-
ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మ్యాచ్ ‘డ్రా’
లీప్జిగ్ (జర్మనీ): ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో గోల్ నమోదు కాని తొలి ‘డ్రా’ నమోదైంది. అదీ యూరోప్లోని రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్లో కావడం విశేషం. శనివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. హోరాహోరీ సమరంలో ఇరు జట్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే మ్యాచ్ కీలక దశలో నెదర్లాండ్స్ను దురదృష్టం వెంటాడింది. డచ్ ప్లేయర్ గ్జెవీ సైమన్స్ చేసిన గోల్ను రిఫరీ తిరస్కరించాడు. సుదీర్ఘ సమయం పాటు వీడియో రీప్లేలు చూసిన తర్వాత ఆ గోల్ను ‘ఆఫ్సైడ్’గా ప్రకటించారు. మరో వైపు తమ స్టార్ ప్లేయర్ ఎంబాపె లేకుండా ఫ్రాన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. మరో మ్యాచ్లో పోర్చు గల్ 3–0 గోల్స్ తేడాతో టర్కీని చిత్తు చేసింది. -
T20 WC: రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ క్రికెటర్
నెదర్లాండ్స్ క్రికెటర్ సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ ఓటమి తర్వాత సిబ్రాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా సౌతాఫ్రికాలోని జొహన్నస్బర్గ్లో 1988లొ జన్మించిన సిబ్రాండ్.. అక్కడే క్రికెటర్గా మారాడు.విరాట్ కోహ్లి క్యాచ్ అందుకునిఅండర్-19 ప్రపంచకప్-2008లో సౌతాఫ్రికా తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. నాడు యువ భారత్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్ను అద్భుత రీతిలో అందుకున్నాడు.జాంటీ రోడ్స్ మాదిరి క్యాచ్ పట్టాడంటూ అప్పట్లో సిబ్రాండ్పై ప్రశంసలు కురిశాయి. ఇక తర్వాత సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో కేప్ కోబ్రాస్(2008/09, 2015/16), వెస్టర్న్ ప్రావిన్స్(2009/10 to 2016/17) జట్లకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించాడు.చాంపియన్స్-2014 లీగ్లో భాగంగా కోబ్రాస్ తరఫున.. జేపీ డుమిన్ స్థానంలో బరిలోకి దిగి.. సూపర్ ఓవర్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అయితే, ఆ తర్వాత ఉన్నత విద్యనభ్యసించడంపై దృష్టి పెట్టిన సిబ్రాండ్ క్రికెట్కు విరామం ఇచ్చాడు.ఉద్యోగం కోసం అక్కడికిఎంబీఏ చేసేందుకు ఆటను పక్కనపెట్టి.. చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో ఉద్యోగ విధుల నిమిత్తం 2021లో నెదర్లాండ్స్కు మకాం మార్చాడు. అక్కడ క్లబ్ క్రికెట్ ఆడిన సిబ్రాండ్.. డచ్ టాప్క్లాసెస్ చాంపియన్షిప్-2023లో వూబర్గ్ సీసీ కెప్టెన్గా వ్యవహరించాడు.ఈ నేపథ్యంలో 2023లో వన్డే వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2024లో టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన సిబ్రాండ్.. ప్రపంచకప్-2024 జట్టులోనూ భాగమయ్యాడు.ఇక ఇప్పటి వరకు మొత్తంగా డచ్ జట్టు తరఫున 12 వన్డేలు, 12లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఆయా ఫార్మాట్లలో 385, 280 పరుగులు చేశాడు. ఇక రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన 35 ఏళ్ల సిబ్రాండ్ టీ20లలో 5 వికెట్లు కూడా పడగొట్టాడు.టీ20 వరల్డ్కప్-2024 - గ్రూప్-డి శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్👉వేదిక: సెయింట్ లూసియా, వెస్టిండీస్👉టాస్: నెదర్లాండ్స్.. తొలుత బౌలింగ్👉శ్రీలంక స్కోరు: 201/6 (20)👉నెదర్లాండ్స్ స్కోరు: 118 (16.4)👉ఫలితం: 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసిన శ్రీలంక👉ఈ మ్యాచ్లో సిబ్రాండ్ చేసిన పరుగులు: 11.చదవండి: అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్ -
వెఘొర్స్ 'సూపర్ గోల్'.. నెదర్లాండ్స్ సంచలన విజయం
యూరో కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం హాంబర్గ్ వేదికగా పోలాండ్తో జరిగిన మ్యాచ్లో 2-1తో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ గేమ్లో ఆఖరికి విజయం డచ్ జట్టునే వరించింది.తొలుత ఫస్ట్హాఫ్ 16వ నిమిషంలో ఆడమ్ బుకస పోలండ్కు మొదటి గోల్ను అందించాడు. అనంతరం 29వ నిమిషంలో నెదర్లాండ్స్ ఫార్వర్డ్ కోడి గక్పో అద్బుతమైన గోల్ కొట్టి స్కోర్ను 1-1తో సమం చేశాడు.ఫస్ట్హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో బ్రేక్ సమయంలో పొలాండ్ మేనెజర్ మిచాల్ ప్రోబియర్జ్ తమ జట్టులో ఒక మార్పు చేశాడు. జాకుబ్ మోడర్కు బదలుగా ఇంపాక్ట్ సబ్గా స్జిమాన్స్కీ జాకుబ్ తీసుకువచ్చాడు.కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ప్రోబియర్జ్ మళ్లీ 10 నిమిషాల తర్వాత మరో రెండు మార్పులు చేశాడు. కానీ ఫలితం ఏ మాత్రం మారలేదు. ఇక సెకెండ్ హాఫ్ ముగిసే సమయం దగ్గరపడుతుండడంతో 1-1 డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు.వౌట్ వెఘొర్స్ అద్బుతం..ఈ క్రమంలో డచ్ మేనేజర్ రోనాల్డ్ కోమాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆఖరి బ్రేక్ సమయంలో రోనాల్డ్ కోమాన్.. మెంఫిస్ డిపే స్థానంలో వౌట్ వెఘోర్స్ట్ని ఇంపాక్ట్ సబ్స్ట్యూట్గా తీసుకువచ్చాడు.మైదానంలో అడుగపెట్టిన వెఘొర్స్.. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా 83వ నిమిషంలో గోల్కొట్టి డచ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోగా.. పొలాండ్ నిరాశలో కూరుకు పోయింది.చదవండి: ఆర్చరీలో భారత్కు ఒలింపిక్ బెర్త్ -
T20 World Cup 2024: సూపర్-8లో చివరి బెర్త్ నేడు (జూన్ 16) ఖరారు
