-
కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు
సాక్షి, ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ మంగళవారం దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ మొదటిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది. ఈ వరుసలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా అవతరించింది. గ్లాక్సోస్మిత్క్లైన్ కన్స్యూమర్ హెల్త్కేర్ మెగా ఒప్పందం ప్రకటించిన దాదాపు 15 నెలల విలీనాన్ని మంగళవారం ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించింది. రూ. 3,045 కోట్ల విలువైన హార్లిక్స్ బ్రాండ్ను కొనుగోలుకు బోర్డు అనుమతి లభించందని సంస్థ ప్రకటించింది. దీంతో హిందూస్థాన్ యూనిలీవర్ షేర్ ధర 11.41 శాతం పెరిగి రూ .2,399 వద్ద ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. (దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు) కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుండి ఎఫ్ ఎంసీజీ ఫార్మా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొన్నాయి. ఇవి వరుసగా 10.4 శాతం, 20 శాతం ఎగిసాయి. అయితే ఈ సమయంలో నిఫ్టీ 6.45 శాతం క్షీణించింది. కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాటం నేపథ్యంలో ఈ ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఏర్పడిందని, దీంతో షేర్లు పెరుగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. మంగళవారం నాటి మార్కెట్ లో ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, డాబర్, ఇమామి, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జూబిలెంట్ ఫుడ్వర్క్స్, కోల్గేట్ పామోలివ్ లాంటి ఇతర ఇతర ఎఫ్ఎంసిజి షేర్లు కూడా ఒక్కొక్కటి 5-10 శాతం మధ్య ట్రేడవుతుండటం విశేషం. కీలక సూచీల్లో సెన్సెక్స్ 2289 పాయింట్లకు పైగా లాభపడుతుండగా, నిఫ్టీ 657 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. చదవండి: బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే -
రిలయన్స్ @10,00,000
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్ ముకేశ్ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్ క్యాప్కు, మొత్తం నిఫ్టీ స్మాల్క్యాప్ సూచీలోని 250 కంపెనీల మార్కెట్ క్యాప్కు సమానం. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్గా వ్యవహరిస్తారు. ఆ రెండు విభాగాల జోరు.... అతి తక్కువ కాలంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని సాధించిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా తెలిపారు. వినియోగ ఆధారిత టెలికం, రిటైల్ రంగాల్లో పెట్టుబడుల వల్ల రిలయన్స్ ఈ ఫలితాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల వాటా కంపెనీ మొత్తం లాభాల్లో నిలకడగా పెరుగుతోందని వివరించారు. 25 సెషన్లలోనే లక్ష కోట్లు అప్.... ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.9 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 25 ట్రేడింగ్ సెషన్లలోనే మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ 14 శాతం పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మాత్రం 41 శాతం ఎగబాకింది. రుణ రహిత కంపెనీగా నిలవాలన్న కంపెనీ లక్ష్యం, దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు చేస్తుండటం, టెలికం టారిఫ్లను పెంచనుండటం, వినియోగదారుల వ్యాపారంపై దృష్టిని పెంచడం.. షేర్ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. వచ్చే నెల నుంచి మొబైల్ చార్జీలను పెంచనున్నామని రిలయన్స్ జియో ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్ పెరుగుతూనే ఉంది. కాగా ఈ క్యూ2లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రికార్డ్ స్థాయిలో రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇటీవల వరకూ అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనే ట్యాగ్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ల మధ్య పోటీ ఉండేది. ఈ రేసులో ఈ రెండు కంపెనీలు నువ్వా ? నేనా అనే పోటీ పడేవి. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న టీసీఎస్కు, రిలయన్స్కు మధ్య తేడా రూ. 2 లక్షల కోట్ల మేర ఉండటం విశేషం. రుణ భారం పెరుగుతూ ఉన్నా... రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2009 నుంచి 2016 వరకూ రూ.350–550 రేంజ్లో కదలాడింది. రిలయన్స్ జియో రంగంలోకి వచి్చన తర్వాత నుంచి షేర్ జోరు పెరిగింది. మూడేళ్లలో ఈ షేర్ 220 శాతం ఎగసింది. 