-
రికార్డుల కోసమే ఆడుతున్నట్లుంది.. రోహిత్-ధావన్ ద్వయం అరుదైన ఫీట్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తున్నారు. ఇప్పటికే బుమ్రా, షమీలు బౌలింగ్లో అరుదైన ఫీట్లను అందుకోగా.. తాజాగా బ్యాటింగ్లో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ద్వయం పరుగులు విషయంలో కొత్త రికార్డును అందుకున్నారు. తాజాగా ఇంగ్లండ్తో వన్డే ద్వారా ఈ ఓపెనింగ్ జోడి 5వేల పరుగుల మార్క్ను క్రాస్ చేసింది. 5వేల పరుగుల మార్క్ను అందుకోవడానికి 114 ఇన్నింగ్స్లు అవసరం అయ్యాయి. కాగా సచిన్-గంగూలీ జోడి తర్వాత వన్డేల్లో తొలి వికెట్కు 5వేల పరుగులు జోడించిన రెండో ఓపెనింగ్ జోడిగా నిలిచి చరిత్రకెక్కింది. ఇంతకముందు వన్డే క్రికెట్లో సచిన్-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్ల్లో 6609 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ఆసీస్ ఆల్టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్క్రిస్ట్ (114 ఇన్నింగ్స్ల్లో 5472), విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ (102 ఇన్నింగ్స్ల్లో 5150) ఉన్నారు. తాజాగా వీరి సరసన రోహిత్ శర్మ- ధావన్ జోడి చోటు సంపాదించింది. 5⃣0⃣0⃣0⃣ ODI runs in partnership for this dynamic duo! 👏 👏#TeamIndia captain @ImRo45 & @SDhawan25 become only the 2⃣nd Indian pair after the legendary duo of @sachin_rt & @SGanguly99 to achieve this feat. 👍 👍 Follow the match ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/gU67Bx4SeE — BCCI (@BCCI) July 12, 2022 చదవండి: Jasprit Bumrah: ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా కొత్త చరిత్ర.. Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్గా -
వార్విక్షైర్ జట్టుకు ఆడనున్న కృనాల్ పాండ్యా
ఇంగ్లండ్ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ రాయల్ లండన్ కప్లో భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 2 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో కృనాల్ వార్విక్షైర్ కౌంటీ జట్టు తరఫున ఆడనున్నాడు. 31 ఏళ్ల కృనాల్ భారత్ తరఫున ఐదు వన్డేలు, 19 టి20 మ్యాచ్లు ఆడాడు. గత ఏడాది వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్పై అరంగేట్రం చేసిన కృనాల్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అరంగేట్రంలో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా గుర్తింపు పొందాడు. -
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్స్ అరుదైన ఫీట్
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం, ఇమాముల్ హక్లు అరుదైన ఫీట్ సాధించారు. తమ కెరీర్లోనే ఈ ఇద్దరు భీకరమైన ఫామ్లో ఉన్నారు. కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ అనేంతలా వీరిద్దరి ఇన్నింగ్స్లు ఉంటున్నాయి. తాజాగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో బాబర్ అజం, ఇమాముల్ హక్లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. కాగా ఈ ఇద్దరికి వరుసగా ఆరో అర్థశతకం కావడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒకేసారి ఇద్దరు పాక్ బ్యాట్స్మన్లు వరుసగా సమాన అర్థశతకాలు నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బాబర్ ఆజం 77, ఇమాముల్ హక్ 72 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: PAK vs WI 2nd ODI: పాక్ కెప్టెన్పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు.. అరంగేట్రం తర్వాత పుట్టిన క్రికెటర్తో..!
IND VS NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య క్వీన్స్టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డే సందర్భంగా క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు ఆవిష్కృతమైంది. మహిళల క్రికెట్లోనే కాకుండా పురుషుల క్రికెట్లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత రేర్ ఫీట్ను భారత మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్ సాధించింది. ఈ మ్యాచ్లో అజేయమైన అర్ధ శతకంతో(81 బంతుల్లో 66 నాటౌట్, 3 ఫోర్లు) రాణించిన మిథాళీ.. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ ఆరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్ (64 బంతుల్లో 65, 6 ఫోర్లు, ఒక సిక్స్)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డును తన పేరిట లిఖించుకుంది. Most 50+ scores by Indian captains against New Zealand in ODIs : 7* - Mithali Raj 6 - Md Azharuddin 6 - MS Dhoni 4 - Virat Kohli#NZvIND — Rhitankar Bandyopadhyay (@rhitankar8616) February 15, 2022 మిథాలీ రాజ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేయగా, రిచా ఘోష్ 2003లో జన్మించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ మిథాలీ రాజ్ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్గా, వన్డే క్రికెట్లో న్యూజిలాండ్పై అత్యధిక హాఫ్ సెంచరీలు(7) నమోదు చేసిన భారత కెప్టెన్గా, వన్డేల్లో న్యూజిలాండ్పై అత్యధిక పరుగులు(739) చేసిన టీమిండియా సారధిగా మిథాళీ పలు రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్లు ధోని, కోహ్లిల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. Most runs by Indian captains against New Zealand in ODIs : 739* - Mithali Raj 723 - MS Dhoni 678 - Md Azharuddin 487 - Virat Kohli Mithali has now scored more runs than any other Indian captains against NZ in ODIs.#NZvIND — Rhitankar Bandyopadhyay (@rhitankar8616) February 15, 2022 ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా రెండో వన్డేలోనూ ఓడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేయగా, న్యూజిలాండ్ వుమెన్స్ జట్టు 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అమిలియా కెర్(135 బంతుల్లో 119 నాటౌట్, 7 ఫోర్లు) అద్బుత సెంచరీతో కడదాకా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. టీమిండియాలో కెప్టెన్ మిథాలీరాజ్, రిచా ఘోష్ అర్ధ సెంచరీలతో చెలరేగగా, ఓపెనర్ సబ్బినేని మేఘన 50 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఐదు వన్డేల ఈ సిరీస్లో మూడో వన్డే ఫిబ్రవరి 18న జరగనుంది. -