టీ20 వరల్డ్కప్ 2024లో చివరి బెర్త్ నేడు (జూన్ 16) ఖరారు కానుంది. గ్రూప్-డి నుంచి రెండో స్థానంలో నిలిచే జట్టేదో ఇవాళ జరిగే మ్యాచ్లతో తేలిపోనుంది. గ్రూప్-డి నుంచి సూపర్-8 రేసులో ఉన్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ నేడు వేర్వేరు జట్లతో తలపడనున్నాయి.సెయింట్ విన్సెంట్ వేదికగా జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ నేపాల్తో తలపడనుండగా.. సెయింట్ లూసియా వేదికగా జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్.. శ్రీలంకను ఢీకొట్టనుంది. నేపాల్పై బంగ్లాదేశ్ గెలిస్తే నెదర్లాండ్స్-శ్రీలంక మ్యాచ్తో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ సూపర్-8లోకి ప్రవేశిస్తుంది. ఒక వేళ నేపాల్ చేతిలో బంగ్లాదేశ్ ఓడి.. శ్రీలంకపై నెదర్లాండ్స్ గెలిస్తే నెదర్లాండ్స్ సూపర్-8కు అర్హత సాధిస్తుంది. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సూపర్-8లోకి ప్రవేశించింది.బంగ్లాదేశ్-నేపాల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం కానుండగా.. నెదర్లాండ్స్-శ్రీలంక మ్యాచ్ రేపు ఉదయం 6 గంటలకు మొదలవుతుంది.ఈ రెండు మ్యాచ్లతో పాటు ఇవాళ మరో మ్యాచ్ కూడా జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్-ఐర్లాండ్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-ఏ నుంచి భారత్, యూఎస్ఏ ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది.సూపర్-8కు అర్హత సాధించిన జట్లు..గ్రూప్-ఏ నుంచి భారత్, యూఎస్ఏగ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్/నెదర్లాండ్స్సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
T20 WC 2024: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్
కింగ్స్టౌన్: టి20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ గెలిచి నిలిచింది. సూపర్–8 అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు గురువారం జరిగిన పోరులో బంగ్లా 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ గెలుపుతో గ్రూప్ ‘డి’లోని మరో జట్టు శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన డచ్ జట్టు ఫీల్డింగ్కు మొగ్గుచూపగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (46 బంతుల్లో 64 నాటౌట్; 9 ఫోర్లు) రాణించాడు. టాపార్డర్లో కెపె్టన్ నజ్ముల్ హోస్సేన్ (1), లిటన్ దాస్ (1)ల వైఫల్యంతో 23 పరుగులకే బంగ్లా 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ తంజిద్ హసన్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షకీబ్ మూడో వికెట్కు 48 పరుగులు జోడించాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.ఆఖర్లో మహ్మూదుల్లా (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు), జాకిర్ అలీ (7 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. సైబ్రాండ్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), విక్రమ్జీత్ సింగ్ (16 బంతుల్లో 26; 3 సిక్స్లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (23 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ కీలకమైన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. రిషాద్ హోస్సేన్ 3, టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. టి20 ప్రపంచకప్లో నేడుఅఫ్గానిస్తాన్ X పాపువా న్యూగినీ వేదిక: ట్రినిడాడ్; ఉదయం గం. 6 నుంచిఅమెరికా X ఐర్లాండ్ వేదిక: లాడెర్హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2024: రాకాసి బౌన్సర్.. తృటిలో తప్పిన అపాయం
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య ఇవాళ (జూన్ 13) జరుగుతున్న కీలక మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ పేసర్ వివియన్ కింగ్మా సంధించిన రాకాసి బౌన్సర్ను ఎదుర్కొనే క్రమంలో బంగ్లా బ్యాటర్ తంజిద్ హసన్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్ 3వ ఓవర్లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.ఇంతకీ ఎం జరిగిందంటే.. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. బంగ్లా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి తంజిద్ హసన్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. డచ్ పేసర్ వివియన్ కింగ్మా సంధించిన రాకాసి బౌన్సర్ను ఎదుర్కొనే క్రమంలో బంతి తంజిద్ హెల్మెట్ గ్రిల్లో ఇరుక్కుపోయింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఒకవేళ బంతి ఇంకాస్తా వేగంగా వచ్చి ఉంటే హెల్మెట్ గ్రిల్ లోనుంచి దూసుకుపోయి తంజిద్ కంటికి పెద్ద గాయం చేసేది. ఊహించని ఈ ఘటనలో తంజిద్ షాక్కు గురయ్యాడు. కొద్ది సేపటి వరకు అతనికి ఏమీ అర్దం కాలేదు. బంతి కంటి దగ్గరకు రావడంతో కళ్లు మూసుకున్న తంజిద్, కొద్ది సేపటి తర్వాత కళ్లు తెరిచి చూసే సరికి అంగులాల దూరంలో బంతి ఉంది. షాక్ నుంచి తేరుకున్న తంజిద్ వెంటనే హెల్మెట్ తీసి నేలపై పెట్టాడు. ఫిజియో హుటాహుటిన మైదానంలోకి వచ్చి తంజిత్కు ఫస్ట్ ఎయిడ్ అందించాడు.కాగా, ఈ ఘటన తర్వాత మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన తంజిద్ 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి ముందు ఆర్యన్ దత్ (2 వికెట్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తంజిద్.. షకీబ్ సాయంతో బంగ్లా ఇన్నింగ్స్ను నిర్మించాడు. 17.2 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 130/4గా ఉంది. షకీబ్ (50), మహ్మదుల్లా (25) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్లో షాంటో (1), లిటన్ దాస్ (1), తౌహిద్ హ్రిదోయ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. డచ్ బౌలర్లలో వివియర్ కింగ్మా 2, పాల్ వాన్ మీకెరెన్, టిమ్ ప్రింగిల్ తలో వికెట్ పడగొట్టారు. -
T20 World Cup 2024: నెదర్లాండ్స్-బంగ్లాదేశ్ 'కీ' ఫైట్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 13) బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. కింగ్స్టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8కు చేరే క్రమంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతానికి ఇరు జట్లు చెరి రెండు మ్యాచ్లు ఆడి తలో మ్యాచ్లో గెలిచి గ్రూప్-డిలో రెండు (బంగ్లాదేశ్), మూడు (నెదర్లాండ్స్) స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టాప్ ప్లేస్లో ఉన్న సౌతాఫ్రికాతో పాటు సూపర్-8కు చేరే అవకాశాలు అధికంగా ఉంటాయి. నేటి మ్యాచ్ కోసం బంగ్లాదేశ్.. గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. నెదర్లాండ్స్ ఓ మార్పు చేసింది. గత మ్యాచ్లో ఆడిన తేజ నిడమానూరు స్థానంలో ఆర్యన్ దత్ను బరిలోకి దించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మాబంగ్లాదేశ్: తంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), లిట్టన్ దాస్(వికెట్కీపర్), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్ -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
