-
వీడియో: కూటమిలో ఆధిపత్య పోరు.. జనసేన మహిళతో పచ్చ బ్యాచ్ వాగ్వాదం!
సాక్షి, అమరావతి/విజయనగరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్గా, పారదర్శకంగా అందించిన పెన్షన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పెన్షన్ పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇదే సమయంలో కూటమి కార్యకర్తల్లో ఆధిపత్య పోరు కూడా కనిపించింది.కాగా, పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నేతల్లో చిచ్చు రాజేసింది. రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. తోక పార్టీ నాయకులు పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదంటూ జనసేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పెన్షన్ల పంపిణీ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూటమి నేతల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. గత ఐదు సంవత్సరాలు ఎటువంటి రాజకీయ రంగు అంటని పెన్షన్ల కార్యక్రమం.. నేడు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పైచేయు కోసం టీడీపీ మరియు జనసేన నాయకుల ముష్టి ఘాతాలుజనసేన వీర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులు. #AndhraPradesh #YSRCP #YSJagan pic.twitter.com/qiVmB5Nvzy— Jagananna Connects (@JaganannaCNCTS) July 1, 2024 టీడీపీ, జనసేన నాయకులు ఆధిపత్యం రుజువు చేసుకునేందుకు యత్నించడంతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కొన్నివార్డుల్లో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా కూటమి నాయకులు ఒకచోట కూర్చొని పంపిణీ చేపట్టారు. వైఎస్సార్ నగర్లోని కొన్ని వీధుల్లో జనసేన, మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇక్కడ జనసేన నాయకులు పంపిణీ చేస్తున్న పెన్షన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలని, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారిని ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనతో పింఛనుదారులు భయాందోళనలకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంలో జనసేనదే ముఖ్యపాత్రని, తమను అడ్డుకోవడమేంటని కొందరు జనసేన నాయకులు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటిగుమ్మం వద్దకు వచ్చి పెన్షన్లు అందించారని లబ్ధిదారులు గుర్తు చేసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
అన్నమయ్య జిల్లా: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలరోజులు కాకముందే అధికారులపై దాదాగిరి చేస్తున్నారు టీడీపీ పెద్దలు.ఈరోజు(జూలై 1వ తేదీ) పెన్షన్ల పంపిణీలో భాగంగా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ భార్య హరితారెడ్డి.. అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీకి పోలీసుల కాన్వాయ్ కావాలంటూ హుకుం జారీ చేశారు. అంతే కాకుండా ఎస్ఐ రమేష్ ఆలస్యంగా వచ్చాడంటూ చిందులు తొక్కారు. తాను కాన్ఫరెన్స్లో ఉన్నానని ఎస్ఐ రమేష్ చెప్పినప్పటికీ సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చూడండి పోలీసులపై దౌర్జన్యం ఈవిడ గారు మంత్రి లేదా MLA అనుకునేరు .. కాదు కాదు రాయచోటి MLA రాం ప్రసాద్ రెడ్డి గారి భార్య గారు నాడు అధికారుల ఆత్మగౌరవాన్ని జగన్ కాపాడాడు .. నేడు అధికారులని బానిసలుగా చూస్తున్న తెలుగుదేశం కూటమి#SaveAPFromTDP #APNeedsYSJaganAgain pic.twitter.com/CeRyKLhD38— 𝑺𝒂𝒕𝒉𝒊𝒔𝒉(𝒀𝑺𝑱𝒂𝒈𝒂𝒏 𝑲𝒂 𝑷𝒂𝒓𝒊𝒗𝒂𝒓) (@SathishWithYSJ) July 1, 2024 -
ఏపీలో మొదలైన పెన్షన్ కష్టాలు (ఫోటోలు)
-
AP Pension: రూ.500 ఇస్తేనే పెన్షన్ ఇస్తా!
