-
ఓయూలో రాహుల్గాంధీ దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకోవడం వల్లే తెలంగాణలో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోరాడేందుకు సమస్యలు లేకనే రాహుల్ గాంధీ రాకను రాజకీయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. -
మేధావులు, క్యారెక్టర్ ఉన్న వారినే పిలుస్తారు
హనుమకొండ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పబ్ల గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. మంగళవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ నేపాల్లోని కఠ్మాండులో పబ్లకు వెళతారు.. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చెబుతారని అనుకుంటున్నారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఎర్రబెల్లి పైవిధంగా బదులిచ్చారు. ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలా.. వద్దా.. అనేది ఆ యూనివర్సిటీ చూసుకుంటుందన్నారు. ప్రభుత్వానికి అనుమతితో సంబంధం లేదని స్పష్టంచేశారు. ‘ఓయూకు వచ్చి పబ్ల గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారనే భావన కూడా అనుమతి ఇవ్వకపోవడానికి ఒక కారణం కావొచ్చు. ఎవరు వస్తే విద్యార్థులు బాగుపడతారు.. ఎవరు వస్తే విద్యార్థులు చెడిపోతారు.. అనే అంశాలపై ఓయూ యాజమాన్యం ఆలోచించి ఆహ్వానిస్తుంది. మేధావులు, క్యారెక్టర్ ఉన్న వారినే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పిలుస్తారు’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. -
Rahul Gandhi OU Visit: ఓయూలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ(మంగళవారం) ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓయూ సందర్శనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ నాయకులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్యూఐ నేతలు కొందరు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడంతో.. కౌంటర్గా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈపర్యటనలో భాగంగా.. ఈ నెల 7న హైదరాబాద్, తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థులతో ఆయన ముఖాముఖి చేపట్టాలనుకున్నారు. అయితే ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అందుకు అనుమతులు నిరాకరించింది. మరోవైపు అక్కడ విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓయూలోకి రాహుల్ గాంధీని అడుగుపెట్టనివ్వబోమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కూడా పోటీగా ఆందోళనలకు దిగుతోంది. ఇక హైకోర్టు సైతం రాహుల్ సభ నిర్వాహణ నిర్ణయాన్ని దాదాపుగా ఓయూకే వదిలేసింది. సంబంధిత వార్త: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు -
ఓయూ రగడ.. ఆగని అరెస్టులు
సాక్షి, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్శిటీ/ చంచల్గూడ: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటన వివాదం రోజురోజుకు పెద్దదవుతోంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన సభ విషయమై విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో పాటు మరో 17 మంది నేతల విషయంలో ఏం చేయాలనే అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర నేతలు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా పలువురు నేతలు చంచల్గూడ జైల్లో ఉన్న వెంకట్ తదితరులను పరామర్శించారు. ఓయూలో విద్యార్థుల అరెస్టు బల్మూరి వెంకట్ తదితరుల అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తం గా నిరసన తెలియజేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమ వారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వీసీ రవీందర్, సీఎం కేసీఆర్లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగాని దయాకర్గౌడ్, నవ తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు బైరు నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. ఓయూ పాలక మండలి చేసిన నిబంధనలు కేవలం కాంగ్రెస్ పార్టీకేనా? టీఆర్ఎస్, బీజేపీలకు వర్తించవా? అని ప్రశ్నించారు. ఓయూలో 7న రాహుల్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్, అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు స్పష్టం చేశారు. కాగా ఓయూలో రాహుల్గాంధీ పర్యటనకు ఎలాంటి అనుమతి లేదని వీసీ సోమవారం మరోమారు తేల్చి చెప్పారు. క్యాంపస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు భారీగా మోహరించారు. రాహుల్ ఓయూ వెళతారు: రేవంత్రెడ్డి సోమవారం ఉదయం సీఎల్పీలో సమావేశమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్లు బల్మూరి వెంకట్ తదితరుల అరెస్టుపై చర్చించారు. తర్వాత పార్టీ నేతలు అంజన్కుమార్ యాదవ్, గీతారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జీ.