-
అది పోవాలంటే రాహుల్ పెళ్లి చేసుకోవాలి: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కులతత్వం పోవాలంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ దళిత మహిళను పెళ్లి చేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సలహా ఇచ్చారు. రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. రాహుల్ ఇచ్చిన నినాదం ‘హమ్ దో హమారే దో’ ఈ సందర్భంగా మంత్రి పార్లమెంట్లో వినిపించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అథవాలే తప్పుపట్టారు. రాహుల్ తనకు మంచి మిత్రుడని, ‘హమ్ దో హమారే దో’ అనే నినాదం గురించి ఆయన మాట్లాడుతున్నారని, నిజానికి ఈ నినాదం గతంలో కుటుంబ నియంత్రణ గురించి వాడేవారని గుర్తుచేశారు. అందుకే ముందుగా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆయన దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అప్పుడు ఆయన మహాత్మా గాంధీ కలలను నిజం చేసినవాడవుతాడని పేర్కొన్నారు. ఆయన పెళ్లితో కులపిచ్చికి అంతం పలకవచ్చు అని పేర్కొన్నారు. ఇలా చేస్తే దేశ యువతకు రాహుల్ మార్గనిర్దేశకుడు అవుతారని ఎద్దేవా చేశారు. గతంలోనూ మంత్రి అథవాలే రాహుల్పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకుంటే, ఆయనకు కులాంతర వివాహం పథకం కింద రూ.2.5 లక్షలు ఇస్తానని తెలిపారు. -
తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్
బాలీవుడ్ ప్రముఖ సింగర్లు నేహా కక్కర్-రోహన్ప్రీత్ సింగ్ వివాహం అక్టోబర్ 24న స్వల్ప అతిథుల మధ్య ఘనంగా జరిగింది. అయితే మరీ ఇంత తొందరగా పెళ్లి చేసుకునేందుకు రోహన్ రెడీగా లేరట. కానీ ఓ రోజు మాత్రం పూటుగా మద్యం తాగి పెళ్లి చేసుకుందాం అని తన ప్రియురాలు నేహాకు మెసేజ్ పెట్టాడట. మొదట దీన్ని నేహా నమ్మలేదట, కానీ తర్వాత నమ్మక తప్పలేదు. మరి ఇంతలోనే అంత మార్పు రావడానికి కారణమేంటో నేహా మాటల్లోనే తెలుసుకుందాం.. పెళ్లి కుదరదన్నాడు "ఓ రోజు షూటింగ్ పూర్తయ్యాక రోహన్ నా స్నాప్చాట్ ఐడీ అడిగాడు. అలా మా మధ్య మాటలు కలిశాయి. ప్రేమ పాఠాలు కూడా నడిచాయి. జీవితంలో సెటిల్ అవ్వాల్సిన సమయం వచ్చిందనిపించి పెళ్లి చేసుకుందాం అని అడిగాను. దీనికి అతడు ససేమీరా ఒప్పుకోలేదు. నాకింకా పాతికేళ్లే.. అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరం మాట్లాడుకోవడమే మానేశాం. అలా కొంతకాలం గడిచింది. సడన్గా ఓ రోజు నేహూ, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పాడు. నాకెందుకో నమ్మాలనిపించలేదు" (చదవండి: రాథోర్ పాటలకు పడి పోవాల్సిందే!) తాగిన మత్తులో ప్రపోజ్ చేశాడనుకున్నా "ఎందుకంటే అప్పుడే రెండు, మూడు బీర్లు తాగాడు. తాగిన మత్తులో ఇలాంటి డైలాగులు కొడుతున్నాడు, కానీ తెల్లారేసరికి మర్చిపోతాడు అని లైట్ తీసుకున్నాను. తర్వాతి రోజు నేను షూటింగ్ కోసం ఛండీఘర్ వెళ్లాను. రోహన్ అక్కడ నా రూమ్కు వచ్చి నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుందా? అని అడిగాడు. నువ్వు తాగితే నేనెందుకు మర్చిపోతాను అని చెప్పాను. కానీ ఆ క్షణమే అర్థమైంది. రోహన్ నిజంగానే పెళ్లికి రెడీ అయ్యాడని! వెంటనే నేను మా అమ్మతో మాట్లాడమని చెప్పాను. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" అని నేహా చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య నెట్టింట నేహా బేబీ బంప్ ఫొటోలు దర్శనమివ్వడంతో ఆమె తల్లి కాబోతుందంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే అదంతా లేటెస్ట్ సాంగ్ 'ఖ్యాల్ రఖ్యా కర్' కోసమేనని తెలియడంతో అభిమానులు అవాక్కయ్యారు. డిసెంబర్ 22న విడుదలైన ఈ సాంగ్ జనాలను ఆకట్టుకుంటోంది. (చదవండి: నేహా కక్కర్-రోహాన్ ప్రీత్సింగ్ల పెళ్లి) -
సిడ్నీ నగరంలో... సిగ్గే పడుతూ...