మనదే యువ ప్రపంచం
కరోనా కారణంగా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా... మెగా ఈవెంట్ ప్రారంభమయ్యాక జట్టులోని ఆరుగురు కరోనా బారిన పడటం... అదృష్టంకొద్దీ మ్యాచ్లో ఆడేందుకు 11 మంది అందుబాటులో ఉండటం... ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పోరాటం... వెరసి అండర్–19 వన్డే క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో యువ భారత్ ఐదోసారి చాంపియన్గా నిలిచింది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నమెంట్ను అజేయంగా ముగించి సగర్వంగా స్వదేశానికి పయనమైంది. టోర్నీ మొత్తంలో ఏ ఒక్కరిపైనో భారత్ సంపూర్ణంగా ఆధారపడలేదు. అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్, రాజ్ బావా, విక్కీ ఒస్త్వాల్, రవి కుమార్... ఇలా ప్రతి సభ్యుడూ తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. తమ కెరీర్లో చిరస్మరణీయ ఘట్టాలను లిఖించుకున్నారు. న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన యువ భారత్ జట్టు అండర్–19 ప్రపంచకప్లో తమదైన ముద్ర వేసింది. ఏకంగా ఐదోసారి జగజ్జేతగా నిలిచి తమ పట్టు నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 14 సార్లు అండర్–19 ప్రపంచకప్ జరగ్గా... యువ భారత్ ఐదుసార్లు చాంపియన్గా నిలిచి, మూడుసార్లు రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆంటిగ్వాలో శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ బౌలర్లు రాజ్ బావా (5/31), రవి కుమార్ (4/34) అదరగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్ సింధు (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. రాజ్ బావా (54 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ దినేశ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజ్ బావా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు అందుకున్నాడు. టోర్నీ మొత్తంలో 506 పరుగులు చేసి, 7 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవల్డ్ బ్రెవిస్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. బీసీసీఐ అభినందన... అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి విజేతగా అవతరించిన యువ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రశంసల వర్షం కురిపించారు. రికార్డుస్థాయిలో ఐదోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్గా నిలిచిన భారత జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 40 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనున్నారు. ‘అన్ని విభాగాల్లో మన కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తమ శిబిరంలో కరోనా కలకలం రేపినా అందుబాటులో ఉన్న వారితో ముందుకు దూసుకెళ్లారు. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ నిరంతరం కుర్రాళ్లలో ఉత్సాహం నింపారు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. సత్కారం... ఇంగ్లండ్పై ఫైనల్లో విజయం తర్వాత యువ భారత జట్టు అంటిగ్వా నుంచి గయానాలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది. భారత హై కమిషనర్ కేజే శ్రీనివాస భారత జట్టును సన్మానించారు. ఆ తర్వాత టీమిండియా గయానా నుంచి ఆదివారం సాయంత్రం స్వదేశానికి పయనమైంది. అమ్స్టర్డామ్ మీదుగా బెంగళూరు చేరుకోనున్న భారత జట్టు సభ్యులు అక్కడి నుంచి అహ్మదాబాద్కు వెళతారు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ సీనియర్ జట్ల మధ్య అహ్మదాబాద్లో మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ చేరుకున్నాక బీసీసీఐ అధికారికంగా యువ జట్టును సత్కరించి రివార్డులు అందజేయనుంది. ప్రధాని శుభాకాంక్షలు ప్రపంచకప్ నెగ్గిన భారత అండర్–19 జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యువ జట్టు తమ ప్రదర్శనతో భారత భవిష్యత్ క్రికెట్ సురక్షితంగా ఉందని చాటి చెప్పిందని ఆయన అన్నారు. ‘యువ క్రికెటర్లను చూసి గర్వపడుతున్నాను. అండర్–19 ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు. అత్యున్నతస్థాయి టోర్నీలో ఆద్యంతం వారు నిలకడగా రాణించి భారత క్రికెట్ భవితకు ఢోకా లేదని నిరూపించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. యువ జట్టు విజయం వెనుక బీసీసీఐ పాత్ర కూడా ఉంది. కొన్నేళ్లుగా అండర్–16, అండర్–19, అండర్–23 స్థాయిలో భారీ సంఖ్యలో మ్యాచ్లు, టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కాస్త ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఈ నేపథ్యంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా భారత యువ జట్టు ఈసారి ప్రపంచకప్ను సాధించడం గొప్ప ఘనతగా భావించాలి. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. –వీవీఎస్ లక్ష్మణ్, ఎన్సీఏ హెడ్ -
అరుదైన ఫీట్కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలరాయిని చేరుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. విండీస్తో త్వరలో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్లో మరో వికెట్ సాధిస్తే ఈ ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకునే 23వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఈ జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 269 మ్యాచ్ల్లో 334 వన్డే వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో 59 మ్యాచ్లు ఆడిన 31 ఏళ్ల చహల్.. 5.19 సగటున 99 వికెట్లు తీశాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్ల ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యుత్తమ గణాంకాలు 6/42గా ఉన్నాయి. కాగా, ఇటీవలి కాలంలో మునుపటి ఫామ్ను ప్రదర్శించలేకపోతున్న చహల్.. జట్టులోని వస్తూ పోతూ ఉన్నాడు. తాజాగా ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో ఛాన్స్ లభించినప్పటికీ 3 మ్యాచ్ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. అయినప్పటికీ విండీస్తో ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు చహల్ ఎంపికయ్యాడు. చదవండి: అందుకే ఐపీఎల్లో ఆడకూడదని డిసైడయ్యా.. ఆసీస్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
India vs South Africa 1st ODI: కొత్త కెప్టెన్సీలో కొత్త పోరుకు...
