-
వైద్య రంగంలో ప్రక్షాళనకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు, డీన్లు, ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యలో తెలంగాణకు అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు తేవడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలలతోపాటు డెంటల్ కాలేజీలలో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్య, డెంటల్ కళాశాలల యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల దగ్గర అదనపు ఫీజులు వసూలు చేయరాదని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా, వాటిల్లో 3,690 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎయిమ్స్లో 100, ఈఎస్ఐలో 125 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 1,320 పీజీ సీట్లున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ సీట్లు 179 ఉన్నాయన్నారు. ప్రైవేట్ రంగంలోని 28 మెడికల్ కళాశాలల్లో 4,600 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నారు. సమావేశంలో వైద్య విద్య సంచాలకురాలు (డీఎంఈ) డాక్టర్ వాణి, వైద్య విద్య స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ విమల థామస్ పాల్గొన్నారు.నేడు 96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలుజూన్ 20న నులిపురుగుల నివారణ దినం సందర్భంగా 96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ రోజు వేయించుకోని వారికి 27న మాప్ అప్ రౌండ్లో వేస్తామని చెప్పారు. -
నీట్ పరీక్షా ఫలితాలు.. కోర్టులో విద్యార్ధినికి చుక్కెదురు
ఢిల్లీ: ఇటీవల ఓ విద్యార్ధిని తన నీట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ చిరిగిందని, ఫలితంగా మార్కులు తక్కువ వచ్చాయని అలహాబాద్ హైకోర్టులో జూన్ 12న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఓఎంఆర్ షీట్ను పరిశీలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్పై జస్టీస్ రాజేస్ సింగ్ చౌహాన్ ధర్మాసనం జూన్ 18న విచారణ చేపట్టింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అవతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.ఈ తరుణంలో నీట్ పరీక్ష రాసిన ఆయుషి పటేల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను జాతీయ పరీక్ష మండలి (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఫలితాల్ని విడుదల చేస్తోంది. అయితే ఈ జూన్ 4న విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆయేషాకు 335 మార్కులు వచ్చాయి. ఆ మార్కులపై విద్యార్ధిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆన్సర్ కీ ఆధారంగా తనకు 715 మార్కులు వస్తాయని, కానీ వేరే అప్లికేషన్ నంబర్తో విడుదలైన పరీక్ష ఫలితాల్లో కేవలం 335 మార్కులే వచ్చాయని అలహదాబాద్ కోర్టులో వాపోయారు. ఎన్టీఏ ఓఎంఆర్ చించేసిందిఅంతేకాదు జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన, తన ఫలితాలు వెలువడడంలో జాప్యం జరిగిందని తెలిపింది. తొలుత నీట్ ఫలితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని ఎన్టీఏ ఆమెకు మెయిల్ చేసినట్లు తెలిపింది. ఓఎంఆర్ షీట్ను ఉద్దేశపూర్వకంగా చింపేసిందని ఎన్టీఏపై ఆయుషి ఆరోపణలు గుప్పించింది. తన ఓఎంఆర్ షీట్ను మరోసారి పరిశీలించాలని అన్నారు. అంతేకాదు ఎన్టీఏపై విచారణ చేపట్టాలని, త్వరలో జరగాల్సిన అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపకుండా నిలిపి వేయాలని కోరారు. నకిలీ పత్రాలు సమర్పించిఅయితే, కోర్టు ఆదేశాలతో ఎన్టీఏ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ను సమర్పించింది. ఆ ఓఎంఆర్ షీట్ చిరిగిపోలేదు. విద్యార్ధిని నకిలీ ఓఎంఆర్ షీట్ను కోర్టుకు సమర్పించినట్లు నిర్దారణకు వచ్చింది. అందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎన్టీఏను ఆపలేమని కోర్టు పేర్కొంది. పిటిషన్ ఉపసంహరణఎన్టీఏ సైతం ఆయుషిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తన ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచింది. అయితే వరుస పరిణామాలతో ఆయుషి తరుపు న్యాయవాది తాను దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కోరగా అందుకు కోర్టు అంగీకరించింది. NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।क्या परीक्षा कराने… pic.twitter.com/mcHwsVb4IH— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 10, 2024ప్రియాంక గాంధీ సైతంఇక ఆయేషీ పటేల్ తనకు అన్యాయం జరిగిందంటూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, పేపర్ లీకేజీలు, అవకతవకలపై చర్య తీసుకోవాలని కోరారు. ఆయుషి పటేల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు, అసత్యాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్నారు. -
‘ఆపరేషన్’ సిజేరియన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సహజ ప్రసవాలను పెంచేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కాగా, 2023–24లో రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ప్రసవాలు జరగ్గా, వీటిలో 4.48 లక్షల ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేశారు. వీటిలో 50 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అవసరం లేకపోయినా చేసిన సిజేరియన్ ఆపరేషన్లే. ఇలాంటి ప్రసవాలు చేసిన ఆస్పత్రులపై వైద్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా వంద శాతం సిజేరియన్లు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని 104 నెట్వర్క్ ఆస్పత్రులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటికి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. సాధారణ ప్రసవం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో గర్భిణులు ఆస్పత్రులకు రావడం వల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్లు అన్ని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అదే విధంగా తొలి కాన్పు సిజేరియన్ ఉండటం వల్ల రెండో కాన్పు కూడా సిజేరియన్ చేశామన్నారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలను వైద్య శాఖ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. కర్నూలులో అత్యధికంగా సిజేరియన్లు 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షలు సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. సిజేరియన్ ఆపరేషన్లలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 23,500 సిజేరియన్లు జరగ్గా, వీటిలో 16,678 ప్రైవేటు ఆస్పత్రుల్లో చేశారు. 20,059 సిజేరియన్లతో పశి్చమ గోదావరి రెండో స్థానంలో, 19,855తో అనంతపురం మూడో స్థానంలో ఉన్నాయి.45 శాతం అనవసరమే సిజేరియన్ ప్రసవాలను నియంత్రించడంలో భాగంగా 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మ«ధ్య రాష్ట్రవ్యాప్తంగా 62 ఆస్పత్రుల్లో 278 ఆపరేషన్లపై వైద్య శాఖ ఆడిట్ నిర్వహించింది. వీటిలో 155 సిజేరియన్లు ( 55 శాతం) గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో అవసరం మేరకే చేసినట్లు తేలింది. మరో 72 కేసుల్లో (26 శాతం) అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టు ఆధారాలతో తేలింది.. మిగిలిన 53 కేసుల్లో (19 శాతం) సిజేరియన్కు అవసరమైన ఆధారాలు ఏమీ లేనట్టు తేలింది. అంటే 45 శాతం సిజేరియన్లు అవసరం లేకుండానే చేసినట్లు తేలింది.⇒ ప్రైవేట్ ఆస్పత్రులు సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ⇒ సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఇస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం ⇒ సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు.⇒ సాధారణ ప్రసవానికి ప్రయతి్నస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీíÙయా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ⇒ యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు చేయడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ⇒సిజేరియన్ ప్రసవం వల్ల కలిగే సమస్యలను వివరించి, సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా గర్భిణి, కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