అమరావతి, సాక్షి: ఎండనక, వాననక.. సుదూర ప్రాంతాల్ని సైతం లెక్కచేయక.. ఆఖరికి కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి పని చేసిన వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడాలనే చంద్రబాబు ప్రభుత్వం నిశ్చయించుకుంది. మరోవైపు పెన్షన్ల పంపిణీ మొదలై గంటలు గడవక ముందే.. కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు బయటకు వస్తున్నాయి.పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో రూ.500 మేరకు వసూలు చేశాడు. కొందరు లబ్ధిదారులు ఈ విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆ ఆరోపణలపై నాయక్ను సస్పెండ్ చేశారు. ఇంకోవైపు.. పెన్షన్ ఇస్తున్నట్లు ఫొటో దిగిన సచివాలయ సిబ్బంది, సర్వర్ సమస్యలున్నాయని, సచివాలయం వద్దకు వచ్చి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ సచివాలయం వద్దకే క్యూ కడుతున్నారు. చాలా చోట్ల వర్షంలో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.రాజకీయ జోక్యాలుఏపీ వ్యాప్తంగా ఈ ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే చాలా చోట్ల సచివాలయ సిబ్బంది స్థానంలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది. ఇప్పుడు టీడీపీ నేతల జోక్యంతో ఇది పార్టీ ఈవెంట్గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంబంధిత వార్త: టీడీపీ ఈవెంట్గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!పింఛన్ నగదు చోరీ?వైఎస్సార్: ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో పింఛన్ పంపిణీ కోసం తెచ్చిన నాలుగు లక్షలు చోరీకి గురయ్యాయి. సచివాలయం సిబ్బంది మురళీ మోహన్ ఆ సొమ్మును తీసుకెళ్తుండగా.. కనిపించకుండా పోయింది. తాను డబ్బు తీసుకెళ్తున్న క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ వద్ద బైక్ మీద నుంచి కళ్లు తిరిగి పడిపోయానని, ఆ టైంలో ఎవరో డబ్బు తీసుకెళ్లారని మురళీ మోహన్ అంటున్నారు. అయితే పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కమిషనర్ రఘునాథరెడ్డి, సీఐ వెంకట రమణ ఆరా తీసి.. దర్యాప్తునకు ఆదేశించారు. -
పెన్షన్ల పంపిణీ కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు
-
పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
-
సచివాలయ ఉద్యోగులతో ఇంటికే పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది ఫించన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యో గుల ద్వారా ఇంటివద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు జూలై 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేందుకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం చంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి విలేకరులకు వెల్లడించారు. డీఎస్సీ 2024 ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎస్జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ఇకపై నిరంతర ప్రక్రియగా ఏటా నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)ను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నియామకాల కంటే ముందే టీచర్లకు శిక్షణ డిసెంబర్ 10వతేదీ నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుత విద్యా విధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అధ్యయనం చేసే దిశగా అధికారులు సమాయత్తం కావాలని నిర్దేశించారు.⇒ ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్ట్ 27 ఆఫ్ 2023) రద్దు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ‘సరైన అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారులు అనవసర సమస్యలు సృష్టిస్తారని గుర్తించాం. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి వైరుధ్యం ఉంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. భూ యజమానులు ఒరిజినల్ డాక్యుమెంట్ను పొందే అవకాశాన్ని కల్పిస్తాం’ అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ⇒ సామాజిక పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ బకాయిలతో కలిపి మొత్తంగా రూ.7 వేలను జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ రూ. 