న్యూయార్క్: టి20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చెమటోడ్చి రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన పోరులో సఫారీ 4 వికెట్లతో నెదర్లాండ్స్ను ఓడించింది. టాస్ నెగ్గిన సఫారీ ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకేల్ లెవిట్ (0), మ్యాక్స్ ఓ డౌడ్ (2) సహా టాపార్డర్లో విక్రమ్జీత్ (12) కూడా నిరాశపరిచారు. ఈ దశలో సైబ్రాండ్ (45 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ లొగాన్ వాన్ బిక్ (23; 3 ఫోర్లు) అండతో జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఐదో ఓవర్ ముగియకముందే 12 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో వన్డే వరల్డ్కప్ మ్యాచ్ ఫలితం పునరావృతమవుతుందేమో అనిపించింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్ (37 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్)కు జతయిన మిల్లర్ (51 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) ఐదో వికెట్కు 65 పరుగులు జోడించి పరిస్థితి చక్కబెట్టాడు. అనంతరం అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా నెదర్లాండ్స్తో ఇవాళ (జూన్ 8) జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగారు. ఓట్నీల్ బార్ట్మన్ (4-0-11-4), అన్రిచ్ నోర్జే (4-0-19-2), మార్కో జన్సెన్ (4-0-20-2) ధాటికి నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్.. సౌతాఫ్రికా పేసర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో సైబ్రాండ్ ఎంజెల్బ్రెట్చ్ (40), లొగాన్ వాన్ బీక్ (23) రాణించకపోయంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో సైబ్రాండ్, వాన్ బీక్తో పాటు విక్రమ్జీత్ (12), స్కాట్ ఎడ్వర్డ్స్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లెవిట్ 0, మ్యాక్స్ ఓడౌడ్ 2, బాస్ డి లీడ్ 6, తేజ నిడమనూరు 0, టిమ్ ప్రింగిల్ 0, వాన్ మీకెరన్ 1 నాటౌట్ పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, కేశవ్ మహారాజ్లకు వికెట్లు దక్కనప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన బార్ట్మన్ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.కాగా, గ్రూప్-డిలో భాగమైన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా.. శ్రీలంకపై విజయం సాధించగా..నెదర్లాండ్స్.. నేపాల్ను మట్టికరిపించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్కీపర్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మాదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ -
T20 World Cup 2024: సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 8) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో నెదర్లాండ్స్-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్-డిలో భాగమైన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన చెరో మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా.. శ్రీలంకపై విజయం సాధించగా..నెదర్లాండ్స్.. నేపాల్ను మట్టికరిపించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్కీపర్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మాదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ -
టీ20 వరల్డ్కప్ 2024లో నేటి (జూన్ 4) మ్యాచ్లు
టీ20 వరల్డ్కప్ 2024లో ఇవాళ (జూన్ 4) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. పసికూన స్కాట్లాండ్తో తలపడనుండగా.. గ్రూప్-డిలో భాగంగా నెదర్లాండ్స్-నేపాల్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్-నేపాల్ సమరం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు పూర్తయ్యాయి. డల్లాస్లో జరిగిన తొలి మ్యాచ్లో కెనడాపై యూఎస్ఏ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. గయానాలో జరిగిన రెండో మ్యాచ్లో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో చెమటోడ్చి నెగ్గింది.బార్బడోస్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో ఒమన్పై నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించగా.. న్యూయార్క్లో జరిగిన నాలుగో మ్యాచ్లో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. తాజాగా గయానా వేదికగా జరిగిన ఐదో మ్యాచ్లో ఉగాండపై ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మెగా టోర్నీలో భారత తొలి మ్యాచ్ న్యూయార్క్ వేదికగా రేపు జరుగనుంది. ఐర్లాండ్తో జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్లో జరుగనుంది. -
T20 World Cup 2024: లంకేయులకు షాక్.. పసికూన చేతిలో పరాభవం
శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మైఖేల్ లెవిట్ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లెవిట్తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (12 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్ తుషార, దునిత్ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. లంక ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హసరంగ బ్యాట్ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్ షనక (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్ క్లెయిన్ 2, లొగాన్ వాన్ బీక్ ఓ వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ తమ రెండో వార్మప్ మ్యాచ్ను మే 30న ఆడనుంది. డల్లాస్లో జరిగే ఈ మ్యాచ్లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్ మ్యాచ్ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్లో లంకేయులు ఐర్లాండ్తో తలపడతారు. ప్రపంచకప్లో శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు గ్రూప్-డిలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్ 9న న్యూయార్క్లో జరుగనుంది. -
బహిరంగ ప్రదేశాల్లో సన్స్క్రీన్ వెండింగ్ మెషీన్స్.. ఎక్కడో తెలుసా?