జిల్లాకో మెడికల్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో వచ్చిన మార్పు జిల్లాకో మెడికల్ కాలేజీ సాధనే అని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 700. ఉస్మానియా, గాం«దీ, వరంగల్ (కాకతీయ), ఆదిలాబాద్ (రిమ్స్) కాలేజీలు ఉండేవి. ఈ నేపథ్యంలో పేదలకు స్పెషాలిటీ సేవలు అందించడంతోపాటు, డాక్టర్ కావాలనుకునే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది.ఇందులో భాగంగా 2016లో 4 మెడికల్ కాలేజీలు సిద్దిపేట, మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేటలో ప్రారంభించారు. దీంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1640కి పెరిగింది. 2021లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, రామగుండంలలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. నాటి సీఎం కేసీఆర్ వీటిని స్వయంగా ప్రారంభించి, ఒకేరోజు తరగతులు ప్రారంభించి రికార్డు సృష్టించారు.దీంతో రాష్ట్రంలో మరో 1200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. 2022లో నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్ల్లో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 26కు పెరిగింది. చివరి దశగా గతేడాది మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా... ఈ ఏడాది ఎన్ఎంసీ తనిఖీ ప్రక్రియ జరుగుతోంది. వీటికి కూడా అనుమతులు వస్తే జిల్లాకో మెడికల్ కాలేజీ పూర్తి కానున్నది. ఇక వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.గుండెపోట్ల చికిత్సకు ‘స్టెమీ’గుండెపోట్లను వెంటనే గుర్తించి చికిత్స అందించేందుకు స్టెమీ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉస్మానియా, గాం«దీ, వరంగల్ ఎంజీఎం, రిమ్స్ ఆదిలాబాద్, ఖమ్మంలో క్యాథ్ల్యాబ్లను ఏర్పాటు చేశారు.టీ డయాగ్నొస్టిక్స్ వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు టీ డయాగ్నొస్టిక్స్ను ప్రారంభించింది. ఇందులో 135 రకాల రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తారు. ఆటో అనలైజర్లు, డిజిటల్ ఎక్స్–రేలు, ఆ్రల్టాసౌండ్ స్కాన్ మెషీన్లు, 2–డి ఎకో, మామ్రోగామ్, హై ఎండ్ డయాగ్నొస్టిక్ పరికరాలు ఈ హబ్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పీహెచ్సీలు మొదలు అన్ని స్థాయిల దవాఖానాలను టీ డయాగ్నొస్టిక్స్కు అనుసంధానం చేసింది. దీంతో పేదలు అటు చికిత్సకు, ఇటు వ్యాధి నిర్ధారణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. గర్భిణులకు చేయూత... 2017లో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్తో బహుళ ప్రయోజనాలు కనిపించాయి. ప్రభుత్వ దవాఖానాల్లో పరీక్షలు, ప్రసవం చేయించుకునే మహిళలకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేలు, ఆడపిల్లల జన్మిస్తే మరో రూ.వెయ్యి అదనంగా నగదును అందించింది. అదనంగా తల్లీబిడ్డకు అవసరమయ్యే వస్తువులతో కూడిన రూ. 2 వేల కిట్ను అందించింది. గతేడాది చివరినాటికి దాదాపు 14 లక్షల మంది ఈ పథకంతో లబ్ధి పొందారు. అలాగే గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు న్యూ్రటిషన్ కిట్ల పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. కొత్తగా స్పెషాలిటీ సేవలు గత ప్రభుత్వం ఏరియా, జిల్లా, సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను బలోపేతం చేసింది. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ జిల్లా దవాఖాన మంజూరైంది. దీంతో ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోని 27,500 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించే కార్యక్రమం గతేడాది పూర్తయింది. సూపర్ స్పెషాలిటీ వసతుల మెరుగు కోసం హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో 26 ఏప్రిల్ 2022న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో టిమ్స్ నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.ఇవి ఎయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థలుగా సేవలందించనున్నాయి. అల్వాల్లో 28.41 ఎకరాల్లో రూ.897 కోట్ల ఖర్చుతో, గడ్డి అన్నారంలో 21.36 ఎకరాల్లో రూ.900 కోట్ల ఖర్చుతో, ఎర్రగడ్డలో రూ.882 కోట్ల ఖర్చుతో పనులు ప్రారంభం అయ్యాయి. అదనంగా నిమ్స్లో 2000 సూపర్ స్పెషాలిటీ పడకల పనులు ప్రారంభం అయ్యాయి. వరంగల్లో 24 అంతస్తులతో హెల్త్ సిటీ నిర్మాణం తుది దశలో ఉంది. రూ.1200 కోట్ల వ్యయంతో 2021 జూన్లో 59 ఎకరాల్లో పనులు మొదలయ్యాయి. ఇక్కడ 34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తారు. ఇవన్నీ పూర్తయితే 8,200 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి. -
ఫెయిల్ అయ్యానని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
షాద్నగర్ రూరల్: పరీక్షలో ఫెయిల్ కావ డంతో మనస్తాపం చెందిన ఫిజియో థెరపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన గురువారం రాత్రి షాద్నగర్ రైతు కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బుచ్చి బాబు, అమృత దంపతుల పెద్ద కూతురు కీర్తి (24) హైదరాబాద్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ కళాశాలలో ఫిజియోథెరపీ నాలు గో ఏడాది చదువుతోంది. ఇటీవల థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఓ సబ్జెక్టులో ఫెయిలైన కీర్తి తీవ్ర మనస్తాపంతో ఉంటోంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కీర్తి తల్లి, ఆర్ఎంపీ వైద్యుడైన తండ్రి బుచ్చిబాబు ఇద్దరూ వేర్వేరు పనులపై గురువారం సాయంత్రం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన కీర్తి సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తండ్రి బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రాంచందర్ తెలిపారు. -
మెడికల్ షాపులపై డీసీఏ దాడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఔషధాల ధరలు ఎక్కువ చేసి విక్రయించడం, తప్పుడు లేబుళ్లుతో చేస్తున్న ఉల్లంఘనలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేన్ (డీసీఏ) కొరడా ఝుళిపించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలో యాంటీ ఫంగల్ మెడిసిన్ ‘టెస్ట్రా–200 క్యాప్సూల్స్’ను ఓ మందులషాపులో కేంద్రం నిర్దేశించిన ఎమ్మార్పీపై చాలా అధిక ధరకు విక్రయిస్తుండడంతో మందులు స్వాదీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ డీజీ వీబీ కమలాసన్రెడ్డి తెలిపారు. ఈ మందు పది క్యాప్యూల్స్ను రూ.50.30 అధిక ధరకు విక్రయించినట్టు వివరించారు. అత్యవసర మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఇలాంటి మందులను అధిక ధరలకు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కళ్ల మందును జ్వరం మందు అంటూ... కళ్ల వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందును.. జ్వరానికి మందు అంటూ తప్పుడు లేబుల్స్తో మార్కెట్లో ప్రచారం చేస్తున్న వారిని డీసీఏ గుర్తించిందని కమలాసన్రెడ్డి తెలిపారు. పీ–మైసిటిన్ అనే ఆయింట్మెంట్ అల్లోపతి మందును కళ్లవ్యాధి చికిత్సకు ఉపయోగించే మందుగా, మహసుదర్శన కఢ అనే ఆయుర్వేదిక్ మందును జ్వరాన్ని తగ్గించేదిగా తప్పుడు ప్రచారం చేయడంపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని ఓ మెడికల్ హాలుపై, ఖమ్మంలో మందుల దుకాణంపై దాడులు చేసి ఆయా మందులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో నకిలీ క్లినిక్పై దాడి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చి»ౌలిలో ఓ నకిలీవైద్యురాలు కె. స్వరూప తగిన అర్హతలు లేకుండా ‘స్వరూప ఫస్ట్ ఎయిడ్ సెంటర్’పేరిట నిర్వహిస్తున్న క్లినిక్పై డీసీఏ అధికారులు దాడిచేసి డ్రగ్ లైసెన్స్లు లేకుండా ఉన్న 17 రకాల మందులు (యాంటీ బయోటిక్స్తో సహా) స్వాదీనం చేసుకున్నారు. -
అమ్మకానికి ఆడ శిశువు
-
ఇట్లు.. ఇటలీకి!
