-
దర్శన్ కేసులో త్వరలో చార్జిషీటు!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకోగా త్వరలో కోర్టుకు చార్జ్షీట్ సమర్పింనున్నట్టు పోలీసుల సమాచారం. దర్శన్తో పాటు మొత్తం 17మంది నిందితుల మొబైల్ ఫోన్లలోని డాటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు అది పూర్తయితే త్వరలో చార్జ్షీట్ తయారు చేయనున్నారు. సీఐడీ టెక్నికల్ సెల్లో డిజిటల్ సాక్ష్యాల సేకరణ జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.జైలు మార్పు అధికారుల నిర్ణయం: హోంమంత్రిదర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తుమకూరు జిల్లా జైలుకు మార్చాలనేది జైలు అధికారుల నిర్ణయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని హోంమంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు అందరూ ఒకే చోట ఉండడం మంచిది కాదని జైలు అధికారులు భావించారన్నారు. దర్శన్, మరో ముగ్గురిని తుమకూరు జైలుకు తరలిస్తారని తెలిసిందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది తనకు తెలియదని, అది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.నటి పవిత్రగౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దర్శన్ అభిమాని అరెస్టుయశవంతపుర: నిర్మాత ఉమాపతిగౌడను అంతు చూస్తానని బెదిరించిన నటుడు దర్శన్ అభిమాని చేతన్ని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దర్శన్ గురించి ఉమాపతి చెడుగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చేతన్ బెదిరించాడు. దీంతో ఫిర్యాదు రాగా అరెస్టు చేసి మళ్లీ విడుదల చేశారు.సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు శివాజీనగర: హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్నగర్కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్పై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్ను చంపాలని నిర్ణయించుకున్నారు. రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. అందుకు జేసీబీ ఓనర్ నరేశ్, డ్రైవర్ సోహాన్ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్ఎఫ్సీ నగర్కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్నగర్కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. సోమవారం నాయబ్ తహసీల్దార్ సందీప్కుమార్రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్రెడ్డి బృందం పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
చీరాలలో యువకుడి హత్య
చీరాలటౌన్: చీరాలలో ఆదివారం దారుణహత్య జరిగింది. పండ్ల వ్యాపారి వద్ద పనిచేసే యువకుడు చిన్న కారణానికే కత్తితో పొడిచి క్యాటరింగ్ షాప్ నిర్వాహకుడు కంచర్ల సంతోష్ (36)ను హత్యచేశాడు. పట్టణ సీఐ పి.శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు.. కంచర్ల సంతోష్ (36) సంగం థియేటర్ సమీపంలో (ఖానాఖజానాలో) అయ్యప్ప క్యాటరర్స్ నిర్వహిస్తూ కర్రీ పాయింట్ కూడా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడ రోడ్డు మీద పండ్ల వ్యాపారాలు జరుగుతుంటాయి. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పండ్ల వ్యాపారి చిన్న వద్ద పనిచేసే ఉమామహేశ్వరరావు తాగునీటి క్యాన్ను నీటితో కడిగాడు. ఆ నీరు ఎదురుగా ఉన్న అయ్యప్ప క్యాటరర్స్ ఖానాఖజానా దుకాణం వద్దకు చేరాయి. ఈ విషయమై కర్రీ పాయింట్లో పనిచేసే మహిళలు ఉమామహేశ్వరరావును ప్రశి్నంచారు. దీంతో అతడు వారిపై వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ మహిళలు తమ యజమాని సంతో‹Ùకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన సంతోష్ ఈ విషయమై ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఉమామహేశ్వరరావు పండ్లు కోసే కత్తితో సంతోష్ని పొడిచాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన సంతోష్ను స్థానికులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మృతిచెందాడు. మృతునికి భార్య, తల్లి ఉన్నారు. ఘటనాస్థలాన్ని, సంతోష్ మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉమామహేశ్వరరావును, పండ్ల వ్యాపారి చిన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. -
దర్శన్ 6106
శివాజీనగర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రగౌడ, హీరో దర్శన్, మరో 15 మంది నిందితులు బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో చేరారు. దర్శన్ సాధారణ ఖైదీలా మారిపోయారు. అయితే ఇతర ఖైదీల నుండి ప్రమాదం రాకుండా ప్రత్యేకమైన బ్యారక్లో ఉంచారు. శనివారం రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. భోజనం చేయని దర్శన్ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు. దర్శన్ రిమాండు ఖైదీ నంబరు 6106, ధనరాజ్ 6107, వినయ్ 6108, ప్రదోశ్ 6109 నంబర్ ఇచ్చారు. భద్రత కోసం దర్శన్ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి 13 రోజులు కాగా, ఆయన బరువులో కొంతవరకు తగ్గి రక్తపోటులో తారతమ్యంగా ఉన్నట్లు తెలిసింది. ఎప్పుడూ సినిమాలలో మాత్రమే కనిపించే దర్శన్ తమ ముందే ఉండడంతో సిబ్బంది, ఖైదీలు సంభ్రమానికి గురయ్యారు.పవిత్ర రగడ రగడజైల్లో పవిత్రాగౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు జైలు దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలని రగడ చేసినట్లు తెలిసింది. అది కావాలి, ఇది కావాలని చిన్న చిన్న విషయాలకు అలుగుతున్నట్లు తెలిసింది. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించగా, ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారు.రిమాండు రిపోర్టులో ఏముంది ?చిత్రదుర్గ రేణుకాస్వామి ఘోర హత్య కేసులో పరప్పన అగ్రహార జైలో చేరిన నటుడు దర్శన్తో పాటుగా 17 మంది నిందితులు, హత్యను తప్పుదారి పట్టించేందుకు సాక్షులను బెదిరింపులకు గురిచేశారని పోలీసులు చెబుతున్నారు. ఓ సాక్షిని నిందితులు ప్రాణ బెదిరింపులకు పాల్పడగా, రహస్యంగా కాపాడినట్లు పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ పిటిషన్లో తెలిపారు. కేసులో తమ పేరు రాకూడదని ఓ వ్యక్తికి దర్శన్ రూ. రూ.40 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సొమ్ము ఆచూకీ కనిపెట్టేందుకు రెండురోజుల పాటు మూడోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. దర్శన్ మొబైల్ఫోన్ను తనిఖీ చేసేటప్పుడు డేటా పోయింది, కోర్టు అనుమతితో మళ్లీ సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసులో 9వ నిందితుడు ధనరాజ్ ఎలెక్ట్రికల్ టార్చ్ షాక్ను ఆన్లైన్లో కొనుగోలు చేసి సొమ్ము జమ చేయగా, దీని ఆధారాలను అందుకోవాల్సి ఉంది. -
హత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్
