చూస్తున్నాం. ఆస్పత్రికి వచ్చే 50 శాతం కేసులు బీపీ, రక్తహీనత లోపంతో వచ్చేవారే. అలాంటి వారికి కూడా ఆస్పత్రుల్లో సుఖ ప్రసవం జరిగేలా చూస్తున్నాం. కానీ పక్షంలో సిజేరియన్ చేస్తున్నాం. దీంతో పాటు క్షేత్రస్థాయిలో సిజేరియన్తో కలిగే నష్టాలపై అవగాహన కలి్పంచాలి. – ఉషశ్రీ, గైన కాలజిస్ట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు వైద్యుల సలహాలు తీసుకోవాలి గర్భిణులు వైద్యుల సూచనలు పాటించాలి. అలాగే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. రక్తహీనత లోపమే మాతా శిశుమరణాలు, ఆపరేషన్లకు కారణమవుతుంది. అనవసర సిజేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకోసం గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ క్రమంలో సీ–సీఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభావతిదేవి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు -
''పీరియడ్స్ ప్రాబ్లమ్..పిల్లలు పుట్టే అవకాశం ఉందా?''
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్య వల్ల రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? – పి.రజిత, మామిడిపల్లి నెలసరి రెగ్యులర్గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో గర్భందాల్చే అవకాశాలు కూడా తగ్గవు. ఇరవై ఏళ్ల వయసులో టీనేజ్లోలా కాకుండా శరీరంలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్గా రెండు మూడు నెలలకోసారి రావడం లేదా మందులు వాడితేనే గాని రాకపోవడం కనుక ఉంటే, వెంటనే డీటెయిల్డ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కొందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, గడ్డంపైన, పైపెదవిపైన వెంట్రుకలు రావడం, తలమీద జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటాం. కొందరికి షుగర్, బీపీ కూడా ఉండవచ్చు. అధిక బరువు ఉంటే శరీరంలో కొవ్వులు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి తగిన మందులు వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గకుండా ఉంటాయి. దీనికి మొదటి చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనే చెబుతాం. థైరాయిడ్ సమస్య ఏదైనా ఉందా అని పరీక్షలు చేస్తాం. అలాగే టీబీ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా పరీక్షిస్తాం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, యోగా, నడక, డాన్సింగ్, సైక్లింగ్ వంటివి కచ్చితంగా చేయాలి. డైట్ కౌన్సెలర్ను సంప్రదించి, ఆహార విషయంలో వారి సలహాలను పాటించాలి. రక్తపరీక్షల రిపోర్ట్స్ బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా లేదా నాన్హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా అని గైనకాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సమస్యకు మూడు నుంచి ఆరునెలల ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో షుగర్.. తల్లీ, బిడ్డకు ప్రమాదం, ఆ ట్యాబ్లెట్తో..
నాకిప్పుడు ఏడో నెల. షుగర్ ఉందని చెప్పారు. Metformin 100mg అనే మాత్రలు వేసుకోమన్నారు. ఇది ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చా? మాత్రలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? – పి. కృష్ణశ్రీ, భీమవరం Metformin అనే మాత్రలను ప్రెగ్నెన్సీలో వాడవచ్చు. డయాబెటిస్కి ఇది మంచి మెడిసిన్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని 80 శాతం స్ట్రిక్ట్ డైట్తో మేనేజ్చేస్తారు. కానీ షుగర్ పెరిగినప్పుడు మాత్రలు లేదా ఇన్సులిన్ను సజెస్ట్ చేస్తారు. షుగర్ నియంత్రణలో లేకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఈ జెస్టేషనల్ డయాబెటిస్ని సులభంగా గుర్తించి .. స్ట్రిక్ట్గా హోమ్ మానిటరింగ్ చేసి నియంత్రణలోకి తెస్తే షుగర్ వల్ల తలెత్తే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉండదు. బిడ్డ అధిక బరువుతో పుట్టడం, ప్రసవమప్పుడు ఇబ్బందులు, అధిక రక్తస్రావం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి రావడం వంటి చాన్సెస్ తగ్గుతాయి. Metformin .. .. షుగర్ మరీ డౌన్ కాకుండా.. hypoglycemia episodes రిస్క్ను తగ్గిస్తుంది. ఇన్సులిన్తో ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఈ మాత్రతో ఉండే ఏకైక ఇబ్బంది.. కడుపు ఉబ్బరం. అందుకే మాత్రలను ఎప్పుడూ తిన్న వెంటనే వేసుకోవాలి. తక్కువ మోతాదులో మొదలుపెట్టి.. నాలుగు రోజులకు మోతాదు పెంచి కావలసిన మోతాదుకు అడ్జస్ట్ చేస్తారు. షుగర్ రీడింగ్స్ నార్మల్ అయితే అదే మోతాదును కొనసాగిస్తారు. రెండు వారాల్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. మాత్రల విషయానికి వస్తే.. రోజూ ఇంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటరింగ్ చేస్తూ మాత్రల మోతాదును నిర్ధారిస్తారు. -
గర్బవతులకు మైగ్రేన్ వస్తే..