India vs South Africa ODI Series: కెప్టెన్గా కోహ్లి భారత క్రికెట్ జట్టును శిఖరానికి తీసుకెళ్లాడు. వ్యూహ ప్రతివ్యూహాలే కాకుండా మైదానంలో అతను చూపించే దూకుడు, అమితోత్సాహం అభిమానులు ఎప్పుడూ మరచిపోలేరు. అయితే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి, 2016 తర్వాత అతను ఒక ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగబోతున్నాడు. నాయకత్వ బాధ్యతలు లేకపోవడం కోహ్లి స్థాయిని తగ్గించకపోవచ్చు గానీ కొత్తగా మాత్రం కనిపించడం ఖాయం. మరోవైపు ముందు వైస్ కెప్టెన్గా ఎంపికై ఆ తర్వాత రోహిత్ శర్మ గైర్హాజరులో అదృష్టవశాత్తూ సారథిగా మారిన కేఎల్ రాహుల్ కొత్త పరీక్షకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన జట్టును అతను వన్డేల్లో విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరం. పార్ల్: టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. 2023 వన్డే వరల్డ్కప్కు అర్హత అందించే ‘వరల్డ్కప్ సూపర్ లీగ్’లో ఈ మూడు వన్డేలు భాగం కాకపోయినా... ఇటీవలే ముగిసిన హోరా హోరీ టెస్టు సిరీస్ కారణంగా ఈ మ్యాచ్లూ ఆసక్తి రేపుతున్నాయి. రాహుల్కు భారత జట్టు కెప్టెన్గా ఇదే తొలి వన్డే మ్యాచ్ కావడం విశేషం. విరాట్ కోహ్లి చివరిసారిగా 2016 అక్టోబరులో వైజాగ్లో జరిగిన భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేలో కెప్టెన్ గా కాకుండా ఒక బ్యాటర్గా మాత్రమే (ధోని నాయకత్వంలో) బరిలోకి దిగాడు. వెంకటేశ్కు చోటు! సహజంగానే టెస్టు జట్టులో లేని కొందరు ‘స్పెషలిస్ట్’ ఆటగాళ్లు వన్డేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. భువనేశ్వర్, దీపక్ చహర్, చహల్, శిఖర్ ధావన్లతో జట్టు కొత్తగా కనిపించనుంది. ‘100 వికెట్ల క్లబ్’కు మరో 3 వికెట్ల దూరంలో ఉన్న లెగ్స్పిన్నర్ చహల్ మరోసారి సీనియర్ జట్టు తరఫున తన స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నాడు. రాహుల్తో పాటు ధావన్ ఓపెనింగ్ చేస్తాడు. మూడో స్థానంలో కోహ్లి మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు. 2019 అక్టోబర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో శతకం సాధించని కోహ్లి ఇప్పుడు బ్యాటర్గా తన సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. ఆరో స్థానంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. దాంతో భారత్ తరఫున 3 టి20లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రాహుల్ (కెప్టెన్), ధావన్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్, దీపక్ చహర్, భువనేశ్వర్, అశ్విన్, బుమ్రా, చహల్. -
India tour of South Africa: వన్డే జట్టులోకి వెంకటేశ్ అయ్యర్!
టీమిండియా యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్కు మరో బంపరాఫర్ తగిలే అవకాశం ఉంది. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిసిన అయ్యర్ తాజాగా నాలుగో మ్యాచ్లో మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. చత్తీస్ఘర్తో జరుగుతున్న మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ 133 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: Vijay Hazare Trophy: రుతురాజ్ హ్యాట్రిక్ సెంచరీ.. దుమ్మురేపుతున్న మహారాష్ట్ర తాజా ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్.. సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో ఎంపిక చేయనున్న వన్డే టీమ్లో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్తో టి20 సిరీస్ ద్వారా టీమిండియాలో అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ త్వరలో వన్డే జట్టులోనూ ఆడే అవకాశం లభించనుంది. ఒకవేళ వెంకటేశ్ అయ్యర్ దక్షిణాఫ్రికా టూర్కు ఎంపికై రాణిస్తే ఆల్రౌండర్గా స్థానం సుస్థిరం చేసుకున్నట్లే. ఇక ఇటీవలీ కాలంలో వెంకటేశ్ అయ్యర్ ప్రదర్శన చూసుకుంటే.. ►ఐపీఎల్ 2021 సీజన్: 10 మ్యాచ్ల్లో 370 పరుగులు, 3 వికెట్లు ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: 5 మ్యాచ్లు 155 పరుగులు.. 5 వికెట్లు ►ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టి20 సిరీస్: 3 మ్యాచ్ల్లో 36 పరుగులు.. 1 వికెట్ ►విజయ్ హజారే ట్రోఫీ: ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో 348 పరుగులు.. 6 వికెట్లు 1⃣0⃣0⃣ up & going strong! 💪 💪@ivenkyiyer2512 continues his superb run of form. 👏 👏 #MPvUTCA #VijayHazareTrophy pic.twitter.com/iiow2ATC2n — BCCI Domestic (@BCCIdomestic) December 12, 2021 -
17 ఏళ్ల తర్వాత పాక్లో పర్యటించనున్న టీమిండియా..!
