-
Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం!
అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలా అని యజమానులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా పెంపుడు శునకాలు, ఇతర పెంపుడు జంతువులను ఖననం చేయడం, దహన సంస్కారాలు చేయడానికో స్థలం లేక నగరజంతు ప్రేమికులు నరకయాతన అనుభవిస్తున్నారు.అపార్ట్మెంట్, విల్లా కల్చర్ వచ్చాక పెంపుడు శునకాలను ఖననం చేసేందుకు మరుభూమి లేక ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో జీహెచ్ఎంసీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఎవరైనా తమ ఇంట్లో పెంపుడు కుక్క మృతి చెందితే దానికి గౌరవప్రదంగా అంతిమయాత్ర నిర్వహించడం, అంతకుమించి మర్యాదపూర్వకమైన దహన సంస్కారాలు చేయడం అందుబాటులోకి వచ్చిది. ఆ వివరాలు తెలుసుకుందాం.. – బంజారాహిల్స్నగరంలో జంతు ప్రేమికులు చాలా మందే ఉన్నారు.. వారు అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులు మృతి చెందితే తీసుకెళ్లి ఎక్కడో పడేయకుండా సంప్రదాయబద్ధంగా శునకాలు, ఇతర జంతువులకు కూడా దహన సంస్కారాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పీపుల్ ఫర్ ఎనిమల్స్(పీఎఫ్ఏ) సంయుక్తంగా డోర్ టూ టూర్ క్రిమేషన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. పెంపుడు జంతువుల యజమానులకు ఇదొక శుభవార్త అనే చెప్పాలి. ఇంటికే వచ్చి మృతి చెందిన శునకాన్నో, ఇతర పెంపుడు జంతువునో ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందుకోసం పీఎఫ్ఏ ప్రత్యేక వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి పెట్ మృతదేహాన్ని ఫతుల్లాగూడలోని క్రిమేషన్కు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రూ.2,500 దూరాన్ని బట్టి ఫీజుగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫతుల్లాగూడలో మాత్రమే అందుబాటులో ఉన్న పెట్ క్రిమేషన్ త్వరలోనే గాజుల రామారం, గోపన్పల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.డిసెంబర్ 2022 నుంచే..ఫతుల్లాగూడలో ఈ సౌకర్యం 2022 డిసెంబర్ నుంచే అందుబాటులోకి వచ్చిది. చాలా మంది తమ ఇంట్లో కుక్కలు చనిపోతే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ బాధపడుతుండటాన్ని గమనించిన పీఎఫ్ఏ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వలంటీర్లను కూడా నియమించింది.డయల్ చేయాల్సిన నంబర్లు.. జంతు ప్రేమికులు తమ ఇళ్లలో పెంపుడు శునకం మృతి చెందితే 73374 50643, 95055 37388 నంబర్కు ఫోన్ చేస్తే ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు క్రిమేషన్కు తీసుకెళ్తారు. దహన సంస్కారాల తర్వాత ఆ బూడిదను ప్రత్యేకంగా ఓ కుండీలో ఉంచి సంబంధిత యజమానులకు అందజేస్తారు. ఆ బూడిదను ఇళ్లలో ఉన్న మొక్కల వద్దకానీ, తమ స్వగ్రామాల్లో కానీ, మరే ఇతర ప్రాంతాల్లో ఉన్న మొక్కలు, చెట్ల వద్ద అయినా పూడ్చిపెడితే సరిపోతుందని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ త్వరలోనే ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో కూడా పెట్ క్రిమటోరియంలను నిర్మించే ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది. ఒక్క ఫోన్ చేస్తే.. చాలు.. ఎక్కడైనా పెంపుడు జంతువు మృతి చెందిందని యజమానులు ఫోన్ చేయగానే ఆ వలంటీర్లు అక్కడ వాలిపోతారు. క్రిమటోరియంకు ఆ శునకాన్ని తీసుకొచ్చి పూలదండలు వేసి సంప్రదాయబద్ధంగా దహనం చేస్తాం. అనంతరం భస్మాన్ని కుండల్లో భద్రపరిచి యజమానులకు అందిస్తున్నాం. గ్యాస్తో నడుస్తున్న ఈ క్రిమటోరియం వల్ల ఎలాంటి కాలుష్యం వెలువడదు. ఎవరికీ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఈ క్రిమటోరియం నిర్మించడం జరిగింది.– వాసంతి వాడి, ఫౌండర్ ప్రెసిడెంట్ పీఎఫ్ఏగ్యాస్తో నడిచే క్రిమటోరియం...ప్రస్తుతం ఫతుల్లాగూడలో అనంతయాత్ర పేరుతో పెట్ క్రిమటోరియంను నిర్వహిస్తున్నాం. త్వరలో మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రతి నెలా 25 వరకూ శునకాలకు మర్యాదపూర్వకమైన, సంప్రదాయబద్ధ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. మా వద్ద ఇందుకోసం అంబులెన్స్ను అందుబాటులో ఉంచాం. 14 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వలంటీర్లు కూడా అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్తో ఈ క్రిమటోరియం నిర్వహిస్తున్నాం. ఇకో ఫ్రెండ్లీ క్రిమటోరియంను నడిపిస్తున్నాం.– దత్తాత్రేయ జోషి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పీఎఫ్ఏరూ.80 లక్షలతో మహదేవ్పురం పెట్ క్రిమటోరియం..కూకట్పల్లి సమీపంలోని మహదేవ్పురం సిక్ బస్తీ దగ్గర రూ.80 లక్షల వ్యయంతో పెట్ క్రిమటోరియం నిర్మించారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఏ ఎన్జీవోకు ఇవ్వాలన్నదానిపై టెండర్ పిలుస్తారు. ఇది అందుబాటులోకి వస్తే చాలా మంది జంతు ప్రేమికులకు తమ ఇంట్లో చనిపోయే పెంపుడు కుక్కల దహన సంస్కారాలు గౌరవ ప్రదమైన వాతావరణంలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది.– డాక్టర్ ఎ.లింగస్వామి, వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ -
మందు మింగడానికి మీ ‘పప్పీ’ మారాం చేస్తోందా? ఇదిగో ఇంట్రస్టింగ్ టిప్
ఆధునిక కాలంలో ఇంట్లో పెంపుడు జంతువు (పెట్స్) పెంచుకోవడం ఒక అవసరంగా మారిపోయింది. వీటిల్లో కుక్క, పిల్లిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా చూసుకోవడం, వాటి ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం , శ్రద్ధ సంరక్షణ ఇవన్నీ యజమాని బాధ్యత. పెంపుడు జంతువుల బ్రీడ్ లేదా సైజుతో సంబంధం లేకుండా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి సాధారణ వ్యాయామం, మానసిక ప్రేరణ అవసరం. ఇంట్లో , బయటా ఆడుకోవడానికి, పరిగెత్తడానికి అవకాశం ఉండేలా చూసుకోవాలి.Tip for giving medication to dogs, dip the syringe in something they like 📹 igotthissitpic.twitter.com/6yCsPxmIMR— Science girl (@gunsnrosesgirl3) June 10, 2024ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. మనుషుల మాదిరిగానే పోషకాలతో నిండిన,సమతుల్య ఆహారం చాలా అవసరం. వాటి బ్రీడ్ వయస్సుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పశువైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించాలి. గ్రూమింగ్, జనరల్ చెక్-అప్లు చేయించాలి. ఏదైనా అనారోగ్యం వస్తే సరైన చికిత్స చేయించాలి. అంతేకాదు పెంపుడు జంతువు వైద్య ఖర్చుల కోసం పెట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.సాధారణంగా అనారోగ్యానికి గురైన కుక్కలకు మందులు వేయడం యజమానులకు ఒక పెద్ద టాస్క్అని చెప్పాలి. ఒక్క పట్టాన మాట వినవు. మారాం చేస్తాయి. ఈ నేపథ్యంలో వాటికి మందులు ఎలా వేయాలో చిన్న చిట్కా అంటూ ఒక వీడియో ఇంటర్ నెట్లో ఆసక్తికరంగా మారింది. చిన్ని పిల్లల్ని మాయ చేసి, మ్యాజిక్ చేసినట్టే.. పెట్స్కి కూడా వాటికిష్టమైన ఆహారంలో పెట్టి తినిపించేయడమే. అదెలాగో మీరూ చూసేయండి. -
కోట్లల్లో పెరిగిపోతున్న పెట్ డాగ్స్ ఇండస్ట్రీ..
పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ భారత్లో ఏటా 13.9% పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్లలో ఒకటని ఇండియన్ పెట్ ఇండస్ట్రీ జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ (IPICA) పేర్కొంది. దీనికి సంబంధించి జస్ట్ డాగ్స్ మార్కెటింగ్ హెడ్ కషాప్ సంఘాని మాట్లాడుతూ..గతంలో వెటర్నరీ క్లినిక్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెట్ కేర్ మార్కెట్ విస్తృతంగా అభివృద్ది చెందుతుంది. ఐదేళ్ల క్రితం భారతదేశంలో దత్తత తీసుకున్న పెంపుడు జంతువుల సంఖ్య 28 మిలియన్లు ఇప్పుడు 38 మిలియన్లకు చేరుకుందని, వచ్చే ఐదేళ్లలో అదే సంఖ్య 45 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పెంపుడు జంతువుల పరిశ్రమ మొత్తం రూ. 8000 కోట్లని, అందులో 65% భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారమని మార్కెట్ అని పేర్కొన్నారు. భారతీయ పెంపుడు జంతువుల పరిశ్రమ ప్రకారం.. పెంపుడు పిల్లల సంరక్షణ కోసం పెట్ పేరెంట్స్ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దత్తత తీసుకోవడం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం, పెంపుడు జంతువులను ఇంట్లో పిల్లలతో సమానంగా పరిగణిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తున్నారు. పెంపుడు జంతువుల కోసం నెలకు సగటున రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. వాటి ఆహారం, దుస్తులు, మందులు,బొమ్మలు.. ఇలా వాటి జాతి, వయస్సు, నగరాన్ని బట్టి ఖర్చు మారుతుంది. బడ్జెట్లో దాదాపు 70%-75% ఎక్కువగా పెట్స్ కోసం ఫుడ్, ట్రీట్మెంట్ కోసమే ఖర్చవుతుంది. పెంపుడు జంతువుల దత్తత పెరగడం ప్రధాన నగరాల్లో మాత్రమే కాదు. ఇది టైర్ 2 మరియు 3 నగరాలకు కూడా విస్తరించింది. దీంతో గత రెండేళ్లలో కొత్తగా 70 పెట్ కేర్ కంపెనీలు ఆవిర్భవించాయి. పెంపుడు కుక్కలలో 6% కుక్కలకు మాత్రమే బ్రాండెడ్ ఆహారం ఇస్తారు. మిగిలినవి దాదాపు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటాయి. ఇక పిల్లుల్లో 2% వాటికి మాత్రమే బ్రాండెడ్ ఆహారం తింటాయని డాగ్-ఓ-బో సహ వ్యవస్థాపకుడు ఇబాదత్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..15 ఏళ్ల క్రితం గ్రూమింగ్ సెలూన్లు లేవు. అప్పట్లో చైనా నుంచి కొన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెట్ గ్రూమింగ్ సెలూన్లు చాలా ఉన్నాయి. అన్ని ఉత్పత్తులను భారత్లోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్ డాగ్స్ కోసం స్విమ్మింగ్ పూల్,ప్రత్యేక ఆహారం, డాగ్ ట్రైనర్లు, డాగ్ సిట్టర్లు, డాగ్ రిసార్ట్స్, డాగ్ గ్రూమింగ్ సెలూన్లు, నోబిల్ ట్రీట్మెంట్ వ్యాన్లు, పెట్ ఫుడ్ ఇలా ఎన్నో వచ్చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు పెంపుడు జంతువులను రవాణా చేసే స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లు ఉన్నాయి. TRASNFERET మొబిలిటీ జనరల్ మేనేజర్ బిజు వర్గీస్ ప్రకారం.. గత ఎనిమిదేళ్లలో వారు దాదాపు 8500 పెంపుడు జంతువులను రవాణా చేసినట్లు తెలిపారు. పెట్ కేర్లో ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో త్వరలోనే సెవెన్ ఓక్స్ పెట్ అనే అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ పెట్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ పార్టనర్ అర్చన నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికి ఇది రెడీగా ఉంటుందని ఆమె పేర్కొంది. హైదరాబాద్ను వెటర్నరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారని అమెరికికు చెందిన ప్రముఖ వెటర్నరీ డాక్టర్ శ్రీరెడ్డి తెలిపారు. ఇందులో యానిమల్ బ్లడ్ బ్యాంక్, ఎలక్ట్రిక్ శ్మశానవాటిక వంటి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. -
వచ్చే రెండేళ్లలో పెంపుడు శునకాల మార్కెట్ ఎంతంటే..
ఇంటికి వెళ్లగానే బుజ్జి అడుగులతో ప్రేమగా మీదకు దూకే చిన్న కుక్కపిల్లని చూడగానే అప్పటివరకూ పడిన శ్రమ అంతా మర్చిపోతాం. అందుకే వాటికి అచ్చం మనుషుల్లానే చూసుకుంటాం. ఎంత టెన్షన్లో ఉన్నా వాటిని చూడగానే ఆంతా ఆవిరైపోతుంది. అయితే పెట్డాగ్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్, వాటికి వేసే బట్టలు, వాటికి వాడే క్యాస్టుమ్స్, వైద్యం..ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతుంది. వచ్చే రెండేళ్లలో పెట్డాగ్స్ ద్వారా దేశంలో దాదాపు రూ.6వేల కోట్లు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి. పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి. కొందరు ఆన్లైన్లో లేదా స్టోర్లో పెట్ ఫుడ్ను విక్రయిస్తున్నారు. స్టూడియోలో లేదా మంచి లొకేషన్లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు. యజమానులు, ఇంటికి వచ్చేవారితో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదీ చదవండి: 25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా 6లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.2వేలకోట్లు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 13.9% వృద్ధి చెందుతోంది. 2025 నాటికి దాదాపు రూ.6వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పెట్డాగ్స్ సంఖ్య ఈ కింది విధంగా ఉంది. Top 10 countries with the most pet dogs#PetDogs #DogLovers #CanineCompanions pic.twitter.com/YNicdDGUx7 — Global Ranking (@Top1Rating) October 13, 2023 -
లిఫ్ట్లోకి కుక్క.. మహిళతో రిటైర్డ్ ఐఏఎస్ డిష్యుం డిష్యుం
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్మెట్లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. చెంపదెబ్బల వర్షం ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida). First Retired IAS Officer beat 👊 a Women Then her Husband beat 👊 that IAS Officer Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO — Dr Jain (@DrJain21) October 31, 2023 పెరుగుతున్న గొడవలు పెంపుడు కుక్కులను లిఫ్ట్లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్మెంట్లు పెంపుడు కుక్కలను లిఫ్ట్లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. -
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
పంజరం నుంచి ఎగిరిపోయిన ఆస్ట్రేలియా జాతి గాలా కాక్టో
హైదరాబాద్: తాను ఎంతో ఇష్టంగా విదేశాల నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్న అరుదైన చిలుక కనిపించకపోవడంతో యజమాని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక రోజు వ్యవధిలోనే ఆ చిలుకను గుర్తించి యజమానికి అప్పగించారు. ఎస్ఐ ఎంఎం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ రోడ్ నెం.44(ఏ)లో నరేంద్రచారి మైరు బిస్ట్రో కాఫీ షాపును నడిపిస్తున్నాడు. ఆయనకు పక్షులంటే మహా ప్రాణం. ఆస్ట్రేలియా జాతికి చెందిన గాలా కాక్టో అనే చిలుకను అక్కడి నుంచే తెప్పించుకొని అపురూపంగా పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల ఈ చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది. దీంతో తన చిలుక కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి దాని ఫొటోను కూడా అందించాడు. నాలుగు నెలల వయసున్న ఈ చిలుక ఖరీదు రూ.1.30 లక్షలుగా యజమాని తెలిపాడు. ఎక్సోటిక్ బర్డ్గా గుర్తింపు పొందిన ఈ చిలుకను తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని, దీనికి లైసెన్స్ కూడా ఉందని రెండు కాళ్లకు ఆ దేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు రెండు రింగులు కూడా ఉంటాయని వెల్లడించారు. ఎస్ఐ ఈ చిలుక ఫొటోలను జూబ్లీహిల్స్లోని పెట్షాప్స్కు పంపించారు. ఎవరైనా ఈ చిలుకను అమ్మితే వారి వివరాలు తెలపాల్సిందిగా సూచించారు. ఓ వ్యక్తి ఈ చిలుకను ఎలా పట్టుకున్నాడో తెలియదు కానీ మూడు రోజుల క్రితం ఎర్రగడ్డలో రూ.30 వేలకు ఓ పక్షి ప్రేమికుడికి విక్రయించాడు. అదే వ్యక్తి ఆ తెల్లవారి రూ.50 వేలకు సయ్యద్ ముజాహిద్కు అక్కడే విక్రయించాడు. ఈ చిలుకను కొనుగోలు చేసిన ముజాహిద్ తన వద్ద ఖరీదైన, అరుదైన గాలా కాక్టో ఆస్ట్రేలియన్ జాతి చిలుక ఉందని రూ.70 వేలకు విక్రయిస్తానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్లోని ఓ పెట్షాప్ నిర్వాహకుడు ఈ స్టేటస్ చూసి జూబ్లీహిల్స్ ఎస్ఐకి సమాచారం ఇచ్చాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి స్టేషన్కు రప్పించడమే కాకుండా తన దగ్గర బంధీగా ఉన్న చిలుకను యజమాని నరేంద్రాచారికి అప్పగించారు. దాదాపు ఇక దొరకదేమో అనుకున్న తన పెంపుడు చిలుక కనిపించేసరికి నరేంద్రాచారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కష్టపడి చిలుకను పట్టుకొని అప్పగించినందుకు పోలీసులకు కతజ్ఞతలు తెలిపారు. -
తప్పిపోయినా.. శునకం వద్ద క్షేమం..!