చీరాల/చీరాల అర్బన్: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం సీతారాంపేటకు చెందిన యువతిపై హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీతారాంపేటకు చెందిన పౌజుల సుచరిత (21) ఇంటర్ వరకు చదివి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఆ యువతి ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఆ తరువాత రైల్వే ట్రాక్ పక్కన ముళ్లపొదల్లో వివస్త్రగా ఆమె మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారని హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు సవాల్గా తీసుకుని 10 బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. గంజాయి మత్తులో.. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. ఈపూరుపాలెం గ్రామానికే చెందిన దేవరకొండ విజయ్, కారంకి మహే‹Ù, దేవరకొండ శ్రీకాంత్ ఈ దురాగతానికి పాల్పడినట్టు తేలింది. నిందితులు ముగ్గురినీ శనివారం సాయంత్రం చీరాల బైపాస్ రోడ్డు వద్ద హాయ్ రెస్టారెంట్ సమీపంలోని వాడరేవు వెళ్లే రోడ్డులో 50 మీటర్లు దూరంలో అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గంజాయి మత్తుకు బానిసలైన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున రైల్వేట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని ఏ1 విజయ్, ఏ2 మహేష్ బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్ళారు. యువతి నోరుమూసి బలవంతంగా అత్యాచారం చేసి అనంతరం ముఖంపై దాడి చేయడంతోపాటు నోరు, ముక్కు మూసి హత్య చేశారన్నారు. ఆ ఇద్దరికీ ఏ3 శ్రీకాంత్ ఆశ్రయం కల్పించాడన్నారు. ముగ్గురు నిందితులకు నేరచరిత్ర ఉందని.. వారిపై చీరాల రూరల్ పోలీస్స్టేషన్లో గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ చెప్పారు. అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, బాపట్ల డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ దర్యాప్తు చేశారన్నారు. ముగ్గురు నిందితులపై కోర్టులో చార్జిïÙట్ వేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి యువతి హత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబ సభ్యులను శనివారం సునీత పరామర్శించారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ ఆకురాతి పద్మిని, గంజి చిరంజీవి ఉన్నారు. ఇదిలావుండగా.. హత్యాచారానికి గురైన పౌజుల సుచరిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించారు. యువతిపై హత్యాచార ఘటన దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్మార్టమ్లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్స్టా్రగామ్లో పోస్ట్ చేసి డిలీట్చేసిన మెసేజ్లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
పవిత్రగౌడ పాత్రనే కీలకం
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో సంచలనం రేపిన చిత్రదుర్గకు చెందిన ఆటోడ్రైవర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అండ్ గ్యాంగ్ సంచరించిన 28 ప్రాంతాల్లో మహజర్ నిర్వహించిన పోలీసులు.. ఏకంగా 139 వస్తువులను సాక్ష్యాలుగా సేకరించారు. నిందితులు ధరించిన దుస్తులు, షూస్, చెప్పులు, దాడికి ఉపయోగించిన వస్తువులు, హోటల్ లెడ్జర్ బుక్, సీసీటీవీ కెమెరా పేటేజీలు, వాహనాలు, నగదు, మృతదేహంపై నుంచి దోచిన నగలు ఇలా ఒక్కటీ వదలకుండా పోలీసులు సాక్ష్యాలుగా తీసుకువచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ అనుచరుడు వినయ్ ఫోన్లో చాటింగ్ చేసిన మెసేజ్లు కేసులో కీలకంగా మారనున్నాయి. దర్శన్ రేణుకాస్వామిపై దాడి చేసిన దృశ్యాన్ని ముగ్గురు యువకులు మొబైల్లో వీడియో తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియోలను సేకరించారు.పవిత్రగౌడ పాత్రనే కీలకంరేణుకాస్వామి హత్య జరగడానికి నటి పవిత్రగౌడ ముఖ్య కారణమని పోలీసుల రిమాండ్ కాపీలో పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పవిత్ర ఏ3 నుంచి మొదలుకుని ఏ7, ఏ11, ఏ12, ఏ13, ఏ16 నిందితులు హత్యలో నేరుగా పాల్గొన్నారని, వీరందరికీ చట్టంపై కనీసం గౌరవం లేదని లభించిన సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందని రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. ఏ1 ముద్దాయి పవిత్ర,రేణుకాస్వామి హత్యకు అందరినీ ప్రేరేపించినట్లు తెలిపారు.బెయిల్కు దర్శన్ ప్రయత్నాలురేణుకాస్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోనున్నారు. దర్శన్ కేసు వాదించడానికి అనిల్, బాబు, రంగనాథ్రెడ్డి అనే లాయర్లను నియమించుకున్నారు. అదేవిధంగా సీనియర్ లాయర్ సీవీ నాగేశ్ను కూడా దర్శన్ నియమించుకున్నారు. ఇటీవల జైలుపాలైన మాజీ మంత్రి రేవన్న కేసును నాగేశ్ వాదించి బెయిలు ఇప్పించారు. అనేక క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. దర్శన్కు కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా లాయర్ నాగేశ్, అసిస్టెంట్ లాయర్ రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి పోలీస్స్టేషన్కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు. -
పవిత్ర గౌడ చూస్తుండగానే.. ఒళ్లు జలదరించేలా రేణుక స్వామి హత్య
బెంగళూరు : కన్నడ నటుడు దర్శన్ తూగుదీప్ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రేణుకస్వామిని దారుణంగా కొట్టి, ఎలక్ట్రిక్ షాకిచ్చి హత్య చేసినట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు బాధితుడి అంతర్గత అవయవాలు పగిలిపోయాయి. రేణుక స్వామి మృతదేహాన్ని కాలువలో పడేసినప్పుడు అతని ముఖం సగం భాగంలో కుక్కలు పీక్కుతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.అయితే ఈ రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు చిత్రహింసలకు గురి చేసే సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి అసభ్యకరంగా సోషల్ మీడియా పోస్ట్లు పెట్టారనే కారణంగా పవిత్రనే దర్శన్ని దాడికి ప్రేరేపించినట్లు సమాచారం.జూన్8న రేణుక స్వామి తన స్వగ్రామమైన చిత్రదుర్గ నుంచి నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200 కిలోమీటర్లు దూరం తరలించారు. అక్కడికి దర్శన్, పవిత్రగౌడలు వచ్చారు. అనంతరం,రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు ఒళ్లు జలదరించేలా హత్య చేశారు. ఆ హత్య జరిగే సమయంలో పవిత్రగౌడ అక్కడే ఉండడం గమనార్హం.కాగా, ఈ సంచలన హత్య కేసులో పోలీసులు ఇద్దరు నటులు సహా 17 మందిని అరెస్ట్ చేశారు. హత్య కోసం దర్శన్ నిందితులకు రూ.50లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో రూ.30 లక్షలు కిడ్నాప్, హత్య, మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన పవన్కు చెల్లించగా.. రాఘవేంద్ర, కార్తీక్ల కుటుంబాలకు కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
నేరం అంగీకరించిన హీరో దర్శన్ !