3 వేల నుంచి రూ.6 వేలకు, పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్ రూ.15 వేలకు, కిడ్నీ, లివర్, బైలేట్రల్ ఎలిఫెంటాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరగనుంది. డయాలసిస్, సికిల్సెల్ ఎనీమియా, థలసేమియా, హెచ్ఐవీ తదితర బాధితులకు పెన్షన్ పంపిణీ డీబీటీ ద్వారా చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుంది. పెన్షన్ పెంపు నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 65.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.⇒ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్ 2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 4.4 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. డిమాండ్, సప్లై, అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్ గ్యాప్ను అంచనా వేయడం, అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో నైపుణ్య సర్వేను 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ⇒ రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించింది. ⇒ విజయవాడలోని డా.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా తిరిగి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈమేరకు నిర్ణయం తీసుకుంది.⇒ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్వ అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి రాజీనామాలను ఆమోదించింది.⇒ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఆరోగ్య పరిరక్షణ ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని, చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించేలా కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని పేర్కొన్నారు. రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీకి ఆదేశాలిచ్చారు. మత్తు, మాదక ద్రవ్యాల నుంచి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. విద్య, ఆరోగ్యం, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.7 శ్వేత పత్రాలుగత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం (ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్, ఎక్సైజ్, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి వీటిని విడుదల చేయనున్నారు. -
బ్యాంకుల నిండా పింఛనుదారులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం పలుచోట్ల పింఛను డబ్బులు తీసుకునేందుకు వచ్చిన అవ్వాతాతలతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,838 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1,939.35 కోట్లు విడుదల విషయం చేసిన విషయం తెలిసిందే. మొత్తంలో లబ్ధిదారుల్లో 47,74,733 మందికి ప్రభుత్వం డీబీటీ రూపంలో శనివారం ఉదయమే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. డబ్బు బ్యాంకుల్లో జమ అయినట్లు శనివారం సాయంత్రానికి 44,54,243 (93.29 శాతం) లక్షల మంది మొబైల్ నంబర్లకు సమాచారం కూడా చేరినట్టు అధికారులు తెలిపారు. శనివారమే 14.33 లక్షల మందికి ఇంటివద్దే అందిన పింఛను డీబీటీ రూపంలో బ్యాంకులో జమచేసినవారు పోను మిగిలిన 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై ఉండే 17,56,105 మంది లబ్ధిదారులకు ఒకటోతేదీ నుంచి ఐదోతేదీ మధ్య గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా వారి ఇంటివద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరిలో 14,33,709 మందికి శనివారమే వారి ఇళ్లవద్ద పింఛను డబ్బు పంపిణీ చేశారు. ఇంటివద్ద పింఛన్ల పంపిణీ 81.64 శాతం పూర్తయిందని, మిగిలిన వారికోసం మరో నాలుగు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
-
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
-
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. -
పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..
-
పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..
-
పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..
-
అవ్వా తాతలపై పచ్చ పగ
-
ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
-
దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ
-
కాసేపట్లో ఏపీలో పెన్షన్ల పంపిణీ
-
పడిగాపులు.. చంద్రబాబుపై పెన్షన్దారుల ఆగ్రహం
