-
ట్రంప్పై ఆ పబ్లిషర్ మండిపాటు..
న్యూయార్క్ : మీడియా, పాత్రికేయులపై దాడి ప్రమాదకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో న్యూయార్క్ టైమ్స్ పబ్లిషర్ ఏజీ సబెర్గర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడి మీడియా వ్యతిరేక వైఖరి సరైంది కాదని, ఇది వైరుధ్యాలను పెంచడంతో పాటు దేశానికి ప్రమాదకరమని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇటీవల వైట్హోస్లో భేటీ సందర్భంగా తాను ఆయనతో ఈ అంశాలపై చర్చించానని న్యూయార్క్ టైమ్స్ ప్రచురణకర్త ఓ ప్రకటనలో వెల్లడించారు. తమ ప్రైవేట్ భేటీ వివరాలను ట్రంప్ తన ట్విటర్ ఫాలోవర్లకు వెల్లడించడంతో దీనిపై తాను బహిరంగంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. జులై 20న జరగిన ఈ భేటీని బహిర్గతం చేయవద్దని ట్రంప్ సహచరులు తనను కోరారన్నారు. కాగా సబెర్గర్తో సమావేశం ఆసక్తికరంగా సాగిందని, మీడియాలో వెల్లువెత్తుతున్న ఫేక్ న్యూస్పై విస్తృతంగా చర్చించామని ట్రంప్ ట్వీట్ చేశారు. మీడియాపై విరుచుకుపడుతూ ట్వీట్ల పరంపర సాగించారు. మీడియాపై ట్రంప్ ఎదురుదాడి, ఆయన అనుసరిస్తున్న మీడియా వ్యతిరేక వైఖరి నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడితో భేటీకి తాను అంగీకరించానని న్యూయార్క్ టైమ్స్ పబ్లిషర్ చెప్పుకొచ్చారు. ఫేక్న్యూస్ అవాస్తవమని తాను ట్రంప్తో స్పష్టం చేయడంతో పాటు జర్నలిస్టులను ప్రజల శత్రువులుగా ఆయన ముద్రవేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు జర్నలిస్టులపై దాడులకు ప్రేరేపిస్తాయని, హింసకు దారితీస్తాయని ట్రంప్కు తెలిపానని వెల్లడించారు. -
పవర్ఫుల్ లేడీగా మరయమ్
లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరయమ్ నవాజ్కు అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్ టైమ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. 2017 ఏడాదికిగానూ ది న్యూయార్క్ టైమ్స్ 11 మంది మహిళల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేయగా.. అందులో మరయమ్కు చోటు దక్కింది. తండ్రి షరీఫ్ కుడి భుజంగా వ్యవహరిస్తూ పాక్ రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమెపై ప్రశంసలు గుప్పించింది. ముఖ్యంగా ఎన్ఏ-120 నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమె చేసిన ప్రచారం గురించి ప్రముఖంగా ప్రచురించింది. ఆ ప్రభావంతోనే ఆ స్థానంలో నవాజ్ భార్య కుల్సుం నవాజ్ ఘన విజయం సాధించారని తెలిపింది. కాగా, పనామా పత్రాల ఆరోపణలతో షరీఫ్ గద్దెదిగి పోగా.. పార్టీ వ్యవహారాలను మరయమ్ చూసుకుంటున్నారు.. ఇక న్యూయార్క్ టైమ్స్ లిస్ట్లో ఉన్న మరికొందరు. హెండా అయారి, మార్గొట్ వాల్స్ట్రోమ్, యూ క్సియుహువా, మనాల్ అల్ షరీఫ్, ఎమ్మా మోరానో, ఓలైవ్ యాంగ్, అస్లి ఎర్దోగన్, లెటిజియా బట్టగ్లియా, సింటా నూరియా, అలైస్ స్చ్వార్జర్ ఉన్నారు. -
ట్రంప్ తొలగింపునకు సమయం ఆసన్నమైందా?
-
ట్రంప్ తొలగింపునకు సమయం ఆసన్నమైందా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలగింపునకు సమయం దగ్గరపడుతోందా?. అమెరికన్ పత్రికల్లో వస్తున్న సంచలన కథనాలు ట్రంప్ త్వరలోనే ఉద్వాసనకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న రష్యా అధికారులతో దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని ట్రంప్ పంచుకున్నారని వాషింగ్టన్ పోస్టులో ఓ రిపోర్టు వచ్చింది. దీన్ని తొలుత వైట్హౌస్ తోసి పుచ్చింది. తర్వాత స్వయంగా ట్రంపే.. ఐతే తప్పేంటి. దేశాధ్యక్షుడిగా ఉగ్రవాదంపై మిత్ర దేశానికి సమాచారం ఇవ్వడంలో తప్పులేదని తనను తాను సమర్ధించుకున్నారు. తాజాగా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లైన్పై విచారణను నిలిపివేయాలని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీని ట్రంప్ కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ సంచలన వార్తను ప్రచురించింది. డైరెక్టర్ పదవి నుంచి తప్పించకముందు వరకూ ట్రంప్, ఫ్లైన్ల మధ్య జరిగిన పూర్తి సంభాషణల వివరాలు కామీ వద్ద ఉన్నాయని పేర్కొంది. అయితే, కామీ రాసుకున్న నోట్స్ తమ చేతిలో లేదని.. ఓ సోర్స్ ద్వారా కామీ నోట్స్ను పూర్తిగా చదివినట్లు రిపోర్టులో పేర్కొంది. ఫిబ్రవరి 14న జరిగిన ఓ సమావేశంలో కామీని కలుసుకున్న ట్రంప్.. 'ఫ్లైన్ మంచివాడు, అతని వదిలేస్తావని ఆశిస్తున్నా' అని మాట్లాడినట్లు చెప్పింది. మహాభియోగం తప్పదా? కథనంపై స్పందించిన వైట్ హౌస్.. అధ్యక్షుడిపై అసత్య ప్రచారం చేయడం తగదని వ్యాఖ్యానించింది. జనరల్ ఫ్లైన్ దేశ రక్షణ కోసం ఎంతో కృషి చేశారని చెప్పింది. ఫ్లైన్పై విచారణను నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్ కామీ లేదా మరే ఇతర వ్యక్తిని కోరలేదని పేర్కొంది. కాగా, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారని.. కానీ కొద్ది రోజులకే రాజద్రోహం కింద అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతారని ప్రొఫెసర్ అలన్ లిట్చ్మన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఓ పత్రికకు ఇంటర్వూలో ఇచ్చిన లిట్చ్మన్ ట్రంప్పై మహాభియోగ తీర్మానం ప్రవేశపెడతారని పేర్కొన్నారు. -
అరెరె.. ఆమె డిగ్గీరాజా కూతురు కాదే!
కూతురితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయండి.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ను ఇరకాటంలో పెట్టింది. ఏడు పదుల వయసుకు దగ్గరలో పడిన డిగ్గీరాజా.. ఇటీవలే నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టును త్వరలోనే పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సరిగ్గా వాటినే చూసిన అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తప్పులో కాలేసింది. ఆమెను మన డిగ్గీ రాజాకు కూతురు అనుకుని, వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీని 'సెల్ఫీ విత్ డాటర్' విభాగంలోకి చేర్చేసింది. ఈ విషయాన్ని ఒకరు కనిపెట్టేసి.. దాన్ని ట్వీట్ చేశారు. డిగ్గీరాజా ఈ కాన్సెప్టును తప్పుగా అర్థం చేసుకున్నారని, సెల్ఫీ విత్ డాటర్ అన్నారు తప్ప కూతురి వయసున్న గర్ల్ఫ్రెండ్తో సెల్ఫీ కాదని అన్నారు. చాలామంది తండ్రులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించి ఇలా తమ కూతుళ్లతో సెల్ఫీలు తీసుకున్నారనే కథనంలో మరికొన్ని ఇతర ఫొటోలతో కలిపి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిగ్గీ రాజా ఫొటోను కూడా ప్రచురించేసింది. అయితే దీనిపై అటు దిగ్విజయ్ సింగ్ నుంచి గానీ, అమృతా రాయ్ నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు. -
‘పిచ్చుక’కు న్యూయార్క్ టై మ్స్లో చోటు
పెడన, న్యూస్లైన్ : పెడనలో ప్రముఖ కలంకారీ వ్యాపార వేత్త పిచ్చుక శ్రీనివాసరావు తయారు చేసిన వ స్త్రాలపై ‘న్యూయార్క్ టైమ్’ పత్రికలో కథనం చోటుచేసుకుంది. అమెరికాలో లెస్ ఇండియన్స్ షో రూంలో పెడన కలంకారీ వస్త్రాలను అమ్మకానికి ఇటీవల ప్రదర్శించారని, పెడన కలంకారీ వస్త్రాలతో తయారు చేసిన ఫిల్లో కవర్ల ఫొటోతో ఉన్న ఆర్టికల్ను 11వ తేదీన న్యూయార్క్టైమ్స్లో ప్రచురించారని పిచ్చుక తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన చిరకాలవాంఛ నెరవేరిందని చెప్పారు. కలంకారీ ముడి వస్త్రాలను చెన్నయ్ నుంచి దిగుమతి చేసుకుని కరక్కాయ, కుంకుడు కాయలతో వస్త్రాలను నానాబెట్టి వాటిని ఉడకబెట్టి వస్త్రాన్ని రంగు మారేలా తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత ప్రవాహించే నది నీటిలో వస్త్రాలను ఉతికి ఆరబెట్టి వస్త్రాలపై వెజిటబుల్స్తో తయారు చేసిన సహజసిద్ధమైన రంగులను ముద్రించేందుకు సిద్ధం చేస్తామని చెప్పారు. ఆ వస్త్రాలపై దేశ ,విదేశీ ప్రముఖులతో డిజైనింగ్ చేయించి తయారు చేస్తామని, ఇంటి వద్దనే బెడ్ షీట్లు, పిల్లో కవర్లు, హ్యాండ్ కట్ చీప్లు, చీరలు, డోర్ కర్టెన్లు తదితర రకాల వస్త్రాలను తయారుచేస్తామని తెలిపారు. జపాన్, జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలకు ఐదేళ్లనుంచి ఎగుమతి చేస్తున్నామని... ఈ విషయాలన్నీ ఆ పత్రికలో ప్రచురించారని శ్రీనివాసరావు వివరించారు.