నాకు మైగ్రేన్ ఉంది. తరచుగా వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు నాకు మూడో నెల. ఎలాంటి మందులు వేసుకోవాలి? ఈ టైమ్లో మైగ్రేన్ బాధించకుండా ఏం చేయాలి? – టి. స్రవంతి, నాగ్పూర్ మైగ్రేన్ సర్వసాధారణమైన తలనొప్పి. మైగ్రేన్ నొప్పి మొదలవడానికి ముందు కొంతమందికి వాంతులు, వికారం, తల తిప్పినట్టవడం వంటివి ఉంటాయి. మీకు అలాంటి లక్షణాలు ఉంటాయా? ఉండవా? మీ మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ముందు మీరు మీ గైనకాలజిస్ట్తో చర్చించండి. దాదాపుగా సగం మందిలో ప్రెగ్నెన్సీలో సమయంలో మైగ్రేన్ తగ్గుతుంది. మందుల అవసరం కూడా తగ్గుతుంది. కానీ ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న కొందరిలో హై బీపీ, Pre eclampsia చాన్సెస్ పెరుగుతాయి. ప్రెగ్నెన్సీలో తగినంత విశ్రాంతి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, టైమ్కి తినడం, యోగా, ధ్యానం లాంటివాటితో తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడైనా తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారసిటమాల్ మాత్రను వేసుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అయిన మైండ్ఫుల్నెస్ లాంటివీ తలనొప్పి తగ్గేందుకు దోహదపడతాయి. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ముందుగా.. మీకు దేనివల్ల మైగ్రేన్ పెరుగుతుందో చెక్ చేసుకోండి. ఆ ట్రిగర్ని మేనేజ్ చేస్తే ఎపిసోడ్స్ తగ్గుతాయి. కంటి నిండా నిద్ర చాలా అవసరం. ఎండలో తిరగటం, చీజ్, చాకోలేట్స్ మొదలైనవి కొందరిలో మైగ్రేన్ను ట్రిగర్ చేస్తాయి. మైగ్రేన్ ఎక్కువసార్లు వస్తూంటే ఒకసారి న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సురక్షితమైన మందుబిళ్లలను అదీ తక్కువ మోతాదులో అదీ తక్కువసార్లు మాత్రమే తీసుకోమని సజెస్ట్ చేస్తారు. కొన్ని మందులు గర్భంలోని శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే స్పెషలైజ్డ్ కేర్ టీమ్ పర్యవేక్షణలో ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో Ergotamine, Ibuprofen లాంటివి అస్సలు ప్రిస్క్రైబ్ చేయరు. తెలియకుండా మందులు వాడకూడదు. హైరిస్క్ కేర్ టీమ్ని సంప్రదించాలి. కొన్ని మందుల వల్ల బిడ్డకు పుట్టుకతో లోపాలు ఏర్పడవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ కంటే ముందే అధిక మోతాదులో కొన్ని మందులను తీసుకుంటూ ఉండి ఉంటే గర్భం నిర్ధారణ అయిన తర్వాత వాటిని మారుస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: పంపాతీరంలో హనుమంతునిచే త్రిశూలరోముడి హతం.. మునులకు ప్రశాంతత) -
''43 ఏళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చింది.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా''?
నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా? ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు ..డౌన్సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ టైమ్కి చేయవలసిన స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. - డా భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ,షుగర్.. డెలీవరీ తర్వాత తగ్గుతాయా?
ప్రెగ్నెన్సీ టైమ్లో వచ్చిన బీపీ, షుగర్.. డెలివరీ తర్వాత తగ్గుతాయా? నాకు ఇప్పుడు ఆరో నెల. బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. అందుకే భయంగా ఉంది. – ఎన్. శ్రీలీల, చెన్నై ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం.. జీవన శైలి సరిగ్గా లేకపోయినా హార్మోన్స్, వయసు కారణంతో ఈరోజుల్లో చాలామంది గర్భిణీలకు ఆరవ నెల, ఏడవ నెల నుంచి బీపీ, సుగర్లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపర్టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్ (జీడీఎమ్)అంటాం. డెలివరీ అయిన ఆరువారాలకు జీడీఎమ్ నార్మల్ లెవెల్కి వస్తుంది. అందుకే డెలివరీ అయిన ఆరువారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్బీఏ1సీ / ఎఫ్బీఎస్ టెస్ట్ను చేయించుకుంటూ ఫాలో అప్లో ఉండాలి. జీడీఎమ్ ఉన్నవారిలో తర్వాత టైప్ 2 డయాబెటిస్ రావడానికి 40 శాతం ఎక్కువ చాన్సెస్ ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా.. మీకు ఆరవ నెలలోపు జీడీఎమ్ వచ్చినా.. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డెలివరీ తరువాత అయిదేళ్లలోపు మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తరువాత క్రమం తప్పకుండా ఫాలో అప్లో ఉండాలి. చక్కటి డైట్ కూడా ఫాలో కావాలి. - డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే..?
నాకిప్పుడు మూడో నెల. బరువు 96 కేజీలు. మూడో కాన్పు. మొదటి రెండు కాన్పులు సిజేరియనే. రెండో కాన్పు అప్పుడు అనెస్తీషియా రిస్క్ ఎక్కువగా ఉండింది. ఈసారి ఆ రిస్క్ లేకుండా ఏం చేయాలో దయచేసి చెప్పగలరు. – రమణి విశ్వం, పిడుగురాళ్ల మీ ఎత్తు, బరువును బట్టి బాడీ మాస్ ఇండెక్స్.. బీఎమ్ఐని కాలిక్యులేట్ చేస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ సాధారణంగా 20– 25 మధ్య ఉంటే ప్రెగ్నెన్సీ, ప్రసవమప్పుడు సమస్యలు తక్కువగా ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ, అనెస్తీషియా, రికవరీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే 5–10 శాతం బరువు తగ్గితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పడు మీకు మూడోనెల అంటున్నారు కాబట్టి మీ బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి 30 కన్నా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ, బీపీ, సుగర్ వంటి పరీక్షలన్నీ చేసి.. ఫలితాలను నిర్ధారించి.. ప్రెగ్నెన్సీలోనే రక్తం పలుచబడడానికి మాత్రలు స్టార్ట్ చేస్తారు. దీనివల్ల మీకు డెలివరీ.. సర్జరీ సమయంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. మల్టీవిటమిన్స్, విటమిన్ డీ3, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలూ నేర్పిస్తారు. మీరు నిర్ధారిత బరువుకు