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య సుదీర్ఘ కాలంగా మైదానంలో ఉన్న వైరంపై సాగిన చర్చలోనే వారిద్దరి మధ్య పరిచయం, ఆపై స్నేహం మొదలైంది. అది అలా పెరిగి ప్రేమగా మారింది. అయితే తర్వాతి అడుగు వేసేందుకు ఇద్దరూ వెనుకాడుతున్న వేళ... అబ్బాయే కాస్త చొరవ చూపించాడు. పెళ్లి ప్రతిపాదన చేసేందుకు తాము ఇష్టపడే క్రికెట్ స్టేడియంకంటే సరైన వేదిక... అందులోనూ భారత్–ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్కు మించిన సందర్భం ఏదీ లేదని భావించాడు. అందుకే వేల మంది ప్రేక్షకుల సమక్షంలో మోకాలిపై కూర్చొని తన మనసులో భావాన్ని వెల్లడించాడు. అటు గ్యాలరీల్లో ప్రేక్షకులు, ఇటు టీవీల్లో లక్షల మంది చూస్తుండగా అమ్మాయీ ‘ఎస్’ అనేసింది. క్రికెటర్లు మొదలు కామెంటేటర్ల వరకు అందరూ ఆ జోడీని అభినందిస్తూ ఆశీర్వదించారు! బెంగళూరుకు చెందిన దీపేన్ మాండలియా ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మెల్బోర్న్లోనే జెట్స్టార్ సంస్థలో ప్రాజెక్ట్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్గా పని చేస్తున్నాడు. మెల్బోర్న్కే చెందిన రోజ్ వింబుష్ని అతను ఏడాదిన్నర కాలంగా ప్రేమిస్తున్నాడు. ‘ఆమె కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించింది కానీ నాకు అంతకంటే సరైన సమయం లేదనిపించింది’ అని దీపేన్ చెప్పగా... ‘నిజంగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యపోయా. కానీ ఇది నన్ను చాలా ఆనందంలో ముంచెత్తింది’ అని రోజ్ స్పందించింది. ఈ ఘటన తర్వాత ఇద్దరి ఫోన్లు ‘కంగ్రాట్స్’ మెసేజ్లతో హోరెత్తిపోయాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
పెళ్లికి నిరాకరించిందని నటిపై కత్తితో దాడి
ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివాహ ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాల్వీని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని యోగేశ్కుమార్ మహిపాల్ సింగ్గా గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉత్తర ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని ఒక కేఫ్ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీపై నిందితుడు యోగేశ్ కుమార్ కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్లో యోగేశ్ కుమార్ తనకు ఏడాదిగా తెలుసని.. ఇద్దరం స్నేహితులమని తెలిపింది. ఈ క్రమంలో యేగేశ్ మాల్వీని వివాహం చేసుకోవాలని భావించాడు. ఆమె ఒప్పుకోలేదు. అంతేకాక అతడితో మాట్లాడటం మానేసింది’ అని తెలిపారు. (చిత్రహింసలు: రక్తపు మరకలు తుడవాలంటూ) ఈ నేపథ్యంలో సోమవారం కేఫ్ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీని యోగేశ్ అడ్డగించాడు. ఎందుకు తనతో మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఆమె తనకు ఇష్టం లేదని చెప్పడంతో కత్తితో పొడిచి పారిపోయాడు. మాల్వీ ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెర్సోవా పోలీసులు వెల్లడించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయని.. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఇక యోగేష్.. ఫేస్బుక్ ద్వారా మాల్వీకి పరిచయం అయ్యాడని పోలీసులు వెల్లడించారు. తనను తాను నిర్మాతగా చెప్పుకుని మాల్వీతో పరిచయం ఏర్పరచుకున్నాడన్నారు. ఇదివరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్ను కలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. -
పెళ్లికి ఓకే అంటే ఇక్కడ టిక్ చెయ్!
లండన్ : ఏ పని చేసినా.. అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటారు కొందరు. అలాంటి కొద్దిమందిలో ఒకడు ఈ స్టోరీలోని ప్రేమికుడు. తన ప్రియురాలిని ‘‘ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’అని అడగటానికి ఏకంగా ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్లోని నార్ఫోక్, గ్రేట్ యార్మౌత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రేట్ యార్మౌత్కు చెందిన 33ఏళ్ల స్మిటెన్ బ్రూనో నివెస్ తన ప్రియురాలు పాట్రికా కలాడో 34ను పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. అయితే తన పెళ్లి ప్రపోజల్ను ఎలా ఆమెకు చెప్పాలో తెలియలేదు. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ ఓ ట్యాటూలు వేసే షాపు దగ్గరకు వెళ్లారు. పాట్రికా బయట ఉండగా.. స్మిటెన్ లోపలికెళ్లి ట్యాటూ వేయించుకోసాగాడు. ( పార్లమెంటులో పోర్న్ ఫొటోలు చూసిన ఎంపీ ) స్మిటెన్, పాట్రికాల జంట ఓ 45 నిమిషాల తర్వాత బయటకొచ్చిన స్మిటెన్ ఆమె దగ్గరకెళ్లి తన ఛాతిపై ఉన్న ‘‘ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని రాసి ఉన్న అక్షరాలను చూపించాడు. ఆ అక్షరాల కింద ఎస్, నో అన్న రెండు గడులు కూడా ఉన్నాయి. ‘ పెళ్లికి ఓకే అంటే ఇక్కడ టిక్ చేయ్!.. లేదంటే..’ అన్నాడు. మొదట ఏమీ అర్థంకాక చూస్తూ ఉండిపోయిన ఆమె ఆ వెంటనే తేరుకుని ఎస్ అని ఉన్న గడి మీద పెన్నుతో రాసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, ఇద్దరికీ ఇది వరకే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ భాగస్వాములతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. వచ్చే ఆగస్టులో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది. -
వర్జిన్, వెజిటేరియన్ అంటూ పెళ్లి ప్రపోజల్
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ తిలోత్తమ షోమ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందుకు నటి షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ కారణంగా నిలిచింది. ఇటీవల తిలోత్తమకు తనను పెళ్లి చేసుకుంటానంటూ ఓ వ్యక్తి నుంచి వింతైన ప్రపోజల్ వచ్చింది. అయితే ఈ ప్రపోజల్ ఏ గులాబి పువ్వుతోనో, ప్రేమ లేఖ ద్వారానో కాదు. సోషల్ మీడియాలో మెసేజ్ ద్వారా తిలోత్తమ అంటే ఇష్టమని తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కోరాడు. ‘ఐ లవ్ యూ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.. జీవితాంతం మీతో కలిసి ఉంటాను. నేను వర్జిన్. అలాగే వెజిటేరియన్ కూడా. అంతేగాక లై- డిటెక్టర్, నార్కో టెస్టు, వర్జినిటి, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ మెసేజ్ చేశారు. (‘అంతకంటే ముందు నేను ఓ పని చేయాలి’) View this post on Instagram ये कैसा शाकाहारी मज़ाक हैं भाई? No thanks. Bye bye Tata bata alvida। A post shared by Tillotama Shome (@tillotamashome) on Jul 5, 2020 at 11:27pm PDT దీనిపై స్పందించిన తిలోత్తమ ‘బ్రదర్ జోక్గా ఉందా.. అవసరం లేదు ధన్యవాదాలు.. బై బై’ అంటూ ఈ స్క్రీన్షాట్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇక ఈ పోస్టుపై నటి ఇషా చోప్రా కామెంట్ చేశారు. తనకు కూడా ఇలాంటే మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. కాగా ‘మాన్సూన్ వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన తిలోత్తమ షోమ్ అంతకముందు థియేటర్ ఆర్టిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. చివరగా ఆంగ్రేజీ మీడియంలో కనిపించారు. (‘సుశాంత్ను ఆ సినిమాల్లో నుంచి తప్పించాను’) -
రవీనా.. నన్ను పెళ్లి చేసుకుంటారా?
పలు భాషల్లో నటిస్తూ అగ్రకథానాయికగా వెలుగొందిన నటి రవీనా టండన్. 2004లో సినిమా డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె చాలా తక్కువ సినిమాల్లో నటించింది. పిల్లలు (దత్తత తీసుకుంది), కుటుంబం అంటూ కెరీర్కు సరైన ప్రాధాన్యతనివ్వలేదు. అయితే కొన్నాళ్ల నుంచి ఆమె తిరిగి ఫార్మాట్లోకి వచ్చింది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇదిలా వుంటే అప్పటికీ ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. "రవీనా టండన్ తన ఫస్ట్ క్రష్" అని బాహుబలి హీరో ప్రభాస్ కూడా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. (శానిటైజర్తో సీట్లను తుడిచిన స్టార్ నటి!) తాజాగా ఆమె గతంలో వేసవి కాలంలో మంచు ప్రదేశాల్లో సేద తీరుతున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ ఫొటోలకు మంత్రముగ్ధులైన అభిమానులు "మేడమ్ సార్.. మేడమ్ అంతే.." అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో అభిమానైతే ఓ అడుగు ముందుకేసి "రవీనా మేడమ్.. వచ్చే జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటారా?" అని మనసులో మాటను కక్కేశాడు. దీనికి నటి స్పందిస్తూ.. "మన్నించాలి, ఇప్పటికే ఏడుగురికి బుక్ అయిపోయింది" అంటూ వచ్చే జన్మ కూడా ఖాళీగా లేదని అర్థం వచ్చేలా సరదాగా సమాధానమిచ్చింది. ఆమె చమత్కార శైలికి ఆశ్చర్యపోయిన అభిమానులు 'ఆమె ఎప్పటికీ క్వీన్' అంటూ కితాబిస్తున్నారు. (ప్రభాస్ సీక్రెట్ క్రష్.. ఓ బాలీవుడ్ హీరోయిన్!) -