సాక్షి, అమరావతి: అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్చుప్గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.పోలింగ్ తర్వాత సైలెంట్చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. మూడు ప్రెస్మీట్లు, ఆరు మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్మీట్ పెట్టలేదు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు.మరోవైపు లోకేశ్కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్చుప్గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అలికిడే లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు కచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో..చంద్రబాబు శనివారం అర్థరాత్రి శంషాబాద్ విమా¯éశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ గతంతో లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. సీఐడీ ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీ ఆయనపై నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సీఐడీ శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియచేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది.స్కిల్ స్కామ్లోనూ దుబాయ్ బంధంచంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్కు చేర్చారు.ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, కిలారి రాజేశ్ దుబాయ్ నుంచే అక్రమ నిధులను సింగపూర్ మీదుగా హైదరాబాద్లోని షెల్ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇటలీలో ప్రత్యక్షం..!గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేశ్ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతోపాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నుంచి సింగపూర్కు నిధులు మళ్లించి అనంతరం భారత్లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. -
వైద్యం.. సువర్ణాధ్యాయం
నాడు..ప్రజారోగ్య పరిరక్షణ ధర్మాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని విస్మరించింది. దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అంపశయ్యపైకి ఎక్కించింది. ఈ క్రమంలో ఏదైనా జబ్బు చేస్తే అప్పులు చేయాలి, అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోవాలి. ఆస్తులు లేని వాళ్లు దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాలి.రాష్ట్ర విభజనను బూచిగా చూపి 2014–19 మధ్య ఆర్థిక పరిస్థితులు బాగోలేవంటూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయలేమని చేతులు ఎత్తేశారు. 108, 104 వ్యవస్థకు పాతరేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టలేదు. వసతులు కల్పించలేదు. అత్యవసర మందులు సైతం అందుబాటులో ఉంచలేదు. పారాసెటిమాల్ టాబ్లెట్ కావాలన్నా బయట తెచ్చుకోండని చీటీ రాసిచ్చే దుస్థితి. చిన్న పిల్లలను ఎలుకలు కొరికేసే పరిస్థితి. అయినప్పటికీ ఆ అధ్వాన్న పరిస్థితులే అద్భుతం అంటూ రామోజీ, ఎల్లో మీడియా బాబును ఆకాశానికి ఎత్తాయి. నేడు.. ఈ అధ్వాన్న పరిస్థితులను చక్కబెడుతూ ఈ ఐదేళ్ల పాలనలో నాడు–నేడు ద్వారా సీఎం వైఎస్ జగన్ వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరుల కొరతకు ప్రణాళికా బద్ధంగా చెక్ పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదారు. పేదలు దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడితే వారి చికిత్సల బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునే గొప్ప వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా తినేసింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినింది. అయినప్పటికీ ప్రజారోగ్యం విషయంలో వైఎస్ జగన్ ఏ మాత్రం రాజీ పడలేదు. మన ఇంట్లో వాళ్లకు ఎవరికైనా జబ్బు చేస్తే ఎలాంటి వైద్యం ఆశిస్తామో.. ఆ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్యం అందించాలనే తాపత్రయంతో ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్్టకు శ్రీకారం చుట్టారు. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సాధ్యం కాని ఈ విధానం ఏపీలో దిగి్వజయంగా అమలవుతుండటం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఉంటారో లేదో? తమ జబ్బు నయమవుతుందా? అని ఒకప్పుడు సామాన్యుడు సర్కారు దవాఖానా అంటే ముఖం చాటేసేవాడు. ఆ దుస్థితి నుంచి ప్రభుత్వ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించే స్థాయికి నేడు వైద్య రంగం అభివృద్ధి చెందింది. నాడు–నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమం, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి వినూత్న విధానాలు పేదోడి వైద్యానికి ఊపిరిపోశాయి.ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ఈ ఐదేళ్ల వ్యవధిలో పేద, మధ్య తరగతికి కావాల్సింది జగన్ చేసి చూపించారు. 17 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతికి వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు మెడికల్ కాలేజీ ఆస్పత్రులతో అత్యాధునిక వైద్యం చేరువ చేశారు. బడ్జెట్తో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పం సీఎం జగన్ది.. అందుకే ఆయన యజ్ఞం ఫలించింది. ► ఉమ్మడి విజయనగరం జిల్లా జనాభా 20 లక్షలకు పైనే.. అయితే జిల్లాలో ఒక్క ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి లేదు. మెరుగైన వైద్యం అవసరమైతే విశాఖపట్నం వెళ్లాల్సిందే. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఒక వైద్య కళాశాల మంజూరు చేయాలని అసెంబ్లీ వేదికగా అడిగితే.. రాష్ట్ర ఆరి్థక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు.. ప్రైవేట్ వైద్య కళాశాలకు అనుమతి ఇస్తున్నామని అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని సమాధానమిచ్చారు. ►ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విజయనగరంలో రూ.500 కోట్లతో కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి.. 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభించారు. ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అక్కడ వైద్య సేవలందుతున్నాయి. ► జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల.. ఇంతవరకూ ఏ ప్రభుత్వం చేయని సాహసం.. ఏజెన్సీ అయినా, వెనుకబడిన ప్రాంతమైనా.. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, ఖరీదైన వైద్యం ఉచితంగా అందాలనే సంకల్పంతో ఖర్చు ఎంతయినా వెనకాడకుండా.. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించగా.. 2024–25లో 5, 2025–26లో 7 వైద్య కళాశాలలు ప్రారంభించనున్నారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలలు స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11. సీఎం జగన్ పాలన వచ్చాక ఏకంగా 17 కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.8,480 కోట్లతో వీటి నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రంలో ఒకే ఏడాది 5 వైద్య కళాశాలలను ప్రారంభించి సీఎం జగన్ కొత్త రికార్డు సృష్టించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. 1923లో రాష్ట్రంలో మొదటిగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి.సీఎం జగన్ మాత్రం కేవలం ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ ఐదు వైద్య కళాశాలల ఏర్పాటు కోసం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కి దరఖాస్తు చేశారు. త్వరలో తనిఖీలు చేస్తారు. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు వీలుగా చర్యలు మొదలు పెట్టారు.కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్య విద్య చదివేందుకు అవకాశం కల్పించడమే కాకుండా.. పరిసర ప్రాంతాల్లోని పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువవుతాయి. కొత్తగా ప్రారంభించే కళాశాలల్లో ఎంబీబీఎస్ బ్యాచ్ పూర్తయ్యి బయటకు వచ్చే సమయానికి 600 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కొత్త బోధనాస్పత్రుల్లో కిడ్నీ, న్యూరో, కార్డియాలజీ, క్యాన్సర్ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల ఏర్పాటుతో వివిధ వ్యాధుల నిర్ధారణ సులభతరమవుతుంది.సూపర్హిట్.. ఫ్యామిలీ డాక్టర్ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యులకు తమ పరిధిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ బాధ్యతలను అప్పగించారు. రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్ క్లినిక్లకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. 104 వాహనంతో పాటు వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీ సేవలు, అనంతరం కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యం వాకబు చేస్తున్నారు. టెలిమెడిసిన్ కన్సల్టేషన్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో విలేజ్ క్లినిక్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 3.83 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్రన్ 2022 అక్టోబర్ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో గత ఏడాది ఏప్రిల్లో అందుబాటులోకి వచ్చింది.ఇంతవరకూ పీహెచ్సీ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్ను సందర్శించి 3,83,19,985 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, సుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు ► చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ► రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ► పాలియేటివ్ కేర్ 4 తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ► 2,500 జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను నెలకొల్పారు. ఫ్యామిలీ డాక్టర్లో సేవలు విభాగం వైద్య సేవలుజనరల్ ఓపీ 1,01,36,801 గర్భిణులు 28,76,014 బాలింతలు 8,81,412 రక్తహీనత 1,63,368 బీపీ 95,32,752 సుగర్ 57,23,906 బీపీ, సుగర్ 87,03,543 గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు ► గర్భ నిర్ధారణకు యూరిన్ టెస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ సుగర్ పరీక్ష ► మలేరియా పరీక్ష హెచ్ఐవీ నిర్ధారణ డెంగ్యూ టెస్ట్ మల్టీపారా యూరిన్► స్ట్రిప్స్ (డిప్ స్టిక్) అయోడిన్ టెస్ట్ వాటర్ టెస్టింగ్ హెపటైటిస్ బీ నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్ విజువల్ ఇన్స్పెక్షన్ స్పుటమ్ (ఏఎఫ్బీ) పార్వతీపురం మన్యం జిల్లాలోని బొబ్బిలి సామాజిక కేంద్రం(సీహెచ్సీ) చుట్టుపక్కల ఆరు మండలాల రోగులకు ఆధారం. గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ముగ్గురు లేదా నలుగురు వైద్యులు మాత్రమే పనిచేసేవారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. ఓపీ బ్లాక్ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో నూతన భవనం నిర్మించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా నిర్మించారు. ఓపీ, ల్యాబ్, సర్జికల్, లేబర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. పడకల సామర్థ్యం 50కు పెంచి తొమ్మిది మంది వైద్యులను సమకూర్చారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఏరియా ఆస్పత్రిని గత టీడీపీ ప్రభుత్వంలో 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతామని హామీలిచ్చి గాలికి వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 100 పడకలకు ఆస్పత్రిని అప్గ్రేడ్ చేశారు. రూ.13 కోట్లతో నాడు–నేడులో మాతా శిశు సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఉండే 100 పడకలకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా అవుతుంది. 