Live Updates.. చంద్రబాబు కుట్రతో పెన్షన్దారులకు అష్టకష్టాలు ►పచ్చబ్యాచ్ ఫిర్యాదుతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరం ►సచివాలయాలకు మంచాల్లో వృద్ధులు, వికలాంగులు ►పెన్షన్ పంపిణీ సజావుగా సాగకుండా పచ్చ కుట్రలు ►ఐదేళ్ల నుంచి ఇంటి వద్దే పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు ►చంద్రబాబు కుట్రలకు ఓటుతోనే జావాబిస్తామంటున్న ప్రజలు కాకినాడ: జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ సచివాయాలకు వచ్చి పింఛన్లు అందుకుంటున్న పెన్షన్ దారులు జిల్లా వ్యాప్తంగా 2,83,544 మంది పింఛన్ దారులకు రూ.84.02 కోట్లు మూడు రోజుల పాటు పంపిణీ ► ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం.. ►ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది. ►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ►ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు. ►తప్పనిసరిగా ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలు మినహా మిగిలిన కేటగిరీ పింఛనుదారులందరికీ ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీ చేపడతారు. ►ఒక గ్రామ సచివాలయం పరిధిలో వివిధ గ్రామాలు ఉన్నచోట్ల ప్రత్యేక సిబ్బందిని నియమించి పంపిణీ చేస్తారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ►వేగంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో పంపిణీకి సరిపడినంత మందిని ఇందుకోసం కేటాయించుకోవాలని సూచించారు. ►సచివాలయాల వద్దకు వచ్చే పింఛనుదారులకు ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ సమాచారాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ► పింఛన్ల పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ► సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 6వతేదీ కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ►ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలకు ఇంటి వద్దే పంపిణీ సందర్భంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి. ►పింఛన్ల పంపిణీని సచివాలయాల వద్ద లబ్దిదారుల ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలి. ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిïÙయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలి. ►ఫింఛన్లు పంపిణీ చేసే సమయంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. తప్పనిసరిగా ఎన్నికల కోడ్ను పాటించాలి. ►సచివాలయాల సిబ్బంది అందరికీ కొత్తగా íపింఛన్ల పంపిణీకి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ లాగిన్లు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. -
పెన్షన్ల పంపిణీపై నీచ రాజకీయం
-
పెన్షన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు
-
చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి: సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ‘‘2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు’’ అని ఎక్స్ వేదికగా సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అదే ఎక్స్ లో మరో ట్వీట్ చేసిన జగన్.. ‘‘లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఏపీలో పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు ఇవే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్3 నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 6 వరకు (మొత్తం నాలుగు రోజులు) పెన్షన్లను పంపిణీ జరగనుంది. అయితే సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం విధివిధానాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేయనున్న సచివాలయాలు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది. -
పెన్షన్ల పంపిణీ బ్యాక్ ఫైర్.. సరిదిద్దుకోలేక టీడీపీ తిప్పలు
కొండవీటి దొంగలో చిరంజీవిని ఎలాగైనా పట్టుకుంటానని. ఆయన్ను నిలువరిస్తానని ప్రతినబూనిన పోలీస్ ఆఫీసర్ విజయశాంతి ఆయన్ను వెంబడిస్తుంది. చిరంజీవిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరదు.. చివరకు ఆమె పెద్ద బురదగుంటలో పడిపోతుంది.. దీంతో చిరంజీవి వచ్చి నన్ను ఉచ్చులో దించుతామని నువ్వు రొచ్చులో పడ్డావేంటి అంటాడు. అచ్చం ఇపుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఐంది. రేసు గుర్రంలా దూసుకెళ్తున్న జగన్ను నిలువరించేందుకు వేసిన వలంటీర్ల ఉచ్చు తిరిగి చంద్రబాబు మెడకు చుట్టుకుంది. దాన్నిప్పుడు తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లుంది