సన్స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లడమా..! నో వే..అంటారు అమ్మాయిలు కదా. చర్మ కేన్సర్ బారిన పడకుండా రక్షించుకునేందుకు ఇది మేలైన మార్గం కూడా. అయితే హడావుడిలోనో.. లేదా ఖర్చు అవుతుందనో కొంతమంది సన్ స్క్రీన్ను పెద్దగా వాడరు. బహుశా అలాంటి వారి కోసమేనేమో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సన్స్క్రీన్ ను అందించే ఏర్పాట్లు చేసింది. తద్వారా ప్రజలను కేన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిస్తోంది. భూ ఉత్తరార్ధగోళంలో న్ని చోట్ల సూర్యకిరణాల్లో హానికారక అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సన్స్క్రీన్ డిస్పెన్సర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా వేదికలు, ఉద్యానవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సన్ క్రీమ్ డిస్పెన్సర్లను అందుబాటులో ఉంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 80 లక్షల మంది చూసేశారు. చర్మ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేలా చూడాలని నెదర్లాండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇటీవలి సంవత్సరాలలో చర్మ కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే, పళ్లు తోముకున్నట్లే చిన్నప్పటి నుండే సన్స్క్రీన్ను అప్లై చేయడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల మాట.Free sunscreen vending machines have begun to be placed in public areas in the Netherlands.pic.twitter.com/XVXjcI2Pwa— The Best (@ThebestFigen) May 16, 2024> అయితే ట్వీపుల్ మాత్రం భిన్నంగా స్పందించారు. అద్భుతం.. ఉచితంగా ఇస్తే ఇంకా మంచిదని కొందరనగా, ఇవి ఫ్రీ కేన్స్ర్ మెషీన్స్ అంటూ వ్యంగ్యంగా మరికొందరు కమెంట్ చేశారు. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, సూర్యుడు మన శరీరంలోని చొచ్చుకెళ్లే రసాయనాలను నాశనం చేసేలా చేద్దాం అంటూ మరికొరు సమాధానమిచ్చారు. -
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
రోబో తోటమాలి!
కృత్రిమ మేధ ఇందుగలదు, అందులేదనే సందేహానికి తావులేకుండా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం ఇంతింతై... అన్నట్టుగా క్రమంగా పెరిగిపోతోంది. వ్యవసాయంలో కూడా ఇప్పటికే కృత్రిమ మేధను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్లో తులిప్స్ రైతులు ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేశారు. తెగుళ్ల బారిన పడ్డ పూల ఏరివేతకు హైటెక్ బాట పట్టారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు ఏఐ సాయంతో రూపొందిన రోబోను ఉపయోగిస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువే అయినా ఈ రోబో మనుషులకు ఏమాత్రంతీసిపోకుండా పని పూర్తి చేస్తూ మన్ననలు అందుకుంటోంది. దాంతో నెదర్లాండ్స్ అంతటా తులిప్ తోటల్లో ఈ రోబోల వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందాల తులిప్ పూలకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తులిప్స్ ఉత్పత్తిదారు కూడా. సీజన్లో విరగబూసి అందాలు వెదజల్లే అక్కడి తులిప్ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బారులు తీరతారు. ఇలా తులిప్స్ సాగు ఉత్పత్తిపరంగానే గాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం. పూలను, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వైరస్లు, తెగుళ్ల బారిన పడ్డ పూలు, మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఏరివేయడం చాలా కీలకం. లేదంటే మొక్కలు బలహీనపడిపోతాయి. పూలు కూడా చిన్నగా, బలహీనంగా పూస్తాయి. పైగా వైరస్ తోటంతా విస్తరించి మొత్తానికే చేటు తప్పదు. ఇప్పటిదాకా మనుషులే రాత్రింబవళ్లూ తోటల్లో కలియదిరుగుతూ ఒక్కో మొక్కనూ, పువ్వునూ పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరేసేవారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. వారిని సిక్నెస్ స్పాటర్స్గా పిలిచేవారు. కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి దీటుగా ఈ పని చేసి పెడుతోంది. తులిప్ తోటలను తెగుళ్ల బారినుంచి కాపాడే హైటెక్ ఆయుధంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఏఐ రోబోలు తులిప్ తోటలను కాపు కాస్తున్నాయి. చీడపీడలు, రోగాల బారినుంచి వాటిని కాపాడే పనిలో తలమునకలుగా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇలా పని చేస్తుంది... ► ఏఐ రోబో తులిప్ తోటల్లో ఒక్కో సాలు గుండా గంటకు కిలోమీటర్ వేగంతో నింపాదిగా కదులుతుంది. ►ఒక్కో మొక్కనూ, ఒక్కో పూవునూ, దాని తాలూకు రెమ్మలను అణువణువూ పరీక్షిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వేలాది పొటోలు తీస్తుంది. ►తనలో స్టోరై ఉన్న సమాచారం సాయంతో ఆ ఫొటోలను కూలంకషంగా విశ్లేషిస్తుంది. తద్వారా సదరు మొక్క, పూవు పాడైందీ, బాగున్నదీ నిర్ణయిస్తుంది. ►పాడైనవాటిని ఎప్పటికప్పుడు ఏరేస్తూ ముందుకు సాగుతుంది. ►ఈ రోబోలను తయారు చేసింది హెచ్2ఎల్ రోబోటిక్స్ లిమిటెడ్కు చెందిన ఎరిక్ డీ జోంగ్ కంపెనీ. ►తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు, పూలను పక్కగా గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతటినీ రోబోకు ఫీడ్ చేసినట్టు కంపెనీ వివరించింది. ►ఈ సమాచారాన్ని తులిప్స్ సాగు చేసే రైతులు, సిక్నెస్ స్పాటర్ల నుంచి కంపెనీ సేకరించింది. కచ్చితత్వంతో కూడిన సాగు... అలెన్ విసర్ అనే ఆసామి తన తులిప్ తోటలో రెండేళ్లుగా ఏఐ రోబోను వాడుతున్నాడు. ఆయన కుటుంబం మూడు తరాలుగా తులిప్స్సాగు చేస్తోంది. ‘‘ఈ రోబో ఖరీదు 2 లక్షల డాలర్లు! అంత డబ్బుతో ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారే కొనుక్కోవచ్చు’’ అన్నాడాయన. అయితే, ‘స్పోర్ట్స్ కారు పాడైన తులిప్లను ఏరిపడేయదు కదా!’ అంటూ చమత్కరించాడు. ‘‘ఈ రోబో ఖరీదైనదే. కానీ నిపుణులైన సిక్నెస్ స్పాటర్లు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో సరిగ్గా చేతికి అందివచ్చింది’’ అని చెప్పాడు. దీన్ని ‘కచ్చితత్వంతో కూడిన సాగు’గా అభివరి్ణంచాడు! కొసమెరుపు నెదర్లాండ్స్ ఉత్తర కోస్తా తీరంలో ప్రఖ్యాత డబ్ల్యూఏఎం పెన్సింగ్స్ తులిప్ తోటలోని ఏఐ రోబోకు అక్క డే జీవితాంతం సిక్నెస్ స్పాటర్గా పని చేసి రిటైరైన థియో వాన్డర్ వూర్ట్ పేరు పెట్టారు. దీని పనితీరు ఆయన్ను కూడా మెప్పించడం విశేషం. ‘‘తోటల్లో తిరిగీ మా నడుములు పడిపోయేవి! మా పనిని ఈ రోబో అలవోకగా చేసేస్తోంది. పాడైన మొ క్కలు, పూలను మాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా గుర్తించి ఏరేస్తోంది’’ అంటూ కితాబిచ్చాడాయన! -
ఉత్కంఠ సమరం.. నెదర్లాండ్స్ బ్యాటర్ల విధ్వంసం.. ముక్కోణపు సిరీస్ కైవసం
నేపాల్లో జరిగిన ముక్కోణపు సిరీస్ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. నేపాల్తో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో నెదర్లాండ్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాడు టిమ్ వాన్ డర్ గుగ్టెన్ చివరి ఓవర్ రెండు, మూడు బంతులను వరుసగా బౌండరీ, సిక్సర్గా మలిచి నెదర్లాండ్స్ను గెలిపించాడు. గుగ్టెన్ మొత్తం 5 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి నెదర్లాండ్స్ను విజయతీరాలకు చేర్చాడు. The Nepal crowd is simply amazing in every manner! 🇳🇵pic.twitter.com/giCO1hA1oE— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 గుగ్టెన్ మెరుపు ఇన్నింగ్స్కు ముందు సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ సైతం బ్యాట్ ఝులిపించాడు. 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులకు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన సైబ్రాండ్.. మొత్తంగా 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి నెదర్లాండ్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. Netherlands' victory lap. - Nepal fans cheering and applauding them in numbers. 👏pic.twitter.com/uc8ch0XO52 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (47), గుల్సన్ ఝా (34), కుశాల్ మల్లా (26), రోహిత్ పౌడెల్ (25), కుశాల్ భుర్టెల్ (20) రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, గుగ్టెన్, మైఖేల్ లెవిట్, సైబ్రాండ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. లెవిట్ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సైబ్రాండ్ (48), గుగ్టెన్ (21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో మ్యాక్స్ ఓడౌడ్ (22), విక్రమ్జిత్ సింగ్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ మల్లా 4 వికెట్లతో చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సిరీస్లో నేపాల్, నెదర్లాండ్స్తో పాటు నమీబియా పాల్గొంది. -
మారిన గుండెతో 4 దశాబ్దాలు
ఆమ్స్టర్డ్యామ్: గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో 6 నెలలకు మించి బతకవు అని వైద్యులు కరాఖండిగా చెప్పేశారు. అదేకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీనిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి, 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ కథ ఇది. ప్రస్తుతం గ్లైడర్ పైలెట్గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినపుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు. త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. ‘హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అనేందుకు నేనే నిలువెత్తు నిదర్శనం. బర్త్డేను అయినా పెద్దగా పట్టించుకోనుగానీ ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు’ అని జాన్సెన్ వ్యాఖ్యానించారు. ‘గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి’ అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మ్యాగ్డీ యాకూబ్ చెప్పారు. ‘40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు. అందుకే జాన్సెన్ను లండన్లోని హేర్ఫీల్డ్ ఆస్పత్రిలో గుండెమార్పిడి చేశా’ అని చెప్పారు. -
T20I: స్ట్రైక్రేటు ఏకంగా 600..? అంతలోనే..