2022లో ఈ విభాగాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్లతో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, లేబర్ రూమ్, ఇతర వసతులను సమకూర్చారు.మానవ వనరుల కొరతకు చెక్ 2019 నుంచి ఇప్పటి వరకు వైద్యశాఖలో 54 వేల పోస్టులను భర్తీ చేశారు. బాబు హయాంలో కేవలం 4,469 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. నేడు ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు సహా 14 మంది సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీవ్రంగా ఉండగా.. ఏపీలో 94.6 శాతం స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నారు.రూ.వేల కోట్లతో అత్యాధునిక పరికరాలు 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలుకోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. రూ.1685.95 కోట్లతో ఆస్పత్రులకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలు సరఫరా చేశారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలు, యూపీహెచ్సీలకు రూ.218.16 కోట్లతో మెడికల్ పరికరాలు అందించారు.పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి రూ.131.27 కోట్లతో పరికరాలు సమకూర్చారు. కేజీహెచ్, కర్నూలు, కాకినాడ జీజీహెచ్లకు రూ.46.11 కోట్లతో సీటీ, ఎంఆర్ఐ, క్యాథ్ల్యాబ్ సేవలను ప్రారంభించారు. క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతం చేస్తూ రూ.190 కోట్లతో కేజీహెచ్, కర్నూలు, కడప ఆస్పత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలు అందిస్తున్నారు. రూ.193.50 కోట్లతో ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ఐసీయూల అభివృద్ధి చేపట్టారు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల మేరకు మందులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఆస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. టీడీపీ హయాంలో 2014–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఏడాదికి సుమారు రూ.216 కోట్లు మాత్రమే వెచ్చించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్ల వ్యయం ఆరోగ్య సురక్షలో 6.45 కోట్ల వైద్య పరీక్షలు అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. గ్రామాల్లోని జగనన్న సురక్ష శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో వైద్యం అవసరం ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ కార్యక్రమం ప్రవేశపెట్టగా తొలి దశలో 60,27,843 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలు సందర్శించి స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా చికిత్సలు అందించారు. ఆస్పత్రులకు వెళ్లి సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కోసం రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. ఈ ఏడాది జనవరిలో రెండో దశ సురక్షను ప్రారంభించగా.. ఇంతవరకూ 10,881 శిబిరాలు నిర్వహించారు. రూ.16,880 కోట్లతో నాడు–నేడుతానిచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ నాడు–నేడులో ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. అధ్వానంగా ఉన్న ఆస్పత్రులను ఐదేళ్లలో చక్కదిద్దారు. భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం ఏకంగా రూ.16,880 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్క్వా‹Ù), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలుస్తోంది. కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. జగనన్న ఆరోగ్య సురక్ష –1లో సేవలు నిర్వహించిన శిబిరాలు – 12,423మొత్తం ఓపీలు – 60,27,843నిర్వహించిన వైద్య పరీక్షలు– 6,45,06,018మెరుగైన వైద్యం కోసం సిఫార్సు– 1,66,828జనరల్ సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 86,053కేటరాక్ట్ సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 80,115కంటి స్క్రీనింగ్– 9,52,066 (5.73 లక్షల మందికి అద్దాలు పంపిణీ)కొత్తగా గుర్తించిన బీపీ కేసులు– 2,51,529కొత్తగా గుర్తించిన సుగర్ కేసులు– 1,54,248జగనన్న ఆరోగ్య సురక్ష –2లో సేవలు నిర్వహించిన సురక్ష శిబిరాలు– 10,881 ఓపీలు– 38,58,410 నిర్వహించిన పరీక్షలు– 88,83,316 మెరుగైన వైద్యానికి సిఫార్సు– 17,558 సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 8,699 కళ్లద్దాలు అవసరమని గుర్తింపు– 2,09,319 అద్దాలు పంపిణీ– 1,70,594 -
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ పెరిగింది. పట్టణాల్లోనూ ఇంటి పక్కనే సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను సీఎం వైఎస్ జగన్ సర్కారు బలోపేతం చేయడంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ)నూ సకల పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు పేరుతో యూపీహెచ్సీల్లో సౌకర్యాలు, వైద్య పరీక్షలు, అవసరమైన మందులతో పాటు ఇద్దరేసి వైద్యులు, నర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.700 కోట్లతో వీటిని ఆధునికీకరించారు. ఫలితంగా ఇప్పుడు యూపీహెచ్సీలకు వైద్య సేవల కోసం వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో పడకేసిన వైద్యం చంద్రబాబు హయాంలో యూపీహెచ్సీల్లో వైద్య పరీక్షలతోపాటు అన్ని సేవలనూ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వైద్యులు, నర్సులను భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలో యూపీహెచ్సీలపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు యూపీహెచ్సీల వైపు చూసేవారు కాదు. చిన్నపాటి అనారోగ్యమైనా జనమంతా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో నెలకు కేవలం వేల సంఖ్యలోనే ఔట్ పేషెంట్ల సేవలందేవి. ఇందుకు ప్రధాన కారణం వైద్య పరికరాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రజలంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండటంతో యూపీహెచ్సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఇదే మార్పు అని వైద్యులతోపాటు పేషెంట్లు సైతం చెబుతున్నారు. ఇంతలోనే.. ఎంతో మార్పు సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి.. సంపూర్ణ సౌకర్యాలు సమకూర్చడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని భారీగా నియమించారు. ఫలితంగా పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గడప తొక్కడం మానేసి.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. ఫలితంగా యూపీహెచ్సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణి పరీక్షల నుంచి చిన్నపాటి సుస్తీ చేసినా వైద్య సేవలకు, పరీక్షలకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. మొత్తం 65 రకాల పరీక్షలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీహెచ్సీలలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలను అందించారు. అంటే రోజుకు సగటున ఒక్కో యూపీహెచ్సీలో 40 మందికి పైగా ఔట్ పేషెంట్ సేవలు అందించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) ద్వారా ఔట్ పేషెంట్ల డేటాను నమోదు చేశారు. మరోవైపు 2022 ఫిబ్రవరి నుంచి 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నెల 21వ తేదీ వరకు 92,82,536 ల్యాబ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఖరీదైన పరీక్షలు ఉచితం గత ప్రభుత్వంలో గర్భిణి పరీక్షల్ని ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఖరీదైన వైద్య పరీక్షల్ని సైతం ఉచితంగా పొందగలుగుతున్నాం. ఆర్థిక స్థోమత లేకపోతే కేజీహెచ్కి వెళ్లే వాళ్లం. ఇప్పుడు సమీపంలోని ఇసుక తోటలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఆరోగ్యానికి భరోసా లభించింది. – పి.సుజాత, గర్భిణి, మద్దిల పాలెం, విశాఖపట్నం నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దాస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కనే వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్యం అందేది కాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతాలకు వెళాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం వైఎస్ జగన్పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించడంతో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ముందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. – సూరాడ ఈశ్వరమ్మ, 12వ డివిజన్, సంజయ్ నగర్, కాకినాడ -
డాక్టర్గా మారొద్దు.. మందులు రాయొద్దు
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకుండా ఎవరూ వైద్యం చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2010 ప్రకారం ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు అనేక ఆరోప ణలు వస్తున్నాయని... వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతిచెందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. కాబట్టి ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఆర్ఎంపీలు తమ చికిత్స కేంద్రం ముందు సూచిక బోర్డులపై ఫస్ట్ అయిడ్ సెంటర్ లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలని... క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోం, మెడికల్ సెంటర్ లేదా మరే ఇతర పేర్లతో సూచిక బోర్డులను ప్రదర్శించరాదని పేర్కొంది. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు సర్కారు సూచనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది. ఆర్ఎంపీలకు సూచనలివీ... ఆర్ఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్లు చేయడం వంటివి చేయరాదు. రోగులకు వైద్య మందుల చీటీని (ప్రిస్క్రిప్షన్) రాయకూడదు. రోగులకు సెలైన్ బాటిల్స్ ఎక్కించరాదు. ఇన్–పేషెంట్ వైద్యం చేయకూడదు, ల్యాబ్లను నిర్వహించరాదు. అబార్షన్లు, కాన్పుల వంటి హైరిస్క్ చికిత్సలు చేయరాదు. రోగులను ప్రలోభపెట్టి వైద్యం కోసం ఆసుపత్రులకు సిఫార్సు చేయడం లేదా బలవంతంగా పంపించడం చేయరాదు. -