Team India Likely To Tour Pakistan After 17 Years For Asia Cup 2023: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులను దాయాది దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకోవడంతో టీమిండియా పాక్ పర్యటన అంశం తెరపైకి వచ్చింది. ఈనెల 15న దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పీసీబీకి ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్ నిర్వహణ బాధ్యతలను అప్పచెబుతూ కౌన్సిల్ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లోనే ఆసియా కప్ను పాక్లో నిర్వహించాల్సి ఉండింది. అయితే అప్పట్లో పాక్ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అనడంతో పీసీబీ ఆ బాధ్యతలను శ్రీలంకకు కట్టబెట్టింది. కరోనా కారణంగా శ్రీలంక కూడా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేయడంతో అప్పట్లో టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ నూతన చైర్మన్ రమీజ్ రాజా దృవీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని వారు సంయుక్తంగా ప్రకటించారు. అన్నీ సజావుగా సాగితే టోర్నీని 2023 జూన్, జులై మాసాల్లో నిర్వహించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, టీమిండియా చివరిసారిగా 2006లో పాక్లో పర్యటించింది. ఆ తర్వాత భారత్-పాక్ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో పాక్ వెలుపల జరిగిన ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడ్డాయి. చదవండి: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్కు కోహ్లి వార్నింగ్..! -
మిథాలీ రాజ్.. 16 ఏళ్లలో తొమ్మిదోసారి ‘టాప్’
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్లో నిలిచింది. ఆమె.. తన 16 ఏళ్ల వన్డే కెరీర్లో తొమ్మిదోసారి ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. గతవారం ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఉన్న విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ 30 పాయింట్లు కోల్పోవడంతో మిథాలీ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. పాక్తో జరిగిన 5 వన్డేల సిరీస్లో చివరి రెండు మ్యాచ్ల్లో 49, 21 పరుగులు మాత్రమే చేసిన స్టెఫానీ.. తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఐదో ప్లేస్లో నిలిచింది. 🔝 @M_Raj03 has regained her position as the No.1 batter on the @MRFWorldwide ICC Women's ODI Player Rankings. Full list: https://t.co/jxTLqOK1gm pic.twitter.com/oAHUTu4eRY — ICC (@ICC) July 20, 2021 కాగా, అంతకుముందు వారం పాక్తో జరిగిన తొలి వన్డేలో అజేయమైన సెంచరీ సాధించడం ద్వారా స్టెఫానీ గతవారం టాప్ ర్యాంక్కు చేరింది. మరోవైపు స్టెఫానీ ఆల్రౌండర్ల జాబితాలో కూడా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ జాబితాలో ఆసీస్ ఆల్రౌండర్ ఎలైస్ పెర్రీ టాప్కు చేరుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా స్టెఫానీ మూడు స్థానాలు దిగజారింది. మొత్తంగా స్టెఫానీ గతవారం జరిగిన పాక్ సిరీస్లో దారుణంగా విఫలం కావడంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో తన పట్టును కోల్పోయింది. ఇక టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ మంధాన కెరీర్ అత్యుత్తమ మూడో ర్యాంక్కు చేరుకుంది. -
వన్డేల్లోనూ సత్తా చాటుతా పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అరుంధతి రెడ్డి... భారత మహిళల టి20 టీమ్లో సత్తా చాటి తన స్థానం పదిలం చేసుకున్న పేస్ బౌలర్. గత మూడేళ్లుగా టి20 ఫార్మాట్లో కీలక ప్లేయర్గా ఎదిగిన అరుంధతి తొలిసారి వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికైంది. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనే టీమ్లో ఆమెకు అవకాశం లభించింది.ఇకపై వన్డేల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమంటున్న 23 ఏళ్ల పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కావడంపై... చాలా సంతోషంగా ఉంది. భారత జట్టుకు ఇప్పటికే ప్రాతినిధ్యం వహించినా... మరో ఫార్మాట్లో నాకు కొత్తగా అవకాశం దక్కుతోంది. టి20ల్లో నిలకడగా రాణించడం వల్లే నాకు ఈ చాన్స్ వచ్చిందని నమ్ముతున్నా. వన్డేల్లోనూ రాణించి జట్టు విజయంలో నేనూ పాత్ర పోషించగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఇంగ్లండ్లో ఆడాలనేది నా కల. ఇప్పుడు అక్కడికే భారత జట్టు తరఫున వెళుతుండటం గర్వకారణం. టి20ల్లో ప్రదర్శనపై... హైదరాబాద్ టీమ్నుంచి మొదలు పెట్టి ఇండియా ‘ఎ’ వరకు మెరుగైన ప్రదర్శన ఇచ్చిన తర్వాతే నాకు జాతీయ జట్టులో అవకాశం లభించింది. మూడేళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్నుంచి చూస్తే ఇప్పుడు నా ఆట ఎంతో మెరుగైంది. నా తొలి సిరీస్లో శ్రీలంకతో ఆడిన మూడో మ్యాచ్తోనే నాకు మంచి గుర్తింపు దక్కింది. కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించిన నేను రెండు కీలక వికెట్లతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాను. అయితే ఇంకా నేను ఆశించిన ‘అత్యుత్తమ మ్యాచ్’ ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. కొన్ని సార్లు మనం ఎంతగా శ్రమించినా చివరకు ఫలితం లభించదు. అయితే నా ఆటను సెలక్టర్లు గుర్తించారు కాబట్టే టి20ల్లో రెగ్యులర్గా మారడంతో పాటు ఇప్పుడు వన్డేల్లోనూ పిలుపు లభించింది. ఇక తక్కువ సమయంలోనే రెండు ప్రపంచకప్లలో ఆడే అవకాశం రావడం నా అదృష్టం. పేస్ బౌలింగ్ పదునుపై... అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత నా బౌలింగ్లో వేగం, కచ్చితత్వం పెంచేందుకు ఎంతో శ్రమించా. కెరీర్ ఆరంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు నా బౌలింగ్లో చాలా మార్పు వచ్చింది. నెట్స్లో సుదీర్ఘ సమయం పాటు సాధనతో లోపాలు సరిదిద్దుకుంటున్నా. ఇన్స్వింగర్ నా ‘స్టాక్ బాల్’ కాగా...