రావడానికి డైట్ కౌన్సెలింగ్కీ వెళ్లాలి. లెగ్ మజిల్ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్, మసాజ్లను సూచిస్తారు. కంప్రెషన్ స్టాకింగ్స్ అనే సాక్స్లను కాళ్లకు వేసుకోవాలి. ప్రసవం తరువాత మీ బరువును బట్టి రక్తం పలుచబడడానికి వారం నుంచి పది రోజుల దాకా ఇంజెక్షన్స్ను ఇస్తారు. దీనివల్ల ఛాతీ, కాళ్లలో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. అనెస్తీషియా రిస్క్ కూడా తగ్గుతుంది. పూర్తి శరీరానికి ఇచ్చే జనరల్ అనెస్తీషియాకన్నా కూడా నడుముకు ఇచ్చే రీజనల్ అనెస్తీషియాలోనే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అధిక బరువు ఉన్న వారిలో మెడలో ఉండే థిక్నెస్ వల్ల శ్వాస సంబంధమైన, స్లీప్ ఆప్నియా సమస్యలు తలెత్తుతాయి. ఇవి జనరల్ అనెస్తీషియాలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఏ అనెస్తీషియా ఇవ్వాలి అనేది తొమ్మిదవ నెలలోనే అనెస్తెటిస్ట్ (మత్తు డాక్టర్) చూసి కౌన్సెల్ చేస్తారు. అధిక బీఎమ్ఐలో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతాయి. అనెస్తీషియా సమయంలో ఆ జాగ్రత్త తీసుకుంటారు. బీఎమ్ఐ అధికంగా ఉంటే కొన్ని పెయిన్ రిలీఫ్ మందులు సరిగా పనిచేయవు. హైరిస్క్ అనెస్తీషియా టీమ్ ఈ విషయాలను గమనించి.. అనెస్తీషియా తర్వాత సమస్యలు రాకుండా చూస్తుంది. మీరు పౌష్టికాహారం తీసుకుంటూ.. తగిన వ్యాయామం చేస్తూ క్రమం తప్పకుండా చెకప్స్కి వెళుతూ.. ఈసారి ప్రసవమప్పుడు రిస్క్ను తగ్గించుకోవచ్చు. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..) -
ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?
బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ జెనిలీయా. సిద్ధార్థ్కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో సత్యం చిత్రంతో పరిచయమైన జెనిలీయా.. ఆ తర్వాత సాంబ, హ్యాపీ, సై, మిస్టర్ మేధావి, రెడీ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 2012లో రితేష్ దేశ్ముఖ్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ల్లో నటిస్తూ సందడి చేస్తోంది.తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబయిలో ఓ ఈవెంట్లో జెనీలియాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'బేబి' హీరోయిన్కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) గత రాత్రి ముంబయిలోని ఈవెంట్లో ఫోటోలకు పోజులిచ్చింది ఈ బాలీవుడ్ జంట. అయితే ఆ ఫోటోల్లో బ్లూ డ్రెస్లో ఉన్న జెనీలియాకు బేబీ బంప్తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. ఓ నెటిజన్ కామెంట్స్లో రాస్తూ..'జెనీలియా గర్భవతి అయి ఉండొచ్చు' అని రాయగా.. మరో నెటిజన్ 'అవును ఆమె మూడోబిడ్డను ఆశిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రితేష్, జెనీలియా కలిసి రితీష్ మరాఠీలో దర్శకత్వం వహించిన వేద్లో నటించారు. మరోవైపు జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్లో నటించింది. అక్షయ్ కుమార్తో కలిసి హౌస్ఫుల్ 5తో రితేష్ నటించనున్నారు. (ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
30లో ప్రెగ్నెన్సీ ప్లాన్,బీపీ, షుగర్ రిస్క్.. మరి పెళ్లికి సరైన వయసేది?