మిషిగన్: రాత్రి వేళ రెండు పెంపుడు కుక్కలతోపాటు కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు కలిసి అటవీ ప్రాంతంలో భారీగా గాలించారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలను సైతం వాడారు. చివరికి ఆల్ టెర్రయిన్ వెహికల్(ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. అప్పటికే ఆ చిన్నారి ఒక పెంపుడు కుక్కను దిండుగా చేసుకుని నిద్రిస్తుండగా మరో శునకం జాగ్రత్తగా కాపలా కాస్తూ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ అంటున్నారు. అమెరికాలో మిషిగన్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిత్ హార్న్కు చెందిన థియా చేజ్ అనే రెండేళ్ల బాలిక బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె వెంట రెండు కుక్కలు కూడా ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు స్థానికులతో కలిసి పరిసర అటవీప్రాంతంలో భారీగా అన్వేషణ మొదలుపెట్టారు. ఆల్ టెర్రయిన్ వెహికిల్(ఏటీవీ), డ్రోన్లు, పోలీసు జాగిలాలతో కొన్ని గంటల పాటు గాలించారు. చివరికి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో థియా ఉన్న విషయాన్ని ఏటీవీ పసిగట్టింది. పోలీసులు వెళ్లే సరికి ఓ చోట వెంట ఉన్న ఒక శునకాన్ని దిండుగా చేసుకుని చిన్నారి నిద్రిస్తుండగా, మరో జాగిలం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. -
ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న రామ్చరణ్ - రైమ్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్కు పెట్ డాగ్ రైమ్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. . రామ్చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఎప్పుడూ రైమ్ మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు. రైమ్ లేకుంటే అడుగుతీసి అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడరు ఈ స్టార్ దంపతులు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా వారి వెంట రైమ్ ఉండాల్సిందే. హైదరాబాద్లో ఇంట్లో ఉన్నా పక్కన రైమ్ ఉండాల్సిందే. రైమ్ పేరు మీద ఏకంగా ఒక ఇన్స్టా అకౌంటే క్రియేట్ చేశారు. దాదాపు 50 వేల ఫాలోయర్స్ రైమ్కు ఉండటం విశేషం. ఇక నేషనల్ పెట్ డే సందర్భంగా రైమ్ మీద నెటిజన్స్ స్పెషల్ ఫోకస్పెట్టారు. రామ్ చరణ్, రైమ్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల టూర్లలోనూ రైమ్ సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇతర నగరాలకు వెళ్లిన రామ్ చరణ్..తిరిగి వచ్చే క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్టులో రైమ్ ఎదురెళ్లి రామ్ వెల్కమ్ చెప్పి తన ఆనందాన్ని, సంబరాన్ని చూపించింది. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. రామ్ - రైమ్ ఇద్దరి మధ్య బాండింగ్ అభిమానులకు, ఫాలోవర్స్కు స్ఫెషల్గా అనిపించింది. -
కొత్త సీఈవో అంటూ మస్క్ ట్వీట్: ‘ఇక ఇదే ఆఖరు’ చెత్త ఫోటోలపై యూజర్లు ఫైర్
న్యూఢిల్లీ: బిలియనీర్ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కొత్త సీఈవో అంటూ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. తన పెంపుడు కుక్క ఫోల్కి ఫోటోను పోస్ట్ చేసి 'న్యూ సీఈఓ ఆఫ్ ట్విటర్' అని పేర్కొన్నారు. అంతేకాదు ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్ , నెంబర్లలోనూ ఇదే బెటర్.. స్టయిల్ కూడా అదిరింది అంటూ పరోక్షంగా మాజీ సీఈవో అగర్వాల్ను అవమానించేలా వరుస ట్విట్లలో కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్టయిలిష్గా, బ్రాండెడ్ బ్లాక్ టీ-షర్ట్లో క్రేజీ లుక్స్తో ఉన్న ఫ్లోకి ముందు ఓ టేబుల్, దానిపైన ల్యాప్టాప్ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో..కొత్త సీఈవో స్టైల్ అదిరిపోయిందని ఒకరు, చాలా ఇన్స్పైరింగ్.. పప్పీలా ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నా అంటూ కమెంట్ చేశాడు కాగా అంతకుముందు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విటర్లో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో మస్క్పై ట్విటర్ యూజర్లు మండిపడ్డారు. ఇక ఇదే ఆఖరు.. అధికారికంగా ట్విటర్ నుంచి నిష్క్రమిస్తున్నాను అని ఒకరు, ఈ పోస్ట్ ఇబ్బందికరమైన, స్త్రీద్వేషపూరిత చిత్రమని మరొకరు పేర్కొన్నారు ."మీరిలా చేస్తారని నమ్మలేక పోతున్నాను", మరొకరు, "మీ మీమ్స్ చాలా పేలవంగా ఉన్నాయని మరొక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది బ్లాక్మస్క్ అనే హ్యాష్ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. pic.twitter.com/iZUukCVrl5 — Elon Musk (@elonmusk) February 14, 2023 -
సందడిగా పెట్ గ్రూమింగ్ వ్యాన్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
మూగనేస్తాలు.. మౌనభావాలు..
మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. పక్క పక్కనే ఇళ్లు ఉంటున్నా.. అంటీముట్టనట్లుగా ఉండటం పరిపాటిగా మారింది. మనసు విప్పి మాట్లాడుకోవటం మాని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో సావాసం చేయడం అధికమైంది. పల్లెటూళ్లలో కాస్త కలివిడితనం ఉంటున్నా.. పట్టణాల్లోని కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా జీవనం సాగుతోంది. ఈ కోవలో ఏదో కోల్పోయిన భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మూగజీవాలతో స్నేహం కాస్త ఊరటనిస్తోంది. మాటలు రాకపోయినా మనసుకు దగ్గరయ్యే స్వభావం ప్రశాంతత చేకూరుస్తోంది. – పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు/కర్నూలు డెస్క్ చెట్టుపై నిద్రపోయిన పక్షులన్నీ తెల్లారింది లెవండోయ్ అన్నట్లు ఒక్కసారిగా పైకి లేచి ఆహార వేటకు పయనమవడం.. గంప కింద కోడి కొక్కొరొక్కోమని మేల్కొలపడం.. పిడికెడంత కూడా లేని పిచుకలు కీచుకీచుమంటూ ఇంటి ముందు వాలి గింజల కోసం వెతుకులాడటం.. పెంపుడు కుక్కలు యజమాని వెంట పొలం బాట పట్టడం.. పశువులు పొలం పనులకు సిద్ధమవడం.. ఇదీ పల్లె జీవనం. మనిషి జీవితంలో ఈ మూగప్రాణాలు ఓ భాగం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ వీటితో అనుబంధం క్రమంగా తగ్గిపోతోంది. యాంత్రిక జీవనంలో మునిగితేలుతూ మానసిక ఆనందాన్ని కోల్పోతున్న వేళ ఇప్పుడిప్పుడే మూగ ప్రాణుల మీద మమకారం పెరుగుతోంది. డబ్బు పోయినా పర్వాలేదు.. మనసు విప్పి మాట్లాడితే మనసుకు సాంత్వన లభిస్తుందనే అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్లో నివాసం ఉంటున్న ఖలీల్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతనికి చిన్నప్పటి నుంచి మూగజీవాలంటే ప్రాణం. మొదట కుక్కలు, పిల్లులతో సావాసం చేసినా, ఐదేళ్లుగా పక్షులను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. సాధారణంగా ఒకటో, రెండో పక్షులను ఓ చిన్న కేజ్లో బంధించి అమితమైన ప్రేమను చూపడం సహజం. ఇందుకోసం వెచ్చించే డబ్బు కూడా వేలల్లోనే ఉంటుంది. అయితే ఇతను తన ఇంటి ఆవరణనే పెద్ద బోనుగా మలచడం విశేషం. పక్షుల స్వేచ్ఛా విహంగానికి అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ బోనుకు చేసిన వ్యయం అక్షరాలా రూ.3లక్షల పైమాటే. ఇక ఈ ఐదేళ్లలో అతను పెంచుతున్న పక్షుల ఖరీదు రూ.7లక్షల పైనే కావడం చూస్తే ఆ మూగ ప్రాణులు అతని జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో తెలుస్తోంది. ఇంతే కాదు.. ప్రతినెలా వీటికి చేస్తున్న ఖర్చు రూ.5వేల వరకు ఉంటోంది. కింద పడితే తినవు.. డబ్బు విలువ పెరుగుతున్న కొద్దీ ఆహారం దొరకడం కూడా కష్టతరమవుతోంది. నిరుపేదలు ఇప్పటికీ దుర్భర జీవనం గడపటం చూస్తున్నాం. కొందరికి డబ్బు ఎక్కువై ఆహార పదార్థాలను వీధులపాలు చేస్తే.. ఇప్పటికీ ఆ విస్తర్లకేసి చూసే జనం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్ని పక్షుల విషయానికొస్తే.. కింద పడిన గింజలను ముట్టుకోవంటే ఆశ్చర్యమేస్తుంది. యజమాని ఎంతో ఇష్టంగా వాటి నోటికి అందించే దేనినైనా తినే ఈ పక్షులు, నోరు జారితే వాటికేసి కూడా చూడకపోవడం వింతేమరి. కుటుంబ సభ్యుల్లానే.. పక్షుల పెంపకం కుటుంబంలో భాగమవుతోంది. వీటి పెంపకం కాస్త కష్టమే అయినా ఇష్టాన్నిపెంచుకుంటే కుటుంబ సభ్యుల తరహాలోనే దగ్గరవుతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొద్దిసేపు పక్షులతో గడిపితే మానసిక ఆనందం లభిస్తుందని పక్షుల ప్రేమికులు చెబుతున్నారు. ఇక ఉదయాన్నే పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే పిల్లలు సైతం వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వీటిపై అమితమైన ప్రేమను చూపుతూ స్నేహితుల్లా భావిస్తుండటం విశేషం. కదలికలు పసిగట్టి.. బాధ తెలుసుకొని పక్షుల పెంపకం కత్తి మీద సాములాంటిదే. వాటితో ఎంత అభిమానం పెంచుకుంటే అంత దగ్గరవుతాయి. కొన్నాం.. తెచ్చుకున్నాం.. అని కాకుండా, ప్రతి రోజూ వాటితో కొంత సమయం గడిపినప్పుడే ఏం తింటున్నాయి, ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలు తెలుస్తాయి. ముందు రోజు వేసిన ఆహారం తినకపోతే ఏదో అనారోగ్యంతో ఉన్నట్లుగా గుర్తిస్తారు. లేదా కదలికలు రోజులాగా ఉండకపోయినా ఏదో బాధలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ మేరకు వాటికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం వీటికి వ్యాక్సినేషన్ చేయిస్తే ఆరోగ్యంగా ఉంటాయని యజమానులు చెబుతున్నారు. పెరుగుతున్న పక్షుల విక్రయ వ్యాపారం మారుతున్న ప్రజల అభిరుచి వ్యాపార పరంగానూ అభివృద్ధి చెందుతోంది. అక్వేరియంలతో పాటు వివిధ రకాల పక్షులు, కుందేళ్ల విక్రయ దుకాణాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. దుకాణాల్లో పక్షులను ఉంచేందుకు రంగురంగుల పంజరాలు ఉంటున్నాయి. వీటికి అవసరమైన ఆహారాన్ని కూడా యజమానులు దుకాణాల్లోనే విక్రయిస్తున్నారు. పక్షుల పెంపకానికి అవసరమైన సామగ్రిని చెన్నై, కోల్కతా, బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారు. తాబేళ్లలో వివిధ రకాలు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లు, గోల్డ్ రంగు తాబేలు, గ్రీన్ తాబేళ్లు తదితరాలు. వీటిలో గ్రీన్ తాబేలు అమ్మడానికి, పెంచడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా ఇళ్లలో ఈ తాబేళ్లు కనిపిస్తున్నాయి. వీటి ధర రూ. 500 నుంచి రూ.2 వేల వరకు ఉంటోంది. దీపావళి అంటే దడ పక్షులకు దీపావళి వస్తే దడ. టపాసుల శబ్దాలకు బెంబేలెత్తుతాయి. కొన్ని పెంపుడు పక్షులు ఆ శబ్దాలకు హార్ట్ స్ట్రోక్కు గురవుతాయి. దీపావళి సమయంలో వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తప్పవని యజమానులు చెబుతున్నారు. వాటితో గడిపితే సమయమే తెలియదు మనిషికి కష్టం వస్తే మాటల్లో చెప్పుకోగలం. పక్షులు తమ బాధను చెప్పుకోలేవు. మనమే అర్థం చేసుకోవాలి. ఉదయం లేవగానే వాటి వద్దకు వెళ్లడం, వాటి బాగోగులను పరిశీలించడం.. స్నేహంగా మెలగడం నా దినచర్యలో భాగమైంది. కనీసం ఓ గంట వాటితో ఉంటే ఏదో తెలియని ఆనందం నాలో కలుగుతుంది. కొత్త వ్యక్తులు వీటి దగ్గరకు వస్తే పెద్ద శబ్దాలు చేస్తూ అటూఇటూ ఎగురుతుంటాయి. నేను కనిపించగానే ఎంతో ప్రేమతో నా మీద వాలిపోతాయి. మనుషుల్లో మానవత్వం లోపిస్తున్న వేళ ఇలాంటి మూగప్రాణులు ఎంతో ప్రేమను కురిపిస్తాయి. ఎంత డబ్బిస్తే ఈ ఆనందాన్ని కొనగలం. – ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, కృష్ణానగర్, కర్నూలు పావురాల పెంపకం ఎంతో ఇష్టం చిన్నతనం నుంచి పావురలంటే అమితమైన ఇష్టం. మొదట్లో నా వద్ద 10 పావురాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎనిమిది రకాలు, వందకు పైగా పావురాలు ఉన్నాయి. ఇంటికి సమీపంలో ఓ షెడ్ ఏర్పాటు చేసుకొని పెంచుతున్నా. రేసింగ్ హ్యూమర్ పావురం ఖరీదు జత రూ.5వేల వరకు ఉంటోంది. 100, 1000 కిలోమీటర్ల పోటీల్లోనూ నా పావురాలు పాల్గొంటాయి. బెట్టింగ్ కాకుండా పావురాల్లోని సత్తా చాటేందుకు పోటీలకు వెళ్తుంటాం. – షేక్ ఇబ్రహీం, కింగ్మార్కెట్, కర్నూలు ఇంట్లో మనిషిగానే.. మా ఇంట్లో ఐదుగురం ఉంటాం. రెండేళ్ల క్రితం రూ.10వేలతో రెండు పిల్లులను కొనుగోలు చేశాం. వీటిని ముద్దుగా మిన్నూ అని పిలుచుకుంటాం. ఇంట్లో మనిíÙలాగా మారిపోయాయి. బయటకు వెళ్లి నా కొద్దిసేపటికే ఇంటికి చేరుకుంటాయి. వీటి ఖర్చు నెలకు సుమారు రూ.4వేల వరకు ఉంటుంది. వీటి ద్వారా మానసిక ఆనందం లభిస్తోంది. – ఇర్ఫాన్, కొత్తపేట, కర్నూలు ఆదరణ బాగుంది నగరంలో పెంపుడు జంతువులు, పక్షులకు ఆదరణ బాగుంది. ఉన్నతశ్రేణి కుటుంబాల్లో వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. ఇంట్లో బిడ్డల్లా వీటిని ఆదరిస్తుంటారు. పెంపుడు శునకాలతో పాటు పిచ్చుకలు, పలురకాల పక్షులు, కుందేళ్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎక్కువగా ఇళ్లల్లో అక్వేరియం వుండేందుకు ఇష్టపడుతున్నారు. వివిధరకాల చేపపిల్లలు అందుబాటులో వున్నాయి. బళ్లారి, మైసూర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. అభిరుచికి తగ్గట్టు ఖరీదైన పక్షులు, చేపలను పెంచేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యాపారం సంతృప్తి్తకరంగా వుంది. – మహబూబ్, దుకాణ యజమాని, కర్నూలు. -
మైకేల్ లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవే!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజౌరీలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో హిందూ కుటుంబాలుండే చోటుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. మారణకాండకు తెగబడి ఆరుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల ఎరివేత కోసం రెండు వేల మంది సిబ్బందితో భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ. అయితే.. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి అప్రమత్తమై మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు మైకేల్. వాడొక పెంపుడు కుక్క!. స్థానికంగా నివాసం ఉంటున్న నిర్మలా దేవి కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అయితే దాడి జరిగిన రోజు (ఆదివారం).. ముసుగులు తుపాకులతో ఉగ్రవాదుల రాకను దూరం నుంచే గమనించిన మైకేల్.. ఏకధాటిగా మొరుగుతూనే ఉంది. సాధారణంగా కంటే గట్టిగా అది మొరగడం గమనించిన నిర్మలా దేవి మనవరాలు.. ఏం జరిగిందా? అని బయటకు వచ్చి చూసింది. కాలనీ చివరి నుంచి తుపాకులతో ఇద్దరు ఇంటి వైపు వస్తుండడం గమనించింది. వెంటనే విషయాన్ని నిర్మలా దేవికి చెప్పడంతో ఆమె మరో గదిలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకుంది. ఈలోపు ఆ ఇంటి హాలులోకి వచ్చిన ఉగ్రవాదులు.. ఎవరూ కనిపించపోయేసరికి టీవీ, ఫర్నీచర్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుక్క మొరగడం, ఆపై తుపాకుల మోతతో చుట్టుపక్కల వాళ్లు కూడా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు. అంతా అలా అప్రమత్తం కావడానికి కారణం మైకేల్గా భావించి.. దాని మీదకు పలు రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే మైకేల్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. సమయానికి అప్రమత్తమై ప్రాణాలతో తాము ఉండడానికి మైకేల్ కారణమని భావించిన కాలనీవాసులు దానికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక రాజౌరీలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్ర దాడుల్లో(కాల్పుల ఘటన, ఐఈడీ బ్లాస్ట్) ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. తమ ప్రాణాలకు భద్రత కరువైందని హిందువులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. వాళ్లను భద్రతా అధికారులు శాంతింపజేసి పంపించారు. -