వినోద్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, ఫిరోజ్ఖాన్లతో కలిసి చంచల్గూడ జైలుకు వెళ్లి వెంకట్ తదితరులతో ములాఖత్ అయ్యారు. ఈనెల 7వ తేదీని ములాఖత్ కోసం రాహుల్ గాంధీ వస్తారని, సమయం ఇవ్వాలని కోరుతూ జైలు సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ రాహుల్గాంధీ ఓయూకు ఖచ్చితంగా వెళ్తారని చెప్పారు. అలాగే విద్యార్థి నేతలతో ములాఖత్ కోసం జైలుకు కూడా వస్తారని తెలిపారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సీటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వర్సిటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో మమేకం కావాలని నిర్ణయిం చుకున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారం సేకరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని భావిం చినట్లు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ఒత్తిడితోనే ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రాహుల్ను ఓయూకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లేందుకు భయపడుతున్న కేసీఆర్ కుట్రపూరి తంగానే రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుం టున్నారని విమర్శించారు. -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. ఫైనల్ మ్యాచ్లోని తొలి సింగిల్స్లో సామ సాత్విక 6–2, 6–2తో సాచి శర్మను ఓడించి ఓయూకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–0తో రెనీ సింగ్పై గెలిచి ఓయూ విజయాన్ని ఖాయం చేసింది. రష్మిక, సాత్వికలతోపాటు అవిష్క గుప్తా, పావని పాథక్లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఓయూ జట్టుకు సి.నాగరాజ్ కోచ్గా, సయ్యద్ ఫారూఖ్ కమాల్ మేనేజర్గా వ్యవహరించారు. చదవండి: Uber Cup 2022: ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అరెస్ట్కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా.. అక్కడ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. గేట్లు ఎక్కి ఓయూ ఆడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన నాయకులు వీసీ వైఖరికి నిరసనగా గాజులు, చీరలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓయూ ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ నాయకులను అరెస్ట్ చేశారు. దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహూల్ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కష్టం అంత ఆవిరి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియాలో చదివిన వారు చాలా మంది ఎమ్యెల్యేలు అయ్యారని, ఒక్కరు కూడా కేసీఆర్ను యూనివర్సిటీకి ఎందుకు తీసుకుపోలేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్తామని, ఈ అంశంపై సోమవారం 3 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ వరకు వెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ‘వీసి గారు ఇది ముగింపు కాదు. సందర్శన మాత్రమే. ఓ ఎంపీగా చూడటానికి వస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విశిష్టతను తెలుసుకునేందుకు వస్తే అడ్డుకునేందుకు ఎవరు మీరు? ఉమ్మడి రాష్ట్రంలో లేని జీఓలు ఎలా తీస్తారు. కృతజ్ఞత లేని రాష్ట్రంగా తెలంగాణ ఎందుకు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురి కావాలా. రాహుల్తో ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ప్రజా ప్రతినిధులం ఉస్మానియాలో సందర్శిస్తాం. ఈ నెల 7న ఎట్టిపరిస్థితిలో రాహుల్ గాంధీని ఉస్మానియాకు తీసుకెళ్దాం.’ అని జగ్గారెడ్డి తెలిపారు. చదవండి: రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా! -
ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఏమేర పెంచాలనే దిశగా అధికారులు చర్చించారు. ప్రతి మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుపై తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఎఫ్ఆర్సీ) సమీక్షిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి, కాలేజీల ప్రతిపాదనలు స్వీకరించింది. గడచిన మూడేళ్లలో మౌలిక వసతులు, కంప్యూటర్ కోర్సుల వల్ల నిర్వహణ వ్యయం పెరిగిందని ప్రైవేటు కాలేజీలు ఆడిట్ రిపోర్టులు సమరి్పంచాయి. అయితే, కాలేజీలు సూచించిన స్థాయిలో ఫీజుల పెంపు సరికాదన్న వాదన ప్రభుత్వ వర్గాల నుంచి విని్పస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజులపై సలహాలు ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశమై ప్రాథమిక అంశాలను చర్చించింది. త్వరలో అన్ని విషయాలపైనా సమగ్రంగా చర్చించాలని నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. -