1977లో ఈ కంపెనీ ఐపీఓకు వచి్చనప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే, అది ఇప్పుడు రూ.2.1 కోట్లకు పెరిగిందని అంచనా. కాలంతో పాటు మారుతూ రావడమే రిలయన్స్ ఘనతకు కారణం. నూలు తయారీ కంపెనీ నుంచి ఇంధన దిగ్గజంగా ఎదగడమే కాకుండా మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రిటైల్, టెలికం రంగాల్లోకి విస్తరించింది. 2009లో రూ.72,000 కోట్ల మేర ఉన్న రుణ భారం పదేళ్లలో 277 శాతం ఎగసి రూ.2.87 లక్షల కోట్లకు పెరిగింది. రుణ భారం ఈ స్థాయిలో పెరుగుతూ ఉన్నా, ఇన్వెస్టర్లు ఈ షేర్పై విశ్వాసాన్ని కోల్పోలేదు. ‘టార్గెట్’ పైపైకి... రుణ రహిత కంపెనీగా నిలవాలన్న రిలయన్స్ కంపెనీ లక్ష్యం వచ్చే ఆరి్థక సంవత్సరంలో సాకారం కావచ్చని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తాఫా నదీమ్ అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు వాటా విక్రయం, రిలయన్స్ జియో విభాగం కారణంగా భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్కు కొనచ్చు రేటింగ్ను ఇచ్చాయి. టార్గెట్ ధరలను పెంచాయి. -
మరోసారి దూసుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్
సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్కెట్క్యాప్ పరంగా దేశంలో అతిపెద్ద మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. మంగళవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు ఇంట్రా-డే 3 శాతానికి పైగా లాభపడి బీఎస్ఇలో ఆల్టైమ్ గరిష్ట స్థాయి (రూ.1,508.45)ని తాకింది. దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .9.50 ట్రిలియన్లను దాటిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. అతి త్వరలోనే పది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ను సాధించే దిశగా సాగుతోంది. అర్ధ శతాబ్దం క్రితం 1966లో ఒక ఉద్యోగితో, కేవలం రూ.1000 మూలధనంతో (అప్పటికి130 డాలర్లతో) రిలయన్స్ను స్థాపించారని, రిలయన్స్ను ప్రపంచ స్థాయి భారతీయ వ్యాపార సంస్థగా నిర్మించాలన్నది తన తండ్రి కల అని, అది తన జీవితకాలంలో సాకారం కావడం తన అదృష్టమని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గత ఏడాది మార్చిలో గుర్తు చేసుకున్నారు. అక్టోబర్ 18న, 9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ను దాటిన మొదటి సంస్థగా ఆర్ఐఎల్ నిలిచింది. 2019 క్యాలెండర్ సంవత్సరంలో ఆర్ఐఎల్ స్టాక్ ధర 34 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పటివరకు రూ .2.3 ట్రిలియన్లు పెరిగింది. కాగా ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ రూ .7.91 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ కాప్ ఇటీవల రూ .7 లక్షల కోట్ల మైలురాయిని దాటి 3 వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
జియో దెబ్బ : ఎగిసిన ఎయిర్టెల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ మళ్లీ ఫాం లోకి వస్తోంది. టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీతో టారిప్ వార్లో భారీగా కుదేలైన భారతీ ఎయిర్టెల్ షేర్లు బిఎస్ఇలో సోమవారం 4 శాతం పెరిగి 19 నెలల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. దీంతో ఎయిర్టెల్ రూ .2 లక్షల కోట్ల (ట్రిలియన్) మార్కెట్ వాల్యుయేషన్ మార్క్ను తిరిగి దక్కించుకుంది. రిలయన్స్ జియో 6 పైసల వడ్డన ప్రకటించిన తరువాత నుంచి భారతి ఎయర్టెల్ వరుసగా ఐదవరోజు కూడా లాభపడింది. దీంతో షేరు ధర మార్చి 2018 నుండి అత్యధిక స్థాయిని తాకింది. గత ఒక వారంలో 2 శాతం లాభంతో పోలిస్తే, 16 శాతం ర్యాలీ చేసింది. దీంతో కంపెనీ 27,662 కోట్ల రూపాయల మార్కెట్ అదనంగా చేకూరింది. గత వారం, రిలయన్స్ జియో ఆఫ్-నెట్ కాల్లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని తెలిపింది. వినియోగదారుల నుండి ఇంటర్ కనెక్షన్ వినియోగ ఛార్జీలను (ఐయుసీ) ప్రకటించడంతో రిలయన్స్ జియో వినియోగదారుల ఆగ్రహానికి గురవుతోంది. తద్వారా ఇప్పటివరకు ఉచితంగా అందించిన వాయిస్ కాల్ సేవపై ఇపుడు ఛార్జీ వసూలు చేస్తుంది. ఈ చర్య ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్న సంగతి తెలిసిందే. -
భారీగా పతనమైన యస్ బ్యాంక్ షేరు