వెరైటీ ప్రపోజల్: వెంటనే పెళ్లి కూడా ఖరారు
బెర్లిన్: ప్రేమికుల వారోత్సవం ముగింపు ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా ఒకెత్తు, రేపటి దినం మరో ఎత్తు. ఎన్ని ఇచ్చి పుచ్చుకున్నా, ఒకరి దగ్గర మరొకరు ఎంత గారాలు పోయినా రేపు అసలు పరీక్ష. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే. కాబట్టి ఆ ఒక్కరోజు ప్రేమించేవారి మనసు గెలిచామంటే చాలు.. జీవితాంతం వారితోనే బతికేస్తామంటూ ఊహల్లో బతికేస్తారు చాలామంది. కొందరు ఊహలు నిజమైతే మరికొందరివి మాత్రం పగటి కలల్లాగే మిగిలిపోతాయనుకోండి.. అది వేరే విషయం. అయితే ప్రేమను వ్యక్తపరిచే కళ అందరికీ ఉండదు. ఎన్నెన్నో అనుకున్నా ఎదురుగా ప్రేయసి/ ప్రేమికుడు తారసపడేసరికి మాత్రం నోరు మూగబోతుంది. అందుకే కొందరు నేరుగా కాకుండా మెసేజ్లోనో, కాల్ చేసో, ఉత్తరం రాసో, ఫ్రెండ్ ద్వారానో ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ మనసులోని మాటను ఇష్టసఖికి చేరవేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తను ప్రేమించిన అమ్మాయికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు.(ప్రేమకు అసలైన నిర్వచనం ప్రేమలేఖలే) జర్మన్కు చెందిన స్టీఫెన్ స్క్వార్జ్ తన ప్రేమను గెలిపించుకోడానికి పొలాన్నిమార్గంగా ఎంచుకున్నాడు. పొలంలో మొక్కజొన్న పంటను యంత్రసహాయంతో ఒక క్రమపద్ధతిలో నాటాడు. అది ఏరియల్ వ్యూ ద్వారా చూస్తే ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని జెర్మన్ భాషలో కనిపిస్తుంది. ఇది అక్కడి జనాలను ఎంతగానో అబ్బుపరిచింది. ఈ ప్రపోజల్ సరాసరి గూగుల్ మ్యాప్లో ప్రత్యక్షం కావడమే ఈ ఆశ్యర్యానుభూతులకు ప్రధాన కారణం. ఇక అనతికాలంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతమందికి నచ్చాక ప్రేయసి పడిపోకుండా ఉంటుందా.. ఈ స్పెషల్ ప్రపోజల్తో అతని ఒళ్లో వాలిపోవడమే కాదు.. ఏకంగా జూన్లో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారీ జంట. (కోటి మాటలు ఓ కౌగిలింతకు సరికావు!) చదవండి: గర్భిణీకి కరోనా, మరి శిశువుకు? -
పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్
ఆదాశర్మ పెళ్లికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. తనకో పెళ్లి కొడుకు కావాలంటూ పెళ్లి కూతురు గెటప్లో తయారై ఉన్న ఫోటోను షేర్ చేశారు. కాకపోతే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే వాడు ఎలా ఉండాలనే విషయంలో కొన్ని షరతులను విధించింది. 'అతను ఉల్లిపాయలు తినకూడదు. కులం, రంగు, మతం, కండలు తిరిగిన దేహం, స్విమ్మింగ్, వీసా, జాతకం లాంటి విషయాలు పట్టించుకోను. కాకపోతే అతను మూడు పూటలా నవ్వుతూ వండిపెట్టాలి. ఇంట్లో జీన్స్ ధరించినా పర్లేదు కానీ బయటకు వెళ్లేటప్పుడు మాత్రం భారతీయ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. నేనే స్వయంగా రోజుకు 5లీటర్ల మంచినీరు అందిస్తా.. కానీ ఇంటా బయట మద్యం, మాంసాహారం ముట్టుకోవద్దు. క్రమం తప్పకుండా షేవ్ చేసుకోవాలి. అలాగే అతనికి భారతదేశంలోని అన్ని భాషా చిత్రాల మీద గౌరవం కలిగి ఉండాలి' అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆదాశర్మ చేసిన ఈ పోస్ట్ను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆదా ఇంత సడెన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో, ఆమె పెట్టిన షరతులను చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆదాశర్మ ఈ మధ్యనే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆదా కమాండో 3, బైపాస్ రోడ్, మ్యాన్ టు మ్యాన్ హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. WANTED : Groom who does'nt eat onions.Caste, colour, religion, shoe size, visa, swimming abilities, bicep size, instagram followers, horoscope no bar He should be willing to cook 3 times a day with a smiling face and shave regularly. Cont'd... pic.twitter.com/rqYh1dzFGv — Adah Sharma (@adah_sharma) September 21, 2019 -
కత్రినా.. నువ్వు లేకుంటే చచ్చిపోతా.. పెళ్లి చేసుకో!