కష్టపడితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు
సాక్షి, హైదరాబాద్: పరీక్షల కోసం కాకుండా, పరిశోధనాత్మకంగా అభ్యాసన చేస్తే గ్రూప్స్లోనే కాదు సివిల్స్లోనూ రాణిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ అభిప్రాయపడ్డారు. కోచింగ్ సెంటర్స్కు వెళ్తేనే పోటీ పరీక్షలో విజయం సాధిస్తామనేది భ్రమని చెప్పారు. గ్రూప్స్లో ఇంటర్వ్యూ తొలగించినందున పరిజ్ఞానం ఉన్నవాడికి పారదర్శకంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశంపై రవీందర్ ‘సాక్షి’తో పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే... లక్ష్య సాధన దిశగా విద్యార్థుల పాత్రేంటి? ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. చాలామంది విద్యార్థుల్లో అంతర్లీనంగా సామర్థ్యాలున్నాయి. దృష్టి పెడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా ఉంది. కానీ వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలకే ప్రాధాన్య మిస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రూప్స్ పోటీకి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోలేకపోతున్నారు. దీన్ని గమనిం చిన తర్వాత ఓయూలో సివిల్స్ అకాడమీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీని కోసం రూ.37 లక్షలు ఖర్చు పెట్టాం. కోచింగ్ కేంద్రాలతో ఫలితం ఎలా ఉంటుంది? లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కేంద్రాల బాట పడుతున్నారు. అక్కడికి వెళ్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తామని భ్రమ పడుతున్నారు. నా అనుభవం ప్రకారం ఇది శుద్ధ దండగ. అక్కడ కేవలం షార్ట్ కట్ పద్ధతులు మాత్రమే చెబుతారు. ఒకరకంగా ఇది మల్టిపుల్ చాయిస్ లాంటిదే. ఆ మాదిరి ప్రశ్న వస్తేనే అభ్యర్థి సమాధానం ఇవ్వగలడు. కానీ సొంతంగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే మెరుగైన రీతిలో గ్రూప్స్లో రాణించే వీలుంది. కాబట్టి కోచింగ్ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఏం చదవాలి? గ్రూప్స్కు సిద్ధమయ్యే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా 8 నుంచి ఇంటర్ వరకూ ఉన్న పుస్తకాలను అభ్యసించాలి. వీటిల్లో లోతైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎన్సీఈ ఆర్టీ, సీబీఎస్సీ ఇంటర్మీడియెట్ పుస్తకాలు.. రాష్ట్ర సిలబస్తో పోలిస్తే పోస్ట్గాడ్యుయేషన్ పుస్తకాలతో సమానం. ప్రతీ పాఠం తర్వాత పాఠానికి కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగే సత్తా విద్యార్థులకు ఉంటుంది. ఆప్షన్స్ ఎంపిక ఎలా ఉండాలి? ఈ మధ్య గ్రూప్–2లో సోషల్ సబ్జెక్టు ఆప్షన్గా తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులే మంచి స్కోర్ సాధించారు. కొత్త సబ్జెక్టు అయితే, మూలాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోతుగా అధ్యయనం చేసే విద్యార్థి ఆప్షన్ విషయంలో ఏది తీసుకున్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి. సివిల్స్లో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా? సాధ్యమే. రోజూ ఒక గంట ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం అలవడే వీలుంది. నెల రోజులు సీరియస్గా చదివితే కోచింగ్ సెంటర్కు వెళ్లకుండానే గ్రూప్స్ కొలువు కొట్టొచ్చు. అలాగే, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. దీనిపై ప్రిపరేషన్ నుంచే దృష్టి పెట్టాలి. -
ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...
కాసింత ఆహారం, దుస్తులు, వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలని అర్ధ శతాబ్దం క్రితం ఒక యువ మేధస్సు ఆలోచించింది. ఆ లక్ష్య సాధనకై ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించి, అడుగులు వేస్తున్న నేపథ్యంలో 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ కిన్నెర హాస్టల్ ప్రాంగణంలో... ప్రగతి నిరోధక, ఛాందస భావాల ప్రతినిధుల కుట్రలకు ఆ యువ కిశోరం ఎదురు నిలిచి పోరాడి నేలకొరిగింది. అతడే ప్రగతి శీల విద్యార్థుల ప్రియ నేత, ఉస్మానియా అరుణ తార, హైదరాబాద్ చేగువేరాగా పిలుచుకునే జార్జి రెడ్డి! 1947 జనవరి 15న కేరళలో జన్మించాడు జార్జి రెడ్డి. 