అవుట్ స్వింగర్లు, ఆఫ్ కట్టర్లను సమర్థంగా ప్రయోగించగలుగుతున్నా. ఎన్ఎస్ గణేశ్ వద్ద కోచింగ్ మొదలు పెట్టిన నాకు రైల్వేస్ టీమ్కు ఆడే సమయంలో మూర్తి సహకరిస్తున్నారు. ఇతర సమయంలో ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ వద్ద ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా. బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టా. మిథాలీ రాజ్ ప్రభావం... నాకు క్రికెట్పై ఆసక్తి కలగడానికి, ఆటలో ఎదిగేందుకు కూడా ఆమెనే స్ఫూర్తి. ఆమె ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో జట్టులో మిథాలీ అక్క కూడా ఉంది. రైల్వేస్ జట్టు తరఫున ఆమె కెప్టెన్సీలో ఆడుతున్నా. సీనియర్ ప్లేయర్గా, మన హైదరాబాదీగా కూడా అన్ని సందర్భాల్లో మిథాలీ సహకారం నాకు లభించింది. నన్ను బాగా ప్రోత్సహిస్తూ తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తోంది. కరోనా కాలంలో సుదీర్ఘ విరామంపై... ఎన్నో ఇతర క్రీడల్లాగే మహిళల క్రికెటర్లందరం కూడా గత ఏడాదంతా ఆటపరంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. టి20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు సంవత్సరం పాటు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేకపోయింది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ సౌకర్యాలు కూడా వాడుకునే పరిస్థితి లేకపోయింది. ఇక ప్రాక్టీస్ చేద్దామంటే అకాడమీలూ మూసేశారు. పైగా కరోనాతో భయం కూడా. దాంతో ఆ సమయంలో క్రికెట్ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. చివరకు నేను ప్రాక్టీస్ కోసం వరంగల్కు వెళ్లిపోయాను. నా సహచర ప్లేయర్ ప్రణీషకు సొంత పిచ్, నెట్స్ ఉండటంతో అక్కడకు వెళ్లి సాధన చేసేదాన్ని. ఈ సారి జాగ్రత్తలూ తీసుకుంటూ ఆటపై దృష్టి పెట్టగలుగుతున్నాం. ‘పాఠాలు నేర్చుకుంటా’ ‘ఇటీవల లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి అనుభవంతో మున్ముందు తప్పులు సరిదిద్దుకుంటా. నేను గెలిపించాల్సిన మ్యాచ్లో విఫలమయ్యాను. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి ‘నోబాల్’గా వేశాను. అదనపు బంతితో వారికి మరో అవకాశం లభించి చివరి బంతికి విజయం సాధించగలిగారు. నేను ‘నోబాల్’ వేయకుంటే మా జట్టు గెలిచేదేమో’ -
వరుస 24 విజయాలతో జైత్రయాత్ర
మౌంట్ మాంగనుయ్: సమష్టి ప్రదర్శనతో మరోసారి మెరిసిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో వరుసగా 24వ విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా 21 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. అలీసా హీలీ (39 బంతుల్లో 46; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్ కాస్పెరక్ మూడు వికెట్లు తీసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 25 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 128 పరుగులు చేసి ఓడిపోయింది. అమీ సాటెర్వైట్ (20), లియా తహుహు (21 నాటౌట్) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షుట్, వేర్హమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
ఎదురులేని రైల్వేస్ జట్టు
రాజ్కోట్: దేశవాళీ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమకు ఎదురులేదని ఇండియన్ రైల్వేస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని రైల్వేస్ జట్టు 12వసారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడిన రైల్వేస్ అన్నింట్లోనూ గెలిచి అజేయంగా నిలువడం విశేషం. ఇప్పటి వరకు ఈ టోర్నీ 14 సార్లు జరగ్గా... 12 సార్లు రైల్వేస్, ఒక్కోసారి ఢిల్లీ, బెంగాల్ జట్లు విజేతగా నిలిచాయి. జార్ఖండ్తో జరిగిన ఫైనల్లో రైల్వేస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ సరిగ్గా 50 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రాణి రాయ్ (49; 3 ఫోర్లు), మణి నిహారిక (39 నాటౌట్; 4 ఫోర్లు), దుర్గా ముర్ము (31; 3 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. రైల్వేస్ బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన సింగ్, ఏక్తా బిష్త్లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. అనంతరం రైల్వేస్ 37 ఓవర్లలో మూడు వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. రైల్వేస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (53; 6 ఫోర్లు), పూనమ్ రౌత్ (59; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. స్నేహ్ రాణా (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. జార్ఖండ్ బౌలర్లలో దేవయాని రెండు వికెట్లు తీసింది. -
ఇంగ్లండ్ ఆటగాడిలో ధోని లక్షణాలు
పుణే: ఆదివారం జరిగిన ఆఖరి మూడో మ్యాచ్లో భారత జట్టు వన్డే సిరీస్ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో స్యామ్ కరన్ వీరోచిత ఇన్నింగ్స్ (95 నాటౌట్) చూస్తే 'గ్రేట్ ఫినిషర్' మహేంద్ర సింగ్ ధోని లక్షణాలు కనిపించాయని బట్లర్ వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో, ఇంగ్లండ్ జట్టు 200 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో కరాన్ 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగి, జట్టుని ముందుండి నడిపించడమే కాకుండా, మ్యాచ్లో చివరి వరకు పోరాడాడు. ఇటువంటి ప్రదర్శనలు మనం భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలో చూస్తుంటామని ఈ సందర్భంగా బట్లర్ గుర్తు చేశాడు. ‘ప్రస్తుతం అందరి కళ్లు ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ పైన ఉంటాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్న స్యామ్ కరన్ నిన్న రాత్రి తను ఆడిన ఇన్నింగ్స్ గురించి చర్చిస్తాడని నేను అనుకుంటున్నాను. అంతరాతీయ క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన క్రికెటర్ గా, ఫినిషర్ గా ఎంఎస్ ధోని అంటే ఏమిటో మాకు తెలుసు. కనుక ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో ఇలాంటివి పంచుకోవడం స్యామ్ కెరీర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్ కారణంగా మా ఆటగాళ్లకు కూడా ఎంఎస్ దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుండడం నాకు ఆనందంగా ఉంది’అని మ్యాచ్ అనంతరం వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ బట్లర్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 2021లో చెన్నై జట్టు తరఫున ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కూడా ఆడనున్నాడు. భాగస్వామ్యాలు లేకే మ్యాచ్ను కోల్పోయాం ‘రెండో వన్డేలో 43.3 ఓవర్లలో 337 పరుగులు చేసిన ఇంగ్లండ్కు మూడో వన్డేలో 330 టార్గెట్ అంత కష్టమేమి కాదు, మేము ఆ స్కోరును చేధించగలమని అనుకున్నాం. రన్-రేట్ సమస్య అవుతుందని అనుకోలేదు, కాని మేము క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం, సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోవడం వంటి అంశాలు ఇంగ్లండ్కు మ్యాచ్ను దూరం చేసింది. చిన్న, చిన్న పొరపాట్లు కలిసి పెద్దవిగా మారుతాయి. ఈ మ్యాచ్ లో అదే జరిగింది. మ్యాచ్ ఆరంభంలో మా బౌల్లర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేశారు,కానీ చివరి వరకు అది కొనసాగించలేదనే అనుకుంటున్నాను. భారత్ బ్యాట్స్మెన్లకు కొన్ని బౌండరీల విషయంలో కష్టపడకపోయినా సునాయాసంగా మేమే పరుగులు సమర్పించుకున్నాం. అవే మ్యాచ్లో 7 పరుగల తేడాతో ఓటమికి కారణమైంది’ అని బట్లర్ అన్నాడు. ( చదవండి: భారత్లో అత్యంత సంపన్న క్రికెటర్ ఇతనేనంటే నమ్ముతారా! ) -
మ్యాచ్లో ఓడినా.. మనసులు గెలిచావోయ్ కరన్!
పుణే: ఆదివారం రసవత్తరంగా సాగిన ఆఖరి వన్డేలో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ గెలిచినప్పటికీ, స్యామ్ కరన్ తన అసాధారణ బ్యాటింగ్ తో అందరి మనసులను గెలుచుకున్నాడు. మరో రకంగా చెప్పాలంటే మ్యాచ్లో ఓటమి తథ్యమనేలా కోహ్లి సేనని భయపెట్టాడు. స్యామ్ కరన్ ఐపీఎల్ 2020 ద్వారా భారత్ క్రికెట్ అభిమానులకి పరిచయమైన పేరు. గత సీజన్ లో చెన్నై జట్టు తరుపున ఓపెనర్గా, వన్డౌన్ గా బరిలోకి దిగి తన బ్యాట్తో మెరుపులు మెరిపించి భారత్లో తనకంటూ గుర్తింపు సంపాదించాడు. నిన్న జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ద్వారా భారత్ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఒకింత గుబులు పుట్టించాడు. మరో ఎండ్ లో ధీటైన బ్యాట్స్మెన్ లేకపోయినా ధైర్యం కోల్పోకుండా తన భీకర బ్యాటింగ్తో మ్యాచ్ను చివరి వరకు లాక్కొచ్చి తన కెరీర్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ను ఆడాడు. భారత జట్టును భయపెట్టిన కరన్ స్యామ్ కరన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పట్టుదలతో ఆడి ఎనిమిదో వికెట్కు ఆదిల్ రషీద్ (22 బంతుల్లో 19; 2 ఫోర్లు)తో 57 పరుగులు... తొమ్మిదో వికెట్కు మార్క్ వుడ్ (21 బంతుల్లో 14; ఫోర్)తో 60 పరుగులు జోడించి ఇంగ్లండ్ విజయం ఖాయమనేలా చేశాడు. భారత్కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని తీవ్రంగా శ్రమించి మ్యాచ్ని చివరి బంతివరకు తీసుకెళ్లాడు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ నెగ్గినా... స్యామ్ కరన్ తన అసాధారణ పోరాటం తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్ నటరాజన్ నేర్పుతో బౌలింగ్ చేసి స్యామ్ కరన్ను కట్టడి చేసి కేవలం ఆరు పరుగులిచ్చి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలర్లు భువనేశ్వర్ (3/42), శార్దుల్ (4/67) కీలక వికెట్లు తీశారు. స్యామ్ కరన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... బెయిర్స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ( చదవండి: భారత్ తీన్మార్ ) -
ధావన్ను ప్రశంసలతో ముంచెత్తిన కోహ్లి
పుణె : ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం సాధించిన తీరుని, ఈ విజయాన్నిఅందించడంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రత్యేకంగా కొనియాడాడు. 'ఇటీవల కాలంలో సాధించిన విజయాల్లో ఇది ఒక మధురమైన విజయంగా నిలిచిపోతుంది' అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన భారత జట్టుకు, రోహిత్ రూపంలో స్వల్ప స్కోరుకే మొదటి వికెట్ను చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కోహ్లి, శిఖర్ ధావన్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 105 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు గట్టి పునాది వేశారు. 'బ్యాటింగ్కు కష్టంగా ఉన్న దశలో పరగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్పై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ''ఇవాళ శిఖర్ ధావన్ ఆడిన తీరు, అతడు సాధించిన 98 పరుగులు స్కోర్ బోర్డులో చూపించే స్కోర్ కంటే విలువైనవి'' అని చెబుతూ ధావన్ని కోహ్లి అభినందనల్లో ముంచెత్తాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పుణేలో మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో 98 పరుగుల చేసి తను ఫామ్లోకి వచ్చినట్లు ప్రకటించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్ తన 18 వ వన్డే సెంచరీని కేవలం 2 పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. ( చదవండి : అరుదైన రికార్డు: సచిన్ తర్వాత కోహ్లినే ) -
‘శత’క్కొట్టిన పృథ్వీ షా
జైపూర్: ఫామ్లేమితో తంటాలు పడుతున్న ముంబై యువ ఓపెనర్ పృథ్వీషా (89 బంతుల్లో 105 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో టచ్లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఢిల్లీ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హిమ్మత్ సింగ్ (145 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) వీరోచిత పోరాటం చేశాడు. లోయర్ ఆర్డర్లో వశిష్ట్ (70 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 31.5 ఓవర్లలోనే మూడు వికెట్లే కోల్పోయి 216 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (39; 6 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్కు 82 పరుగులు జోడించారు. తర్వాత పృథ్వీకి జతయిన సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడి అర్ధసెంచరీ బాదాడు. వీళ్లిద్దరు మూడో వికెట్కు 93 పరుగులు జోడించడంతో ముంబై విజయం సులువైంది. ఇతర మ్యాచ్ల ఫలితాలు ► బెంగాల్: 315/6 (కైఫ్ అహ్మద్ 75, అనుస్తుప్ 58); సర్వీసెస్: 245 (రజత్ 90, పుల్కిత్ 53; ఇషాన్ పొరెల్ 2/31). ► జమ్మూకశ్మీర్: 279/9 (శుభమ్ 68, వివ్రత్ శర్మ 66); సౌరాష్ట్ర: 283/7 (చిరాగ్ జానీ 93 నాటౌట్, అర్పిత్ 66). ► హరియాణా: 299/9 (హిమాన్షు రాణా 102, రాహుల్ తెవాటియా 73); చండీగఢ్: 300/7 (మనన్ వొహ్రా 117, అంకిత్ 78). ► మహారాష్ట్ర: 295/8 (రుతురాజ్ గైక్వాడ్ 102; వైభవ్ అరోరా 4/45); హిమాచల్ ప్రదేశ్: 236 (అభిమన్యు రాణా 46, రాజ్వర్ధన్ 4/42). ► పుదుచ్చేరి: 273/6 (పారస్ డోగ్రా 101, ); రాజస్తాన్: 274/4 (మనేందర్ సింగ్ 115). -