‘కత్రినా.. నిన్ను నేను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నన్ను పెళ్లి చేసుకో. నీ నెంబర్ ఇవ్వు’ .. ఇది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ను ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్. ఓ వెబ్ షోలో పాల్గొన్న కత్రినా ఈ ట్వీట్కు పాజిటివ్గా స్పందిస్తూ.. ‘ ఈ రోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు ఉన్నారని తెలియడం ఆనందం కలిగిస్తోంది. ఈ రోజుల్లో అందరూ పరిస్థితులకు అనుగుణంగా ఉండిపోతూ.. ఏదీ సీరియస్గా తీసుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. నటుడు ఆర్బాజ్ ఖాన్ నిర్వహించే వెబ్ షో ‘పించ్’లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో నటులు, సెలబ్రిటీలపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్లు వారికి చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో వచ్చిన పెళ్లి ప్రతిపాదనను చూపించగా.. కత్రినా ఒకింత ఉద్వేగంగానే స్పందించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా ఆమె మాట్లాడారు. రణ్బీర్ కపూర్తో రిలేషన్షిప్కు బ్రేకప్ చెప్పిన తర్వాత సింగిల్గానే ఉంటున్న ఆమె.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఏమో ఐడియా లేదు. ఒకరోజు పెళ్లి చేసుకుంటాను. జీవితం ఊహించలేనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు’ అని బదులిచ్చారు. వైవాహిక వ్యవస్థపై నమ్మకముందా? అని ప్రశ్నించగా.. ‘ఒక వ్యక్తిగా నాకు పెళ్లి, పిల్లలపై నమ్మకముంది. ఒకరోజు నేను పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపారు. -
భారత్, ఇంగ్లండ్ మ్యాచ్లో మ్యారేజ్ ప్రపోజల్
లండన్ : లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని తన గర్ల్ఫ్రెండ్కు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఈ చర్యతో కాసింత సిగ్గుపడిన ఆ యువతి తర్వాత అతని ప్రపోజల్ను అంగీకరించింది. అతడు ఇచ్చిన రింగ్ను స్వీకరించింది. దీంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు టీవీలో కూడా ప్రసారం అయ్యాయి. కామెంటేటర్స్ కూడా దీనిపై తమదైన శైలిలో స్పందించారు. ఆ సమయంలో బౌలింగ్ చేస్తున్న భారత బౌలర్ చాహల్ కూడా క్లాప్స్ కొడుతు వారికి శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఆ వ్యక్తి ప్రపోజ్ చేసిన సమయంలో ‘డెసిషన్ పెండింగ్’ అంటూ.. ఆమె అతని ప్రపోజల్ అంగీకరించిన తర్వాత ‘షీ సెడ్ యస్’ అంటూ టీవీ స్ర్కీన్పై ప్లాష్ నిచ్చారు. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు ఈ ప్రపోజల్ను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వారిద్దరిని కామెంటేటర్స్ బాక్స్లోకి పిలిచిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ అధికారులు వారికి చిన్నపాటి బహుమతి కూడా అందజేసినట్టు సమాచారం. గతంలో కూడా క్రికెట్ మ్యాచ్లు జరగుతున్న సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 86 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. -
మ్యాచ్లో మ్యారేజ్ ప్రపోజల్..వైరల్!
-
సల్మాన్ పెళ్లి చేసుకుంటా అని అడిగితే..
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ల బంధం ఓపెన్ సీక్రెట్. చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో కానీ 2009లో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. బ్రేకప్ చెప్పుకుని వేరే పెళ్లిళ్లు చేసుకున్నారా? అంటే అదీ లేదు. మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్గా సల్మాన్ ఖాన్ ఉండగా.. ఇటు మాజీ ప్రేయసి కత్రినా కూడా పెళ్లి ప్రస్తావ ఏమీ లేకుండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికీ వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగానే మెలుగుతున్నారు కూడా. సల్మాన్తో డేటింగ్లో ఉండగానే కత్రినాను కరణ్ జోహార్ తన చాట్ షోలో ఓ ప్రశ్న అడిగారు. ఒకవేళ సల్మాన్ తనను పెళ్లి చేసుకోమని అడిగితే ఏం చెబుతావ్ అని కరణ్ కత్రినాను ప్రశ్నించారు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం కాస్త దిమ్మతిరిగేలానే ఉంది. ‘ఇది చాలా అన్యాయం. నేను ప్రమాణపూర్తిగా చెబుతున్నాను పూర్తిగా మోసం’ అంటూ సమాధానమిచ్చారు. అయితే ఇలా సల్మాన్ తనను అడిగినప్పుడు ఉంటుందని అన్నారు. సల్మాన్, కత్రినాలు దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. చెట్టపట్టాలేసుకుని తిరిగారు. కానీ 2009లో వీరిద్దరూ విడిపోయారు. ఇప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులుగానే ఉంటూ అన్యోన్యతను ప్రదర్శిస్తూ ఉన్నారు. 2017లో జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్ గువహటిలో కత్రినా... సల్మాన్ను అందలానికి ఎత్తేశారు. సల్మాన్ చాలా అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. అదేవిధంగా సల్మాన్ కూడా కత్రినాకు తక్కువేమీ కాకుండా.. స్వీటెస్ట్ గర్ల్స్లో ఆమె ఒకరంటూ ప్రశంసలు కురిపించారు. టైగర్ జిందా హై సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు కూడా. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లను వసూలు చేసింది. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనదీక్ష
కామేపల్లి: మండల పరిధిలోని పొన్నెకల్లు గ్రామపంచాయతీ పరిధిలోని బర్లగూడెం గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనదీక్ష చేపట్టిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కామేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంనగర్కు చెందిన అమ్మాయి భూక్య పద్మ, బర్లగూడెం గ్రామానికి చెందిన నూనావత్ కిశోర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కిషోర్ పాల్వంచ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పద్మ బీఈడీ చదువుతోంది. అయితే ఇరువురి కుటుంబ సభ్యులు వివాహానికి ఒప్పుకొని కట్నంగా రూ.15 లక్షలు ఇస్తామని చర్చలు జరిపారు. కొంతకాలంగా కిశోర్ ముఖం చాటేయడంతోపాటు, వేరే సంబంధాలు చూస్తుండటంతో పద్మ కిషోర్ ఇంటి ఎదుట దీక్షను చేపట్టింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. -
పెళ్లి ఇష్టంలేక ప్రియుడు..మనస్తాపంతో ప్రియురాలు
మంచాల (ఇబ్రహీంపట్నం): విషం తాగి ప్రేమికులు వేర్వేరుగా ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని యువతి తరఫు బంధువులు యువకుడిపై ఒత్తిడి తేవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కూడా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మతండాలో గురువా రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం డాకు తండాకు చెందిన అఖిల గత రెండు నెలలుగా ఎల్లమ్మ తండాలోని తమ బంధువుల ఇంటి వద్ద ఉంటూ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఎల్లమ్మతండాకు చెందిన సపావట్ శ్రీకాంత్ ఆదిబట్లలోని టాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కుల పెద్దలు పెండ్లి చేయాలని ఇరువురి పిలిచి అడిగారు. అయితే శ్రీకాంత్ మాత్రం అఖిలను పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని చెప్పాడు. ఆమెను ప్రేమించావు గనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని యువతి తరఫు బందువులు శ్రీకాంత్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో శ్రీకాంత్ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అఖిల కూడా విషం తాగింది. ఆమెను కూడా ఇబ్రహీంపట్నంలోని మరో ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇద్దరి ఆత్మహత్య లేఖలు లభ్యం ఆత్మహత్యకు ముందు అఖిల ఉత్తరం రాసింది. శ్రీకాంత్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని.. కానీ ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొంది. తన మృతికి శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు కారణమంటూ వారి పేర్లు ఉత్తరంలో రాసింది. అదే విధంగా శ్రీకాంత్ కూడా ఆత్మహత్యకు ముందు లేఖరాశాడు. తన మృతికి అఖిల బంధువులే కారణమంటూ లేఖలో ఆరోపించాడు. తనకు ఇష్టం లేకున్నా అఖిలతో పెళ్లి చేసేందుకు ఆమె బంధువులు తనపై ఒత్తిడి తెస్తున్నారని.. అది భరించలేకే ఆత్మహత్యకు పాల్పడున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. -
నన్నుపెళ్లి చేసుకుంటావా.?
ఇస్తాంబుల్: రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవాకు వింత అనుభవం ఎదురైంది. ఈ మాజీ నెం1 ర్యాంకర్ మ్యాచ్ ఆడుతుండగా ఓ అభిమాని పెళ్లి ప్రపోజల్ చేశాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం స్టేడియంలో ఉన్న వారందరికీ నవ్వులు పూయించింది. ఐదు గ్రాండ్స్లామ్లు గెలుచుకున్న షరపోవా.. వచ్చే గ్రాండ్స్లామ్ సీజన్ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇస్తాంబుల్లోని సినాన్ ఎర్దేం హాల్లో స్థానిక ప్లేయర్ కాగ్ల బైకుకాకేతో మ్యాచ్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగింది. అప్పుడే బాల్ సర్వ్ చేయడానికి సిద్ధమవుతున్న షరపోవాను 'మరియా... నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ఓ అభిమాని రష్యన్ భాషలో గట్టిగా అరిచాడు. దీనికి ఏమాత్రం విసుగు చెందని షరపోవా ఓ రెండు క్షణాలు ఆలోచించి...'ఏమో!' అని సమాధానమిచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
షరపోవాకు అభిమాని పెళ్లి ప్రపోజల్
-
పెళ్లంటూ చేసుకుంటే మోదీనే..
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లంటూ చేసుకుంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీనే చేసుకుంటానని ఓ మహిళ అంటుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని జైపూర్కు చెంది శాంతి శర్మ అనే 40 ఏళ్ల మహిళ గత నెల రోజులుగా(సెప్టెంబర్ 8 నుంచి) దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తోంది. మోదీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనను మోదీ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందని మీడియాకు ఆమె తెలిపింది. అంతేకాదు ఇక్కడి నుంచి తనను పంపిస్తే నేరుగా ఆయన ఇంటి ముందు ఆందోళన దిగుతానని చెప్పింది. శాంతి శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు 1989లో వివాహం జరిగింది. పెళ్లైయిన సంవత్సరానికే ఆమెను భర్త విడిచిపెట్టాడు. ఆ తరువాత ఆమెను చేసుకుంటామని చాలా మంది ముందుకొచ్చినా నిరాకరించింది. అయితే ప్రస్తుతం తాను నరేంద్ర మోదీని పెళ్లి చేసుకుని ఆయనకు సేవలు చేయాలని నిర్ణయించుకున్నానని.. ప్రధాని సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. మోదీ తనను చేసుకుంటే తన ఆస్తి మొత్తం అమ్మి రెండు కోట్ల రుపాయలను కట్నంగా ఇస్తానని చెబుతోంది. ఇదివరకే మోదీకి యశోదా బెన్తో పెళ్లి అయిన విషయం తెలిసిందే. పెళ్లైయిన కొద్ది కాలం నుంచే వారు వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం యశోదా బెన్ గుజరాత్లోని తన సొంత గ్రామంలోనే ఉంటున్నారు. -
కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్
సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల్లో కోహ్లీకి క్రేజ్ మామూలు రేంజ్లో ఉండదు. ఎంత అంటే డానియెల్లి యాట్ సైతం విరాట్ను పెళ్లి చేసుకోమని కోరింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఈసారి పాకిస్తాన్ నుంచి వచ్చింది. పాకిస్తాన్కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇటీవల ప్రపంచ ఎలెవన్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్లో తనను పెళ్లి చేసుకోమని ఓ పోస్టర్ పట్టుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియా ట్విట్టర్లో వైరల్ అయింది. ఇక ఇటీవల పాకిస్తాన్లో ప్రపంచ ఎలెవన్ క్రికెట్ జట్టు పర్యటించింది. ఇందులో ప్రపంచ దేశాలకు చెందిన క్రికెటర్లు పాల్గొన్నారు. అయితే ఇందులో భారత్ నుంచి ఏఒక్కరు ఆడలేదు. దీంతో పాక్లోని కోహ్లీ, ధోని అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. సోషల్ మీడియా ద్వారా తమ నిరాశను వ్యక్త పరిచారు. భారత ఆటగాళ్లు కోహ్లీ, ధోని ఈ మ్యాచ్ల్లో ఆడుంటే పాకిస్తాన్ క్రికెట్కు మరింత ప్రభావం ఉండేదన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో చాలా మంది అభిమానులు 'వీ మిస్ ధోని, కోహ్లీ' అనే ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. అందులో ఒకరు 'కోహ్లి మేరీ మీ' ప్లకార్డు పట్టుకొని ఉన్నాడు. -
ప్రియుడు మోసం చేశాడని.. కోసి పారేసింది!