అప్పట్లో వైఎస్ఆర్ పెట్టిన గొప్ప పథకం. ఇప్పుడు సీఎం జగన్ చేసి చూపించారు
-
ఏపీ వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
-
నారావారి నైవైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత వైద్య సదుపాయాలు మృగ్యమైన ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ వైద్యారోగ్యశాఖను నిర్విర్యం చేసింది. పేదల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నారావారి నైవైద్యంగా మలచుకుంది. ప్రభుత్వాస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. వైద్య పరీక్షల పేరిట ప్రైవేటు సంస్థలకు పందేరం చేసింది. ఈఎస్ఐ మందుల కుంభకోణానికి పాల్పడింది. ఎన్నికల మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. జిల్లాకు ఒక నిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఏకంగా ప్రభుత్వాస్పత్రిలో నెలలు నిండని శిశువును ఎలుకలు కొరికిన వైనం రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు తీరని మచ్చగా మిగిలింది. 2014–19 మధ్య ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వైద్యారోగ్యశాఖ స్వర్ణయుగాన్ని చూస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు ద్వారా సకల వసతులూ సమకూరాయి. అర్బన్, విలేజ్ హెల్త్క్లినిక్లు బలోపేతమయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటింటికీ వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యసురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్రను సర్కారు ఆవిష్కరించింది. కరోనా సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొ ల్పింది. వైద్యారోగ్యశాఖలో నెలకొన్న నాటి.. నేటి పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే.. చంద్రబాబు హయాంలో.. ఆరోగ్యశ్రీకి పేరుమార్చి తూట్లు నిరుపేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించాలనే సదుద్దేశంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తూట్లు పొడిచింది. ‘‘ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు ఆపరేషన్ల సౌకర్యం కల్పిస్తాం.’ అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్ల»ొల్లి మాటలతో ప్రజలను వంచించారు. 2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం రోగాల సంఖ్యను ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి 1,059కి అంటే కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. 108 ఊపిరి తీశారు 108, 104 సేవలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీని బాబు పట్టించుకోలేదు. సంచార వైద్యవాహనాల నిర్వహణను గాలికి వదిలేశారు. ఒక్క కొత్త వాహనమూ కొనుగోలు చేయలేదు. ఫలితంగా అత్యవసర సమయంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 679 మండలాలు ఉంటే కేవలం 336 అంబులెన్సులు (108) మాత్రమే ఉండేవి. అంటే మండలానికి ఒక్క సంచార వాహనం కూడా లేని దుస్థితి ఉండేది. కేవలం 292 ‘104’ మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వాహనాలు ఉండేవి. తూతూ మంత్రంగా పోస్టుల భర్తీ వైద్య శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన టీడీపీ 2014–19 మధ్య పట్టుమని 10 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. ఆ ఐదేళ్లలో వైద్య శాఖలో కేవలం 4,469 పోస్టులు భర్తీ చేశారు. ఆస్పత్రుల్లో పెరిగిన జనాభా అవసరాలకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది లేరని సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా అవి బుట్టదాఖలే అయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే అందుబాటులో ఉండేవారు. దీంతో ఆ ఒక్క డాక్టర్ సెలవుపై వెళితే అక్కడ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. మందులు కావాలంటే బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. నిమ్స్ స్థాయి ఆస్పత్రుల ఊసే లేదు అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నిమ్స్ స్థాయి) నిర్మిస్తామని హామీ ఇచ్చిన బాబు గద్దెనెక్కాక ఆ ఊసే ఎత్తలేదు. 2014లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎటువంటి చొరవా చూపలేదు. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించి తన అనుయాయుల జేబులు నింపడానికి బాబు పెద్ద పీట వేశారు. దీంతో వైద్య విద్యను అభ్యసించాలన్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. వైఎస్ జగన్ పాలనలో.. ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం టీడీపీ ప్రభుత్వంలో పూర్తిగా కునారిల్లిన ఆరోగ్యశ్రీ పథకానికి 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరుజ్జీవం పోసింది. కేవలం 1,059గా ఉన్న రోగాల సంఖ్యను 3,257కు పెంచింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. చికిత్స వ్యయం పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా క ల్పించింది. నెట్వర్క్ ఆస్పత్రులను విస్తృతంగా పెంచింది. అన్ని ఆస్పత్రుల్లో చేరిన వెంటనే వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టింది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టు కేర్ తరఫున ఉద్యోగులను నియమించింది. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేసింది. రూ.16,852 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేసింది. నెలకు రెండుసార్లు గ్రామాలకు వైద్యులు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్వో ప్రమాణాలు కలిగిన 105 రకాల మందులు ఉచితంగా అందిస్తోంది. సంచార వైద్యానికి ప్రాధాన్యం 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సంచార వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి పల్లెకు వైద్య వాహనాలు వెళ్లేలా చర్యలు చేపట్టింది. 679 మండలాలు ఉంటే 689 వాహనాలు(108) సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రవేశపెట్టి మొత్తం 910 ( 104) కొత్త వాహనాలు కొనుగోలు చేసింది. 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్లు కొన్నారు. అంబులెన్స్ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు, వీటి నిర్వహణ ఏటా రూ.188 కోట్ల ఖర్చుచేస్తున్నారు. జిల్లాకు ఓ వైద్య కళాశాల వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఓ వైద్యకళాశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఒకేసారి ఏకంగా 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించింది. మచిలీపట్నం, ఏలూరు తదితర చోట్ల ఐదు నిర్మాణాలు పూర్తి చేసి ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులూ ప్రారంభించింది. మరో ఐదు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, విలేజ్ హెల్త్ క్లినిక్ల బలోపేతం, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది. -
కాలేజీకి భారీ విరాళం.. ట్యూషన్ ఫీజు మాఫీ!
ఆ మెడికల్ కాలేజీకి ఊహించని రీతిలో ఒక బిలియన్ డాలర్లు(రూ. 10 కోట్లు) విరాళంగా అందాయి. దీంతో ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజులను మాఫీ చేసి, వారికి ఫీజు భారాన్ని తగ్గించింది. యునైటెడ్ స్టేట్స్లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో ఈ ఉదంతం చోటుచేసుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విద్యా సంస్థకు భారీ విరాళం అందడంతో, ఆ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులందరి వార్షిక ట్యూషన్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి, మోంటెఫియోర్ మెడికల్ సెంటర్ ఉన్నాయి. ఈ కాలేజీ యునైటెడ్ స్టేట్స్లోని వెనుకబడిన ప్రాంతంలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాఫీకి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటన విన్న విద్యార్థులంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఆ వీడియోలో కనిపించారు. ఈ విరాళాన్ని ఐన్స్టీన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్, మాంటెఫియోర్ హెల్త్ సిస్టమ్ బోర్డ్ మెంబర్ రూత్ ఎల్ గాట్స్మాన్ అందించారని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. We are profoundly grateful that Dr. Ruth Gottesman, Professor Emerita of Pediatrics at @EinsteinMed, has made a transformational gift to #MontefioreEinstein—the largest to any medical school in the country—that ensures no student has to pay tuition again. https://t.co/XOy9HZLbfD pic.twitter.com/1ijv02jHFk — Montefiore Health System (@MontefioreNYC) February 26, 2024 -
‘నాట్కో’ ట్రస్ట్తో ప్రభుత్వం ఎంవోయూ
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుంటూరు జీజీహెచ్లోని నాట్కో సెంటర్ను లెవల్–1 క్యాన్సర్ సెంటర్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీన్లో భాగంగా నాట్కో సెంటర్లో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు అదనంగా మరో 100 పడకలతో బ్లాక్ నిర్మాణానికి ‘నాట్కో’ ఫార్మా సంస్థ వైద్య, ఆరోగ్య శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ నరసింహం, నాట్కో ఫార్మా వ్యవస్థాపకుడు, నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి.సి.నన్నపనేని మంగళవారం ఎంవోయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ.. ఈ సెంటర్లో రేడియేషన్, మెడికల్, సర్జికల్ వంటి అన్ని రకాల విభాగాల్ని ఏర్పాటు చేయడం ద్వారా క్యాన్సర్ రోగులకు సమగ్ర చికిత్స అందుతుందని వివరించారు. క్యాన్సర్ చికిత్స నిర్ధారణ కోసం అవసరమైన పెట్, సిటి మెషిన్ కొనుగోలుకు కూడా టెండర్లు పిలిచామని తెలిపారు. ఈ సెంటర్లో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పని చేసే విధంగా 30 ప్రత్యేక పోస్టులతో కలిపి మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామన్నారు. వి.సి. నన్నపనేని మాట్లాడుతూ సుమారు 35 వేల చదరపు అడుగుల్లో అదనంగా 100 పడకల క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. నాట్కో క్యాన్సర్ సెంటర్లోని రోగులకు ఉచిత మందుల పంపిణీలో భాగంగా ఈ త్రైమాసికానికి రూ.60 లక్షల విలువైన మందుల్ని కృష్ణబాబుకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు, క్యాన్సర్ సెంటర్ సమన్వయకర్త యడ్లపాటి అశోక్కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
పేదవాడి ప్రాణం.. ఖరీదెంత?!