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది. హత్య తర్వాత అభిమాని మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ఇచ్చినట్లు తేలింది. ఈ నేరాన్ని దర్శన్ అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య కేసులో ఇప్పటికే దర్శన్ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్ అంగీకరించాడు. దర్శన్ పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
మియాపూర్: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ
సాక్షి,హైదరాబాద్: మియాపూర్లో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు. బాలిక మిస్సింగ్ మిస్టరీ వారం రోజుల తర్వాత వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రి బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. -
కన్నడ హీరో దర్శన్ కేసు.. అతని భార్యకు నోటీసులు!
ప్రస్తుతం శాండల్వుడ్ అంతటా హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ పేర్లే వినిపిస్తున్నాయి. బెంగళూరులో జరిగిన ఓ అభిమాని హత్య కేసు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. తన ప్రియురాలు పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపాడని రేణుకాస్వామి అనే అభిమానిని దారుణ హత్య చేశారని వీరిపై ఆరోపణలొచ్చాయి. అయితే హీరో దర్శన్కు ఇదివరకే పెళ్లయింది. విజయలక్ష్మిని వివాహం చేసుకోగా.. ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. గత పదేళ్లుగా పవిత్ర గౌడతో రిలేషన్లో ఉన్నారు. తాజాాగ హత్య కేసులో నోటీసు అందుకున్న విజయలక్ష్మి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన భార్య వాంగ్మూలాన్ని బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రేణుకస్వామి హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇండస్ట్రీకి సంబంధం లేదు: కిచ్చా సుదీప్అయికే మరోవైపు.. ఈ వ్యవహారంతో కన్నడ ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ ఇప్పటికే హీరో కిచ్చా సుదీప్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు. -
దర్శన్ కేసు.. రోజుకొక పేరు
దొడ్డబళ్లాపురం/ యశవంతపుర/ మైసూరు: చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతూ కొత్త కొత్త ముఖాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కామాక్షిపాళ్య పోలీసులు మరో నటునికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కమెడియన్ చిక్కణ్ణకు నోటీసులు ఇచ్చి బెంగళూరులోని స్టోని బ్రూక్ పబ్లో మహజర్కు తీసికెళ్లారు. నటుడు యశస్ సూర్యకు కూడా విచారణకు హాజరవ్వాలని సూచించారు. హత్య జరిగిన రోజు స్టోని బ్రూక్ పబ్లో హీరో దర్శన్తో పాటు యశస్ విందులో పాల్గొన్నాడని తెలియడమే దీనికి కారణం. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నటి పవిత్రగౌడ మంగళవారం అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిసింది.మైసూరు హోటల్లో మహజరుహీరో దర్శన్ పర్సనల్ మేనేజర్ నాగరాజు, కారు డ్రైవర్ లక్ష్మణ్ను మంగళవారం పోలీసులు మైసూరుకు తీసుకువచ్చి స్థల పరీశీలన జరిపారు. బెంగళూరు నుంచి పోలీసు వ్యాన్లో వారిని మైసూరులోని ర్యాడిసన్ బ్లూ హోటల్కు తీసుకువచ్చారు. హత్య సమయంలో నటుడు దర్శన్ మైసూరులో ఇదే హోటల్లో ఉంటూ లలిత మహల్లో జరుగుతున్న డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొనేవాడు. కువెంపు నగరలో ఉన్న గోల్డ్ జిమ్కు కూడా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో హత్య గురించి ఇక్కడ చర్చించారా అని నిందితులతో హోటల్, దర్శన్ సంచరించిన ప్రాంతాల్లో విచారణ జరిపారు. తరువాత టి.నరిసిపుర రోడ్డులో ఉన్న దర్శన్ ఫాంహౌస్కు తీసుకెళ్లారు.పకడ్బందీగా దర్యాప్తు: కమిషనర్రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కాస్త ఏమరుపాటుగా ఉన్నా కేసు దారి తప్పేదని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ అన్నారు. కేసులో ఇప్పటివరకూ దర్శన్తో కలిపి మొత్తం 17మందిని అరెస్టు చేసి అన్ని కోణాల్లో విచారణ జరిపామన్నారు. కేసులో సాక్ష్యాధారాలను టెక్నాలజీ సాయంతో సేకరిస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్, టెక్నాలజీ, చట్టపర సలహాలు తీసుకుని ముందుకు పోతున్నామన్నారు.మళ్లీ బాతుల కేసుమైసూరు సమీపంలో టి.నరిసిపుర రోడ్డులోని దర్శన్ ఫాంహౌస్లో అరుదైన బార్ హెడెడ్ గూస్ అనే అరుదైన జాతి బాతులు కొన్ని ఉన్నాయి. వీటిని పెంచుకోవడం నిషిద్ధం కావడంతో అటవీ సిబ్బంది గతంలో దర్శన్ దంపతులు, వారి మేనేజర్ నాగరాజుపైన కేసులు పెట్టారు. దీనిపై త్వరలో విచారణ చేపట్టనున్నారు.ఎవరు చేసినా నేరమే: ఉమాపతిదర్శన్ వ్యవహారంపై నిర్మాత ఉమాపతి స్పందిస్తూ హత్య చేయడం నేరం. అది ఎవరూ చేసినా తప్పే. అలాంటి వ్యక్తికి శిక్ష పడాలి. నాకు తెలిసినంత వరకు మృతుడు రేణుకాస్వామి వదిలేయాలని ఎంత వేడుకున్నా వదలకుండా చంపేశారని తెలిసింది. రేణుకాస్వామి భార్య గురించి ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి. దర్శన్ అభిమానినే హత్య చేయటం ఎంతవరకు న్యాయం అని ఉమాపతి ప్రశ్నించారు. దర్శన్ దేవుడంత మనిషి అయినా కుక్క బుద్ధి కలవాడు అని విమర్శించారు. నటుల పాత్ర ఉంటే కేసు పెడతాం: హోంమంత్రిహత్య కేసులో దర్శన్తో పాటు ఇతర నటుల పాత్ర ఉందని తేలితే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని హోంమంత్రి జీ. పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, దర్శన్ ఒక నటుడు కాబట్టి సహజంగానే అతడితో అనేకమంది నటులు కలిసి తిరుగుతుంటారని అంత మాత్రాన వారందరినీ అనుమానంతో చూడలేమన్నారు. త్వరలో రేణుకాస్వామి కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తానన్నారు. ఎస్ఐ ఉద్యోగాల భర్తీ చివరిదశలో ఉందన్నారు. ఇంధన ధరల గురించి ధర్నాలు చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం 14 సార్లు ధరలు పెంచిన సంగతి మర్చిపోయిందా అని ప్రశ్నించారు. -
చికెన్ పాయా ఇవ్వనందుకే హతమార్చా
రాయదుర్గం: ‘చికెన్ పాయా (చారు), మద్యం కొనుగోలుకు డబ్బు అడిగా... ఇవ్వలేదు. దీంతో హత్య చేశాను’ అంటూ తాను చేసిన నేరాన్ని పోలీసుల సమక్షంలో నిందితుడు అంగీకరించాడు. రాయదుర్గం పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను రూరల్ సీఐ ప్రసాద్బాబు, డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాదరెడ్డితో కలసి డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం మురుడప్ప హత్యకు గురైన విషయం తెలిసిందే. హతుడి చిన్నమ్మ హరిజన పెన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితుడిని గుర్తించి, సోమవారం సాయంత్రం 5 గంటలకు కల్యం బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో వాస్తవాలను నిందితుడు బహిర్గతం చేశాడు. అనాథగా ఉంటున్న మురడప్ప చుట్టుపక్కల ఇళ్లతో పాటు ఆంజనేయస్వామి ఆలయంలో స్వీపర్గా పనిచేస్తుండేవాడు. ఆదివారం కావడంతో చికెన్ దుకాణం నిర్వాహకుడి వద్ద కోడి కాళ్లను ఉచితంగా తీసుకున్నాడు.ఆలయానికి దూరంగా ఉండే వంకలో సొంతంగా చికెన్ రసం (పాయా) వండుకుని భోజనం చేస్తుండగా అక్కడికి యేసురాజు చేరుకున్నాడు. చికెన్ చారుతో పాటు మద్యం కొనుగోలుకు డబ్బు కావాలని యేసురాజు అడగడంతో మురడప్ప నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆ సమయంలో చేతికి అందిన రాయి తీసుకుని మురడప్ప తలపై యేసురాజు మోది హతమార్చాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ గౌతమి శాలి ప్రత్యేకంగా అభినందించారు. -
హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు
వ్యక్తిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. రోజురోజుకి కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్. కన్నడ హాస్య నటుడు కమ్ హీరో చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలానే పోలీస్ స్టేషన్కి కూడా తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)కన్నడ హీరో దర్శన్.. జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజులు, వీడియోలని మొబైల్లో పంపడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఓవైపు విచారణ, మరోవైపు దర్యాప్తు సాగుతోంది.అయితే హత్య జరగడానికి ముందు దర్శన్తో పాటు అతడి మనుషులు.. బెంగళూరు రాజేశ్వరి నగర్లోని స్టోనీ బ్రూక్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు. దీనికి దర్శన్ ఫ్రెండ్, నటుడు చిక్కన్న కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే పార్టీ చేసుకునే టైంలో హత్య గురించి దర్శన్ ఏమైనా చర్చించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిక్కన్నకు నోటీసులు ఇచ్చారు. ఇతడికి హత్యతో సంబంధం లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. కేవలం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుని వదిలేశారు.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలా పాల్.. వీడియో వైరల్!) -
పవిత్రగౌడ ఇంట్లో సోదాలు.. దుస్తులు, చెప్పులు సీజ్
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆర్ఆర్ నగరలో ఉన్న పవిత్రగౌడ ఇంటికి ఆమెను, ఆమె అనుచరుడు పవన్ను తీసుకెళ్లారు. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు అయిన పవిత్రగౌడ మేనేజర్ దేవరాజును పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన షెడ్ వద్దకు పవిత్రగౌడతో కలిసి దేవరాజు కూడా వెళ్లాడని దర్యాప్తులో తేలడంతో శనివారం అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది. రేణుకాస్వామి ఉంగరం, చైన్ తదితరాలను నిందితులు లాక్కున్నట్టు పోలీసులు తెలిపారు.దర్శన్ను కలిసిన నిందితులురేణుకాస్వామి మృతదేహం లభించగానే లొంగిపోవాలని డీల్ కుదుర్చుకున్న నిందితులు లొంగిపోవాలా, లేక కొన్ని రోజులు వేచి చూడాలా అనే మీమాంసలో పడిపోయారు. దీనిపై మైసూరులో ఒక హోటల్లో ఉన్న దర్శన్ వద్దకు వెళ్లి చర్చించారని విచారణలో తేలింది. దీంతో పోలీసులు సదరు హోటల్లో కూడా మహజర్ చేయవచ్చని తెలుస్తోంది.కరెంటు షాకిచ్చి..రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య తరువాత ఆ పరికరాన్ని బెంగళూరు–మైసూరు హైవేలో విసిరేశారు. దీంతో పోలీసులు విజయనగర ప్రాంతంలో హైవేలో పరికరం కోసం గాలింపు చేపట్టారు.సీఐ గిరీష్ నియామకంరేణుకాస్వామి కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలోకి సీఐ గిరీష్ నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో కామాక్షిపాళ్య పోలీస్స్టేషన్కు తాత్కాలిక సీఐ గిరీష్ బదిలీపై వచ్చారు. తరువాత అక్కడే రేణుకాస్వామి హత్య వెలుగు చూసింది. దర్శన్ అరెస్టు సమయంలో గిరీష్ను మళ్లీ సీకే అచ్చుకట్టు పోలీస్స్టేషన్కు పంపించారు. అయితే కేసు విచారణకు అవసరమని గిరీష్ను తనిఖీ అధికారిగా నియమించారు. -
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
నార్నూర్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను కిరాతకంగా హత్య చేయించింది. పథకం ప్రకారం ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపించింది. తర్వాత తనకేమీ తెలియనట్టు భర్తను ఎవరో చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు.విజయలక్ష్మి నిజామాబాద్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె.. మహేశ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్తో కలిసి గజేందర్ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. సుపారీ ఇస్తామని.. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మ హేశ్కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద ముగ్గురూ కాపు కాశారు. గజేందర్ను మొదట వె నుక నుంచి బైక్తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండల తో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్ను వెంటబెట్టు కుని హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
హత్య జరుగుతుందని ఊహించలేదు
దొడ్డబళ్లాపురం: తనకు అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడని రేణుకాస్వామి గురించి దర్శన్కు చెప్పానే కానీ, హత్య చేస్తారని అసలు ఊహించలేదని రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ చెప్పుకొచ్చారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆమె.. రేణుకాస్వామిని హత్య చేస్తారని ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేదాన్నని అన్నారు. అశ్లీల మెసేజ్ విషయం దర్శన్కు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనకు తెలుసని, అందుకే మొదట దర్శన్కు చెప్పకుండా ఆ మెసేజ్ను పవన్కు చూపించినట్లు చెప్పినట్లు సమాచారం. నోరు విప్పని దర్శన్ రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరెస్టైన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు గురువారం అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు. నగదు సీజ్ రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు. అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు.మరో ఇద్దరి అరెస్ట్ దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. చిత్రదుర్గకు చెందిన అనుకుమార్ ఆలియాస్ అను, జగదీష్ ఆలియాస్ జగ్గును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 16కి చేరింది. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకురావడంలో వీరు ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. -
ఏడురోజులకు బాలిక మృతదేహం లభ్యం..