Heads Up For Tails: శునకాలకు కిరాణా స్టోర్
మనుషులకు కిరాణా దుకాణాలు ఉన్నాయి. శునకాలకు? పిల్లులకు? ఏవో నాలుగు రకాల తిండి, మెడ పట్టీలు, గొలుసులు... ఇవి అమ్మే పెట్ స్టోర్స్ కాకుండా వాటి ప్రతి అవసరాన్ని పట్టించుకుని వాటికి అవసరమైన టాప్ క్లాస్ వస్తువులను అమ్మే ఓ దుకాణం ఉండాలని భావించింది రాశి నారంగ్. పదేళ్ల నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి నేడు నంబర్ వన్ స్థాయికి చేరింది. ఆమె ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’ దేశవ్యాప్తంగా 75 రిటైల్ స్టోర్స్తో 30 పెట్ స్పాలతో సంవత్సరానికి 140 కోట్ల రూపాయల అమ్మకాలు సాగిస్తోంది. రాశి నారంగ్ పరిచయం. ఢిల్లీకి చెందిన రాశి నేడు దేశంలో అత్యధిక పెట్ స్టోర్లు కలిగిన సంస్థ ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’కు ఫౌండర్. పెంపుడు జంతువుల రంగంలో కోట్ల వ్యాపారానికి వీలుంది అని గ్రహించిన తెలివైన అంట్రప్రెన్యూర్. ‘మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. మా అత్తగారిది కూడా. మా ఇంట్లో చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాళ్లం. అయితే వాటి బాధ్యత మొత్తం కుటుంబం తీసుకునేది. కాని నాకు పెళ్లయిన కొత్తల్లో నాకంటూ ఒక కుక్క కావాలనుకుని ‘సారా’ అనే బుజ్జి కుక్కపిల్లను తెచ్చుకున్నాను. అదంటే చాలా ఇష్టం నాకు. దాని పుట్టినరోజుకు దానికేదైనా మంచి గిఫ్ట్ కొనిద్దామని ఢిల్లీ అంతా తిరిగాను. ఏవో కాలర్స్, గొలుసులు తప్ప దానికి తొడగడానికి మంచి డ్రస్సు గాని, కొత్త రకం ఆట వస్తువు గాని, మంచి ఫుడ్గాని ఏమీ దొరకలేదు. కుక్కలు పడుకునే బెడ్స్ కూడా ఎక్కడా దొరకలేదు. నేను చెబుతున్నది 2008 సంగతి. ఇంటికి ఖాళీ చేతులతో వచ్చి నా సారాను ఒళ్లో కూచోబెట్టుకుని ఆలోచించాక అర్థమైంది... నాలాగే కుక్కలను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. వారు కూడా ఇలాగే ఫీలవుతూ ఉంటారు. నేనే కుక్కలకు అవసరమైన ప్రాడక్ట్స్ ఎందుకు తయారు చేయించి అమ్మకూడదు అనుకున్నాను. అలా నా యాత్ర మొదలైంది’ అంటుంది రాశి. మొదటి స్టోర్ ఢిల్లీలో... అయితే ఆ ఆలోచన వచ్చాక పని మొదలెట్టడం అంత సులువు కాలేదు. రాశి హెచ్.ఆర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఉద్యోగం కూడా చేసింది. ‘అంత చదువు చదివి కుక్కల వస్తువులు అమ్ముతావా’ అని ఫ్రెండ్స్ అన్నారు. ‘ఏదో హాబీలాగా కాలక్షేపం చేస్తుందిలే’ అని భర్త, అత్తమామలు అనుకుని వదిలేశారు. కాని రాశి ఆలోచన వేరుగా ఉంది. కుక్క అంటే ఆమె దృష్టిలో మరో ఫ్యామిలీ మెంబరే. ‘శునకాల పట్ల మన భారతీయుల దృష్టి ఇటీవల మారింది. అంతకుముందు వాటిని ఇంటి బయట కట్టేసి వాచ్ డాగ్లుగా చూసుకునేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటున్నారు. వాటికి క్వాలిటీ ఆహారం వస్తువులు మందులు ఇవ్వడంతో వాటి ఆరోగ్యం, వాటితో ఆనందం పొందాలని అనుకుంటున్నారు. కాని అలాంటి వస్తువులు ప్రత్యేకంగా దొరకడం తక్కువ. నేను రంగంలో దిగాను’ అంటుంది రాశి. కుక్కల ఒంటి తీరు, బొచ్చును బట్టి బట్టలు కుట్టి దుస్తులు తయారు చేయడం రాశి చేసిన మొదటి పని. అవి పడుకునే తీరును బట్టి అందమైన బెడ్స్ తయారు చేయడం. అవి ఆడుకోవడానికి రకరకాల వస్తువులు. వాటి ముఖ్య ఆహారం, అల్పాహారం కోసం రకరకాల క్వాలిటీ పదార్థాలు, అందమైన మెడ పట్టీలు, ప్రమాదకర రసాయనాలు లేని షాంపూలు, డియోడరెంట్లు... ఇవన్నీ ఒకచోట చేర్చి వాటిని షాపులకిచ్చి అమ్మాలనుకుంది. ‘కాని పెట్ స్టోర్లు అమ్మే వ్యాపారులు సగటు వ్యాపారులు. నేను తీసుకెళ్లిన ప్రాడక్ట్లు చూసి ఇలాంటివి అమ్మం. ఇవి ఎవరూ కొనరు అని నన్ను వెనక్కు పంపించేసేవారు. ఇక చూసి చూసి నేనే ఒక షాపు తెరిచాను. అలా ఢిల్లీలో హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్ మొదటి షాపు మొదలైంది’ అంటుంది రాశి. సుదీర్ఘ విరామం తర్వాత... ఢిల్లీలో షాపు నడుస్తుండగానే రాశి భర్తకు సింగపూర్లో ఉద్యోగం వచ్చింది. అతనితో పాటు వెళ్లి అక్కడ 7 ఏళ్లు అక్కడే ఉండిపోయి 2015లో తిరిగి వచ్చింది రాశి. ‘అన్నాళ్లు నేను షాపును అక్కడి నుంచే నడిపాను. విస్తరించడం వీలు కాలేదు. కాని తిరిగి వచ్చాక ఈ ఐదారేళ్లలోనే ఇంత స్థాయికి తీసుకొచ్చాను’ అంటుంది రాశి. ఆమె దార్శనికతను గ్రహించిన సంస్థలు భారీగా ఫండింగ్ చేయడంతో రాశి తన స్టోర్స్ను పెంచుకుంటూ వెళ్లింది. అంతే కాదు కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పిట్టలు... వీటి సంరక్షణకు స్పాలు కూడా మొదలెట్టింది. అన్నీ పెట్ ఫ్రెండ్లీ షాపులు. రాశి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ‘క్యాట్ ఓన్లీ స్టోర్’ కూడా తెరిచింది. అన్ని మెట్రో నగరాల్లో ‘హెడ్స్ ఫర్ టెయిల్స్’ షాపులు ఉన్నాయి. కుక్కలకు కావాల్సిన 100కు పైగా వస్తువులు, జాతిని బట్టి వాడాల్సిన వస్తువులు అమ్మడం ఈమె సక్సెస్కు కారణం. ఒక పనిలో పూర్తిగా శ్రద్ధతో నిమగ్నమైతే రాశిలా ఎవరైనా విజయం సాధించవచ్చు. -
రూ. 10 వేలు కట్టండి.. ఖర్చులు భరించండి
నోయిడా: బహుళ అంతస్తుల భవంతి లిఫ్ట్లో ఆరేళ్ల విద్యార్థిపై పెంపుడు శునకం దాడి ఘటనలో కుక్క యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చిన్నారి చేతికి గాయం కావడంతో చికిత్సకయ్యే ఖర్చంతా భరించాలని, మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆయనను గ్రేటర్ నోయిడా అథారిటీ ఆదేశించింది. గ్రేటర్ నోయిడా(పశ్చిమం)లోని విలాసవంత లా రెసిడెన్షియా సొసైటీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సొసైటీలో ఉండే ఒకావిడ తన కొడుకుతో కలిసి లిఫ్ట్లో వెళ్తుండగా అప్పుడే ఒకతను తన కుక్కతో సహా లిఫ్ట్లోకి వచ్చాడు. వచ్చీరాగానే బాలుడిని కుక్క కరిచేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యంతో ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ‘కుక్కను అదుపుచేయడంలో మీరు విఫలమయ్యారు’ అని అతడికి పంపిన నోటీసులో గ్రేటర్ నోయిడా అథారిటీ ఆరోగ్యవిభాగాధిపతి డాక్టర్ ప్రేమ్చంద్ పేర్కొన్నారు. రూ.10వేలు, చికిత్స ఖర్చు ఏడు రోజుల్లో చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. -
స్మార్ట్ పెట్డ్రైయర్..కుక్క పిల్లలు దర్జాగా కూర్చోవచ్చు!