1960–70ల్లో హైదరాబాద్లోని నిజాం కాలేజీ విద్యార్థిగా, ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్గా జార్జ్ చెరగని ముద్ర వేశాడు. క్లిష్టమైన అణు భౌతిక శాస్త్రంలో (న్యూక్లియర్ ఫిజిక్స్) గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక దృఢత్వం తప్పనిసరి అని విశ్వసించే జార్జ్ తనని తాను బాక్సింగ్ ఛాంపియన్గా మలుచుకున్నాడు. అంతేగాక తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు బోధిస్తూ, వారిలో నూతన విశ్వాసాన్ని నింపేవాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ గిరిజన పోరాటాలు, తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గాలులు ఉస్మానియా గడ్డను తాకాయి. ఆ ప్రజా ‘తిరుగుబాట్లు’ ఉస్మానియా విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ నూతన పరిణామాలకు వేదికైంది. రైతాంగ పోరాటాలకు జడుచుకొని నగరాలలో స్థిరపడిన ఆధిపత్య సామాజిక వర్గాల వారసులు... చదువు సాకుతో ఉస్మానియా యూనివర్సిటీలో తిష్ఠ వేశారు. మరోవైపు నాటి ఉద్యమ విజయాలతో చదువుల ఒడిని చేరుకున్న మధ్యతరగతి, రైతు కూలీల బిడ్డలు, ఉన్నత విద్యకై ఉస్మానియా వర్సిటీలోకి అప్పుడప్పుడే చేరుకోవడం ఆరంభమైంది. (క్లిక్: మహిళల వద్దకే ఉద్యోగాలు) మొదటి బృందానికి నాటి పాలక పార్టీ, నేటి అధికార పార్టీ మాతృసంస్థలు దిశానిర్దేశం చేస్తూ... యూనివర్సిటీపై తమ తమ ఆధిపత్యాల కోసం వికృత మార్గాలు ఎంచుకున్నాయి. ఫలితంగా రెండో బృందం విద్యార్థులపై హాస్టళ్లలో, మెస్లలో, తరగతి గదులలో, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ల పేరుతో.. బల ప్రదర్శన, ఆధిపత్యం చేయడం ఆనవాయితీగా మారింది. యూనివర్సిటీ అధికారులపై, ఆచార్యులపై బెదిరింపులకు పాల్పడటం; విద్యార్థి సంఘాల ఎన్నికలలో ఆరోగ్యకరమైన పోటీ జరగకుండా భయభ్రాంతులు సృష్టించడం, తోటి విద్యార్థుల స్వేచ్ఛను హరించడం సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విద్యార్థిగా జార్జి రెడ్డి యూనివర్సిటీ గడ్డపై అడుగు పెట్టాడు. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థి లోకానికి పెద్ద దిక్కై నిలిచాడు. క్యాంపస్లో విద్యార్థి హక్కుల రక్షణకై నిలబడ్డాడు. భౌతిక దాడులను తన బిగి పిడికిలితో తిప్పికొడుతూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపాడు. సైద్ధాంతిక అధ్యయనం, చర్చలతో సహచరులలో స్ఫూర్తి రగిలించాడు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందాన్ని నిర్మించి ఆనతి కాలంలోనే విద్యార్థుల ఆత్మీయ నేతగా ఎదిగాడు. సాధారణ విద్యార్థులను పోటీకి నిలవనివ్వని ‘ఆధిపత్యం’పై విద్యార్థి సంఘాల ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు. విజ్ఞానంలోనూ, నాయకత్వంలోనూ పతాక స్థాయికి చేరుకుంటున్న జార్జి ‘ఆధిపత్య వర్గాలకు’ కంటగింపుగా మారాడు. దీంతో ఛాందసవాదులు జార్జిని అమానుషంగా హత్య చేశారు. జార్జి త్యాగాన్నీ, ఆశయాలనూ ఎత్తి పడుతూ జార్జి స్థాపించిన పీడీఎస్ అనతికాలంలోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ)గా దేశవ్యాప్తంగా విస్తరించింది. ‘జీనా హై తో మర్ నా సీఖో, ఖదం ఖదం పర్ లడ్నా సీఖో’ అంటూ మరణానంతరం కూడా యువ తరానికి దిశానిర్దేశం చేస్తున్న హీరో జార్జి రెడ్డి. (చదవండి: వ్యవస్థల్లో విపరీత ధోరణులు) - ఎస్. నాగేశ్వర్ రావు పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు (ఏప్రిల్ 14న జార్జి రెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా... నేడు ఓయూలో నిర్వహించే ‘రెడ్ షర్ట్’ కవాతు, బహిరంగ సభ నేపథ్యంలో) -
అన్ని రంగాల్లో గణితానిది కీలకపాత్ర
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సైన్స్ (ఏపీటీఎస్ఎంఎస్) 30వ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. వర్సిటీ క్యాంపస్ లోని ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో గణితశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఓయూ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వీరయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి వీసీ రవీందర్, గౌరవ అతిథి, ఏపీటీఎస్ ఎంఎస్ అధ్యక్షుడు, జేఎన్టీయూ అనంతపురం ఈసీ కేశవరెడ్డి, కన్వీనర్ కిషన్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాథమెటిక్స్ అండ్ ఐటీస్ రిలవెన్స్ టు సైన్స్ అండ్ ఇంజనీ రింగ్ అనే అంశంపై కేశవరెడ్డి మాట్లాడుతూ.. గణితశాస్త్రం అన్ని రంగాలకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనాలిసిస్, మెషినరీ లర్నింగ్, స్టాటిస్టిక్స్లో గణితం కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ఓయూలో మూడ్రోజులు జరిగే ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరవ నున్నారు. 160 పరిశోధన పత్రాలను ఎంపిక చేశామని, ఉత్తమ పరిశోధన పత్రానికి రూ. 5 వేల నగదు బహుమతి అందచేయనున్నామని సదస్సు కన్వీనర్ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎస్ఎంఎస్ జనరల్ సెక్రటరీ భారతి తదితరులు పాల్గొన్నారు. -