మహబూబాబాద్: బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిన దంపతుల కుమార్తె మియాపూర్లో ఈ నెల 7న అదృశ్యమైంది. అనంతరం అదే మియాపూర్ జంగల్లో 7రోజుల తర్వాత బాలిక మృతదేహం శుక్రవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మాతండా గ్రామ పంచాయతీకి చెందిన బానోతు నరేశ్, శారద దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఇద్దరి పిల్లలతో గత 20రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ మియాపూర్ ఏరియా పరిధిలోని నడిగడ్డతండాలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన వారి కుమార్తె బానోతు వసంత (12) సమీపంలోని కిరాణా షాపు వద్దకు వెళ్లింది.ఎంతకూ ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి నరేశ్ చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా మియాపూర్ జంగల్లో కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక అనుమానాస్పదంగా మృతి చెందినట్లు భావించిన పోలీసులు వసంత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సదరు మృతదేహం తమ బిడ్డదేనని గుర్తించి బోరున విలపించారు. -
Actor Darshan: ‘ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్’
లక్షలాది మందికి అభిమాన హీరో, సినిమాలలో దుర్మార్గులను చెండాడే పాత్రల్లో మెప్పించే దర్శన్ నిజ జీవితంలో సాధారణ మనిషి కంటే తక్కువగా ఆలోచించి ఇబ్బందుల్లో పడ్డాడు. పోలీస్ ఠాణాలో ఖైదీగా మారాడు. దర్శన్ ఇలా చేశాడా.. అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు అభిమానులు వాపోతున్నారు.దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ ప్రముఖ నటుడు దర్శన్కు వ్యతిరేకంగా బుధవారంనాడు ప్రజల ధర్నాలతో అట్టుడికింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వందలాదిమంది ర్యాలీలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు చేరి దర్శన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్శన్ ఫోటోకు చెప్పుల హారం వేసి ఊరేగించి దగ్ధం చేశారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ సినిమాలలో అనేక మంచి పాత్రలు చేసిన దర్శన్ నిజ జీవితంలో విలన్ గా మారడం విషాదనీయమన్నారు. రేణుకాస్వామితో ఇబ్బందిగా ఉంటే తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాల్సింది అని, ఇలా అమానుషంగా హత్య చేయడం సబబు కాదన్నారు. ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. అతన్నీ ఇలాగే చంపాలి తన పుత్రున్ని ఎంత దారుణంగా చంపారో అదేరీతిలో ఆ హీరోని కూడా చంపాలి అంటూ రేణుకాస్వామి తల్లిదండ్రులు విలపించారు. గత శనివారం బెంగళూరులో హత్యకు గురైన చిత్రదుర్గవాసి రేణుకాస్వామి కుటుంబీకులు ఘోరాన్ని తలచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని చూసి అతని భార్య సహన రోదిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. చిత్రదుర్గలో బుధవారం కుటుంబ సభ్యులు,బంధువులు అంత్యక్రియలు జరిపారు. సహన ఇప్పుడు మూడో నెల గర్భంతో ఉంది. బిడ్డ పుట్టకముందే తండ్రి చనిపోవడంతో ధారగా విలపిస్తోంది. దర్శన్ని కూడా ఇలాగే చంపాలని కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెట్టారు. సంబంధిత వార్త: బెల్ట్తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు! రూ. 30 లక్షలు డీల్ హత్య కేసులో హీరో దర్శన్ని రెండవ నిందితునిగా చేర్చారు. హత్యా నేరాన్ని వారి మీద వేసుకోవడానికి ముగ్గురికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. 8వ తేదీన రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి కామాక్షిపాళ్యలో షెడ్లో బంధించి హింసించి చంపారు. శవాన్ని ఎలా తరలించాలనేది చర్చించారు. ప్లాన్ ప్రకారం ఒక గ్యాంగ్కు చెందిన ముగ్గురిని పిలిపించి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. చిత్రదుర్గ్ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర(రఘు) ఇందులో ప్రధాన సూత్రధారి వ్యవహరించాడు. రేణుకాస్వామి భార్య వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్య జరిగిన రాత్రి రఘు తన ఇంటికి వచ్చి తన భర్తను తీసుకెళ్లాడని చెబుతోంది. మరోవైపు తన భాగస్వామి పవిత్రపై అనుచిత కామెంట్లు చేశాడంటూ దర్శన్, రేణుకా స్వామిని బెల్ట్, కర్రలతో బాది..గొడకేసి కొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఆపై శవాన్ని పారవేసి, ఒకవేళ పోలీసులు కనిపెట్టి విచారణ చేపడితే లొంగిపోయేలా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే శవం లభించాక పోలీసులు విచారణ చేపట్టారు. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో పోలీసులు వారిని విడివిడిగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దర్శన్ అనుచరులతో ముగ్గురు నిందితులూ రాత్రంతా ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డులు ఆధారంగా మారాయి. దొన్నె బిరియాని వద్దని ఇడ్లీలు.. దర్శన్ మంగళవారం రాత్రి కామాక్షిపాళ్య పోలీస్స్టేషన్లో నిద్రలేని రాత్రి గడిపాడు. పండ్ల జ్యూస్, ఇడ్లీలు తిని నిద్రపోకుండా మేలుకునే ఉన్నట్టు సమాచారం. దొన్నె బిరియాని ఇవ్వగా వద్దన్నారు. పవిత్ర, మిగతా నిందితులు బిరియాని ఆరగించారు. పోలీసులు 6 రోజులపాటు కస్టడీకి తీసుకుని స్టేషన్కు తీసుకువచ్చి 12 మంది నిందితులతో పాటు నిద్రపోవడానికి అవకాశమిచ్చారు. దర్శన్ సెలబ్రిటీ కావడం వల్ల ప్రత్యేకంగా కార్పెట్, దిండు ఇచ్చినా నిద్రపోలేదు. ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్ సినీ హీరోగా, సంపన్నుడిగా ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్ ఠాణాలో దిగులుగా కూర్చున్నారు. ఒక్క సిగరెట్ ఇవ్వాలని పోలీసులను వేడుకున్నట్టు సమాచారం. సిగరెట్ లేక చేతులు వణుకుతున్నాయని వాపోయాడు. కానీ పోలీసులు సిగరెట్ ఇవ్వలేదు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, హత్య చేయమని తాను చెప్పలేదని పదేపదే చెబుతున్నాడని తెలిసింది. పవిత్ర, దర్శన్ కార్లు సీజ్ దర్శన్, పవిత్రల కార్లను పోలీసులు సీజ్ చేయడంతో పాటు వాటిలో ఉన్న మద్యం బాటిళ్లు, ఇతర సాక్ష్యాధారాలను స్వా«దీనం చేసుకున్నారు. రేణుకాస్వామిని బంధించి, హింసించి హత్య చేసిన షెడ్లోకి దర్శన్కు చెందిన స్కారి్పయో, పవిత్ర వాడే జీప్ ర్యాంగ్లర్ వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ రెండు వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. జీప్లో పవిత్ర వ్యానిటీ బ్యాగ్, ఇతర వస్తువులు లభించాయి. అభిమానుల హంగామా హత్య కేసులో అరెస్టైన దర్శన్ను విచారిస్తున్న బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్స్టేషన్ ముందు దర్శన్ ఫ్యాన్స్ హల్చల్ చేసారు. భారీగా చేరి నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు గందరగోళం సృష్టిస్తుండడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేశారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ గొడవలతో స్థానికులకు ఇబ్బందులు కలిగాయి.పవిత్ర వర్సెస్ రేణుకాస్వామి తన అభిమాన హీరో భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలి, చెడు తిరుగుళ్లు తిరగరాదని భావించిన ఆ అభిమాని రేణుకాస్వామి.. అందుకోసమే ప్రాణత్యాగం చేశాడు. ప్రముఖ నటుడు దర్శన్, నటి, ప్రియురాలు పవిత్రగౌడపై వాట్సాప్, ఇన్స్టా తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. దర్శన్ భార్య విజయలక్షి్మని పట్టించుకోకుండా పవిత్రగౌడతో సహ జీవనంపై రేణుకాస్వామి కోపం తెచ్చుకున్నాడు. ఈ ద్వేషంతో పవిత్రకు అసభ్యంగా మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారాస్థాయికి చేరింది, తన మర్మాంగాన్ని ఫోటో తీసి పవిత్రకు పంపించి.. నేను దర్శన్ కంటే తక్కువ కాదు, నా వద్దకు కూడా రా అంటూ హేళనగా మెసేజ్ పంపాడు. దీంతో ఆమె దర్శన్కు గట్టిగా ఫిర్యాదు చేయడం, ఆయన అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. పవిత్ర, రేణుకాస్వామి అకౌంట్ని బ్లాక్ చేసినా అతడు మరో కొత్త ఖాతాతో మెసేజ్లు పంపించేవాడు.దర్శన్ మహజరు దర్శన్, ఇతర నిందితులను పోలీసులు బుధవారంనాడు హత్య జరిగిన ఆర్ఆర్ నగరలోని షెడ్ వద్దకు తీసికెళ్లారు. ఎలా బంధించారు? ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించారు? దాడి మీ సమక్షంలోనే జరిగిందా? మీరు అడ్డుకోలేదా? అనే ప్రశ్నలు పోలీసులు వేశారు. అక్కడ పెద్దసంఖ్యలో అభిమానులు, స్థానికులు చేరారు.ఇన్స్టాలో భార్య అన్ఫాలో గతంలో హీరో దర్శన్– భార్య విజయలక్ష్మి మధ్య తరచూ గొడవలు రేగి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం తెలిసిందే. ఆ కేసుల్లోనూ దర్శన్ జైలుపాలయ్యాడు. అయితే దివంగత రెబల్స్టార్ అంబరీష్, కొందరు సినీ పెద్దల సర్దుబాటుతో ఇద్దరూ కలిసిపోయారు. అయితే ఈసారి హత్య కేసుతో వారి సంసారంలో పెద్ద అగాథమే ఏర్పడిందని చెప్పవచ్చు. ఎక్కువగా పవిత్రగౌడతోనే దర్శన్ ఉండిపోవడంతో వారి కాపురం కలహాలమయంగా మారింది. ప్రియురాలు పవిత్ర గౌడ కోసం ఇటువంటి కేసులో తలదరూర్చడాన్ని భార్య సహించలేకపోతోంది. బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తపరచకపోయినా ఇన్స్టాలో భర్త దర్శన్ ను అన్ఫాలో చేయడంతో పాటు డీపీని కూడా తొలగించారు. -
బెల్ట్తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు!