నమీబియాతో టీ20 మ్యాచ్లో నెదర్లాండ్స్ బ్యాటర్, తెలుగు మూలాలున్న తేజ నిడమనూరు చేసిన పరుగులు కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేదు. అయినా.. అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఎందుకంటే...?! నేపాల్- నమీబియా- నెదర్లాండ్స్ మధ్య నేపాల్ వేదికగా టీ20 ట్రై సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నమీబియా- నెదర్లాండ్స్ కీర్తిపూర్ వేదికగా గురువారం తలపడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మైకేల్ లెవిట్ మెరుపు శతకం(62 బంతుల్లో 135 రన్స్) బాదగా.. వన్డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ సూపర్ హాఫ్ సెంచరీ(40 బంతుల్లో 75 పరుగులు) చేశాడు. LEVITT! Maiden T20I century for Michael Levitt! He's only 20 years old and he's just the 2nd Dutcman to acheive the milestone!#NAMvNED | #TheNetherlandsCricket | #KNCB pic.twitter.com/AetJhyZzyo — Netherlands Cricket Insider (@KNCBInsider) February 29, 2024 చిచ్చరపిడుగు పరుగుల విధ్వంసం ఈ క్రమంలో లెవిట్ స్ట్రైక్రేటు 217.74గా నమోదు కాగా.. సైబ్రండ్ స్ట్రైక్రేటు 187.50. మరి తేజ నిడమనూరు స్ట్రైక్రేటు ఎంతో తెలుసా?!.. సరిగ్గా 600. నిజమే.. నమీబియాతో మ్యాచ్లో మూడు బంతులు ఎదుర్కొన్న అతడు మూడు సిక్సర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. నెట్టింట చర్చ ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20లలో 600 స్ట్రైక్రేటు వద్ద ఉండగా అవుటైన మొదటి బ్యాటర్ తేజ నిడమనూరేనా అంటూ ఓ నెటిజన్ చర్చకు దారితీశారు. ఇందుకు స్పందనగా మిగతా యూజర్లు తమకు తోచిన సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా వన్డేల్లో ఆండీ మెక్బ్రైన్ అనే క్రికెటర్ ఒక బంతి ఎదుర్కొని సిక్సర్ కొట్టాడని ఓ నెటిజన్ ప్రస్తావించారు. మొత్తానికి అలా తేజ స్ట్రైక్రేటు గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సాధారణంగా ఓ బ్యాటర్ మ్యాచ్లో మొత్తంగా చేసిన పరుగులను వందతో గుణించి, అతడు ఎదుర్కొన్న బంతులతో భాగించి స్ట్రైక్రేటును నిర్ణయిస్తారు. అలా తేజ స్ట్రైక్రేటు 600 అయింది. అదీ సంగతి!! భారీ స్కోరుతో సత్తా చాటి ఇదిలా ఉంటే నమీబియాతో మ్యాచ్లో లెవిట్, సైబ్రండ్ కలిసి రెండో వికెట్కు ఏకంగా 178 పరుగులు జోడించడం విశేషం. నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక భాగస్వామ్యం. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది. మరోవైపు.. తేజ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. కాగా 1994లో విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు 2022లో నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 30 వన్డేలు, 8 టీ20లు ఆడి వరుసగా 679, 79 పరుగులు చేశాడు. Is Teja Nidamanuru the first batter to be out with a strike rate of 600 in T20 International cricket? @ZaltzCricket — DB Kate (@DutchBKate) February 29, 2024 -
సిక్సర్ల వర్షం.. యువ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ
నమీబియాతో టీ20 మ్యాచ్లో నెదర్లాండ్స్ యువ క్రికెటర్ మైకేల్ లెవిట్ దుమ్ములేపాడు. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిది సిక్సర్లు, ఏడు బౌండరీల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు లెవిట్. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఇదే తొలి శతకం. కాగా నేపాల్ వేదికగా నమీబియా- నెదర్లాండ్స్- నేపాల్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి టీ20లో నేపాల్పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ ఆతిథ్య నేపాల్ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఓపెనింగ్ బ్యాటర్ మైకేల్ లెవిట్.. నేపాల్పై అర్ధ శతకం(54) బాదాడు. తాజాగా నెదర్లాండ్స్తో గురువారం నాటి మ్యాచ్లోనూ బ్యాట్ ఝులిపించిన లెవిట్.. 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లెవిట్కు తోడు వన్డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ అద్భుత అర్థ శతకం(40 బంతుల్లో 75)తో రాణించాడు. ఇద్దరూ కలిసి ఏకంగా రెండో వికెట్కు ఏకంగా 178 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లెవిట్, సైబ్రండ్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. కాగా కీర్తిపూర్లో నమీబియాతో జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. ఈ మేరకు భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ తరఫున టీ20లలో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా మైకేల్ లెవిట్ చరిత్రకెక్కాడు. మాక్స్ ఒడౌడ్ లెవిట్ కంటే ముందు పొట్టి ఫార్మాట్లో సెంచరీ సాధించాడు. -
నేపాల్ బ్యాటర్ల వీరోచిత పోరాటం
నేపాల్ టీ20 ట్రై సిరీస్లో రసవత్తర సమరం జరిగింది. నెదర్లాండ్స్తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్లో నేపాల్ బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా.. దీపేంద్ర సింగ్ (34 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కరణ్ (7 బంతుల్లో 11; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడి నేపాల్ను విజయానికి చేరువ చేశారు. అయితే చివరి ఓవర్ మూడు, నాలుగు బంతులకు కరణ్, దీపేంద్ర ఔట్ కావడంతో నేపాల్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. వీరిద్దరూ చెలరేగడంతో నేపాల్ 17వ ఓవర్లో 9 పరుగులు, 18వ ఓవర్లో 18, 19వ ఓవర్లో 15, 20వ ఓవర్లో 12 పరుగులు సాధించింది. చివరి ఓవర్లో దీపేంద్ర సింగ్ తొలి రెండు బంతులను బౌండరీ, సిక్సర్గా మలచి నేపాల్ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మైఖేల్ లెవిట్ (54), సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ట్ (49), ఎడ్వర్డ్స్ (33), తేజ నిడమనూరు (31) రాణించగా.. మ్యాక్స్ ఓడౌడ్ (4) తక్కువ స్కోర్కు ఔటయ్యాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, కుశాల్ మల్లా తలో వికెట్ పడగొట్టగా.. ఎడ్వర్డ్, తేజ రనౌట్ అయ్యారు. ఛేదనలో చివరి వరకు పోరాడిన నేపాల్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. దీపేంద్ర సింగ్, కరణ్తో పాటు ఆరంభంలో ఆసిఫ్ షేక్ (34), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (50) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్, సైబ్రాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వివియన్ కింగ్మా, వాన్ డర్ గుగ్టెన్, ఆర్యన్ దత్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో భాగంగా నేపాల్తో నిన్న జరిగిన మ్యాచ్లో నమీబియా ఆటగాడు లాఫ్టీ ఈటన్ 33 బంతుల్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. -
భారత్ను గెలిపించిన శ్రీజేశ్
పురుషుల ప్రొ హాకీ లీగ్లో భాగంగా ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 4–2తో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్కు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో భారత్కిది రెండో విజయం. ‘షూటౌట్’లో గోల్కీపర్ శ్రీజేశ్ నెదర్లాండ్స్ జట్టు రెండు ప్రయత్నాలను నిలువరించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
36 బంతుల్లోనే శతకం.. 11 సిక్సర్లు, 5 ఫోర్లు
యూరోపియన్ మహిళల టీ10 లీగ్ 2023లో సంచలనం నమోదైంది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ కెప్టెన్ ఐరిస్ జ్విల్లింగ్ 36 బంతుల్లోనే శతక్కొట్టింది. ఈ ఇన్నింగ్స్లో జ్విల్లింగ్ 11 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగుల భారీ స్కోర్ చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో జ్విల్లింగ్ ఒక్కరే మూడొంతుల పరుగులు చేయడం విశేషం. మహిళల క్రికెట్ టీ10 ఫార్మాట్లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్ జ్విల్లింగే కావడం మరో విశేషం. ఈ మ్యాచ్లో జ్విల్లింగ్ ధాటికి ఇద్దరు బౌలర్లు ఓవర్కు 23 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి, 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నెదర్లాండ్స్ బౌలర్లలో డి లాంజ్, రాబిన్ రిజ్కే, హన్నా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కార్లిన్ వాన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఆస్ట్రియా ఇన్నింగ్స్లో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మల్లిక మహదేవ 30 పరుగులు చేసింది. ఆస్ట్రియా ఇన్నింగ్స్లో నలుగురు డకౌట్లు అయ్యారు. -
భారత్ అదరహో
కౌలాలంపూర్: ఆద్యంతం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన భారత జట్టు జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున ఆదిత్య అర్జున్ లలాగే (34వ ని.లో), అరిజిత్ సింగ్ హుందల్ (35వ ని.లో), సౌరభ్ ఆనంద్ కుష్వా (52వ ని.లో), ఉత్తమ్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు టిమో బోర్స్ (5వ ని.లో), వాన్ డెర్ హెజ్డెన్ (16వ ని.లో), ఒలివియర్ హోర్టెన్సియస్ (44వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మిగతా క్వార్టర్ ఫైనల్స్లో జర్మనీ 2–1తో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై, ఫ్రాన్స్ 3–2తో ఆ్రస్టేలియాపై, స్పెయిన్ 4–2తో పాకిస్తాన్పై విజయం సాధించాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీతో భారత్; స్పెయిన్తో ఫ్రాన్స్ తలపడతాయి. జూనియర్ స్థాయిలో చివరిసారి 2005లో నెదర్లాండ్స్పై గెలిచిన భారత జట్టుకు ఈసారీ గట్టిపోటీ ఎదురైంది. అయితే మ్యాచ్లో మూడుసార్లు వెనుకబడ్డ భారత్ ఏమాత్రం ఆందోళన చెందకుండా పోరాడింది. రెండు క్వార్టర్లు ముగిసేసరికి 0–2తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్లో నెదర్లాండ్స్ మూడో గోల్ చేసి మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ ముగిసేందుకు ఎనిమిది నిమిషాలు ఉన్నాయనగా భారత్ మళ్లీ స్కోరును సమం చేసింది. అదే జోరులో మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాలముందు నాలుగో గోల్తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. చివర్లో నెదర్లాండ్స్ జట్టు స్కోరును సమం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. నెదర్లాండ్స్ ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... భారత జట్టు గోల్కీపర్ మోహిత్తోపాటు రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండి నెదర్లాండ్స్కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. చివరి పది సెకన్లలోనూ నెదర్లాండ్స్కు పెనాల్టీ కార్నర్ లభించినా భారత ఆటగాళ్లు దానిని నిర్వీర్యం చేసి చిరస్మరణీయ విజయం అందుకున్నారు. మ్యాచ్ మొత్తంలో నెదర్లాండ్స్కు 12 పెనాల్టీ కార్నర్లు రాగా వాటిలో మూడింటిని గోల్స్గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక దానిని భారత్ లక్ష్యానికి చేర్చింది. 6 జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరడం ఇది ఆరోసారి. గతంలో భారత జట్టు 2001, 2016లలో విజేతగా, 1997లో రన్నరప్గా నిలిచింది. 2005, 2021లలో సెమీఫైనల్తోపాటు మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. -
రైట్...రైట్!