మిర్యాలగూడ అర్బన్ : ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రికి వస్తే.. వచ్చిన రోగం పోవడం దేవుడెరుగు.. అసలు ప్రాణమే లేకుండా పోతే..! ఆ ప్రాణానికి ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారు కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు. పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు సైతం వైద్యులకే వత్తాసు పలుకుతూ బాధిత కుటుంబాల్లో కన్నీరు మిగిలిస్తున్నారు. ఒక్కోసారి రోగులు, వారి బంధువులును సైతం బెదిరించి విషయం బయటికి పొక్కకుండా పెద్ద మనుషులు (రౌడీ షీటర్లు) ఆయా ఆస్పత్రులకు అండగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వారిని పెంచి పోషిస్తున్నారని ప్రజలకు తెలిసిన విషయమే. అనేక చావులను బయటికి రానీయకుండా ప్రాణాలకు ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరికి అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా వైద్యధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యాన్ని తెలిపే ఘటనలు ఇలా.. ● దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామానికి చెందిన దాసరి యల్లయ్య తన కూతురు మీనాక్షి(9)తో కలిసి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఈ నెల 14వ తేదీన మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డీకాలనీలో గల ఓ వైద్యశాలకు తీసుకొచ్చారు. బాలికలను పరీక్షించిన ఎముకల వైద్యుడు కాలికి ఆపరేషన్ చేయాలని థియేటర్కు తీసుకెళ్లి ఎముకల వైద్యుడే మత్తు మందు ఇచ్చాడు. మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న రోగి బంధువులు (ఫైల్) కొద్ది సేపటికే బాలిక అపస్మారక స్థితిలోకి పోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వైద్యుడు బాలిక పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పి స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి హడావుడిగా వారిని హైదరాబాద్ తరలించి ఆస్పత్రికి తాళం వేసి వెళ్లిపోయాడు. హైదరాబాద్కు తీసుకెళ్లే సరికి ఆ బాలిక మృతిచెందింది. వెంటనే పెద్ద మనుషులు రంగంలోకి దిగి బాలిక ప్రాణానికి రూ.5లక్షలు ఖరీదు కట్టారు. ● గత సంవత్సరం ఆగస్టు 30న త్రిపురారం మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన మాతంగి రాధ (38) కడుపునొప్పితో బాధపడుతూ మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల ఓ మల్టీసెపషాలిటీ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. వారంరోజుల తరువాత డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రాధకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన కుటుంబ సభ్యులు తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు వైద్య సేవలు ప్రారంభించారు. అయినప్పటికీ మహిళ ఆరోగ్యం బాగు పడకపోగా మరింత క్షీణించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండకు తరలించి చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. కాగా పెద్ద మనుషుల జోక్యంతో మృతురాలి కుటుంబానికి రూ.3 లక్షలు ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలకు నీళ్లు.. అన్నీ మావే.. అంతా మాకే.. అన్నట్లుగా ఉంది మిర్యాలగూడలో వైద్యులు తీరు. ఆస్పత్రులతోపాటు ల్యాబ్, మెడికల్ షాప్ వంటి వ్యాపారాలన్నీ వారే ఏర్పాటు చేసుకుని ఎలాంటి అర్హత లేని సిబ్బందిని పనిలో పెట్టుకుని రోగుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ఏదైనా రోగం వచ్చిందని వైద్యుడి వద్దకు వెళ్తే.. అవసరం లేకపోయినా అన్ని రకాల పరీక్షలు రాసి తమవద్దే చేయించుకోవాలని వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారని రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రోగి మృతిచెందడంతో ఆందోళన చేస్తున్న బంధువులు (ఫైల్) తమకు నచ్చిన విధంగా ల్యాబ్ నుంచి రిపోర్టులు రాయించుకుని ఏ జబ్బూ లేకున్నా వేల రూపాయల మందులు తమ సొంత మెడికల్ షాపుల ద్వారా అంటగడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికై నా జిల్లా వైద్యాధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అకారణంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
వైద్యంలో ఏఐ తప్పులకు బాధ్యులెవరు?
అన్ని రంగాల మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) వాడటం మొదలైంది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, చికిత్స, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం, మందుల అభివృద్ధి వంటి పనులకు తగు జాగ్రత్తలతో ‘ఎల్ఎంఎం’లను వాడొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆ మేరకు ఆరోగ్య సిబ్బందిపై భారం తగ్గుతుంది. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. అలాంటప్పుడు వీటి ద్వారా తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది? ఆరోగ్య సేవలు, ఉత్పత్తులకు అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణాలను ఏఐ టెక్నాలజీలు, టూల్స్కు కూడా విస్తరించాలి. భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారీ వీటిని కచ్చితంగా ఆడిట్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఛాట్జీపీటీ వంటి కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ టెక్నా లజీలను వాడటం మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఈ విషయమై ఒక హెచ్చరిక జారీ చేసింది. ఛాట్జీపీటీ, బార్డ్ వంటి ఎల్ఎంఎం (లార్జ్ మల్టీ–మోడల్ మోడల్స్)లు అందించిన సమాచారం, వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా... అంతకంటే ఎక్కువ విషయాలపై వ్యాఖ్యానించగలవు. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చు కోవడం ఇవి చేసే పని. ఆరోగ్య రంగంలో వీటిని ఉపయోగించడం వల్ల తప్పుడు సమాచారం, ఏకపక్ష లేదా అసంపూర్తి సమాచారం అందే ప్రమాదాలు ఉంటాయనీ, ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చుననీ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. శిక్షణ ఇచ్చేందుకే తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తే పరిస్థితి మరింత అధ్వాన్న మవుతుందన్నది ఈ హెచ్చరిక సారాంశం. ముఖ్యంగా జాతి, కులం, మతం వంటి విషయాల్లో ఏఐ టెక్నాలజీలు వివక్షతో కూడిన సమాచా రాన్ని తయారు చేసే ప్రమాదముంది. ఏఐ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ 2021లో సాధారణ మార్గదర్శకాలు కొన్నింటిని జారీ చేసింది. అదే సమయంలోనే ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంతో రాగల ప్రయోజనాలనూ గుర్తించింది. నైతికత విషయంలో కొన్ని స్థూల మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వాటి ప్రకారం... ఏఐ టెక్నాలజీలు స్వయం ప్రతిపత్తిని కాపా డేలా ఉండాలి. మానవ సంక్షేమం, భద్రత, ప్రజాప్రయోజనాలు, పారదర్శకతలకు పెద్దపీట వేయాలి. తెలివిగా ప్రవర్తించడంతోపాటు వివరించేలా ఉండాలి. బాధ్యత స్వీకరించాలి. అందరినీ కలుపుకొని పోవాలి. వివక్ష లేకుండా చూసుకోవాలి. వివరించేలా ఉండటం అంటే... ఏఐ తాలూకూ డిజైన్ , వినియోగం విషయాల్లో దాపరికం లేకుండా తగినంత సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం! పారదర్శకత ఆశించగలమా? ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల మరి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఎల్ఎంఎంల ఆవిష్కరణతో ఇవి అనివార్యమయ్యాయి. ఎల్ఎంఎంల వాడకం గురించి అర్థం చేసు కోవాలంటే ఏఐ టెక్నాలజీని సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎల్ఎంఎం టూల్ను అభివృద్ధి చేయడంతో మొదలవుతుంది. అభివృద్ధి చేసేది కార్పొరేట్ కంపెనీ, యూనివర్సిటీ, స్టార్టప్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఆధారపడేది సమాచార లభ్యత, నైపుణ్యాల పైనే. తరువాతి దశలో అభివృద్ధి చేసిన ఎల్ఎంఎంకు ఓ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అందిస్తారు. లోటుపాట్లను సరిచేయడం, విస్తృత సమాచా రంతో శిక్షణ ఇవ్వడం అన్నమాట. ఎల్ఎంఎంను భారీ సాఫ్ట్వేర్ వ్యవస్థలో భాగం చేయడం కూడా ఈ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను సిద్ధం చేసే థర్డ్ పార్టీ బాధ్యతే. ఈ పని చేసిన తరువాత ఈ కృత్రిమ మేధ ద్వారా సేవలు అందుతాయి. లేదా ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి దశల్లో మూడోది వినియోగదారుడికి దీన్ని అందించే డిప్లాయర్. ఆరోగ్య రంగంలో ఈ డిప్లాయర్ ఎక్కువ సందర్భాల్లో ఆసుపత్రి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థ లేదా ఫార్మా కంపెనీ అయివుంటుంది. ఈ మూడు దశల్లో నైతికత, నియంత్రణకు సంబంధించిన చాలా ప్రశ్నలు, అంశాలు ఎదురవుతాయి. చాలాసార్లు డెవలపర్ పెద్ద టెక్ కంపెనీ అయి ఉంటుంది. ఎల్ఎంఎంల తయారీకి కావాల్సినన్ని నిధులు, టెక్నాలజీ నైపుణ్యాలు వీరి వద్దే ఉంటాయి. వీటి అభివృద్ధిలో వాడే అల్గారిథమ్స్, వాటి వల్ల రాగల ప్రమాదాల గురించి సామాన్యు లకు తెలిసే అవకాశాలు తక్కువే. కార్పొరేట్ కంపెనీ కాబట్టి పార దర్శకత, నిబద్ధతలను కూడా ఆశించలేము. నియంత్రణ ఎలా? ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్త ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు ఒక బెంగ పట్టుకుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ ప్రస్తుత న్యాయ, చట్ట వ్యవస్థల్లోకి ఇముడుతాయా? మానవ హక్కు లకు సంబంధించిన అంశాలతోపాటు దేశాల డేటా పరిరక్షణ చట్టాల విషయంలోనూ ఈ సందేహముంది. ఎల్ఎంఎంల ప్రవేశం ఒక రకంగా ప్రభుత్వ, నియంత్రణ సంస్థలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో జరిగిందని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ విష యాన్నే తీసుకుందాం. ఎల్ఎంఎంలను చేర్చేందుకే వీరు ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్ చట్టాన్ని చివరి దశలో మార్చాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం అల్గారిథమ్స్ ప్రస్తుత చట్ట, న్యాయ వ్యవస్థల పరిధిలోకి చేరే అవకాశం లేదు. మరోవైపు ఎల్ఎంఎంలు కూడా మనుషుల్లా చిత్తభ్రమలకు గురై తప్పుడు సమాచారాన్ని ఇవ్వవచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇంకో ఆందోళన ఏమిటంటే... ఈ ఎల్ఎంఎంల ద్వారా తప్పులు జరిగితే వాటికి బాధ్యత ఎవరిది? ఇలాంటి తప్పుల కారణంగా జరిగే నష్టం, కలిగే హాని, దుర్వినియోగాలకు ఎవరు బాధ్యులన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా ఈ ఎల్ఎంఎంలు సైబర్ సెక్యూరిటీ ముప్పులకు అతీతమేమీ కాదు. ఆరోగ్య రంగంలో వీటిని వాడితే రోగుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య రంగంలో ఏఏ అంశాలకు ఎల్ఎంఎంలను వాడవచ్చు నన్న విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఒక స్థూల అంచనాకు వచ్చింది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, లక్షణాలను పరిశీలించడం, చికిత్స, పరిపాలన, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం వంటి పనులు... వైద్య, నర్సింగ్ శిక్షణ, శాస్త్రీయ పరిశోధన, మందుల అభివృద్ధి అన్న అంశాలకు మాత్రమే తగు జాగ్రత్తలతో ఎల్ఎంఎంలను వాడవచ్చునని సూచిస్తోంది. ఈ పనులన్నింటినీ ఎల్ఎంఎంలు చేస్తే ఆరోగ్య సిబ్బందిపై భారం అంతమేరకు తగ్గుతుంది. మరోవైపు ఓ కంపెనీ మెడికల్ ఎల్ఎంఎంను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, వైద్యపరమైన సమాచారాన్ని సంక్షి ప్తీకరించడం, అన్నింటినీ కలిపి వైద్యులకు స్థూల నివేదిక ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. ఇలాంటివి ఎక్కువైన కొద్దీ వైద్యుడికి, రోగికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. మరి ఏం చేయాలి? ఎల్ఎంఎంల వాడకాన్ని పూర్తిగా అడ్డుకోవ డమైతే కాదు. వీటిని అభివృద్ధి చేసే సమయంలో వీలైనంత ఎక్కువ పారదర్శకత తీసుకురావడం ఒకటైతే... వాడకం కూడా బాధ్యతాయు తంగా ఉండేలా చూసుకోవడం మరొకటి. ఈ దిశగా ముందు ప్రభు త్వాలు ఆరోగ్య రంగంలో వినియోగానికి తలపెట్టిన ఎల్ఎంఎంల మదింపు, అనుమతుల కోసం నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏఐ వ్యవస్థల అభివృద్ధికి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలు, డేటా సెట్స్ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ వ్యక్తులూ వాడుకోగలిగితే తప్పు ఒప్పుల గురించి ఒక స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది. ఆరోగ్య సేవలు, ఉత్ప త్తులకు ప్రస్తుతం అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణా లను ఏఐ టెక్నాలజీలు, టూల్స్కు కూడా విస్తరించాలి. ఆరోగ్య, వైద్య అంశాలకు సంబంధించి భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారి ఏఐ టూల్స్, టెక్నాలజీలను కచ్చితంగా ఆడిట్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏఐతో వచ్చే లాభాలపై అతిగా అంచనాలూ పెట్టుకోవద్దు; రాగల ముప్పులను తక్కువ చేసి చూడనూ వద్దు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వైద్య రంగంలో విప్లవాత్మక ఫలితాలు
లబ్బీపేట (విజయవాడతూర్పు): వైద్య రంగంలో రాష్ట్రప్రభుత్వం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాలతో సత్ఫలితాలొస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. వైద్య సేవలనే కాకుండా, వైద్య విద్యను సైతం అందరికీ చేరువ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హాలులో జరిగిన వేడుకల్లో యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యఅతిథిగా బెంగళూరుకు చెందిన నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 60 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తున్నదని తెలిపారు. సమాజంలో వైద్య రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, నిరుపేదలకు ఉపయోగపడేలా సేవాభావంతో వైద్యం చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు అందలం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించిందన్నారు. ఆ పథకంలో చికిత్సల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతో పాటు, 3,257 వైద్య ప్రక్రియలతో సహా, అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఎలాంటి వ్యయ పరిమితి లేకుండా ఉచితంగా చికిత్స అందించడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే ఐదు మెడికల్ కళాశాలల్లో కోర్సులు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆస్పత్రులు, 12 జిల్లా ఆస్పత్రులు, 11 టీచింగ్ ఆస్పత్రులు, 15 స్పెషాలిటీ ఆస్పత్రులు, 542 యూపీహెచ్సీలు రోగుల ఆరోగ్యానికి భద్రత ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యఅతిథి నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వైద్యులు నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, అకడమిక్ జాయింట్ రిజిస్ట్రార్ అజయ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ సుమిత శంకర్, జాయింట్ రిజిస్ట్రార్ (ఎగ్జామినేషన్స్) పి.ప్రవీణ్కుమార్, యూనివర్సిటీ సభ్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కంచర్ల సుధాకర్, పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో మెడికల్ మాఫియా.. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా అమ్మకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ,ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో చెలగాటమడుతోంది. తాజాగా మనుషుల రక్తం, ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్లో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్లో తనిఖీలు నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్లోనూ డ్రగ్ అధికారుల దాడులు చేపట్టారు. ముసాపేట బాలాజీనగర్లోని హీమో ల్యాబొరేటరీస్లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్, స్లాస్మా, సీరం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్ను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో రూ, వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కేటుగాళ్లు ఈదందా సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు -
కరోనా బారిన మాజీ సీఎం... స్వైన్ ఫ్లూ కూడా నిర్ధారణ!