ఓయూలో అబ్బాయిల హాస్టల్.. అమ్మాయిలకు!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ కేటాయింపుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంగళవారం వీసీ కార్యాలయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అబ్బాయిల స్పోర్ట్స్ హాస్టల్ను అమ్మాయిలకు కేటాయించారు. తమ కోసం స్పోర్ట్స్ నిధులతో నిర్మించిన హాస్టల్ను ఖాళీ చేసేదిలేదని వ్యాయామ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు 12 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఓయూ వీసీని రీకాల్ చేయండి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ను రీకాల్ చేయాలని బహుజన విద్యార్థి ఫెడరేషన్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సైను కోరారు. సంస్కరణల పేరుతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలువురు అధికారులు యూనివర్సిటీ కాలేజీలు, కార్యాలయాల్లో అవసరం నిమిత్తం డైలీవేజ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించగా తనకు నచ్చని అధికారులు, సిబ్బందిని వీసీ రవీందర్ అకారణంగా తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం 2014లో జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఓయూకు సంబంధం లేని ఆర్క్యూస్లో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసేయడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థి నేతలు వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. (క్లిక్: కారులో కూర్చుని వెండితెరపై సినిమా చూడొచ్చు.. త్వరలో హైదరాబాద్లో..) -
ఓయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని సోమవారం కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీనగేష్ తెలిపారు. ఈ నెల 26న డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్ కోర్సుల 3, 5 సెమిస్టర్ పరీక్షలు, 28న డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. (క్లిక్: త్వరలోనే విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీ) కోవిడ్ కారణంగా గతంలో 2 గంటల వరకు కుదించిన సమయాన్ని ఇక నుంచి డిగ్రీతో పాటు ఇతర కోర్సులకు సైతం పాత సమయాన్ని 3 గంటల వరకు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఓయూలో పరీక్షల వాయిదా పడ్డాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు. త్వరలో డిగ్రీ పరీక్షల టైం టేబుల్ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. (క్లిక్: 25 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం) -
ఓయూలో 14 నుంచి సెల్ట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ అనుబంధ విభాగం.. ద సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెనింగ్ సెంటర్ (సెల్ట్)లో ఈ నెల 14 నుంచి తరగతి గది బోధనను పునఃప్రారంభించనున్నట్లు గురువారం డైరెక్టర్ డాక్టర్ సవీన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 90145 00509కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. న్యాయశాస్త్రం పీహెచ్డీ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ న్యాయశాస్త్రంతో పాటు గణితం, జియోలజీ పీహెచ్డీ కోర్సుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. అక్టోబరులో జరిగిన వివిధ పీహెచ్డీ కోర్సుల పార్టువన్ (కోర్సు వర్క్) పరీక్ష ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఓయూ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఓయూ పరిధిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్, బీకాం ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలను వెబ్సైట్లో చూడవచ్చు. -
కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా
బంజారాహిల్స్: కరోనా విజృంభణతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కొన్ని పరీక్షలను రద్దు చేశాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను విశ్వ విద్యాలయ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. జేఎన్టీయూ పరిధిలో... కేపీహెచ్బీ కాలనీ: జేఏన్టీయూహెచ్లో జరగనున్న అన్ని పరీక్షలను ఈ నెల 30వరకు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ యం. మంజూర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వార్షిక పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు), మధ్యస్థ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షల రీషెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఓయూలో పరీక్షలు రద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సోమవారం పేర్కొన్నారు. వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా రెగ్యులర్, దూరవిద్య కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