న్యూఢిల్లీ: ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ప్రేయసి తెలివిగా అతడి పురుషాంగాన్ని కోసి పారేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని మంగోల్పురిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రవి(35) ఓ చిరు వ్యాపారి. స్థానిక మంగోల్పురిలో నివాసం ఉండే 23 ఏళ్ల యువతిని గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మొదట్లో యువతి ఇతడిని పట్టించుకోలేదు. కానీ క్రమంగా వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంటకు పెళ్లి విషయంలో విభేదాలొచ్చాయి. యువతి తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించగా, ప్రియుడు రవి మాత్రం విషయం వచ్చేసరికి దాటవేసేవాడు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి యువతి ఇంటికి రవి వెళ్లగా.. పెళ్లి చేసుకోవాలంటూ యువతి గట్టిగా నిలదీసింది. మా ఇంట్లో వాళ్లు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తనని మరిచిపోవాలిని సూచించగా యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నాలుగేళ్లుగా తనవెంట తిప్పుకుని మోసం చేసిన ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. ఇంట్లో వాళ్లకు కొద్దిసేపు బయటకు వెళ్లమని సూచించిన ఆ యువతి.. ఈ ఒక్కసారి తనతో శృంగారం చేస్తే పెళ్లి మాట ఎత్తనని ప్రియుడిని నమ్మించింది. చివరకు అతడిని నగ్నంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లింది. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న చాకుతో ప్రియుడి పురుషాంగాన్ని కోసిపారేసింది. నొప్పిని భరించలేక అతడు సాయం చేయాలని అరుస్తూ బటయకు పరిగెత్తాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడు రవిని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సర్జరీ చేసిన వైద్యులు పేషెంట్ను జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. యువతి సహా ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని విచారణ చేపట్టిన మంగోల్పురి పోలీసులు తెలిపారు. -
చార్మీని పెళ్లాడడానికి రెడీ...
నటి చార్మీని పెళ్లాడడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏంటీ నమ్మబుద్ధికా వడం లేదా? అయితే ఇది చదవండి. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న త్రిష గురువారం 33వ ఏటలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో నటి చార్మీ కూడా ఉంది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిష. త్వరగా తిరిగి రా.. పార్టీ చేసుకుందాం. అలాగే నేను చేసిన పెళ్లి ప్రతిపాదనను ఈ ఏడాదైనా పరిగణనలోకి తీసుకో..’ అంటూ ట్విటర్లో చార్మీ ట్వీట్ చేసింది. త్రిష స్పందిస్తూ ‘నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఇష్టాన్ని వ్యక్తపరిచిన రోజే సమ్మతం తెలిపాను. లవ్ యూ’ అంటూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు వారి మధ్య సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని గుర్తు చేస్తున్నా.. నెటిజన్లు తమదైన ప్రచారాలతో దుమ్ముదులుపుతున్నారు. కాగా పౌర్ణమి చిత్రంలో త్రిష, చార్మి కలిసిన నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులుగా మారారు. త్రిష తన తల్లి ఉమాకృష్ణన్ తో కలిసి సమ్మర్ వెకేషన్కు వెళ్లింది. అక్కడే తన పుట్టినరోజును స్నేహితుల సమక్షంలో జరుపుకుంది. -
పెళ్లికి అంగీకరించలేదని కత్తితో దాడి
జగిత్యాల: పెళ్లికి అంగీకరించలేదని ఆగ్రహించిన యువకుడు బాలికపై కత్తితో దాడిచేసి గాయపరచిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను(16) పెళ్లి చేసుకోమని తరుచుగా వేధిస్తూండేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన రాకేష్ ఆదివారం ఉదయం ఒంటరిగా ఉన్న బాలికపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకునే సరికి రాకేష్ పరారయ్యాడు. గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. -
ఆ సీనియర్ నటిని పెళ్లి చేసుకుంటాడట!