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడయ్యింది. గెహ్లాట్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’లో తన ఆరోగ్యం గురించి అశోక్ గెహ్లాట్ తెలియజేస్తూ ‘గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్ టెస్టులు చేయించాను. కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వచ్చే ఏడు రోజుల పాటు నేను ఎవరినీ కలవలేను. మారుతున్న ఈ సీజన్లో అందరూ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం వాతావరణం మారుతోంది. ఇటువంటి వాతావరణంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని’ దానిలో పేర్కొన్నారు. -
పాడేరు మెడికల్ కాలేజీ.. సిద్ధం
గిరిజనుల జీవన ప్రమాణాలు పూర్తిస్థాయిలో పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. పాడేరులో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ఓ వైపు వేగంగా పూర్తి చేస్తుండడంతో పాటు, ఆ స్థాయి వైద్య సేవలను ముందుగానే అందుబాటులోకి తెస్తోంది. సాక్షి,పాడేరు: గిరిజనులకు ఉన్నత వైద్యసేవలు కల్పించడం లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన పాడేరులో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రూ.500కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం 35ఎకరాల విస్తీర్ణంలో తలారిసింగి పాలి టెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ కళాశాల,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఈఏడాదిలో మొత్తం అన్ని భవనాలను పూర్తి చేసే లక్ష్యంతో ఎన్సీసీ నిర్మాణ సంస్థ చురుగ్గా పనులు నిర్వహిస్తోంది. జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరుమార్పు వైద్య విధాన పరిషత్లో ఇంతవరకు పనిచేసిన పాడేరు జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఇటీవల విలీనం చేసి జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరు మార్చారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ఇంకా గడువు ఉండడంతో ముందస్తుగానే పాడేరు జిల్లా జనరల్ ఆస్ప త్రిలో 420 బెడ్లలో రోగులకు 24గంటల పాటు ఉన్నత వైద్యసేవలకుచర్యలు చేపట్టింది. పాడేరు జిల్లా ఆస్పత్రిలో అదనపు అంతస్తును యుద్ధప్రాతిపదికన ఇటీవల పూర్తి చేసి, అన్ని సదుపాయాలతో పడకలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 50 ప్రత్యేకంగా గర్భిణులకు, మరో 50 మాతా శిశువుల ఆరోగ్యసేవలకు, 50 పడకలు రక్తహీనత సమస్య ఉన్న మహిళా రోగులకు కేటాయించనున్నారు. జాతీయ వైద్యమండలి పరిశీలనకు ఏర్పాట్లు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన 420 బెడ్లు,ఇతర సౌకర్యాలు,వైద్య నిపుణులు,అందించే సేవలను సమగ్రంగా పరిశీలించేందుకు జాతీయ వైద్య మండలి పర్యటించనుంది. ఈ మండలి పరిశీలన తరువాత మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా జనరల్ ఆస్పత్రి సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. 256 పోస్టుల భర్తీకి చర్యలు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రులకు సంబంధించి వివిధ విభాగాల్లో 706 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముందుగా 256 పోస్టుల భర్తీని కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేగవంతం చేసింది. మిగిలిన వైద్యులు,నర్సింగ్,ఇతర విభాగాల పోస్టులకు వైద్య ఆరోగ్యశాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. విధుల్లో వైద్య నిపుణులు పాడేరు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా జిల్లా ప్రజలకు నిరంతర ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో ముందస్తుగానే ప్రభుత్వం వైద్యులను నియమించింది. పాడేరు మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్తో పాటు నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫె సర్లు, 17మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రోగులకు ఉన్నత వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. భవనాల నిర్మాణాలతో సంబంధం లేకుండా 420 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాం. అన్ని విభాగాల వైద్యపోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. – డాక్టర్ డి.హేమలతాదేవి, ప్రిన్సిపాల్,పాడేరు మెడికల్ కళాశాల -
ఈసారి 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అయితే ఈ 'కర్తవ్య పథ్'లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే కనిపించనుంది. అందులోనూ ముఖ్యంగా సాయుధ దళాలకు వైద్య సేవలందించే మహిళ డాక్టర్ల బృందం కవాతు చేయనుండటం విశేషం. అంతేగాదు దేశంలోని 'నారీ శక్తి' పరేడ్తో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు సంచలనాత్మకంగా నిలిచిపోనున్నాయి. ఈ సారి రిపబ్లిక్డే వేడుకల్లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా తొలిసారిగా సాయుధ దళాల వైద్య సేవలకు సంబంధించి పూర్తి మహిళా బృందం కర్తవ్పథ్లో కవాతు చేయడం విశేషం. దీనికి మేజర్ సృష్టి ఖుల్లార్ నాయకత్వం వహించనున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలు మహిళా బృందంతో చారిత్రత్మక కవాతును ప్రారంభించి సంచలనం సృషిస్తోంది. ఇక వైద్యురాలు ఖుల్లార్ మహిళల బృందానికి నాయకత్వం వహించి సాయుధ దళాల మహిళా డాక్టర్గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ కవాతు శౌర్యం, పరాక్రమంతో అడ్డంకులన్నింటిని బద్దలు కొట్టేలా 'నారీ శక్తి 'వేస్తున్న అసలైన అడుగు. ఈమేరకు సృష్టి ఖుల్లర్ మాట్లాడుతూ.. నేత్ర వైద్యురాలిగా, ఆపరేషన్ థియేటర్లో సర్జికల్ కత్తి పట్టుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు కర్తవ్య పథ్లో కత్తి పట్టుకోవడం తనకు ఓ ఛాలెంజింగ్గా అద్భుతంగా ఉందని సంతోషంగా చెప్పింది. అందుకు తాను భారత ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాని అన్నారు. Met paratrooper & eye surgeon Major Srishti Khullar today. She will lead the all-women Armed Forces Medical Services marching contingent at the Republic Day parade. "From holding the surgical knife to carrying a sword at the parade, the new role is quite challenging & rewarding." pic.twitter.com/1gT5MTQIxZ — Rahul Singh (@rahulsinghx) January 23, 2024 చరిత్ర సృష్టించనున్న ఢిలీ మహిళా పోలీసులు.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 'కర్తవ్య పథ'లో పూర్తిగా మహిళా పోలీసులే ప్రదర్శన ఇవ్వనున్నారు. పరేడ్లో ఇలా పూర్తి మహిళా పోలీసులే పాల్గొనడం తొలిసారి. ఇక ఈ మహిళా బృందంలో నగర దళానికి చెందిన మహిళ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దీనికి ఐపీఎస్ అధికారిణి శ్వేతా కే సుగతన్ నాయకత్వం వహించనున్నారు. ఆమె నేతృత్వంలో దాదాపు 194 మంది మహిళా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు కవాతు చేయనున్నారు. మహిళా అధికారుల సారథ్యంలోనే త్రివిధ దళాల కవాతు ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా మహిళా అధికారుల సారథ్యంలో త్రివిధ దళాల కవాతు నిర్వహిస్తుండటం విశేషం. ఇక భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ శరణ్య రావు తాను ఈ త్రివిధ దళాల ఆర్మీ కాంపోనెంట్కి సూపర్ న్యూమరీ అధికారిగా సారథ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం అని భావోద్వేగంగా మాట్లాడారు కెప్టెన్ శరణ్యరావు. ఈ ఏడాది నారీ శక్తి థీమ్కి తగ్గట్టుగా చాలామంది మహిళల నేతృత్వంలో త్రివిధ దళాల కవాతు జరగడం అనేది చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న అపూర్వ ఘట్టం అని కొనియాడారు. తొలిసారిగా ఓ ఆర్మీ దంపతుల కవాతు ఈ కర్తవ్య పథ్లో తొలిసారిగా ఒక జంట కలిసి కవాతు చేయనుండటం విశేషం. వివిధ రెజిమెంట్లలో భాగంగా తొలిసారి మేజర్ జెర్రీ బ్లేజ్, కెప్టెన్ సుప్రత అనే జంట కలిసి కవాతు చేయనుంది. వారిద్దరూ గతేడాది జూన్లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఇక 'కర్తవ్య పథ్' అంటే..ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే ఈ మార్గం.ఒకప్పుడూ ఇది ‘రాజ్ పథ్’ అనే పేరుతో ఉండేది. (చదవండి: ఢిల్లీ పరేడ్కు అసామాన్యులు) -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