టీడీపీ పరిస్థితి. వాస్తవానికి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తులో సీట్లు ప్రకటించిన దగ్గర్నుంచి వారి పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎటునుంచి చూస్తున్నా ఎక్కడోచోట ఇబ్బంది కనిపిస్తూనే ఉంది. దానికితోడు టీడీపీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేని చోట్ల తమ వాళ్ళను జనసేనలోకి పంపించి అక్కడ గ్లాసు గుర్తు మీద పోటీ చేయిస్తున్నారు. అవనిగడ్డలో బుద్ధప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ అలా టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్ళే.. ఇదిలా ఉండగానే తమ కూటమిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ వేసిన తప్పటడుగు ఇప్పుడు వాళ్ళను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. చిన్న గాయాన్ని గోక్కుని... గెలుక్కుని పెద్ద పుండుగా మార్చినట్లు ఐంది. ఇన్నేళ్ళుగా వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. ఐతే అది ఆపాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులమేరకు వాలనీర్లను పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం దూరం పెట్టింది. అది సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారని, అది తమకు లాభిస్తుందని టీడీపీ క్యాంప్ భావించింది. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ అదే అంశం మీద ప్రజల్లోకి వెళ్ళింది. ఫస్ట్ తేదీ వచ్చినా పెన్షన్లు ఇవ్వలేకపోవడానికి టీడీపీ కారణం... చంద్రబాబే వాలంటీర్లను అడ్డుకున్నారు. లేకుంటే ఈపాటికి అవ్వాతాతలకు పెన్షన్లు అందేవి అంటూ వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాతోబాటు ఆ పార్టీ నాయకులూ ప్రచారం మొదలు పెట్టి.. ఈ అంశాన్ని ప్రజలకు వివరించారు. ఇంకేముంది... ప్రజలు.. దాదాపు 67 లక్షలమంది వృద్ధులు.. వికలాంగులు తిట్లు అందుకున్నారు. మా నోటికాడి కూడు ఆపేసారు... లేకుంటే ఈపాటికి మాకు పెన్షన్లు అందేవి.. చంద్రబాబు పెద్ద కుట్రదారు అంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ ఎండల్లో వృద్ధులం ఎక్కడికి వెళ్తాం.. మా వాలంటీర్ ఉంటే మాకు చక్కగా పెన్షన్లు అందేవి.. ఈ చంద్రబాబు మాకు పెన్షన్లు ఆపేసాడు.. ఎన్నికల్లో అయన సంగతి చూస్తాం అంటున్నారు. రోజూ ఇంట్లోని రొట్టెముక్కల్ని తినేస్తున్న ఎలకను పట్టుకునేందుకు పిల్లి ఒక ఉచ్చు తయారు చేసింది... అది ఎలక మెడకు వేయబోతే తిరిగి తన మెడకే చుట్టుకోవడంతో దాన్ని తీసుకోలేక పిల్లి గిలగిలా కొట్టుకుంది... అచ్చం ఇలాగే ఇంటింటికి వలంటీర్ల ద్వారా సేవలు అందిస్తూ తన ఓట్లను సునాయాసంగా ఎత్తుకుపోతున్న సీఎం వైయస్ జగన్ను అదుపు చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు... వలంటీర్ల కాళ్లకు కర్ర అడ్డం బెట్టి వాళ్ళను పడగొట్టి తాను రేసులో ముందుకు పోదాం అనుకున్నారు... అయితే చంద్రబాబు ఆ కర్రను తన కాళ్ళమధ్య పెట్టుకుని తానే బోర్లా పడినట్లు ఐంది.. దీంతో ఇప్పుడు లేవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇది కాస్తా టీడీపీకి డ్యామేజ్గా మారింది. దీంతో ఇప్పుడు బాబు, టీడీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. సచివాలయంలో లక్ష ముప్ఫైవేలమంది ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్లతో పెన్షన్లు ఇప్పించండి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అసలు జగనొచ్చాక ఉద్యోగాలే ఇవ్వలేదని చెబుతూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు సచివాలయంలోని లక్షా ముప్పైవేల ఉద్యోగులు ఉన్నారుగా వాళ్లతో పెన్షన్లు ఇవ్వండి అని సలహా ఇచ్చేసారు. మొత్తానికి కూటమి కూర్చిన తరువాత పార్టీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు ఏదేదో చేసి ప్రభుత్వాన్ని గందరగోళపరుద్దామని భావించి తానే ఉచ్చులో చిక్కుకున్నట్లు అయింది. ఇప్పుడు మెడకు చుట్టుకున్న తాడును తప్పించుకునేందుకు చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ అంశంలో పవన్ కల్యాణ్... బీజేపీలు సైలెంట్ గా ఉన్నాయ్... చంద్రబాబు చేసిన పెంటను తామెందుకు నెత్తికి రుద్దుకోవాలి అనుకున్నాయో ఏమో మరి ఆ పార్టీలు... దాని నేతలు మాత్రం ఈ అంశాన్ని విననట్లే ఊరుకున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
వలంటీర్లంటేనే వణికిపోతున్న పెత్తందారులు