ఓపెనింగ్ చేస్తానని వేడుకున్నా: సచిన్
న్యూఢిల్లీ : మార్చి 27... 1994... భారత క్రికెట్ గతిని మార్చిన రోజుల్లో ఇది అత్యంత ప్రధానమైనది. ఇదే రోజున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలిసారి ఓపెనర్గా వచ్చాడు. న్యూజిలాండ్పై ఆక్లాండ్లో జరిగిన మ్యాచ్లో కేవలం 49 బంతుల్లో 82 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఆ తర్వాతదంతా తెలిసిన చరిత్రే. అప్పటివరకు మిడిలార్డర్లో ఆడిన తాను అనూహ్యంగా ఓపెనింగ్కు దిగేందుకు జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా ప్రాధేయపడినట్లు చెప్పాడు. నాటి మ్యాచ్లో తన బ్యాటింగ్ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ అనుభవాలు పంచుకున్నాడు. ‘అప్పటివరకు వన్డేల్లో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేసేవారు. ఓపెనింగ్కు దిగి నేను ఈ పద్ధతి మార్చాలనుకున్నా. ఇందుకోసం ఒక్క అవకాశం ఇమ్మంటూ, విఫలమైతే మళ్లీ అడగనంటూ జట్టు మేనేజ్మెంట్ను వేడుకోవాల్సి వచ్చింది. మ్యాచ్లో ప్రదర్శనతో నా ఓపెనింగ్పై మరో మాటకు తావు లేకపోయింది. అందుకనే... అభిమానులకు ఒక్కటే చెబుతున్నా. విఫలమవుతామనే భయంతో ప్రయోగాలకు వెనుకాడొద్దు’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. -
50 ఓవర్ల మ్యాచ్; 571 పరుగుల విజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్థానిక టోర్నీలో సంచలనం నమోదైంది. 50 ఓవర్ల మహిళల క్రికెట్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఒక జట్టు 571 పరుగుల తేడాతో విజయం సాధించింది . ఎస్ఏసీఏ పీసీ స్టేట్వైడ్ మహిళల ఫస్ట్గ్రేడ్ మ్యాచ్లో నార్తర్న్ డిస్ట్రిక్స్, పోర్ట్ అడిలైడ్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ డిస్ట్రిక్స్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 596 పరుగుల భారీ స్కోరు చేసింది. నలుగురు క్రీడాకారిణులు సెంచరీల మోత మోగించారు. టెగాన్ మెక్ఫార్లిన్ (80 బంతుల్లో 136), టాబీ సవిలీ (56 బంతుల్లో 120), శామ్ బెట్స్ (71 బంతుల్లో 124 నాటౌట్), డార్సీ బ్రౌన్ (84 బంతుల్లో 117 నాటౌట్) చెలరేగి ఆడారు. నార్తర్న్ డిస్ట్రిక్స్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనకు దిగిన పోర్ట్ అడిలైడ్ ఒత్తిడిలో కేవలం 10.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. ఇందులో ఎనిమిది మందే బ్యాటింగ్ చేయడం గమనార్హం. ప్రతిభా కపూర్ 9 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్గా నిలిచారు. -
వన్డేల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్
బులవాయో : జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్తాన్ ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా పాక్ ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్లు నిలిచారు. తొలి వికెట్కు 304 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన పాక్ ఓపెనర్లు.. గతంలో శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య-ఉపుల్ తరంగ కలిసి నెలకొల్పిన 284 పరుగులు అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని బద్ధలుకొట్టారు. 2006లో ఇంగ్లండ్పై లీడ్స్లో జరిగిన వన్డేలో లంక ఓపెనర్లు ఆ ఫీట్ నమోదు చేశారు. కాగా, నేడు 304 పరుగుల వద్ద సెంచరీ వీరుడు ఇమాముల్ హక్ (113: 122 బంతుల్లో 8 ఫోర్లు) ఔటైన తర్వాత జమాన్ మరింతగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఫఖర్ జమాన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి పాక్ క్రికెటర్గా జమాన్ (210 నాటౌట్; 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లు) నిలిచాడు. ఓవరాల్గా వన్డే క్రికెట్లో ద్విశతకాన్ని బాదిన ఆరో క్రికెటర్ జమాన్. వన్డౌన్ క్రికెటర్ అసిఫ్ అలీ (50 నాటౌట్; 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకం చేయడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లాడి కేవలం వికెట్ నష్టపోయి 399 పరుగులు సాధించింది. జింబాబ్వేకు 400 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఫఖర్ జమాన్ కంటే ముందు టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలతో పాటు న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్, వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్గేల్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నాలుగో వన్డేలోనూ జింబాబ్వే చిత్తు! 400 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జింబాబ్వే ఈ మ్యాచ్లోనూ దారుణంగా విఫలమైంది. పాక్ బౌలర్ షాదబ్ ఖాన్ (4/28) చెలరేగడంతో 42.4 ఓవర్లాడిన జింబాబ్వే కేవలం 155 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో నాలుగో వన్డేలో పాక్ 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ట్రిపానో (44), చిగుంబురా (37), పరవాలేదనిపించారు. ఓపెనర్ మసకద్జ (22), పీజే మూర్ (20) పరుగులు చేయగా, ఇతర బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో సిరీస్లో మరో దారుణ ఓటమి చవిచూసింది. నాలుగు వన్డేలు నెగ్గిన పాక్ చివరి మ్యాచ్లోనూ నెగ్గి 5-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేయాలని భావిస్తోంది. ఫఖర్ జమాన్(210 నాటౌట్)కు ముందు ఓ వన్డేలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన పాక్ క్రికెటర్గా సయీద్ అన్వర్ (194 పరుగులు) ఉన్నాడు. 1997లో భారత్పై అన్వర్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. తాజా మ్యాచ్లో మరో రికార్డు కూడా బద్దలైంది. గతంలో శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య-ఉపుల్ తరంగ కలిసి నెలకొల్పిన 284 పరుగులు అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని జమాన్-ఇమాముల్ హక్లు బద్దలుగొట్టారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 304 పరుగులు చేశారు. -
బంతి తీసుకున్నాడు... బరిలో నుంచి తప్పుకుంటాడా?
లీడ్స్: ఇంగ్లండ్తో మూడో వన్డే అనంతరం ఆటగాళ్లంతా మైదానాన్ని వీడుతున్న సమయంలో చోటుచేసుకున్న ఘటన బుధవారం తీవ్ర స్థాయి ఊహాగానాలకు తావిచ్చింది. అదేంటంటే, ఆట ముగిశాక డ్రెస్సింగ్ రూమ్కు వస్తూ భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని... అంపైర్లను అడిగి వారి నుంచి మ్యాచ్ బంతిని తీసుకున్నాడు. సరిగ్గా ఇదే విధంగా 2014లో ఆస్ట్రేలియాతో సిరీస్లో బెయిల్స్ను తీసుకున్న ధోని తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల పరిస్థితులకు తగినట్లు ఆడటం లేదంటూ విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రెండు ఘటనల మధ్య పోలిక మొదలైంది. ధోని పరిమిత ఓవర్ల క్రికెట్కూ త్వరలో వీడ్కోలు చెబుతాడంటూ మీడి యా హల్చల్ చేసింది. అయితే, ఎటువంటి సంచలన ప్రకటన రాకపోవడంతో చివరకు ఇదంతా ఊహాగానంగానే మిగిలిపోయింది. -
మ్యాచ్లో మ్యారేజ్ ప్రపోజల్..వైరల్!
-
8 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ
-
‘వాట్ ద హెల్.. అసలేం జరుగుతోంది’
ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసారంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆసీస్ జట్టుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన డే- నైట్ వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టిమ్ పెయిన్ సేన దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన కావడంతో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం షేన్వార్న్... ‘ఇప్పుడే నిద్ర లేచాను. ఇంగ్లండ్ స్కోరు చూశాను. అసలు అక్కడ ఏం జరుగుతోంది. వాట్ ద హెల్ అంటూ’ ట్వీట్ చేశాడు. ఇక ఆసీస్ మాజీ సారథి మైకేల్ క్లార్క్ కూడా ట్విటర్ వేదికగా తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాగా 1986లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 206 పరుగులతో ఓడిన ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్తో ఆ రికార్డును అధిగమించి మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. Just woke up and saw the score in England. What the hell happened over there & what is going on boys ? Gulp..... — Shane Warne (@ShaneWarne) June 19, 2018 Morning 🏏🤦♂️ — Michael Clarke (@MClarke23) June 19, 2018 -
వన్డే క్రికెట్లో పెను సంచలనం.!
నాటింగ్హామ్: 50 ఓవర్లలో 41 ఫోర్లు, 21 సిక్సర్లతో ఏకంగా 481 పరుగులు... ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై సృష్టించిన వీర విధ్వంసం ఇది. ఆస్ట్రేలియాపై సునామీలా విరుచుకుపడిన మోర్గాన్ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే–నైట్ మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా ఇప్పటి వరకు తమ పేరిటే ఉన్న 444 పరుగుల (2016లో పాకిస్తాన్పై) రికార్డును తుడిచి పెట్టింది. అలెక్స్ హేల్స్ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్ బెయిర్స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో విరుచుకు పడగా... జేసన్ రాయ్ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్తో తమ వంతు పాత్ర పోషించారు. మ్యాచ్లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం. ఇంగ్లండ్ ధాటికి ఆసీస్ బౌలర్లలో టై అత్యధికంగా 100 పరుగులు సమర్పించుకోగా, రిచర్డ్సన్ 92, స్టొయినిస్ 85 పరుగులు ఇచ్చారు. 46 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 450 వద్ద నిలిచింది. బ్యాటింగ్ జోరు చూస్తే స్కోరు 500 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే చివరి నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా లేకుండా 31 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్... వరుస బంతుల్లో హేల్స్, మోర్గాన్ వికెట్లు కూడా తీయడంతో స్కోరు 481కే పరిమితమైంది. 482 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రషిద్ (4/47) దెబ్బకు 239 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ (51), స్టోయినీస్ (44)లు టాప్ స్కోరర్లుగా నిలిచారు. 5 వన్డేల సిరీస్లో 3-0తో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)