ఉదారవాదులూ, వామపక్షవాదులూ ‘గత కాలమె మేలు వచ్చు కాలము కంటెన్...’ అనుకోక తప్పని సమయం వచ్చినట్టుంది. మొన్న అర్జెంటీనాలో, ఇప్పుడు నెదర్లాండ్స్లో జరిగిన ఎన్నికల్లో మితవాద నేతలు విజయకేతనాలు ఎగరేయటం...యూరప్ ఖండంలోని చాలాచోట్ల నానాటికీ మితవాద పార్టీలకు ఆదరణ పెరుగుతుండటం ప్రపంచం ‘కుడి’వైపు మళ్లుతున్న సూచనలు అందిస్తున్నాయి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఇటీవల తీవ్ర మితవాద పక్ష నేత జేవియర్ మిలీ వామపక్ష నేత సెర్జియా మాసాను ఓడించి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెంట్రల్ బ్యాంకు మూసివేత, స్థానిక కరెన్సీ పెసో రద్దు ఆయనగారి వాగ్దానాలు. దేశ సాంఘిక, ఆర్థిక విధానాలను ధ్వంసం చేసి నవ అర్జెంటీనా నిర్మించటమే తన ధ్యేయమని చెప్పుకొన్నారు. తాజాగా నెదర్లాండ్స్లో తీవ్ర మితవాద పక్షమైన పార్టీ ఫర్ ఫ్రీడమ్ (పీవీవీ) 37 స్థానాలు గెల్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. 150 స్థానాలున్న దిగువ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 76 స్థానాలకు దూరంలోనే వున్నా ఆ పార్టీ నేత గీర్డ్ వైల్డర్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే పీవీవీ ప్రవచించే ఇస్లాం వ్యతిరేకత అక్కడ రాజ్యాంగ విరుద్ధం కావటంవల్ల ప్రధాన స్రవంతి పార్టీలు ప్రభుత్వంలో చేరేందుకు నిరాకరిస్తున్నాయి. మసీదుల మూత, ఖురాన్ నిషేధం, ముస్లిం దేశాల నుంచి వలసలు అరికట్టడం వైల్డర్స్ వాగ్దానాలు. రెండో ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమ యూరప్లో మితవాద పక్షాలకు కాలం చెల్లి, ఉదార వాద పార్టీల ఆధిక్యతే సాగింది. ఒక్క ఇటలీలోని సోషల్ మూవ్మెంట్ పార్టీ (ఎంఎస్ఐ)కి తప్ప ఎక్కడా మితవాదులకు ఆదరణ దొరకలేదు. 1955–80 మధ్య అక్కడక్కడ మితవాద పార్టీలు తలెత్తి కొద్దో గొప్పో స్థానాలు గెల్చుకున్న ఉదంతాలున్నా అవి ఒకటి రెండు దఫాలకు మించి నిలబడ లేకపోయాయి. 1956లో ఫ్రాన్స్లో యూనియన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రెటర్నిటీ (యూఎఫ్ఎఫ్) 13 శాతం ఓట్లు గెల్చుకుని, 52 స్థానాలు సాధించినా చాలా త్వరగానే కనుమరుగయింది. అంతవరకూ దుందు డుకువాదులుగా పేరుబడిన అతి మితవాద పక్షాలు 1980–2000 మధ్య అంతక్రితంతో పోలిస్తే ఎంతోకొంత మెరుగయ్యాయి. ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీ), నెదర్లాండ్స్లో సెంటర్ పార్టీ (సీపీ) ఓటర్లను ఆకట్టుకోవటం మొదలెట్టాయి. అయితే ఉదారవాద పార్టీలు, వామపక్ష పార్టీల తర హాలో వీటికి నిర్దిష్టమైన సిద్ధాంతమేమీ ఉండదు. స్థానికత, జనాకర్షణ, అవినీతి, పెరుగుతున్న నేరాలు, వలసలు, ముస్లింలపై వ్యతిరేత వంటివే ఈ పార్టీలకు ఊపిరి. 1980కి ముందు ఒక శాతం అంతకన్నా తక్కువ ఓట్లు మాత్రమే రాబట్టుకునే మితవాదులు 2010 నాటికి 10 శాతం ఓట్లు తెచ్చు కునే స్థితికి ఎదిగారు. ఒక్క ఆస్ట్రియా దీనికి మినహాయింపు. అక్కడ తీవ్ర మితవాద ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీ) 1999లో 27 శాతం ఓట్లు సాధించి కూటమి ప్రభుత్వంలో చేరింది. ఈ పరిణామం యూర ప్కు మింగుడుపడలేదు. ఆ దేశంపై పలు ఆంక్షలు సాధించటంతోపాటు చాలా దేశాలు అక్కడికి దౌత్య పర్యటనలు మానుకున్నాయి. 2019లో ఎఫ్పీ నేత అవినీతి ఆధారాలతోసహా బట్టబయలు కావటంతో దానికి ఆదరణ సన్నగిల్లింది. కానీ మొన్న ఫిబ్రవరిలో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో అది 24 శాతం ఓట్లతో బలం పుంజుకుంది. వేరే దేశాల్లో కూడా మితవాదులకు ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కనబడుతూనే వున్నాయి. స్పెయిన్, బెల్జియం, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది మొదట్లో ఇటలీలో నియో ఫాసిస్ట్ పార్టీగా ముద్రపడిన ఎంఎస్ఐ అధికారం చేజిక్కించుకోగా, నిరుడు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో అతి మితవాది మెరిన్ లీ పెన్ రెండో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఆమె పార్టీ దిగువ సభలో భారీగా స్థానాలు గెల్చుకుంది. జర్మనీలో నియో నాజీ పార్టీ ఏఎఫ్డీ ప్రస్తుతానికైతే ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్క పోలాండ్ ఇందుకు మినహాయింపు. అక్కడ 2019 ఎన్నికల్లో 43.6 శాతం ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్)ని మొన్న అక్టోబర్ ఎన్నికల్లో అధికారంలో నుంచి దించలేకపోయినా, ఆ పార్టీ ఆధిక్యతను 35 శాతానికి తగ్గించటంలో ఉదారవాద పార్టీలు విజయం సాధించాయి. నెదర్లాండ్స్లో వైల్డర్స్ సాధించిన ఆధిక్యత సహజంగానే యూరప్ అంతటా రాజకీయ ప్రకంప నలకు కారణమైంది. ఎందుకంటే ఇంతవరకూ నెదర్లాండ్స్లో ఏ మితవాద పార్టీ 20 శాతం దాటి ఓట్లు సాధించలేదు. తొలిసారి వైల్డర్స్ 23.6 శాతం ఓట్లు గెల్చుకున్నారు. అంతేకాదు... ఇటలీ మిత వాద నేత మెలొని, ఫ్రాన్స్ మితవాద నేత మెరైన్ లీ పెన్ మాదిరి తన తీవ్రవాద భావాలను కాస్త యినా సవరించుకోలేదు. అధికారంలోకి రాగానే ఈయూలో ఉండాలా వద్దా అనే అంశంపై రిఫరెండమ్ నిర్వహిస్తానని వైల్డర్స్ హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యమా కాదా అన్న సంగతలావుంచి వర్తమాన స్థితిగతుల నుంచి గట్టెక్కటం ఎలాగో తెలియక అన్ని దేశాల్లోనూ పాలకులు తలలు పట్టు కుంటున్నారు. ఒకపక్క ఉక్రెయిన్ నుంచి రోజూ వేలాదిమంది శరణార్థులు వస్తున్నారు. పశ్చిమా సియా, ఆఫ్రికా ఖండ దేశాల నుంచి సైతం నిత్యం వలసలుంటున్నాయి. ఇందుకు ఈయూనే తప్పు బట్టాలి. వివిధ దేశాల్లో మంటరాజుకోవటానికి కారణమవుతున్న అమెరికా వైఖరిని నిలువరించక పోగా దానికి సహకారం అందించటమే వలసలు పెరగటానికి కారణం. అశాంతితో దహించుకుపో తున్న దేశాలను వదిలి సహజంగానే జనం సురక్షిత ప్రాంతాలు వెదుక్కుంటారు. ఇతరత్రా విషయా లెలావున్నా వలసలపై ఓటర్లలో ఉన్న భయాందోళనలకు పరిష్కారం వెదకటంలో ప్రధాన స్రవంతి పార్టీలు విఫలమైతే అన్నిచోట్లా రాగలకాలంలో అతి మితవాద పక్షాలదే పైచేయి అవుతుంది.