పోగాలము దాపురించినప్పుడు ఇలాగే చేస్తుంటారు. రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి.తెలుగుదేశం పరిస్థితి అలాగే తయారైంది. ఏపీలో వలంటీర్ల సేవలకు బ్రేక్ పడేలా తాము చేసిన కుట్ర ఫలించాయని తెలుగుదేశం పార్టీ నేతలు లోలోపల సంతోషించవచ్చేమో కాని, అదే వారికి రాజకీయంగా ఉరితాడు కాబోతోంది.వచ్చే రెండు నెలలు వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్ పంపిణీ చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.ఇది ఏపీ ప్రజలకు శరాఘాతం వంటిదే. తెలుగుదేశం పార్టీ వలంటీర్ల వ్యవస్థపై నిత్యం విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. టీడీపీకి ఏజెంట్ గా మారిన మాజీ ఐఎఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రయోగించి ఈ మేరకు ఉత్తర్వులు తెప్పించారు. రమేష్ వలంటీర్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడమే కాకుండా, ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈనాడు రామోజీరావు ఎన్నోసార్లు వలంటీర్ల వ్యవస్థపై విద్వేషం కక్కుతూ వార్తలు రాయించారు. ✍️టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు వలంటీర్లను పలుమార్లు అవమానించారు. వారిని మూటలు మోసే ఉద్యోగం చేసేవాళ్లని, ఆడవాళ్లను ఇబ్బందిపెట్టేవారని ఇలా పిచ్చి ఆరోపణలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లను కిడ్పాపర్లుగా అబివర్ణించారు. ఏపీ ప్రజల పట్ల ఏ మాత్రం మానవత్వం లేనివారు, ప్రజల సంక్షేమం కోరుకోనివారు ,దుర్గార్గులు మాత్రమే ఇలాంటి ఉత్తర్వుల కోసం ప్రయత్నిస్తారు. నిమ్మగడ్డ రమేష్ అలాంటి విలన్ పాత్రను పోషించారని చెప్పాలి. కాకపోతే సినిమాలో విలన్ అంతిమంగా ఓడిపోయినట్లే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా మూల్యాన్ని చెల్లించుకోబోతోంది. రమేష్ కుమార్ ఆ పార్టీకి మేలు చేయాలనుకుని ఉండవచ్చుకాని జరగబోయేది కీడే అన్న సంగతి ఇప్పుడు బోదపడుతుంంది. ఈ విషయంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావడంతో వారిద్దరూ మాట మార్చి వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని ప్రకటించారు. చంద్రబాబు అయితే ఏకంగా ఏభైవేల రూపాయల వరకు వారికి ఆదాయం వచ్చేలా చేస్తానని అబద్దపు హామీని కూడా ఇచ్చేశారు. ఇళ్త వద్దకే పెన్షన్ ఇవ్వాలని అంటున్నారు. ✍️మరో వైపు ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తమ వర్గం మీడియాను, ఇంకో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి ప్రజా వ్యతిరేకులను ఉపయోగించి వలంటీర్ల వ్యవస్థపై కేసులు వేయించారు.నీచమైన కధనాలు రాయించారు. దీనికి తోడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయడం ఆరంభించారు. అందుకు ప్రాతిపదికగా 2019 లో మొదటి దశలోనే ఎన్నికలు అంటే ఏప్రిల్ పదకుండు కల్లా ఎన్నికలు ముగియగా,ఈసారి అలాకాకుండా ఎన్నికలను నాలుగోదశకు మార్పించడంలో చంద్రబాబు బృందం సఫలం అయింది. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిలో గొడవలను సర్దుబాటు చేసుకోవడం కోసమే ఈ ఏర్పాటు అన్న అభిప్రాయం ఏర్పడింది.అలాగే ఐటి,సీబీఐ వంటి అదికారులు రంగప్రవేశం చేసి తమ వద్ద ఉండే నల్లధనం పట్టుబడకుండా జాగ్రత్తలు పడ్డారనుకోవాలి. అవి చాలవన్నట్లు ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థపై కాటు వేశారు.ఈ మూడు నెలలు వలంటీర్ల సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడంలో కృతకృత్యులయ్యారు. ✍️కాని దీనివల్ల వారికి ఈ ఆదేశమే యమపాశంగా మారబోతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయవద్దని చెప్పడం వల్ల సకాలంలో వృద్దులకు పెన్షన్ అందే అవకాశం ఉండదు.దీనిపై ప్రజలలో నిరసన వస్తుంది.ఇప్పటికే ఆ నిరసనలను టీడీపీ చవిచూస్తోంది. ఇదంతా తెలుగుదేశం నిర్వాకమని తెలుసుకోవడం కష్టం కాదు. అప్పుడు బలహీనవర్గాల ప్రజలంతా, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న స్కీముల లబ్దిదారులంతా తెలుగుదేశంపై మరింత ఆగ్రహం చెందుతారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించినా, హైకోర్టు అబిప్రాయపడినా ఇప్పటికిప్పుడు రెండున్నర లక్షలమందికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం సాధ్యం కాని పని. గ్రామ,వార్డు సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని అన్నప్పటికీ, వృద్దులంతా ఇబ్బంది పడతారు.