మా అమ్మాయికి 22 ఏళ్లు. ఇంజినీరింగ్ అయిపోయి ఈమధ్యనే ఉద్యోగంలో చేరింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ తను ఇంకో అయిదేళ్ల దాకా పెళ్లి ప్రసక్తి తేవద్దంటోంది. పిల్ల మొండితనం వల్ల పెళ్లికి మరీ ఆలస్యం అవుతుందేమోనని చింతగా ఉంది. ఆడపిల్ల పెళ్లికి సరైన వయసేదో సూచించగలరా? – చల్లపల్లి వింధ్యాకిరణ్, హోస్పేట్ ఈరోజుల్లో ఉన్నత చదువుల కోసం ప్రతి ఆడపిల్లా ప్రయత్నిస్తోంది. దాంతో వ్యక్తిగత శ్రద్ధ, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండట్లేదు. దీనివల్ల పెళ్లి, పిల్లలు అన్నీ ఆలస్యం అవుతున్నాయి. ఈ క్రమంలో చాలాసార్లు 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీస్ని చూస్తున్నాం. అలాగని ఎర్లీ మ్యారెజెస్ ఏమీ విజయవంతం కావడంలేదు. వాటిల్లో విడాకులనూ చూస్తున్నాం. అందుకని పెళ్లికి సరైన వయసు ఇదని చెప్పడం కష్టమే మరి! ఈ రెండు పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని 28 –32 ఏళ్ల మధ్య వయసు పెళ్లికి బెస్ట్ వయసుగా కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెబుతున్నాయి. ఈ వయసుకి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ మెంటల్ ఎబిలిటీ వస్తుంది. ఈ వయసులో ట్రామా, స్ట్రెస్, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ బ్యాలెన్స్, కమ్యూనికేషన్ చక్కగా ఉంటాయి. మనం ఏం చేయాలి?మనకేం కావాలి? అనే విషయాల్లో స్పష్టంగా ఉంటారు. అమ్మాయికి 30 ఏళ్లు దాటినప్పటి నుంచి నేచురల్ లేదా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ చాన్సెస్ తగ్గుతుంటాయి. జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో అండాల నాణ్యతా తగ్గిపోతోంది. ఏఎమ్హెచ్ అనే టెస్ట్తో దీన్ని కనిపెట్టవచ్చు. 30 –35 ఏళ్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బీపీ, సుగర్ వచ్చే చాన్సెస్ పెరుగుతాయి. లేట్ మ్యారేజెస్ .. ఇండైరెక్ట్గా లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి 28 – 30 ఏళ్ల మధ్యలో పెళ్లిని ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. అలాగే భవిష్యత్లో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
చిన్న వయసులోనే గర్భం..తల్లీ, బిడ్డకు ప్రాణపాయం
ఓ వైపు బాగా చదువుకున్న అమ్మాయిలు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికారణంగా 40 దాటే వరకూ పిల్లలు కలగక ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పదహారేళ్లు నిండకముందే కొందరు అమ్మాయిలు తల్లులవుతున్నారు. పరస్పర ఈ వైరుధ్యం పలువురు వైద్యులు, నిపుణులను విస్మయపరుస్తున్న అంశం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు వస్తున్న గర్భిణుల్లో 3 శాతానికి పైగా మైనర్ అమ్మాయిలు వస్తున్నట్టు తేలింది. బాల్యవివాహాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 458 మంది మైనర్ అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో 16 ఏళ్లలోపు అమ్మాయిలు 107 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.శ్రీసత్యసాయి జిల్లాలోనూ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. మొత్తం ప్రసవాల్లో 3.23 శాతం మైనర్లవే కావడం గమనార్హం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో మైనార్టీ తీరని అమ్మాయిలు ప్రేమ– పెళ్లి బాట పడుతున్నారు. ప్రతిబంధకంగా బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయి అంటేనే భారంగా భావిస్తున్నారు. అందుకే 15 ఏళ్లకే పెళ్లి చేస్తున్నారు. రాయదుర్గం, మడకశిర, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పదో తరగతి చదువుతూండగానే పెళ్లి చేస్తున్నారు. బాగా చదువుకుని కెరీర్లో స్థిరపడాల్సిన సమయంలో వారికి పెళ్లి తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది. నిఘా పెట్టినా ఆగడం లేదు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలను అడ్డుకుంటున్నా మరోవైపు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. బాల్యవివాహాలు కుదిర్చిన పెద్దలు, ఇరువురు తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడే అవకాశమున్నా కొన్ని ప్రాంతాల్లో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చైల్డ్లైన్ 1098, హెల్ప్లైన్ 181, డయల్ 100కు ఫోన్ చేస్తే పెళ్లిళ్లు ఆపేస్తారు. దీన్ని వినియోగించుకోవాలని ఐసీడీఎస్ అధికారులు కోరుతున్నారు. = ‘అనంత’ జిల్లాలో 4 మాసాల్లో 458 ‘మైనర్’ ప్రెగ్నెన్సీలు = ఇందులో పదహారేళ్లలోపు అమ్మాయిలు 107 మంది = శ్రీసత్యసాయి జిల్లాలో