సినీ నటీమణులకు ఈ మధ్య సోషల్ మీడియాలో చిత్రమైన ప్రపోజల్స్ వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ యువకుడు బాలీవుడ్ అందాల నటి టిస్కా చోప్రాపై మనస్సు పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ట్విట్టర్లో బహిరంగంగా ప్రతిపాదన పంపాడు. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న 42 ఏళ్ల టిస్కా కూడా ఏం తక్కువ తినలేదు. ‘నేను పెళ్లికి రెడీ. వివరాలు పంపు. మా ఆయన కూడా ఎవరి కోసం నేను వెళుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు అంతకంటే సీనియర్ నటికి ట్విట్టర్లో పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ‘బాగ్ మిల్కా బాగ్’, ‘వీర్ జరా’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సీనియర్ నటీమణి దివ్యాదత్తాను పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు ముందుకొచ్చాడు. ట్విట్టర్లో అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి ఆమెకు పెళ్లి ప్రతిపాదన పెట్టాడు కానీ.. వచ్చిరానీ ఇంగ్లిష్లో అతను ఏం చెప్పాడో ఎవరికీ అర్థం కాలేదు. ‘Divya Like you and I want to marry you very extraordinary amount Tume Hu Khus marry me I will swear’ అంటూ ట్వీట్ చేశాడు. అతని భావాల బట్టి ‘దివ్యా.. నువ్వు నాకు ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా.. ఒట్టు’ అని అన్నట్టు భావిస్తున్నారు. అయితే, అతడి ఇంగ్లిష్ అర్థం కాక సీనియర్ నటి దివ్యాదత్తా కూడా తికమక పడ్డారు. ‘ఏమంటున్నావు అన్నా.. కాస్తా అర్థమయ్యేట్టు చెప్పు’ అని ఆమె అడిగారు. ఇక, అతడి వచ్చిరానీ ఇంగ్లిష్ మీద నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లిష్ భాష ఇప్పుడే ప్రశాంతంగా చనిపోయిందని ఒకరు కామెంట్ చేయగా.. మీ మీద ధ్యాసతో ఏం టైప్ చేస్తున్నాడో తెలియక తప్పులు టైప్ చేసి ఉంటాడని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా గూగుల్ ట్రాన్స్లేటర్ పొరపాటే అయి ఉంటుందని ఒకరు.. కన్సోలేషన్ ప్రైజ్ కింద స్పోకెన్ ఇంగ్లిష్ బుక్ అతనికి కానుకగా ఇవ్వండని మరొకరు ఛలోక్తులు విసిరారు. @divyadutta25 @Armanma19175530 English just died a Peaceful death! — Shilpacious (@shilpa11m) October 21, 2016 -
నటికి సోషల్ మీడియాలో మ్యారేజ్ ప్రపోజల్!
ముంబై: సెలబ్రిటీలను పెళ్లిచేసుకునేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. అప్పుడప్పుడు కొందరు యువతులు తమ అభిమాన హీరో ఇంటి ఎదుట బైఠాయించి.. పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తుండటం మన గమనిస్తుంటాం. ఇక్కడ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఓ యువకుడు తన అభిమాన నటిని పెళ్లి చేసుకుంటావా అని సోషల్ మీడియాలో అడిగాడు. ఆ వివరాలిలా ఉన్నాయి. బాలీవుడ్ నటి టిస్కా చోప్రాకు ఓ వ్యక్తి సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. ఇందుకు టిస్కా చోప్రా కూడా స్పందిస్తూ.. ఆ అభిమానికి షాక్ ఇచ్చింది. మొదటగా పెళ్లి ప్రతిపాదనకు థ్యాంక్స్ చెప్పిన టిస్కా.. పూర్తి వివరాలు పంపించాలని అభిమానికి ఓ ట్వీట్ చేసింది. తన భర్తను ఈ పెళ్లి గురించి పర్మిషన్ తీసుకోవాలని, ఏ వ్యక్తి తనతో జీవితాన్ని కోరుకుంటున్నారో ఆయనకు తెలియాలి కదా అని చమత్కరించింది. టిస్కా నుంచి ఇలాంటి రిప్లై ఊహించని ఆ వ్యక్తి కంగుతిని ఉంటాడు. తారే జమీన్ పర్, కిస్సా, రహస్య మూవీలతో వెండితెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న టిస్కా పలు టీవీ షోలతో పాటు కహానీ ఘర్ ఘర్ కీ, కరిష్మా కా కరిష్మా లాంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం 'చట్నీ' అనే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో బిజీగా ఉంది. -
పెళ్లికి నో చెప్పిందని.. టీచర్ ను..!
ఇస్లామాబాద్: పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పిందన్న కారణంతో ఓ స్కూలు టీచర్ ను సజీవ దహనం చేశారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి చివరికి తనువు చాలించింది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో బుధవారం చోటుచేసుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబ్ కు సమీపంలోని ముర్రీ ప్రాంతంలో మరియా సదాఖత్(19) అనే స్కూల్ టీచర్ పై కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ముందుగా యువతిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నించారు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై సజీవ దహనానికి యత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆమె అంకుల్ తెలిపారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సదాఖత్ నేడు చనిపోయిందని తెలిపారు. సదాఖత్ ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్ గా పనిచేస్తుందని, ఆ స్కూలు ప్రిన్సిపాల్ తన కొడుకును వివాహం చేసుకోవాలని ఆమెను కోరాడు. పెళ్లికొడుకు వయసు తనకంటే రెట్టింపు ఉందని, అతడు అది వరకే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడన్న కారణంతో పెళ్లికి నో చెప్పింది. టీచర్ జాబ్ కూడా వదిలేసింది. చనిపోయేముందు ఈ ఘటనపై ఆమె వాంగ్మూలం ఇచ్చిందని, ప్రిన్సిపాల్ తో పాటు మరో నలుగురు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీస్ అధికారి మజార్ ఇక్బాల్ తెలిపారు. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.