దీనికి కారణం ఏమిటని వారు తెలుసుకుని టీడీపీని మరింత అసహ్యించుకుంటారు. వారు పట్టుబట్టి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడే ఆపివేసిన వలంటీర్ల వ్యవస్థను టిడిపి కూటమి అధికారంలోకి వస్తే పూర్తిగా ఎత్తివేస్తారని జనం భావిస్తారు. ✍️అది టీడీపీకి మరింత శరాఘాతం అవుతుంది.అయితే ఈ ఆదేశాలతో తమకు సంబంధం లేదని టీడీపీ చెప్పడానికి యత్నిస్తోంది. అందులో వాస్తవం ఎంతో కొంత ఉందని అనుకోవాలంటే,చంద్రబాబు వెంటనే ఎన్నికల సంఘానికి వలంటీర్ల సేవలను యధావిధిగా కొనసాగించాలని లేఖ రాయాలి. అలా చేస్తారా?చేయరు.పైగా డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్లు తమ వద్ద ఉన్న సిమ్ కార్డులు,టాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అందచేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది.దీంతో ఒకరకంగా వలంటీర్లకు స్వేచ్చ లబించవచ్చు.వారు తమ ఇష్టం వచ్చినట్లు ఎన్నికలలో పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారిని లబ్దిదారులంతా ఎందుకు పెన్షన్ రాలేదని అడిగితే ఎటూ టిడిపినే కారణమని చెబుతారు.దానివల్ల ఎవరికి నష్టం జరిగేది ఊహించుకోవచ్చు. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే స్కీమ్ ఒకదానిని కేంద్రం అమలులోకి తెచ్చింది. ✍️అప్పటికే ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని కేంద్రం నుంచి అధికంగా గ్యాస్ సిలిండర్లు వచ్చేలా చేసుకున్నారు.అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత కొణిజేటి రోశయ్య ఎన్నికల సంఘానికి దీనిపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు కాని, చంద్రబాబు ,టీడీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.పేదలకు గ్యాస్ కనెకక్షన్లు ,సిలిండర్లు ఇస్తుంటే కాంగ్రెస్ వారు అడ్డుకుంటున్నారని ఆరోపించేవారు. దానిపై కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వడానికి ఇబ్బంది పడేవారు. ఎన్నికల సందర్భంలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శించేది. కాని దానిని చంద్రబాబు తనకు అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. ఆ అంశంతో పోల్చితే వలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం చేసిన నిర్వాకం చాలా పెద్దది. దారుణమైనది. ✍️అప్పుడు గ్యాస్ సిలిండర్ల స్కీమ్ వల్ల కొన్నివేల మంది మాత్రమే ప్రయోజనం పొందేవారు. కాని ఇప్పుడు వలంటీర్ల వల్ల కోట్లాది మంది ప్రజలు సేవలు పొందుతున్నారు. అలాంటి సేవలపై కక్షకట్టి ఆపేశారన్న విమర్శ సహజంగానే టీడీపీ, చంద్రబాబులపై వస్తుంది. దీనిపై ఆత్మరక్షణలో పడే చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వడానికి సతమతం అవుతున్నారు. ఈలోగా అధికార వైఎస్సార్సీపీ ఈ పాయింట్ పై విరుచుకుపడింది. వృద్దులు, బలహీనవర్గాలంటే టిడిపికి గిట్టదని, చంద్రబాబు పెత్తందార్ల ప్రతినిది అని ,అందుకే పేదల పొట్టగొట్టే పని చేశారని ఆరోపించారు. ఏతావాతా టీడీపీకి ముందు నుయ్యి,వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తమకు సంబంధం లేదని అబద్దం చెప్పడానికి యత్నిస్తారు.కాని పలుమార్లు ఆయనతో సమావేశాలు పెట్టించి ప్రభుత్వంపై విమర్శలు చేయించడం, గతంలో ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు టీడీపీ మద్దతు ఇవ్వడం వంటి ఘట్టాలు జ్ఞప్తికి వస్తాయి. ✍️నిజానికి వలంటీర్ల వల్ల కేవలం పెన్షన్ లే కాదు..అనేక రకాల ఇతర సేవలు కూడా అందుతున్నాయి. అర్హులైన ప్రజలకు ఏదైనా స్కీము వర్తింప చేయదలిస్తే వలంటీర్ కు చెప్పేవారు. వలంటీర్లు వారినుంచి దరఖాస్తు తీసుకుని గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా తగు ఉత్తర్వులు పొంది,వాటిని లబ్దిదారులకు అందచేస్తుంటారు. ఎవరికి పుట్టిన తేదీ సర్టిఫికెట్, కులం ,ఆదాయం తదితర సర్టిఫికెట్లు అవసరమైనవారికి ఇళ్ల వద్దకే తెచ్చి ఇస్తుంటారు.ఇప్పుడు వాటన్నిటికి బ్రేక్ పడుతుంది.ఇప్పుడే ఆపేసి ప్రజలందరిని ఇబ్బందులకు గురి చేసినవారు ,ఎన్నికల తర్వాత ఏమి చేస్తారో అన్న సందేహం వస్తుంది. ఇవన్ని టీడీపీకి నష్టం చేసే అంశాలే అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శాసనసభ ఎన్నికల తరుణంలో తెలుగుదేశం పార్టీ తనకు తానే ఉరితాడు పేనుకుని మరీ తన మేడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకోబోతోందన్న భావన కలుగుతుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు