-
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప(81)పై బెంగళూరు కోర్టు గురువారం నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ, యడ్యూరప్ప హాజరు కాకపోవడంతో సీఐడీ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, తిరిగివచి్చన తర్వాత సీఐడీ ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐసీసీ సెక్షన్ 354 కింద ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తనపై వచి్చన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు అంతకుముందే రికార్డు చేశారు. పోక్సో కేసులో యడ్యూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. దీనిపై సీఐడీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. -
ప్రముఖ నటుడిపై పోక్సో కేసు.. నాలుగేళ్ల పాపతో దారుణంగా!
మలయాళీ ప్రముఖ నటుడు కూటికల్ జయచంద్రన్ పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. తన నాలుగేళ్ల కూతురిని ఈ నటుడు లైంగికంగా వేధించాడని ఓ మహిళ.. కోజికొడ్లోని కసాబా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అలానే దీని నుంచి తప్పించుకునేందుకు మరో విషయం తెరపైకి తీసుకొచ్చాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)మరోవైపు పోలీసులు.. ఇప్పటికే నాలుగేళ్ల చిన్నారి దగ్గరకెళ్లి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అయితే ఆ చిన్నారి ఏం చెప్పింది అనే విషయాల్ని మాత్రం బయటపెట్టలేదు. అలానే నటుడు జయచంద్రన్ని అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా తెలిసి రావట్లేదు. టీవీ ప్రోగ్రామ్స్, స్టేజీ ఫెర్ఫార్మెన్స్లతో గుర్తింపు తెచ్చుకున్న జయచంద్రన్.. రీసెంట్ టైంలో అయితే 'దృశ్యం 2' సినిమాలో నటించాడు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
దిశ ఎఫెక్ట్: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో 2017వ సంవత్సరంలో సంచలనం రేపిన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు గణేష్ కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలుకి 4 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవ్వగా, దిశ ఎఫెక్ట్తో విచారణ వేగవంతంగా జరిగింది. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా వాదించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. -
చిన్నారులపై అత్యాచారం కేసుల్లో జైలు
విశాఖ లీగల్/విజయవాడ స్పోర్ట్స్: వావి వరసలు మరచి అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు వేర్వేరు కేసుల్లో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ.. ఆయా న్యాయమూర్తులు సోమవారం తీర్పునిచ్చారు. సొంత మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది తీర్పు చెప్పారు. అలాగే 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం చేసిన మేనమామకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు వెల్లడించారు.కేసుల పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని మల్కాపురం పోలీస్స్టేషన్ పరిధిలోని మల్కాపురం జాలరి వీధిలో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వాడమొదుల శ్యాంసుందరరావు (70) నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. బాధితురాలు (ప్రస్తుతం 19) పెద్దకొడుకు చంద్రశేఖర్ కూతురు. చంద్రశేఖర్ వృత్తిరీత్యా కారు డ్రైవరు. నిత్యం బయటకు వెళ్లేవాడు. బాధితురాలి తల్లి సత్యవతి, తన ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆ ఇల్లు రెండంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు.రెండో అంతస్తులో నిందితుడు శ్యాంసుందరరావు, అతని భార్య ఉంటున్నారు. 2017 అక్టోబర్ ఒకటో తేదీకి ముందు నిందితుడు బాలికను భయపెట్టి లోబర్చుకుని ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. అక్టోబర్ ఒకటో తేదీన బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచి్చన వెంటనే సుమారు మూడున్నర గంటల సమయంలో వృద్ధుడు బాలికపై మళ్లీ లైంగిక దాడికి యతి్నస్తుండగా ఆ బాలిక గట్టిగా అరిచింది. ఆ కేకలు విన్న ఆమె చెల్లెలు కింద ఫ్లోర్లో ఉన్న తల్లికి చెప్పింది. అది విన్న తల్లి మేడ మీద మొదటి అంతస్తుపైకి వెళ్లి చూడగా నిందితుడు చేస్తున్న అకృత్యాన్ని కళ్లారా చూసింది. వెంటనే మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐదు లక్షల రూపాయలను బాధితురాలికి ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.కసాయి మేనమామకు ఐదేళ్ల జైలు.. ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక (12) తల్లితో కలిసి పండుగలకు విజయవాడ వన్టౌన్లోని అమ్మమ్మ ఇంటికి వస్తుంటుంది. 2017న దసరా పండుగకు వచ్చిన బాలిక పట్ల ఆమె మేనమామ లైంగికదాడికి యతి్నంచడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన బాలిక 2018 జనవరిలో మేనమామ తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2018 జనవరి 9న వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయ మూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. -
తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. కూతురుపై కన్నేశాడు
హన్మకొండ: మైనర్పై అత్యాచారానికి యత్నించిన ఘటనలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ శుక్రవారం అరెస్టయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైంలో బండారి సంపత్ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. వర్ధన్నపేట ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం లైంగిక బంధానికి దారితీసింది. దీంతో సదరు మహిళ తన భర్తను వదిలిపెట్టి కొంతకాలంగా సంపత్తో సహజీవనం సాగించి.. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆమెకు అప్పటికే పదేళ్ల వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఆ బాలికకు తండ్రిగా వ్యవహరించాలి్సన సీఐ కీచకుడిగా మారాడు. ఇటీవల అత్యాచారానికి యత్నించడంతో బాలిక తల్లి కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి విచారణ చేపట్టారు. లైంగిక దాడికి యత్నించినట్లు నిర్ధారణకు వచ్చి సీఐ సంపత్పై పోక్సో కేసు నమోదు చేశారు. రెండేళ్లక్రితం సంపత్పై ఫిర్యాదు.. ఎస్సై బండారి సంపత్ మాయమాటలు చెప్పి తన భార్యను తీసుకెళ్లాడని రెండేళ్ల క్రితం అప్పటి పోలీస్ కమిషనర్ తరుణ్జోషిని కలిసి ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. అçప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సంపత్ను ఏఆర్కు అటాచ్ చేశారు. -
యడియూరప్పపై పోక్సో కేసు
సాక్షి, బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(81)పై పోక్సో కేసు నమోదైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 354ఏ కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె తల్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. చట్టపరంగా ముందుకు వెళతానన్నారు. పోలీసులు డాలర్స్ కాలనీలోని యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆయన నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారని డీజీపీ అలోక్ మోహన్ శుక్రవారం చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం వెంటనే కేసును సీఐడీకి అప్పగించామన్నారు.ఈ పరిణామంపై హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు చెప్పారన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు బాలిక చిత్రీకరించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆమె ఏడుస్తూ సాయం అర్థించింది కేసు నమోదు కావడంపై యడియూరప్ప స్పందించారు. ఈ కేసుకు సంబంధించి చట్ట పరంగా ముందుకెళతానన్నారు. ‘ఆ మహిళ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. ఆమెను లోపలికి రమ్మని చెప్పి, సమస్య తెలుసుకున్నా. ఆ వెంటనే పోలీస్ కమిషనర్ దయానందతో ఫోన్లో మాట్లాడి, ఆమెకు న్యాయం చేయాలని కోరా. ఆ వెంటనే ఆమె నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో, ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చింది’అని చెప్పారు. ఆమె పోలీస్ కమిషనర్ను కలిశాక, వ్యవహారం మలుపు తిరిగిందని పేర్కొన్నారు. -
మాజీ సీఎంపై కేసు.. ఆశ్చర్యం కలిగించిందన్న ప్రముఖ సింగర్!
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ అరెస్ట్పై ఫెమినిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఆ వార్తకు సంబంధించిన క్లిప్ను షేర్ చేసింది. కాగా.. దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తోంది. మనదేశంలో మహిళలకు రక్షణ లేదని చాలాసార్లు తన ట్వీట్ల ద్వారా వెల్లడించింది. ఇటీవల స్పెయిన్ జంటపై జరిగిన లైంగిక దాడిపై కూడా చిన్మయి స్పందించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. There is a POCSO case lodged against former Karnataka Chief Minister B S Yediyurappa for sexually harassing a minor. I am stunned. pic.twitter.com/vjY4ynwurR — Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2024 -
Bengaluru: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. మాజీ సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైంది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇంటికి వస్తే సాయం చేశాను.. పోలీసులు కేసు పెట్టారు.. తనపై లైంగిక దాడి కేసు నమోదవడంపై యడ్యూరప్ప స్పందించారు. ఒక మహిళ కూతురిని తీసుకొని ఫిబ్రవరి 2వ తేదీన తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని చెప్పారు. ఆమెకు ఒక కేసు విషయంలో సాయం అవసరమైతే పోలీస్ కమిషనర్కు స్వయంగా ఫోన్ చేశానని చెప్పారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆమె తనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించిందన్నారు. తర్వాత పోలీసులు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయా లేదా అనేది చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇదీ చదవండి.. అవినీతి నిర్మూళనే మా సిద్ధాంతం.. మోదీ -
టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు
భారత జాతీయ జట్టు హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 22 ఏళ్ల అమ్మాయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుణ్పై కేసు నమోదు చేశారు. 2018లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వరుణ్.. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను మైనర్నని (17 ఏళ్లు).. వరుణ్ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణలో ఉన్నాడని యువతి ఫిర్యాదులో ప్రస్తావించింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వరుణ్ కోసం గాలిస్తున్నారు. వరుణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు కాకముందు వరకు వరుణ్ భువనేశ్వర్లోని జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్నట్లు తెలుస్తుంది. 28 ఏళ్ల వరుణ్ కుమార్ భారత జాతీయ జట్టు తరఫున డిఫెండర్ స్థానంలో ఆడతాడు. 2017 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత జట్టులో స్టాండ్బై సభ్యుడిగా ఉన్నాడు. జూనియర్ స్థాయి నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. హాకీ ఇండియా లీగ్లో పంజాబ్ వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా తరఫున 142 మ్యాచ్లు ఆడిన వరుణ్ మొత్తం 40 గోల్స్ చేశాడు. -
అది ప్రేమే..కామం కాదు: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబై: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. యువకుడు, మైనర్ రిలేషన్లో ఉన్నారని, వారి మధ్య ఏర్పడిన లైంగిక సంబంధం ప్రేమ కారణంగా కలిగినదే తప్ప.. కామం వల్ల కాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఊర్మిళ జోషి పార్కే తీర్పు వెల్లడించింది. ‘బాలిక మైనర్యే కావచ్చు. కానీ ఆమె తన ఇష్టం మేరకే ఇంటిని వదిలి నిందితుడు నితిన్ ధబేరావుతో కలిసి ఉంటున్నట్లు పోలీసులతో చెప్పింది. ధబేరావు వయసు కూడా 26 ఏళ్లు. వారి ఇద్దరు ప్రేమ వ్యవహారం కారణంగానే కలిసి ఉండాలని అనుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం వల్లే లైంగికంగా ఒకటయ్యారు. అంతేగానీ నిందితుడు ఆమెను కామంతో లైంగిక వేధింపులకు గురిచేయలేదు. ఆమెపై బలవంతంగా జరిగిన దాడి కాదు’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ఆంక్షలతో కూడి బెయిల్ మంజూరు చేసింది. కాగా 13 ఏళ్ల మైనర్ తన ఇంటి పక్కన నివసించే నితిన్ దామోదర్ ధబేరావ్ను ప్రేమించింది. 2020 ఆగస్టులో అతనితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులు ఇద్దరు ఒకచోట నివసించారు. బాలిక తండ్రి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వెతికి పట్టుకున్నారు. 2020 ఆగస్టు 30న దామోదర్పై పోక్సో కేసు నమోదు చేశారు. అక్టోబర్లో అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ధబేరావ్తో ప్రేమించడం కారణంగానే.. తన ఇష్టపూర్వకంగా ఇంటిని వదిలి బయటకు వచ్చినట్లు బాలిక తెలిపింది. అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినట్లు పేర్కొంది. అతనితో కలిసి జీవించేందుకే తన ఇంట్లో నుంచి బంగారం, డబ్బులు దొంగిలించినట్లు వెల్లడించింది. చదవండి: Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం -
బాలికపై అత్యాచారం కేసు..
సోన్భద్ర: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్దులార్ గోండ్కు ప్రత్యేక న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో, శాసనసభ సభ్యత్వానికి ఆయన అర్హత కోల్పోనున్నారు. తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. సోన్భద్ర అడిషనల్ జడ్జి, ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సెషన్ జడ్జి అహ్సానుల్లా ఖాన్ తాజాగా తీర్పు వెలువరించారు. జరిమానా మొత్తాన్ని బాధితురాలి కుటుంబ సంక్షేమం కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో రామ్దులార్ గోండ్ భార్య గ్రామ సర్పంచిగా ఉన్నారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు మియోర్పూర్ పోలీస్ స్టేషన్లో గోండ్పై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మొదట్లో పోక్సో ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగింది. బీజేపీ తరఫున గోండ్ దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యాక ఈ కేసు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది. -
టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. ముఖ్యంగా బాలికలను ఉద్ధేశించి.. రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని, ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పింది. అబ్బాయిలు కూడా మహిళల విషయంలో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని పేర్కొంది. పరస్పర సమ్మతితో సెక్స్లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. మైనర్ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొనందుకు గతేడాది ఓ టీనేజర్కు సెషన్స్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ చిత్తరంజన్ దాస్, పార్థ సారథి సేన్లతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అత్యాచారం కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు టీనేజీ అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది. విచారణ సందర్భంగా... తన ఇష్టపూర్వకంగానే టీనేజర్తో రిలేషన్లో ఉన్నానని కోర్టుకు సదరు బాలిక కోర్టుకు తెలిపింది. అతన్ని పెళ్లి కూడా చేసుకున్నానని పేర్కొంది. అయితే 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం అనే విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది. కాగా, పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు వస్తుంది. చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి! టీనేజీలో సెక్స్ అనేది సాధారణమైన విషయమని, అయితే అలాంటి కోరికలను ప్రేరేపించడం అనేది వ్యక్తుల చర్యలపై ఆధారపడి ఉంటుందని బెంచ్ పేర్కొంది. యుక్త వయసు బాలికలు రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు మొగ్గు చూపరాదని, లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల సుఖం కోసం ఆశపడితే సమాజంలో చెడ్డపేరు వస్తుందని, అలాంటి పనులకు పాల్పడవద్దని హితవు పలికింది. బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. అదే విధంగా టీనేజీలోని అబ్బాయిలు కూడా అమ్మాయిలను గౌరవించాలని తెలిపింది. వారి హక్కులను, గోప్యతను, ఆత్మగౌరవవాన్ని, ఆమె శరీర స్వయంప్రతిపత్తిని కాపాడేలా వ్యవహరించాలని తెలిపింది. ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలని, మంచి-చెడుల గురించి చెప్పాలని సూచించింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా వారితో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచించింది. యుక్త వయస్సులో లైంగిక సంబంధాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలను నివారించడానికి పాఠశాలలో లైంగిక విద్య అవసరమని నొక్కి చెప్పింది. -
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రాంబాబుకు 25 ఏళ్లు జైలు శిక్ష
-
విశాఖ పొక్సో కోర్టు సంచలన తీర్పు
విశాఖ: కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధించి సంచలన తీర్పునిచ్చింది విశాఖ పోక్సో కోర్టు. 2020లో మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రరావు అనే కసాయి తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి బంధువులు 2020, అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్ర రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా విశాఖ పోక్సో కోర్టులో విచారణ జరిగింది. మూడేళ్లపాటు జరిగిన విచారణానంతరం ఈరోజు ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. రామచంద్రరావుకు జీవితఖైదును విధించడంతో పాటు బాధితురాలికి పది లక్షల రూపాయల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని జడ్జి ఆనంది ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరగడంతో స్పెషల్ పొక్సో కోర్టు ప్రాసిక్యూటర్ కరణం కృష్ణకి కన్నీటితో కృతఙ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబసభ్యులు. ఇది కూడా చదవండి: తిరుమలలో నేటి నుంచి మూడ్రోజుల పాటు కారీరిష్టి యాగం -
ఢిల్లీలో ప్రభుత్వాధికారి నిర్వాకం.. స్నేహితుడి కుమార్తెను..
న్యూఢిల్లీ: మహిళలు, పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత గల పదవిలో ఉండి పశువులా వ్యవహరించాడొక కామాంధుడు.ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి తన స్నేహితుడి టీనేజీ కూతురిపై ఎన్నో నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి పట్టుబడ్డాడు. అతనికి సహకరించినందుకు ఆతడి భార్య పైన కూడా కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి తన స్నేహితుడు 2020లో మరణించడంతో అతడి మైనర్ కుమార్తె(14)ను తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఆ బాలిక వారితోనే కలిసి ఉంటోంది. ఈ వ్యవధిలో ప్రభుత్వాధికారి ఆ అమ్మాయిపై అనేక మార్లు అత్యాచారం చేసినట్లు మధ్యలో తాను గర్భం దాల్చగా అతడి భార్య, కుమారుడు కొన్ని మందులిచ్చి గర్భాన్ని తొలగించారని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీనేజీ అమ్మాయి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని ఆమె నుండి ఇంకా స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వాధికారిపై పోక్సో చట్టం తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడికి సహకరించినందుకు అధికారి భార్యపైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి.. -
విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..బట్టలూడదీసి..
పాట్నా: పాఠాలు చెప్పాల్సిన మాష్టారు తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు వారిని వివస్త్రుల్ని చేసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ మాష్టారిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రాధమిక విచారణ జరుగుతోందని ఈ జంటను వేధించిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వీడియో బయటకు రావంతో.. బెగుసరై జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పత్ కౌలా గ్రామం తెగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీతం టీచరుగా పనిచేస్తున్న కిషన్ దేవ్ చౌరాసియా(45) మైనర్ బాలిక(20) తో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని స్థానిక యువకులు ముగ్గురు గమనించి వారిపై దాడి చేసి ఇద్దరి బట్టలు ఊడదీశారు. ఈ సంఘటన మొత్తాన్ని వారు వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు పొక్కడంతో తాము రంగంలోకి దిగి ప్రాధమిక విచారణ చేపట్టామని తెలిపారు. తప్పుడు రాగం.. ట్యూషన్ చెప్పడానికి వచ్చి తనను లైంగికంగా వేధించారని మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యూజిక్ టీచర్ కిషన్ సింగ్ చౌరాసియా పై పోక్సో చట్టం, ఏసీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తోపాటు మరికొన్నిసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఎస్పీ. ఈ జంట పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: యూపీలో దారుణం.. చెల్లెలి తల నరికి.. -
కర్ణాటకలో ఘాతుకం.. మైనర్ బాలికపై..
బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఒక చర్చి ప్రతినిధి తన కళాశాలలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా గురువారానికి ఫెర్నాండెస్ ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. శివమొగ్గలోని ఓ చర్చిలో పనిచేస్తోన్న ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ చర్చి అనుబంధ కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతొ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానిక కోటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తలిదండ్రులు. పోలీసులు ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ పై పోక్సో చట్టం తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండుకు తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ బాలిక బంధువులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు తరలి వచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు
నిజామాబాద్: బోధన్లోని శక్కర్నగర్ చౌరస్తాలో బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సోహైల్ అనే యువకుడు బాలికను ఏడాదిన్నరగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఎవరు లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడ్డ యువకుడిని కుటుంబ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా సదరు యువకుడు ఏడాదిన్నరగా వేధిస్తున్నాడని, ఎవరికి చెప్పుకున్నా అండగా నిలువలేదని బాలిక తండ్రి ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
బాల్యవివాహాలను అరికట్టాలి!
నారాయణపేట: బాల్యవివాహాలను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు దేవయ్య అన్నారు. బుధవారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బాలల హక్కుల పరిరక్షణ అంశాలపై ఓరియంటేషన్ కమ్ సెన్సిటిజషన్ ప్రోగ్రాం ఆన్చైల్డ్ రైట్స్పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. పోక్సో కేసుల విషయంలో ఎంతో సున్నితంగా ఉండాలన్నారు. పోక్సో కేసులపై సీరియస్గా ఉంటుందని పీఎస్లలో వారికి రక్షణ కల్పించాలన్నారు. ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ అనే అంశాలపై పోలీసులు ఫోకస్ చేయాలన్నారు. జిల్లా మ్యాపింగ్ తీసుకొని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సక్సెస్ స్టోరీపై పిల్లలకు గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ హాస్టళ్లను చక్కగా నిర్వహించాలని ఎస్సీ అధికారికి ఆదేశించారు. అదేవిధంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ దేశ భవిష్యత్ గర్వపడేలా అధికారులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం ద్వారా కేసులు నమోదు చేసి చార్జీషీట్ వేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. షీటీమ్స్ ద్వారా కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్శ్యామల మాట్లాడుతూ సీడబ్ల్యూసీ కమిటీ పరిధిలో 675 కేసులు నమోదైనట్లు తెలిపారు. డీడబ్ల్యూఓ వేణుగోపాల్ మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టడానికి 24గంటలు పని చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ సహాయంతో 300 మంది పిల్లలను గుర్తించి, వారిని గురుకుల పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ ప్రోగ్రాం, షీటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ మాట్లాడూతూ బాలబాలికల ఆరోగ్య పరిస్థితులను తన సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. జిల్లాలోని 704 అంగన్వాడీ కేంద్రాల్లో 50,276 మందిలో బాలికలు 24,823 , బాలురు 25,453 ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో నార్మల్ డెలవరీలలో మొదటిస్థానంలో ఉందని డీఎంహెచ్ఓ అన్నారు. టీఎస్సీపీసీఆర్ కమిటీ సభ్యులు దేవయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు, అధికారులు ఉన్నారు. -
ఇష్టమొచ్చినట్టు పోక్సో చట్టం.. స్కూలు మాష్టారుపై కేసు నమోదు..
బెంగుళూరు: పోక్సో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దీన్నీ సద్వినియోగం చేసుకునేవారు కంటే దుర్వినియోగం చేసేవారి సంఖ్యే ఎక్కువగా ఉందని బాంబే హైకోర్టు సీరియస్ అయ్యిన విషయం తెలిసిందే. అంతలోనే కర్ణాటక తుంకూరు జిల్లాలోని ఓ పాఠశాల అధ్యాపకునిపై హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న కారణంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు చిక్కనాయకనహళ్లి పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోడెకెరె ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు హెచ్.ఎస్.రవి విద్యార్థులకు ఎక్కువగా హోంవర్క్ ఇస్తూ వేధిస్తున్నారని, హోంవర్క్ చేయకపోతే కఠినంగా శిక్షిస్తున్నారని పిల్లలు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని, వారిని ఇంతగా వేధిస్తున్నందుకు అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తలిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. హోంవర్కు ఎక్కువగా ఇచ్చి పిల్లలను వేధిస్తున్నందుకు గాను సదరు లెక్కల మాస్టారుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అసలే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారని బాంబే హైకోర్టు ఇటీవల మొట్టికాయలు మొట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంటు కల్పించుకుని ఈ చట్టంలో తగిన సవరణలు చెయ్యాలని కోరుతూ ఒక కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు గురించి తెలిస్తే బాంబే హైకోర్టు ఇంకెంత సీరియస్ అవుతుందో మరి. ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు -
బీజేపీ నేత కొడుకు ఘాతుకం.. ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్రేప్
భోపాల్: మధ్యప్రదేశ్లోని ధాతియా జిల్లాలో దారుణం జరిగింది. అధికార బీజేపీ పార్టీ ప్రతినిధి కుమారుడు స్నేహితులతో కలిసి ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మైనర్ చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. అవమానభారంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ హోం శాఖమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ధాతియా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన యువతి ఆత్మహత్యకు పాలపడిన తర్వాత విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, భారీ సంఖ్యలో స్థానికులు ఉన్నవ్ పోలీసు స్టేషన్ వద్ద గుమికూడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా స్పందిస్తూ.. ఒకవేళ ఆ అమ్మాయి తన వాంగ్మూలంలో బీజేపీ నాయకుడి కుమారుడి పేరు చెబితే తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనర్ బాలిక ఇచ్చిన కంప్లైంట్ లో.. బీజేపీ లీడర్ కొడుకు తన స్నేహితులతో కలిసి మొత్తం నలుగురు తనను, తన సోదరిని తీసుకుని ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుని వెళ్లారని, అక్కపై సామూహికంగా అత్యాచారం చేసి తనపై కూడా లైంగిక దడి చేశారని తెలిపింది. సంఘటన అనంతరం ఇద్దరూ ఇంటికి చేరుకోగా తన సోదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొంది. ధాతియా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడుతో సహా ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని ఒకరు మాత్రం పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుకి చేరువలో ఝాన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని అన్నారు. ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత మనస్పర్థలు చోటుచేసుకున్నాయని పోక్సో చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం పెద్ద తలనొప్పిగా మారిందని తెలిపింది బాంబే హైకోర్టు. ఇదే క్రమంలో 17 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొన్న కేసులో నుండి ఓ యువకుడికి విముక్తి కలిగించింది. హైకోర్టు ఏం చెప్పింది? ప్రస్తుత ఐపీసీ చట్టం ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి ఒకరు, 17 ఏళ్ల 364 రోజుల వయసున్న బాలికతో ఆమె ఇష్టంతో శృంగారంలో పాల్గొంటే నేరంగా పరిగణించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. దీనివలన చట్టాలను దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోందని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం శృంగార సంబంధాన్ని ఇష్టపూర్వకంగా కొనసాగించిన తర్వాత