బెంగళూరు: కర్నాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపారు! రేణుస్వామికి తగిన ‘బుద్ధి’ చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్ను ఉసిగొలి్పందని తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్రను ఈ పనికి దర్శన్ పురమాయించారు. రాఘవేంద్ర తన భర్తను ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లాడని రేణుస్వామి భార్య చెప్పారు. అతన్ని బెంగళూరు సమీపంలో ఒక షెడ్డులో దర్శన్ బెల్ట్తో చితకబాదారు. అభిమానులు కర్రలతో కొట్టారు. ఎముకలు విరిగి, సున్నిత ప్రాంతాల్లో అంతర్గత గాయాలై రేణుస్వామి అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు. దాన్ని వీధి కుక్కలు తినడం చూసి ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ బుధవారం ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్ట్ చేశారు. -
యువతి దారుణ హత్య
రాయగడ: ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఆనందమయమైన జీవితాన్ని కొనసాగిద్దామని ప్రేమికురాలిని ప్రియుడు ఒప్పించాడు. అయితే వీరిద్దరి పెళ్లికి ప్రేమికురాలి తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించకపోవడంతో కోపోద్రేక్తుడైన ప్రేమికుడు పథకం ప్రకారం ప్రేమికురాలిని పిలిచి హత్య చేసిన అనంతరం ఒక అడవిలో మృతదేహాన్ని పారేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. తన కూతురుని హత్య చేశాడంటూ బిసంకటక్ పోలీసుస్టేషన్లో ప్రేమికుడిపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తప్పించుకోలేనని తెలిసి, సరాసరి జిల్లాలోని గుణుపూర్ పోలీసుస్టేషన్లో ప్రేమికుడు లొంగిపొయాడు.మనస్థాపంతో హత్యవివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బిసంకటక్లో నివాసముంటున్న నిటు నౌరి (23) అనే యువతితో గుణుపూర్లోని మరాటిగుడ గ్రామానికి చెందిన మేన్యూవ్ సబర్ (28) అనే యువకుడు ప్రేమలో పడ్డాడు. ఇదే క్రమంలో తన ప్రేయసిని కలిసేందుకు సరాసరి బిసంకటక్ వెళ్లి మాట్లాడి వస్తుండేవాడు. అయితే ఇక పెళ్లి చేసుకుందామని అందుకు తల్లిదండ్రులకు ఒప్పించమని ప్రేయసిని అడిగాడు. తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని యువతి తన ప్రియుడితో చెప్పడంతో మనస్థాపానికి గురయ్యాడు.ఈ నేపథ్యంలోనే సోమవారం తన ప్రేయసికి ఫోన్చేసి ఒకసారి మాట్లాడాలని రమ్మన్నాడు. అందుకు అంగీకరించిన ఆమె కలిసేందుకు వెళ్లింది. అప్పటికే బిసంకటక్లో ఉన్న సబర్ తన వ్యూహం ప్రకారం ప్రేమికురాలిని హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని బిసంకటక్ సమీపంలోని కిరిబిరి అడవుల్లో పడేశాడు. తిరిగి ఏమీ తెలియని వాడిలా తన స్వగ్రామమైన గుణుపూర్ వెళ్లిపోయాడు. ఇంట్లో కుమార్తె లేకపోవడంతో అంతా వెతికిన తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న సబర్ సరాసరి గుణుపూర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. తానే హత్య చేసి మృతదేహాన్ని పారివేసిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో బిసంకటక్ పోలీసులు అడవిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నకొడుకే కాలయముడు
గంగవరం: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదన్న కోపంతో కన్నతల్లి అని కూడా చూడకుండా గోడకు తలను కొట్టి హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన మండలంలోని నూగుమామిడిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపిన వివరాలు... కొలుతూరి అబ్బాయి, ఆదమ్మ(54) భార్యాభర్తలు. వీరికి వివాహాలైన ఇద్దరు కొడుకులున్నారు.పెద్ద కొడుకు బాలయ్య భార్యతో కలిసి అదే గ్రామంలో నివాసముంటున్నాడు. చిన్నకొడుకు కృష్ణను భార్య విడిచి వెళ్లిపోవడంతో గ్రామంలోనే తల్లిదండ్రులతో ఉంటున్నాడు. నిత్యం తాగుతూ తిరగడమే పనిగా పెట్టుకున్నాడు. రోజూలాగే తాగేందుకు ఆదివారం రాత్రి కూడా తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోడంతో గొడవపడ్డాడు. తీవ్ర ఆగ్రహంతో తల్లి తలను గోడకు కొట్టాడు. గొడవ జరగడంతో కొడుకు తనను కూడా కొడతాడేమోనని భయపడి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన తల్లి ఆదమ్మ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. తల్లిని హత్య చేసి కృష్ణ పరారయ్యాడని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు. అడ్డతీగల సీఐ రవికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారని, ఆయన ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్బీ హెచ్సీ రాజారావు వివరాలు సేకరించారు. -
మూడు రోజుల రెక్కీ.. వెంటాడి.. వేటాడి..
మానకొండూర్: ఓ యువకుడిని చంపేందుకు మూడు రోజులు రెక్కీ నిర్వహించారు. విషయం తెలిసి సదరు యువకుడు ప్రాణాలు కాపాడుకునేందుకు పొరుగూరిలో దాక్కున్నాడు. పసిగట్టిన ప్రత్యర్థులు వెంబడించారు. తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డాడు. అయినా వదలని ఆ దండగులు ఆ యువకుడిని బావి నుంచి బయటకు తీసి తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. చివరకు సదరు యువకుడు పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి– కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామాల మధ్యలోని మానేరు వాగులో శవమై కనిపించాడు. స్థానికుల కథనం ప్రకారం.. మానకొండూర్ మండలం పచ్చునూరుకు చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి(23) మంగళవారం ఉదయం కిడ్నాప్నకు గురై సాయంత్రం శవమై కనిపించడంతో గ్రామం ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన గోపు రమ, రఘునాథరెడ్డికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్యాంసుందర్ వరంగల్లో ఉంటున్నాడు. చిన్న కొడుకు ప్రశాంత్రెడ్డి (23) ఇంటర్ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. పదేళ్లక్రితం తల్లి రమ, ఆరేళ్ల క్రితం తండ్రి రఘునాథరెడ్డి అనారోగ్యంతో చని పోయారు. ఒంటరిగానే ఇంటివద్ద ఉంటున్న ప్రశాంత్రెడ్డిపై పోలీసు కేసులు ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా ప్రశాంత్రెడ్డికి స్థానికంగా ఉండే రమేశ్ ఉరఫ్ జానీతో ఓ భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో ‘నిన్ను చంపుతా.. అంటే నిన్నే చంపుతా’ అంటూ తరచూ ఒకరినొకరు చాలెంజ్ చేసుకుంటున్నారు.ఎక్కడ ప్రశాంత్రెడ్డి తనను చంపుతాడోననే భయంతో రమేశ్ తన ఫ్రెండ్ గాజు శంకర్, మరికొందరి సహకారంతో ప్రశాంత్ను అంతమొందించాలని ప్రణాళిక రచించారు. మూడు రోజులుగా ఆయ న ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు స మాచారం. ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టిన ప్రశాంత్ అప్రమత్తమయ్యాడు. తనకు సాయం చేయాలని గ్రామంలో పలువురిని కోరాడు. సోమవారం సాయంత్రం ఊటూరులోని ఓ మిత్రుడి వద్దకు వెళ్లాడు. తనకు రూ.500 ఇచ్చి ఈ రాత్రికి ఆశ్రయం కల్పిస్తే ఉదయాన్నే జమ్మికుంట వెళ్లి, అక్కడి నుంచి హన్మకొండలోని తన సోదరుడి వద్దకు వెళ్తానని తెలిపాడు.బావిలో పడ్డా.. రాళ్లతో కొట్టి..బయటకు తీసి.. సోమవారం రాత్రి రమేశ్ ఆయన అనుచరులు పచ్చునూరులో ప్రశాంత్రెడ్డి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఊటూరు వెళ్లాడని తెలుసుకుని మంగళవారం వేకువజామున ఐదుగంటల ప్రాంతంలో ఆ గ్రామానికి వెళ్లారు. శివారులోని ఓ శివాలయం వద్ద ఓ హనుమాన్ మాలధారుడితో ప్రశాంత్రెడ్డి గురించి వాకబు చేశారు. సదరు భక్తుడి సెల్ఫోన్ తీసుకుని ప్రశాంత్రెడ్డి నంబరుకు ఫోన్ చేశారు. సమీపంలోనే ఫోన్ రింగ్ శబ్ధం రావడంతో అతడిని వెంబడించారు. గమనించిన ప్రశాంత్రెడ్డి తప్పించుకునే క్రమంలో సమీపంలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో పడ్డాడు. అయినా వదలని దుండగులు రాళ్లతో దాడిచేశారు. తీవ్రగాయాలైనా.. వదలకుండా తాడుసాయంతో బావిలోంచి బయటకు తీసి ఉదయం 6 గంటల ప్రాంతంలో జీప్లో ఎక్కించుకొని గ్రామం నుంచి తీసుకెళ్లారు.ఆ 12 గంటలు..కిడ్నాప్ గురించి పోలీసులకు సమాచారం అందడంతో ఉదయం 6గంటలకు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ, మానకొండూర్ సీఐ మాదాసు రాజ్కుమార్ హుటా హుటిన ఊటూరు గ్రామానికి చేరుకుని ప్రశాంత్రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 12 గంటల పాటు పలు గ్రామా ల్లో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. వాటి ఆధారంగా వేగురుపల్లి శివారులోని మానేరువాగుకు జీపులో వెళ్లినట్లు గుర్తించారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి– మా నకొండూ ర్ మండలం వెల్ది మధ్యలో ఉన్న మానేరు వాగులో ప్రశాంత్రెడ్డి మృతదేహం లభ్యమైంది. ప్రశాంత్రెడ్డిని హత్య చేసింది రమేశ్ అనే వ్యక్తిగా సమాచారం. కాగా.. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రశాంత్ ను దారుణంగా హింసించి, పైశాచికంగా చంపినట్లు అతని మృతదేహాన్ని బట్టి తెలు స్తోంది. హత్యకు ఆధిపత్య పోరా? పాత కక్షలు కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు గంజాయి మత్తులో ఇలా పైశాచికంగా ప్రవర్తించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. గతేడాది ఏప్రిల్లోనూ గంజాయి తాగి వచ్చిన కొందరు మానకొండూరులో తుపాకీతో కాల్పులు జరిపేందుకు యత్నించారు. ఆ ఘటనతో పోలికలుండడం బలాన్ని చేకూరు స్తున్నాయి. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజ్కుమార్ వివరించారు. -
డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి కేసులో సంచలన తీర్పు
చంఢీగఢ్: గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)ను భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్ సింగ్ హత్య కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకంటించింది. ఈ హత్యకేసులో డేరా బాబాతో పాటు.. జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, అవతార్ సింగ్లకు సీబీఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తేలారు.హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్ సింగ్. ఆయన జూలై 10, 2002న హత్యకు గురయ్యారు. ఈ హత్యపై కురుక్షేత్రలోని తానేసర్ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చంఢీగఢ్ హైకోర్టు సీబీఐ ఆదేశించింది. ఈ కేసులు డేరా బాబాతో పాటు మరో నలుగురిపై చార్జ్షీట్ దాఖలు చేసి విచారణ చేపట్టింది. అనంతరం డేరా బాబాతో మరో నలుగురికి సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
కుత్బుల్లాపూర్: కాపు సంఘం నేత, బిల్డర్ కుప్పల మధు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు బీదర్ జిల్లాకు చెందిన మానే కేలి పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మధు ఈ నెల 24న ఉదయం తన కారులో డ్రైవర్ రేణుక అనే వ్యక్తి తో కలిసి బీదర్ వెళ్లాడు. చింతల్ ప్రాంతంలో మరో ఇద్దరు కారులో ఎక్కినట్లు తెలిసింది. నలుగురు కలిసి బీదర్ ప్రాంతంలో ఓ క్లబ్బులో గడిపారు. అదే రోజు రాత్రి మధు భార్య లక్ష్మి అతడికి ఫోన్ చేయగా అప్పటికే బయలుదేరినట్లు చెప్పాడు. మరో గంట తర్వాత ఫోన్ చేయగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చార్జింగ్ అయిపోయి ఉంటుందని భావించారు. అయితే శనివారం ఉదయం బీదర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో ఉన్న కారు నెంబరు ఆధారంగా కర్ణాటక పోలీసులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ కల్పన సొసైటీలో ఉన్న మధు ఇంటికి వెళ్లి ఆయన భార్య లక్ష్మీకి మధుకు కారు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా మధు హత్యకు గురైనట్లు తెలిసి వారు షాక్ అయ్యారు . అతడి శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. తలపై బండరాయి మోది హత్య చేసినట్లు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో రూ . 5 లక్షల నగదు, ఒంటిపై రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని తీసుకువచ్చి పద్మా నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పథకం ప్రకారమే హత్య చేశారా..! రియల్ వ్యాపారిగా, కాపు సంఘం నేతగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో సుపరిచయస్తుడిగా ఉన్న మధు కొద్ది కాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తాడు. దీంతో ఎక్కడికి వెళ్లినా మంది మార్బలం.. ఒంటినిండా నగలతో కనిపించాడు.. ఇటీవల అతడి పెద్ద కుమార్తెకు వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆగస్టులో పెళ్లి ఉండగా ఇంతలోనే హత్యకు గురి కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హత్య పథకం ప్రకారమే చేశారా..! ఎవరైనా పాత ఆరి్థక లావాదేవీలతో సుపారి ఇచ్చి హత్య చేయించారా..? డబ్బు, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసమే డ్రైవర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా..! వెంట వెళ్లిన వారి సెల్ఫోన్లు ఎందుకు స్విచ్ఛాఫ్ చేశారు ప్రశ్నలు అనుమానాలకు తావిస్తున్నాయి. కర్ణాటక పోలీసులు హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. స్థానికంగా అందరితో ఆప్యాయంగా మాట్లాడే మధు అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. అతడి వద్ద ఎన్నో ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్న రేణుక దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.