మరింత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు = చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్న యువతులు 3.23 శాతం = అమ్మాయిలను వెంటాడుతున్న సామాజిక మాధ్యమాల దు్రష్పభావం బాల్యవివాహాలతో భారీ నష్టం = చదువు ఆగిపోయి కెరీర్ అర్ధంతరంగా ముగుస్తుంది = చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల బరువు తక్కువ పిల్లలు పుట్టే అవకాశం = చిన్న వయసులో తల్లి కావడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది = ప్రీ మెచ్యూర్ అంటే 9 నెలలకు ముందే పిల్లలు పుట్టే అవకాశం = దీనివల్ల కాన్పు సమయంలో తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ ప్రాణాపాయం కౌన్సెలింగ్ ఇస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో 15 ఏళ్లు దాటగానే అమ్మాయిలను తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ముందస్తుగా పెళ్లి చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మరికొన్ని చోట్ల సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై యువతీ యువకులు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ల ప్రభావం ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. –శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్.. బాలింత కన్నుమూత
బిడ్డ పుట్టడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. కానీ, ఆ ఆనందం ఐదురోజులకే ఆవిరైంది. బిడ్డకు చనుబాలు బట్టిన ఆ బాలింత నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఆ పసికందుకు శాశ్వతంగా దూరమైంది. వరంగల్: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో బాలింత మృతి చెందింది. కుటుంబసభ్యులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బుస్స సుష్మిత (25) మొదటి కాన్పు ప్రసూతి వైద్యసేవల కోసం సీకేఎం హాస్పిటల్లో ఈనెల 13 చేరింది. ఆదే రోజు సిజేరియన్ ద్వారా మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండడంతో నవజాత శిశువుల వార్డులోని ఇంక్యుబేటర్లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. తల్లి సుష్మితను ఐసీయూనుంచి 18న ప్రత్యేక వార్డుకు మార్చారు. శుక్రవారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో సుష్మిత వెళ్లి శిశువుకు పాలు పట్టించి వచ్చి నిద్రపోయింది. తిరిగి రెండు గంటల అనంతరం బాబుకు పాలుపట్టాలని తల్లి నిద్రలేపే ప్రయత్నం చేయగా కదలకపోవడంతో వైద్యులను సంప్రదించారు. డ్యూటీ వైద్యులు వెంటనే పరీక్షించి సీపీఆర్ నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. నిద్రలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో సుష్మిత మృతి చెందినట్లు సీకేఎం సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలకుమారి తెలిపారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?
గర్భవతుల్లో గుండెల్లో లేదా ఛాతీలో మంటగా ఉండటం, తేన్పులు, అజీర్తి ఫీలింగ్... ఇవన్నీ చాలా సాధారణంగా కనిపించే సమస్యలు. అయితే స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా చాలామందిలో ఈ సమస్య కనిపించినప్పటికీ గర్భవతుల్లో... మరీ ముఖ్యంగా ఐదారు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువ. ఎందుకు వస్తుందంటే.. కారణాలివి... గర్భవతుల్లో ప్లాసెంటా నుంచి ప్రోజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. నెలలు నిండుతూ గర్భసంచిలో పిండం పెరుగుతున్న కొద్దీ... దానికి మరింతగా చోటు కల్పించడానికి గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేయడం కోసం ప్రకృతిపరమైన ఏర్పాటిది. ఈ హార్మోన్ కేవలం గర్భసంచినే కాకుండా జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే ‘లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్’పైనా ప్రభావం చూపుతుంది. దాంతో ఆ స్ఫింక్టర్ వదులై, జీర్ణరసాలు పైకి ఎగజిమ్మడంతో గర్భవతుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. నివారణ: ఆహారంలో కారం, మసాలాలూ, వేపుళ్లు పరిమితంగా తీసుకోవాలి. మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ మోతాదుల్లో కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి భోజనం పూర్తికాగానే పడుకోకూడదు. కాసేపు అటూ ఇటూ తిరగాలి∙ పడుకునే సమయంలో తలగడ పెట్టుకుని, తల కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి అప్పటికీ సమస్య తగ్గకపోతే డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే యాంటాసిడ్స్ వాడాలి. (చదవండి: కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?)