‘317 జీవోను రద్దు చేయండి’
ఉస్మానియా యూనివర్సిటీ: ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న 317 జీవోను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ఉద్యోగుల బదిలీల కోసం జారీ చేసిన జీవో 317తో ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. స్థానికతను, రోస్టర్ను పట్టించుకోకుండా అధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు తూట్లు పొడిచారన్నారు. సీనియర్ను జూనియర్గా మారుస్తూ సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాకు అన్యాయంగా బదిలీ చేస్తూ మానసిక వేదనకు గురిచేయడం సరికాదన్నారు. భార్యాభర్తలు వేర్వేరు చోట్ల విధులు నిర్వహిస్తే లోకల్ సమస్యతో పాటు వారి పిల్లలు ఆగమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అగౌరవపరచకుండా వారికి న్యాయం జరిగేలా ఉన్న జీవోపై కేసీఆర్ క్షుణంగా అధ్యయనం చేయాలని, బదిలీలపై గందరగోళ పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. -
8 నుంచి ఓయూ హాస్టళ్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. పీజీఈసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ పీజీఈసెట్ ఈ నెల 6 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ పి.రమేష్బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువుంటుందని వెల్లడించారు. ‘డిగ్రీ వన్టైమ్ చాన్స్’ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్టైమ్ చాన్స్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్లాగ్, వన్టైమ్ చాన్స్ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్ శ్రీనగేశ్ తెలిపారు. (తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు) పీజీ ప్రవేశాల చివరి విడత వెబ్ కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్కౌన్సెలింగ్ జరగనున్నట్లు కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్య ర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా సర్వేశ్వర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడ బ్ల్యూఆర్ఈఐఎస్) అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. -
జనావాసాల్లో గాయపడ్డ విదేశీ కొంగ
సాక్షి, అంబర్పేట(హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ అడవికి ఆనుకొని ఉన్న బాగ్ అంబర్పేట మల్లికార్జున్నగర్లో ఓ విదేశీ పక్షి గాయపడింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్షిని పోలీసుస్టేషన్కు తీసుకువచ్చి జూ పార్కు అధికారులకు సమాచారం అందించారు. జూ పార్కు అధికారులు ఈ పక్షి నైబీరియా నుంచి వలస వచ్చినట్లుగా జూ పార్కు అధికారులు గుర్తించారు. గాలిపటం మాంజా కారణంగా ఈ పక్షి గాయపడి నేలపై పడ్డట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జూ పార్కుకు తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. -
నీరాలో కేన్సర్ నిరోధకశక్తి
సాక్షి, హైదరాబాద్ /ఉస్మానియా యూనివర్సిటీ: తాటి, ఈత చెట్ల నుంచి లభించే నీరాలో పోషక విలువలతోపాటు కేన్సర్ వ్యాధి నిరోధకశక్తి ఉందని ఉస్మానియా యూనివర్సిటీ మైక్రోబయోలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ భీమా వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రమంత్రి శ్రీనివాస్గౌడ్ కలసి తన పరిశోధనల ద్వారా ఆరు నెలలపాటు నిల్వ ఉండేలా తయారు చేసిన నీరాను అందచేసి, పరిశోధన అంశాలను వివరించారు. కిడ్నిలో రాళ్లు ఏర్పడకుండా కూడా నీరా ఉపయోగపడుతుందని తన అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. ఈ మేరకు భీమాను మంత్రి అభినందించారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ నీరా ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ రూ.20 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నెక్లెస్రోడ్డులో నీరాకేఫ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైగౌడ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికోటి రామారావుగౌడ్, శాస్త్రవేత్తలు డా.చంద్రశేఖర్, డా.శ్రీనివాస్నాయక్ పాల్గొన్నారు. -
మూడవ రోజు ముమ్మరంగా..