పిల్లులను, కుక్కలను పెంచుకోవడం చాలామందికి సరదా. అయితే, వాటిని పెంచుకోవడం అంత తేలికైన పని కాదు. వేళకు వాటికి అన్ని సేవలూ చెయ్యాలి. ముఖ్యంగా వాటికి స్నానం చేయించడం పెద్ద ప్రహసనమే! స్నానం చేయించాక, వాటిని తువ్వాలుతో తుడిచేస్తే తేలికగా ఆరిపోవు. ఒంటినిండా రోమాలతో ఉండే పెంపుడు జంతువులను స్నానం తర్వాత పొడిగా తయారు చేయడానికి కొందరు సాధారణ హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. హెయిర్ డ్రైయర్ల నుంచి వెలువడే శబ్దానికి పెంపుడు జంతువులు బెదిరిపోతాయి. ముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు ఎలాంటి సమస్య లేనివిధంగా ఉపయోగపడే స్మార్ట్ పెట్డ్రైయర్ అందుబాటులోకి వచ్చింది. ఘనాకారంలో డబ్బా మాదిరిగా ఉండే ఈ డ్రైయర్లో పిల్లులు, కుక్కపిల్లలు సుఖంగా కూర్చునేందుకు తగిన చోటు ఉంటుంది. ఇందులో అన్ని వైపుల నుంచి వెలువడే వెచ్చని గాలికి అవి ఇట్టే పొడారిపోతాయి. ‘డ్రైబో ప్లస్’ పేరిట దొరుకుతున్న ఈ స్మార్ట్ పెట్డ్రైయర్ ధర సైజును బట్టి 599–749 డాలర్లు (సుమారు రూ.50 వేల నుంచి 62 వేలు) ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. -
ఖరీదైనా పెంచుకుంటున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుక్క, పిల్లి, పక్షి.. పెంపుడు జంతువు ఏదైనా వీటి మీద మనుషులకు ఉన్న ప్రేమ పెట్ కేర్ రంగ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. భారత్లో పెంపుడు జంతువుల సంరక్షణ (పెట్ కేర్) విపణి రూ.8,000 కోట్లుంది. ఇందులో సగం వాటా పెట్ ఫుడ్ కైవసం చేసుకుంది. మిగిలిన వాటా భద్రత, పోషణ, వ్యాయామం, వైద్య సంరక్షణ వంటి సేవలు దక్కించుకున్నాయి. కోవిడ్–19 మహమ్మారి పుణ్యమా అని ఒత్తిడి, నిరాశ నుంచి బయటపడేందుకు పెంపుడు జంతువులను పెంచుకునే ట్రెండ్ అధికం అయింది. ఈ నేపథ్యంలో 2025 నాటికి పరిశ్రమ రూ.10,000 కోట్లను దాటుతుందని అంచనా. దేశవ్యాప్తంగా 3 కోట్ల పైచిలుకు పెంపుడు జంతువులు ఉన్నట్టు సమాచారం. వీటి సంఖ్య ఏటా 11% పెరుగుతోంది. పోటీలో దిగ్గజాలు.. పెట్ ఫుడ్ విభాగం ఏటా 20 శాతం వృద్ధి చెందుతోందని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెబుతోంది. పెట్ కేర్ రంగంలో మార్స్ పెట్కేర్, హిమాలయ వెల్నెస్ కంపెనీలు అగ్ర స్థానంలో ఉన్నాయి. ప్యూరినా పెట్కేర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా నెస్లే ఈ రంగంలోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. క్యానిస్ లుపస్ సర్వీసెస్ ఇండియాలో పెట్టుబడి చేస్తున్నట్టు ఇమామీ ప్రకటించింది. వేగంగా వృద్ధి చెందుతున్న పెట్ కేర్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని మార్స్ పెట్కేర్ ఎండీ సలీల్ మూర్తి తెలిపారు. పెడిగ్రీ, విస్కాస్ వంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న మార్స్ పెట్కేర్ హైదరాబాద్ ప్లాంటు విస్తరణకు రూ.500 కోట్ల పెట్టుబడి చేస్తోంది. కాస్మోస్ ఫిల్మ్స్ జిగ్లీ బ్రాండ్తో ఈ రంగంలో అడుగుపెట్టింది. లక్షలు వెచ్చిస్తున్నారు.. పెంపుడు జంతువుల కొనుగోళ్ల విషయంలో భారత్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. పెట్స్లో కుక్కల వాటా అత్యధికంగా 75 శాతం ఉంది. పిల్లులు 15 శాతం, పక్షులు 10 శాతం వాటా కైవసం చేసుకున్నాయని సమాచారం. షిడ్జూ కుక్క పిల్ల, ఆస్ట్రేలియన్ కాకటియెల్ పక్షులకు డిమాండ్ ఎక్కువ. రంగు రంగుల్లో లభించే పక్షుల అమ్మకాలే అధికం. బ్లూ–గోల్డ్ మకావ్ చిలుకలు రూ.2 లక్షల నుంచి, స్కార్లెట్ మకావ్ రూ.18 లక్షల వరకు లభిస్తాయి. ఒక మీటర్ దాకా పొడవు ఉండే హయసింత్ మకావ్ ఖరీదు రూ.40 లక్షల వరకు ఉంది. సవన్నా పిల్లుల జతకు బెంగళూరులో ఓ కస్టమర్ రూ.50 లక్షలు, మరో కస్టమర్ కొరియన్ మాస్టిఫ్ కుక్కకు రూ.1 కోటి వెచ్చించారని అమ్మూస్ పెట్స్, కెన్నెల్స్ ఫౌండర్ మహమ్మద్ మొయినుద్దీన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘విదేశాల నుంచి పెట్స్ దిగుమతిపై నిషేధం ఉంది. దేశీయంగానే వీటిని పెంచుతున్నారు. కోవిడ్ సమయంలో డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడి వీటి ధరలు రెండింతలయ్యాయి. రంగు, ఆకారం, ఆరోగ్య స్థితినిబట్టి ధర నిర్ణయం అవుతోంది’ అని తెలిపారు. సెలబ్రిటీల్లో క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సినీ నటుడు రామ్చరణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెట్స్ ప్రేమికుల జాబితా పెద్దదే. -
పెట్ ఈజ్ బ్యూటీఫుల్
సాక్షి, అమరావతి: పెంపుడు జంతువుల సౌందర్యం, ఆరోగ్య సంరక్షణలో పెట్ స్పాలు కొత్త ఒరవడి సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు కాస్మోపాలిటిన్ నగరాలకే పరిమితమైన పెట్ గ్రూమింగ్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. విజయవాడ, గుం టూరు, విశాఖపట్నం వంటి నగరాల నుంచి వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు.. ఇంటివద్దకే గ్రూమింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సైజును బట్టి ఫీజు గతంలో ఇష్టంగా పెంచుకునే జంతువులకు ఆరో గ్యం బాగోకపోతే వెటర్నరీ ఆస్పత్రులకు పరుగెత్తే యజమానులు.. ఇప్పుడు అలాంటి సమస్యలు రా కుండా ముందస్తుగా పెట్ గ్రూమింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో పెట్ సైజును బట్టి ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి మాత్రమే అయితే రూ.500 నుంచి రూ.1,900 వరకు, నెలవారీ ప్యా కేజీ రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు రేట్లు నిర్ణయించారు. కేవలం బొచ్చు కత్తిరించేందుకే రూ.600 నుంచి రూ.1,900 తీసుకుంటున్నారు. రూ.4 వేల నుంచి రూ.30 వేల ఖర్చు దేశంలో సగటున యజమానులు ఒక్కో పెంపుడు జంతువుపై (జాతిని బట్టి) నెలకు రూ.4 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. వీటిలో షాంపూలు, కండిషనర్లు, అలంకరణ ఉత్పత్తులపై 50 శాతం ఖర్చు చేస్తుండగా మిగిలినది ఆహారం, దువ్వెనలు, బ్రష్లు, ట్రిమ్మింగ్ పరికరాల కోసం వెచ్చిస్తున్నారు. పెరుగుతున్న జంతు ప్రేమికులు పెరుగుతున్న చిన్న కుటుంబాలు, రెట్టింపు ఆదా యం, జీవనశైలి మార్పులతో ప్రతి ఒక్కరు జంతువుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ప్రథమస్థానంలో శునకాలు ఉండగా తర్వాతి స్థా నంలో పిల్లులున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాలకు మాత్రమే పరిమితమైన పిల్లుల పెంపకం ఇక్కడ చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. ఓ సర్వే ప్రకారం దేశంలో దాదాపు మూడుకోట్ల పెంపుడు కుక్కలున్నాయి. ఏటా ఆరులక్షల కుక్కలను దత్తత తీసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్లో ప్రతి 10 మందిలో ఆరుగురు పెంపుడు జంతువుల యజమానులుగా ఉం టున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతా ల్లోనే 30 వేల పెంపుడు కుక్కలుండటం గమనార్హం. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి పెట్ గ్రూమింగ్ సేవలకు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. మాకు రాష్ట్రవ్యాప్తంగా 12 వరకు పెట్ కేర్ స్టోర్స్ ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, న గరాల్లో పెట్ గ్రూమింగ్ తెలిసిన వారికి మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో గ్రూమింగ్ కోర్సు చేసేందుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. – మృణాళిని, పెట్ కేర్ సెంటర్ యజమాని -
‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ పోతుంది. ఇక పుష్ప చిత్రంతో రాత్రికి రాత్రే పాన్ స్టార్డమ్ తెచ్చుకున్న ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో ఆమెకు నార్త్ నుంచి సౌత్గా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇటీవల తన సినిమా షూటింగ్లో భాగంగా నిర్మాతలను రష్మిక ఇబ్బంది పెట్టిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం! షూటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి రష్మిక పయణించాల్సి ఉండగా తనతో పాటు తన పెంపుడు కుక్క కూడా ప్లైట్ టికెట్స్ బుక్ చేయాలని ఆమె డిమాండ్ చేసిందని పలు వెబ్సైట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కాస్తా రష్మిక కంటపడ్డాయి. దీంతో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ను ట్విట్ర్లో షేర్ చేసి సదరు వార్తలను కొట్టిపారేసింది. ఈ మేరకు రష్మిక ట్వీట్ చేస్తూ.. ‘హే.. ఇలాంటి రూమర్స్ ఎలా సృష్టిస్తారలో అర్థం కాదు. ఆరా(రష్మిక పెంపుడు కుక్క) నాతో కలిసి పయణించాలని మీకు ఉన్న. తనకు మాత్రం నాతో ట్రావెల్ చేయడం అసలు ఇష్టం ఉండదు. తను హైదరాబాద్లోనే హ్యాపీ ఉంటుంది’ అంటూ పడిపడి నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం ఆ తర్వాత మరో ట్వీట్లో ‘క్షమించండి నవ్వు ఆపుకోలేకపోతున్నా’ అంటూ కామెంట్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక రష్మిక ట్వీట్కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇది మాత్రమే కాదు మేడం.. ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయని అన్నాడు. అతడికి కామెంట్స్పై రష్మిక ‘ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే నాకు తెలియజేయండి ప్లీజ్’ అని చెప్పింది. కాగా ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో రణ్బీర్ సరసన ఎనిమల్ మూవీతో పాటు వంశీపైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న వరిసు(వారసుడు) చిత్రాలతో బిజీ ఉంది. -
‘ఉక్రెయిన్ నుంచి రాలేను.. నా ప్రాణం కంటే చిరుత పులుల ప్రాణాలే ముఖ్యం’
Indian Doctor Refuses To Leave Ukraine: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి కారణంగా వేలాదిమంది ఉక్రెయిన్ వాసుల, విదేశీయులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలసల బాట పట్టారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ గంగా సాయంతో ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ పౌరులను, విద్యార్థులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తోంది. ఇప్పటికే చాలా మంది పౌరులను తరలించింది కూడా. ఈ క్రమంలో కొంతమంది బంకర్ల ఉన్నాముంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో విదేశాంగ కార్యాలయం రష్యాతో సంప్రదింపుల జరిపి వారిని తరలించే ప్రయత్నాలు కూడా చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఉక్రెయిన్లోని డాన్బాస్లో చిక్కుకున్నాడు. ఆయన మెడిసిన్ చదవడానికి 15 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. ఆ తర్వాత డాన్బాస్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్గా పనిచేస్తున్నారు. అయితే అతని వద్ద రెండు చిరుత పులులు ఉన్నాయి. అయితే వాటిని వదిలి తాను రాలేనని అంటున్నాడు. తన ప్రాణం కోసం పెంపుడు జంతువులను వదులుకోలేను అని చెబుతున్నాడు. ప్రస్తుతం అతను తన పులులతో కలిసి బంకర్లలో తలదాచుకుంటున్నాడు. వాటి ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నాడు. అంతేకాదు తన పెంపుడు జంతువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నాని డాక్టర్ పాటిల్ చెప్పారు. ఇలాగే గత వారం, భారతీయ విద్యార్థి రిషబ్ కౌశిక్ తన పెంపుడు కుక్కతో వచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతివ్వాలని అభ్యర్థించాడు. దీంతో అతను కేంద్ర ప్రభుత్వ చేపట్టిన ఆపరేషన్ గంగా సాయంతో తన పెంపుడు కుక్కతో సహా భారత్కి సురక్షితంగా తిరిగి వచ్చాడు. (చదవండి: వాషింగ్టన్లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో) -
పెంపుడు జంతువులను తీసుకోచ్చేందుకు కేంద్రం అనుమతి
-
నా కుక్కపిల్ల లేకుండా ఉక్రెయిన్ విడిచి రాను!: భారతీయ విద్యార్థి
Please Help Indian Student Stranded With Pet Dog: యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్లో చిక్కుకున్న ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి తన పెంపుడు కుక్క లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించాడు. తూర్పు ఉక్రెయిన్లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రేడియో ఎలక్ట్రానిక్స్లో చదువుతున్న రిషబ్ కౌశిక్ విమానంలో తనతోపాటు కుక్కపిల్ల కూడా వచ్చేలా అన్ని అర్హత పత్రాలను సంపాదించేందుకు ప్రయత్నించానని చెప్పాడు. మరిన్ని పత్రాల కోసం అధికారులను సంప్రదిస్తే వాళ్లు తనను కొట్టారని చెబుతున్నాడు. పైగా విమాన టికెట్టు అడుగుతున్నారని అన్నాడు. అయినా ఉక్రెయిన్ గగనతలం మూసివేసినపుడు తాను విమాన టిక్కెట్ ఎలా పొందగలను అని ప్రశ్నిస్తున్నాడు. కౌశిక్ ఢిల్లీలోని భారత ప్రభుత్వ యానిమల్ క్వారంటైన్ సర్టిఫికేషన్ సర్వీస్ (ఏక్యూసీఎస్)ని, ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించానని కానీ ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయానని చెప్పాడు. ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ఒకరికి కాల్ చేస్తే వారు తనని దుర్భాషలాడారని చెబుతున్నాడు. గత ఫిబ్రవరిలో ఖార్కివ్లో తనకు 'మాలిబు' అనే రెస్క్యూ కుక్కపిల్ల లభించిందని చెప్పాడు. కౌశిక్ రాజధాని కైవ్లోని ఒక బంకర్లో దాక్కున్నానని బాంబుల మోత, తుపాకుల మోతతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నానని అన్నాడు. "మీకు వీలైతే, దయచేసి మాకు సహాయం చేయండి. కైవ్లోని భారత రాయబార కార్యాలయం కూడా మాకు సహాయం చేయడం లేదు. నాకు ఎవరి నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు " అని అతను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్ వీడియో!) -
పెంపుడు కుక్కకు బర్త్డే పార్టీ... లాకప్లో యజమానులు
అహ్మదాబాద్: ముచ్చట పడి పెంచుకున్న కుక్కకు ఘనంగా పుట్టినరోజు చేయాలనుకున్నారు. బంధుమిత్రులను పిలిచి కేక్ కట్ చేసి హంగామా చేశారు. అదే వారిని చిక్కుల్లో పడేసింది. అహ్మదాబాద్కు చెందిన చిరాగ్ పటేల్, ఉర్విష్ పటేల్లు సోదరులు. క్రిష్ణానగర్ ప్రాంత వాసులు. శుక్రవారం రాత్రి తమ ఫ్లాట్లో అబ్బీ (కుక్క పేరు... ఇండియన్ స్పిట్జ్ జాతికి చెందినది)కి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రాండ్గా పార్టీ ఇచ్చారు. జానపద గాయకుడితో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో అతిథులు హాజరుకావడంతో కోవిడ్–19 ప్రొటోకాల్ను ఉల్లంఘించిన వీరిపై పోలీసులు కన్నెర్ర చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి చిరాగ్, ఉర్విష్లపై కేసు కట్టి అరెస్టు చేశారు. దగ్గరుండి పార్టీ ఏర్పాట్లు చూసిన వీరి మిత్రుడు దివ్వేశ్ మెహారియాను జైల్లో వేశారు. -
హ్యాట్సాఫ్!. కుక్కని భలే రక్షించాడు.. వైరల్ వీడియో
ఒక్కోసారి సంభవించే అనుహ్యమైన ప్రమాదాలు లేదా జంతువులు దాడులు చాలా భయానకంగా ఉంటాయి. పైగా ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు. అచ్చం అలాంటి ఘటనే ఒక కస్టమర్ కుమార్తెకి ఎదురైంది. (చదవండి: పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!) అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని స్టెఫానీ లాంట్జ్ సబర్బన్ లాస్ వెగాస్లో అమెజాన్ డెలివరీ డ్రైవర్ లిడే ప్యాకేజీలను డెలివరీ చేస్తుంటాడు. ఇంతలో ఒక కస్టమర్ కుమార్తె 19 ఏళ్ల లారెన్ రే బయటకు వచ్చింది. అనుకోకుండా అక్కడ ఒక వీధి కుక్క ఆమె వద్దకు వచ్చింది. అయితే ఆమె కూడా ఆ కుక్కని చక్కగా పలకరించింది. అంతా బాగానే ఉంటుంది. ఇంతలో ఆమె పెంపుడు కుక్క బయటకు వచ్చింది. అంతే ఆ వీధి కుక్క ఒక్కసారిగా చాలా క్రూరంగా ఆ కుక్క పై దాడి చేసింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా ఏం చేయాలో పాలుపోదు. అయితే ఏదోరకంగా దాన్ని భయపెట్టడానికి ప్రయత్నించినా కూడా అది ఆగదు. పైగా ఆమె పై కూడా దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న అమెజాన్ డ్రైవర్ వెంటనే స్పందించి ఆ కుక్కను నివారించటమే కాకుండ ఆమె పెంపుడు కుక్క వద్దకు రాకుండా అడ్డుగా నిలబడి ఉంటాడు. ఆ తర్వాత ఆమె తన పెంపుడు కుక్కను తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ కుక్క కూడా కాసేపటికి నిష్క్రమించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
మూగప్రేమకు అమ్మానాన్న.. 50 ఏళ్లకుపైగా సేవలు
‘మానవసేవే మాధవసేవ’గా భావిస్తారు. ఈ దంపతులు మాత్రం అంతకుమించి జంతుసేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నారు. ‘ఆకలి’ అన్ని ప్రాణులకు సమానమే. మనిషికి ఆకలైతే నోరు తెరిచి అర్ధించి కడుపు నింపుకుంటారు. జంతువులు ఆకలైయినా నోరు తెరిచి అడగలేవు. తాము తినేప్పుడు ఎదుటకు వచ్చిన మూగజీవుల ఆకలి బాధను వారు గ్రహించారు. ఆరోజు నుంచి క్రమం తప్పకుండా రెండుపూట్ల వాటి ఆకలి తీర్చడం దినచర్యగా పెట్టుకున్నారు. అన్నం, కూరలు వండి మూగజీవులుండే ప్రాంతాలకు వెళ్లి ప్రేమతో ఆహారాన్ని అందిస్తూ అమ్మానాన్నలయ్యారు. నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్కాలనీలో ఎం.విజయ్కుమార్, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారుండేది మానవ ప్రపంచంలో అయినా మనస్సు మాత్రం జంతు ప్రపంచంతో ముడిపడి ఉంది. విజయ్కుమార్ కేబుల్ ఆపరేటర్. వేకువజాము నుంచి కుక్కలు, కోతులు, పిల్లులు, ఆవులు, పక్షుల ఆకలి తీర్చడంతో ఈ దంపతుల దినచర్య ప్రారంభమవుతోంది. ఆ సమయానికి మూగప్రాణులు వారి కోసం ఎదురు చూస్తుంటాయన్న ఆత్రుత వారిలో కనపడుతుంటుంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నుంచి అయ్యప్పగుడి సెంటర్ వరకు ఉన్న వీధుల్లోని మూగజీవాలకు అతను సుపరిచితుడు. ఉదయాన్నే పాలు, బిస్కెట్లు దగ్గర నుంచి భోజనం వరకు అందిస్తుంటాడు. అనారోగ్యం పాలై ఇబ్బందులు పడే వాటికి వైద్యసేవలు సైతం అందిస్తుంటాడు. తాను తినే ముద్దలో మూగజీవాల ఆకలి తీర్చాలనే సంకల్పాన్ని తండ్రి ఆనందరావు దగ్గర నుంచి విజయ్కుమార్ పుణికి పుచ్చుకున్నాడు. దీనికితోడు భార్య రాజ్యలక్ష్మి సహకారం కూడా తోడవడంతో తన సేవా కార్యక్రమాలు మరింత బలపడ్డాయి. దీంతో సుమారు 50 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. స్వయంగా వెళ్లి.. ఉదయం ఐదు కేజీలు, సాయంత్రం ఐదు కేజీల బియ్యం, కూరలు, అప్పుడప్పుడు మాంసం, చేపలు కూరలు సైతం వండి ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి మూగజీవాలకు పెడుతుంటాడు. వీధుల్లో చాలామంది ఆహార పదార్థాలను పడేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి మూగజీవాలు తినేవిధంగా తయారు చేస్తారు. విజయ్కుమార్ దంపతుల సేవను గుర్తించిన స్నేహితులు, బంధువులు సైతం ఈ విషయంలో తోడుంటారు. వైద్యసేవలు ఆకలి తీర్చడంతో పాటు జబ్బున పడిన మూగ జీవులకు వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ల సహాయం తీసుకునేవాడు విజయ్కుమార్. ఓ రోజు రాత్రి సమయంలో రైలు పట్టాల మధ్యలో ఆవు చిక్కుకున్న విషయాన్ని గుర్తించి పశువైద్యాధికారులను, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆవును ప్రమాదం నుంచి తప్పించిన ఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్తాడు. కరెంట్ షాక్కు గురైన కోతి కాలును బాగు చేయించేందుకు మూడు నెలలకు పైగా వైద్యసేవలు అందించానంటాడు. తాను చేస్తున్న పనులను చూసి ఆ వీధుల్లో వారు పాలు, పెరుగు ఇచ్చేవారు. కరోనా సమయంలో.. కరోనా సమయంలో మూగజీవాలు ఆకలికి అల్లాడాయి. ముఖ్యంగా కరెంటాఫీస్ సెంటర్ కోతులకు కేంద్రం. ఆ సమయంలో విజయ్కుమార్ కష్టపడి అరటి పండ్లను సేకరించి వాటి ఆకలి తీర్చాడు. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు, పిల్లులకు సైతం ఆకలిని తీర్చడం కరోనా సమయంలో కష్టమైంది. అయినా తమ సేవా కార్యక్రమాలను ఆపలేదు. జంతువులపై తనకున్న జాలి, దయ, తన సంపాదనలో అధికంగా వెచ్చించేందుకు ఇష్టపడ్డాడు. ఇటీవల నెల్లూరులో భారీ వర్షాలు, వరదల సమయంలో సైతం మూగజీవాలకు ఆహారం పెట్టే కార్యక్రమాలకు బ్రేక్ వేయలేదు. మొదలైందిలా.. విజయ్కుమార్ తండ్రి ఆనందరావు ఆర్టీసీ ఏడీసీగా పని చేస్తుండేవారు. ఆ రోజుల్లో జంతువులకు బిస్కెట్లు, పాలు అందించేవాడు. తాను వి«ధులకు వెళ్లి వచ్చేప్పుడు విధిగా ఈ పనిని చేయడం తనకు అలవాటు. ఈ పని చిన్నప్పటి నంచి విజయ్కుమార్ చూస్తూ మూగజీవాలపై ప్రేమను పెంచుకున్నాడు. ఉద్యోగం నుంచి తండ్రి విశ్రాంతి పొందిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ ఈ పనిని కొనసాగించారు. తమకున్నంతలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో పాటు అన్నం ఆయా ప్రాంతాల్లోని జంతువులకు పెట్టడం దిన చర్యగా చేసుకున్నారు. ఎంతో ఆనందాన్నిస్తోంది తాను తినే ముద్దలోనే పశుపక్షాదుల ఆకలి గుర్తు చేసుకుంటాం. ఉన్నంతలోనే మా కుటుంబం మూగజీవాల కోసం సహాయం అందించడం తృప్తినిస్తుంది. వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఉదయాన్నే గోవులు, పక్షుల ఇంటి ముందు వాలడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక గంట కేటాయిస్తే మూగజీవాల ఆకలి తీర్చిన వాడినవుతాను. మనుషులకు పెడితే మర్చిపోతారేమో కానీ, మూగజీవాలు మాత్రం తమ ప్రేమను కళ్లల్లోనే చూపే విధానం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలకు ఎటువంటి సేవలు కావాలన్నా 97002 21223 నంబర్కు ఫోన్ చేస్తే నిస్వార్థంగా అందిస్తాను. – విజయ్కుమార్