కేసులు నమోదు చేయడం క్రిమినల్ న్యాయ వ్యవస్థకు భారంగా మారింది. చట్టం, న్యాయవ్యవస్థ ఇటువంటి కేసుల్లో బాధితుడికి మద్దతుగా నిలవలేకపోతున్నాయి. యువతి సమ్మతంతోనే శృంగారం జరిగితే మాత్రం నిందితుడిని నిర్దోషిగా విడుదల చెయ్యాలని 31 పేజీల తీర్పులో తెలిపింది. పోక్సో చట్టం ఉద్దేశ్యమేంటీ? మైనర్లను లైంగిక వేధింపుల నుండి రక్షించేందుకే POCSO చట్టం రూపొందించబడింది. నిజంగా బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారానికి పాల్పడితే ఆ వ్యక్తి ని ఈ చట్టం కింద విచారించడం తప్పులేదు. అలాంటివి కాని కేసుల్లో నియంత్రణ అవసరమని తెలిపింది న్యాయస్థానం. ఈ అంశాన్ని పార్లమెంటు కూడా సీరియస్గా పరిగణించాలని సూచించింది. చట్టం దుర్వినియోగం అవుతోందా? కౌమార దశలో ఉన్నవారిపై ఈ తరహా చట్టాలు అమలు చేయడం ద్వారా వారి లైంగిక స్వేచ్ఛను దెబ్బతీసినట్టవుతుంది. అత్యధిక కేసుల్లో బాలికలు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత ప్లేటు ఫిరాయించడంతో మగవారే ఎక్కువగా శిక్షించబడుతున్నారని పేర్కొంది. పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే అది రేప్ కింద కూడా పరిగణించకూడదని తెలిపింది. మగవాళ్లకే చిక్కులా? చట్టం దృష్టిలో మైనర్ బాలికలు శృంగారానికి అంగీకరించినా అది లెక్కలోకి రాదు. అదే సమయంలో యువకులకు మాత్రమే ఇది చిక్కుల్ని కొనితెచ్చిపెడుతోంది. ఇటీవల 17.5 ఏళ్ల వయసున్న ఓ బాలిక విషయంలో ఇలాగే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయాలని చూసిన ఘటనలో జస్టిస్ భారతి డాంగ్రే నేతృత్వంలో బాంబే హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. ఇది కూడా చదవండి: పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్.. -
కీచక మారుతండ్రికి రెండు జీవిత ఖైదులు
ఖలీల్వాడి: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన ఓ మారుతండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలు స్తూ రెండు జీవితఖైదులు విధించింది. ఈ మేరకు నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్చార్జి సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు చెప్పారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవింద్రావు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. అక్కడ భర్తను విడిచిపెట్టి ఐదేళ్లు, రెండేళ్ల వయసుగల ఇద్దరు కూతుళ్లతో ఉంటున్న ఓ మహిళ పరిచ యం కావడంతో ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత వారు వివాహం చేసుకొని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలో ఓ వ్యవసాయదారుని వద్ద జీతానికి పనిచేస్తున్నారు. అయితే గతేడాది పెద్ద బాలి క కాలికి గాయం కావడంతో గోవింద్రావు 2022 అక్టోబర్ 20న అదే గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అనంతరం బాలికను నేరుగా ఇంటికి తీసుకురాకుండా మెంట్రాజ్పల్లి వెళ్లే దారిలోని పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలిక ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచాడు. స్పృహ కోల్పోయిన బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నడుచుకుంటూ వెళ్లిన బాలిక అపస్మారకస్థితిలో ఉండటంతో ఏం జరిగిందో చెప్పాలని బాలిక తల్లి నిలదీసింది. దీంతో గోవింద్రావు అసలు విషయం చెప్పడంతో బాలికను తల్లి నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్కు తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలిక మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి న నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ముద్దాయి నేరం ఒప్పుకోలు స్వాధీన పంచనామా, సీసీటీవీ ఫుటేజీ, బాలిక పోస్ట్మార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదికలతోపాటు ఇతర సాక్ష్యాలను జతచేసి అభియోగ పత్రాన్ని పోక్సో కోర్టులో సమర్పించారు. న్యాయ విచారణలో 24 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల కింద గోవింద్రావుపై నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ అత్యాచారం నేరానికిగాను జీవిత ఖైదు, దాడి చేసి బాధితురాలి మృతికి కారణమైనందున హత్యా నేరానికిగాను మరో జీవితఖైదును జడ్జి విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని సెషన్స్ జడ్జి సునీత తీర్పులో సూచించారు. -
పోక్సో నిందితుడికి బెయిల్.. దేశంలోనే ఇలా తొలిసారి?
ముంబై: పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి(45).. అదీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు కాకముందే బెయిల్ మంజూరు చేసింది ఓ న్యాయస్థానం. తద్వారా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన కోర్టుగా నిలిచింది ముంబై సెషన్ కోర్టు. ముంబై వకోలా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి.. తన మూడేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ జనవరి చివరివారంలో పోలీసులను ఆశ్రయించింది. తన కూతురు పొరుగింట్లోకి తరచూ వెళ్తుందని, ఈ క్రమంలో తన కూతురిపై పొరుగింట్లో ఉండే వ్యక్తి రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. 20 రోజుల తర్వాత విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పిన ఆమె, తర్వాత మరో రెండు రోజులు ఆగి పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా పోక్సో చట్టం ప్రకారం నిందితుడి అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ, ఛార్జ్షీట్ ఇంకా ఫైల్ చేయలేదు. సాధారణంగా ఛార్జ్షీట్ ఫైల్ అయ్యాకే.. బెయిల్ విషయంలో కోర్టును ఆశ్రయించొచ్చు. ఈ లోపు నిందితుడు బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించాడు. తన(నిందితుడు) క్లయింట్ ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీలో టెక్నీషియన్గా పని చేస్తున్నాడని, ఘటన జరిగినట్లు చెప్తున్న రోజున ఆఫీస్లోనే ఉన్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు నిందితుడి తరపు న్యాయవాది. అంతేకాదు.. రెండు ఇళ్ల మధ్య ఉన్న పైప్లైన్ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తన క్లయింట్ను బద్నాం చేసే ఉద్దేశంతోనే తప్పుడు కేసు పెట్టినట్లు వాదించాడాయన. మరోవైపు.. ప్రాసిక్యూషన్ నిందితుడికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఈ పోక్సో కేసులో ఛార్జ్షీట్ కూడా ఇంకా ఫైల్ కాలేదని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. నిందితుడు, బాధిత కుటుంబం పొరుగింట్లోనే ఉంటాడు గనుక అతని నుంచి వాళ్లకు ఏదైనా హాని జరిగే అవకాశం ఉండొచ్చని, కేసును ప్రభావితం చేయొచ్చని వాదించారు. అయితే.. కోర్టు మాత్రం నిందితుడి తరపు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది. -
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి యావజ్జీవం
గుంటూరు లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి పోక్సో కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.3,500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. బాలిక తల్లితో కలిసి దుర్గి మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి పూర్తి చేసుకుని నాలుగో తరగతిలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో దుర్గిలో నివాసం ఉంటున్న అత్త ఇంటికి వెళ్లి వస్తానని తల్లికి చెప్పడంతో అదే గ్రామంలో ఉంటున్న ఆటో డ్రైవర్ కామ రామన్జీ అలియాస్ అంజితో మాట్లాడి ఆటో ఎక్కించి పంపించింది. అంజి బాలికను మొక్కజొన్న పొలం వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత బాలికను బంధువుల ఇంటి వద్ద దింపాడు. బాలిక అనారోగ్యంగా ఉండటంతో అదే రోజు సాయంత్రం తల్లి వద్దకు వచ్చేసింది. అంజి బెదిరింపులకు భయపడి తల్లికి విషయం చెప్పలేదు. అయితే 2018, మే 12న తల్లి యథావిధిగా పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఎప్పుడూ ఇంటి పనులు చేసే బాలిక చేయకుండా నీరసంగా కనిపించడంతో ఏం జరిగిందని అడుగ్గా, గతంలో తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని చెప్పింది. వెంటనే తల్లి దుర్గి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఏఎస్పీ కె.జి.వి.సరిత దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నిందితుడు అంజిపై నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు పైవిధంగా తీర్పు చెప్పారు. కోర్టు విచారణ సమయంలో బాలిక మృతి చెందింది. బాలిక కుటుంబానికి రూ.4 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్యామల కేసు వాదించారు.