నాంపల్లి/ ఉస్మానియా యూనివర్సిటీ: ఇంటర్ పరీక్షా ఫలితాల రగడ కొనసాగుతోంది. మూడవ రోజు కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఫెయిలై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో ఎంజే రోడ్డు పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం నుంచే బోర్డు కార్యాలయం గేట్లు మూసివేయడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించి వారు నిరసనలు వ్యక్తం చేశారు. దీనికి తోడు సోమవారం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు జాతీయ క్యాంపెయిన్ శిక్షా బచావో–దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఇంటర్మీడియట్ బోర్డుకు వందలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులను, ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు దొరికినవారిని దొరికినట్టుగా వ్యాన్లో ఎక్కించి గోషామహల్ స్టేడియానికి తరలించారు. 90 మంది ఆందోళనకారులను బేగంబజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరినీ పాస్ చేయాలని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాహనాల అద్దాలు ధ్వంసం.. కాగా బోర్డు కార్యాలయానికి తరలివెళ్లే క్రమంలో కొందరు యువకులు ట్రాఫిక్లో రెచ్చిపోయారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనాల అద్దాలను పగులగొట్టారు. ఆందోళనకారుల చేతిలో రెండు ఆటోలు, రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు బంద్: ఏబీవీపీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీలను బంద్ చేయనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. -
ఓయూ ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్, పార్ట్టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష ఉండేది కాదు. ఈనేపథ్యంలో ఓయూలో కొత్తగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: మూడు వందల కాలేజీలకు ముప్పు) 13న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఈనెల 10న శుక్రవారం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈనెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షకు 836 మంది దరఖాస్తు చేయగా 677 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐసెట్–2021 అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. (చదవండి: మద్యం తాగాడు.. విద్యార్థులను బాదాడు) పీజీ రిపోర్టింగ్ గడువు 15 వరకు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (చదవండి: బయోపిక్లు ‘భయో’ పిక్లు, కాకూడదు) -
ఓయూలో సమాధి కలకలం.. దానిపై తాజా పూలు చల్లి ఉండటంతో..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహం వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. వారు తిరిగి వసతి గృహాలకు పరుగెత్తారు. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఈసీహెచ్-1 వసతిగృహానికి దగ్గరగా చెట్ల మధ్య ఇది ఉంది. దానిపై తాజాగా చల్లిన పూలు ఉన్నాయి. చదవండి: ఓయూ క్యాంపస్లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్ అయితే అక్కడ జంతువును పూడ్చిపెట్టి ఉంటారని విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపు బస్తిలో ఉండే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క మూడు రోజుల కింద చనిపోతే దాన్ని ఆదివారం పూడ్చి పెట్టినట్లు ప్రత్యేక సాక్షి చెప్పడంతో.. ఓయూ అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు, విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: హైదరాబాద్: స్విగ్గి డెలివరీ బాయ్స్ సమ్మె.. నిలిచిన ఫుడ్ డెలివరీ -
ఓయూ క్యాంపస్లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్లో వాకింగ్ కోసం వచ్చే బయటి వారినుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని వర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. క్యాంపస్ విద్యార్థులతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల నుంచి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ మరియు యోగా వంటి ఫిట్నెస్ కార్యకలాపాలకు వస్తుంటారు. అయితే వాకర్స్కు యూనివర్సిటీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి యూనివర్సిటి గ్రౌండ్లో వాకింగ్ చేసే వారి నుంచి 200 రూపాయల యూజర్ చార్జీలను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం క్యాంపస్లో స్విమింగ్పూల్, క్రికెట్ గ్రౌండ్ వాడుకునే వారి నుంచి యూజర్ చార్జీలు వసులు చేస్తున్నారు. అయితే బయటి వ్యక్తులు క్యాంపస్లోని వసతులను ఉచితంగా వాడుకోవడం వల్ల వాటి విలువ తెలియడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. పరిస్థితితులకు అనుకూలంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుపట్టలేమన్నారు. కొంతమంది క్యాంపస్కు పెంపుడు కుక్కలను తీసుకొచ్చి ఇక్కడే మలమూత్ర విసర్జన చేయించడాన్ని విద్యార్థులు తప్పు పడుతున్నారు. అంతేకాక చుట్టుపక్కల నివాసముండేవారు తమ కార్లను ఈ స్థలాన్ని పార్కింగ్స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. రాత్రి వేళ అయితే క్రీడా మైదానాల్లో మద్యం తాగి..ఖాళీ సీసాలను పగులగొట్టి అలాగే వదలివేస్తారు. చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ వాకింగ్కు ప్రముఖులు హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, రాంచందర్రావు, పలువురు విద్యావేత్తలు, విద్యా సంస్థల యజమానులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ తదితరులు వాకింగ్కు వస్తారు. వీరి భద్రత కూడ యూనివర్సిటీ చూసుకోవలసి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది వ్యక్తులు కూడా క్యాంపస్లో తిరుగుతుంటారు. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలుసుకునే అవకాశం లేదు. అందుకోసం యూనివర్సిటీ అధికారులు క్యాంపస్లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. చదవండి: హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు -
ఓయూలో సీఎంగా వ్యవహరించిన ఈటల రాజేందర్
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఇటీవల హుజూరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓయూలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మాక్ అసెంబ్లీలో ఆయన సీఎం సీట్లో ఆసీనులై ఆదేశాలిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘భవిష్యత్తు తెలంగాణ వేదిక’ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించగా.. ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి సెషన్ను ప్రారంభించారు. గవర్నర్గా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకులు పేరాల శేఖర్రావు వ్యవహరించారు. చదవండి: ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే దృఢమైన పునాది ముఖ్యమంత్రి హోదాలో ఈటల మాట్లాడుతూ మన రాజ్యాంగం సామాన్యులకు సైతం కల్పిస్తున్న అవకాశాలను వివరించారు. ఇటీవలి హుజూరాబాద్ ఎన్నికల్లో తన ఓటమికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు తనకు ఓటు వేసి ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. మాక్ అసెంబ్లీ స్పీకర్లుగా ఎర్రబెల్లి రజినీకాంత్, సాయికృష్ణారావు, దేవికారెడ్డిని ఎన్నుకోగా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, రాణిరుద్రమ దేవి పాల్గొన్నారు. చదవండి: యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం -
27 భాషల్లో ఓయూ వెబ్సైట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ వెబ్సైట్ను ఇక నుంచి ఇంగ్లిష్తో పాటు 27 భాషల్లో చూడవచ్చు. ఈ మేరకు 27 భాషల్లో ఓయూ పోర్టళ్లను శుక్రవారం ఆవిష్కరించారు. తెలుగుతోపాటు 10 దేశీయ, 17 విదేశీ భాషల్లో యూనివర్సిటీ వెబ్సైట్లో సమాచారాన్ని పొందుపరిచారు. ఓయూ వెబ్సైట్కి వెళ్లి భాషల ఎంపికపై క్లిక్ చేస్తే 27 భాషల జాబితా లభిస్తుంది. ఎవరికి అవసరమైన భాష వారు ఎంపిక చేసుకోవచ్చు. ఓయూలో ప్రస్తుతం 90 దేశాల విద్యార్థులు ఉన్నారని, భవిష్యత్తులో ఇక్కడ చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు, మన దేశంలోని విద్యార్థులకు ఈ 27 భాషలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. -
ఓయూలో వైద్య పరికరాల కోర్సు!
సాక్షి, హైదరాబాద్: మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన మెడ్ట్రానిక్... ఉస్మానియా యూనివర్సిటీతో జట్టు కట్టనుంది. ఓయూలో ఏడాది కాలవ్యవధిగల వైద్య పరికరాల పీజీ కోర్సు ఏర్పాటులో సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన మెడ్ట్రానిక్... ఈ అంశంపై ఓయూ వైస్ చాన్స్లర్ సహా జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ తదితర విభాగాల ప్రొఫెసర్లతో చర్చించింది. ఈ విషయాన్ని మెడ్ట్రానిక్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నిరంజన్ ఎస్.గౌడ్ తెలిపారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఇందుకు సంబంధించిన అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడాదిలోగా కోర్సు... ‘ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్ డివైజెస్పై ఏడాది పీజీ కోర్సు ప్రవేశపెట్టాలని సూచించాం. దీనివల్ల విద్యార్థులకు వైద్య పరికరాలకు సంబంధించి పూర్తి విజ్ఞానం అందుతుంది. ఇది రాష్ట్రంలో హెల్త్ కేర్ రంగం పురోభివృద్ధికి దోహదపడుతుంది. ఏడాదిలోగా కోర్సును ప్రారంభించాలని యోచిస్తున్నాం. డివైజ్ అండ్ పేషెంట్ సేఫ్టీపై పీజీ కోర్సు ఉంటుంది. మేము యువ శాస్త్రవేత్తలను తయారు చేస్తాము. తత్ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ డివైజెస్ను విదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనూ వాటి వినియోగం పెరిగింది. మేము చేస్తున్న కృషితో భవిష్యత్తులో రాష్ట్రంలో వైద్య పరికరాలను తయారు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల విదేశాల నుంచి ఖరీదైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వివిధ రకాల చికిత్సలు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి’ అని నిరంజన్ గౌడ్ తెలిపారు. జీవనశైలి వ్యాధులు పెరిగాయి ‘భారతీయుల జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోట్లు, మూత్రపిండాల వ్యాధులు అధికమయ్యాయి. ఇలాంటి వ్యాధుల బారినపడ్డ వారి జీవితకాలాన్ని పెంచేందుకు అత్యాధునిక వైద్య పరికరాలను ఉపయోగిస్తారు. దీనివల్ల వారి జీవిత కాలాన్ని పెంచవచ్చు. ఈ తరహా పరికరాలు తయారు చేసే మా కంపెనీని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇటీవల ప్రారంభించాం. నూతన వైద్య పరికరాల భద్రతను మేం పరీక్షిస్తాం. అయితే వాటికి సంబంధించిన శాస్త్రవేత్తలు మన వద్ద లేరు. కొత్త వారికి శిక్షణ ఇవ్వడం, శాస్త్రవేత్తలను ఇక్కడ ఉంచాలనేది మా ప్రయత్నం’ అని నిరంజన్ గౌడ్ వివరించారు.