సాక్షి,ముంబై : ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంక్కు ఫలితాల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో యస్ బ్యాంకు షేరు ఏకంగా 20శాతం కుప్పకూలింది. తద్వారా ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అంతేకాదు తాజా పతనంతో యస్ బ్యాంక్ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ) రూ. 20,615 కోట్లకు క్షీణించింది. నిఫ్టీలో ఇదే అతి తక్కువ మార్కెట్ క్యాప్ అని గణాంకాలు ఆధారంగా తెలుస్తోంది. క్యూ1 ఫలితాలు బుధవారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాల్లో యస్ బ్యాంక్ నికర లాభం 91 శాతం క్షీణించి రూ. 114 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) మాత్రం 3 శాతం పుంజుకుని రూ. 2281 కోట్లను తాకింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.22 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. ఇక నికర వడ్డీ మార్జిన్లు 3.1 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడిన సంగతి తెలిసిందే. బుధవారం యస్ బ్యాంక్ షేరు ఆరంభంలో భారీగా పుంజుకున్నా.. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. -
ఆ విభేదాల ప్రభావం వుండదు - ఇండిగో సీఈవో
సాక్షి, ముంబై : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో కంపెనీ సీఈవో రనుంజాయ్ దత్తా స్పందించారు. బుధవారం ఆయన ఇండిగో ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ఇవి కేవలం ప్రమోటర్ల మధ్య విభేదాలు మాత్రమేనని, దీనికి ఇండిగోకు ఎలాంటి సంబంధ లేదనీ, ఇండిగో కార్యకలాపాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం ఉండదని వివరణ ఇచ్చారు. అలాగే ఎయిర్లైన్స్ మిషన్, డైరెక్షన్, గ్రోత్ స్ట్రాటజీలో ఎలాంటిమార్పు ఉండదని స్పష్టం చేశారు. సంస్థ కార్యకలాపాలు, వృద్ధి పైనే దృష్టి సారించడం ప్రస్తుతం ముఖ్యమన్నారు. ప్రమోటర్ల మధ్య విభేదాలుతో ఉద్యోగులకు, ఎయిర్లైన్స్కు ఏమీ నష్టం జరగదని సీఈవో ప్రకటించారు. శక్తిసామర్థ్యాల మేరకు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని, ఉద్యోగుల నుంచి కూడా ఇదే ఆశిస్తున్నానని చెప్పారు. ఈ సదర్భంగా టార్గెట్లను రీచ్ అయ్యేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ఉద్యోగులందరికీ ఆయన ధన్యవాదాలు అన్నారు. మరోవైపు ఇండిగోలో సంక్షోభంముదిరిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఇండిగో షర్లలో అమ్మకాలకు దిగారు. దీంతో ఇండిగో షేర్లు 11 శాతానికి పైగా పతనమమ్యాయి. అమ్మకాల సెగతో సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 6423 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఒక దశలో 19 శాతానికి పైగా నష్టపోయి, గత మార్చి తర్వాత తొలిసారి ఇంత భారీ నష్టాలను మూటగట్టకుంది. ముగింపులో స్వల్పంగా కోలుకున్నప్పటికీ, 2016 జనవరి తర్వాత ఇండిగోకు ఇదే అతి పెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ప్రమోటర్లు రాకేష్ గాంగ్వాల్, రాహుల్భాటియా మధ్య విభేదాల నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిందిగా గాంగ్వాల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీనికోరిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇండిగో సంస్థను సెబీ కోరింది. -
ఆపిల్కు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ను మరో దిగ్గజం సంస్థ మైక్రోసాఫ్ట్ వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. మార్కెట్ క్యాప్కు సంబంధించిన మైక్రోసాఫ్ట్ అమెరికాలో నెం.1 కంపెనీగా స్థానాన్ని దక్కించుకుంది. తద్వారా ఇటీవల జోరుమీదున్న ఆపిల్కు మైక్రోసాఫ్ట్ గట్టి షాక్ ఇచ్చింది. నాలుగు నెలల క్రితం ఆపిల్ షేర్లు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఆగస్టులో 207 డాలర్ల మార్క్ను అందుకొని, దాన్ని సాధించిన తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది. అప్పటి నుంచి ఆపిల్ కొత్త రికార్డులను సాధించడం ప్రారంభించింది. ఏడు వారాల క్రితం 231 డాలర్ల షేర్ సాధించి ట్రెండింగ్లో నిలిచింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఆపిల్ షేర్లు బిజినెస్ ఎనలిస్ట్లకు కూడా అర్థం కాని స్థితిలో నిలకడలేమితో కొనసాగుతున్నాయి. ఊహించని పరిణామాలు జరుగుతుండడంతో ఆపిల్లో ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడుదారులు సైతం వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది. దీంతో ఆపిల్ షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో తీసుకొచ్చిన ఐఫోన్ ఎక్స్ఆర్ సేల్స్లో బోల్తా పడ్డాయి. ఈ పరిణామామే ఆపిల్ పతనానికి కారణమని ట్రేడ్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆపిల్ షేర్లు 172.29 డాలర్లకు దిగజారాయి. కొద్ది వారాల సమయంలోనే ఆపిల్ షేర్లు 25 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. దీంతో ఆపిల్ ట్రిలియన్ డాలర్ల కంపెనీ అనేది చేదు కలగానే మిగిలిపోయింది. అంతేకాదదు ఆపిల్ మూలధనం (మార్కెట్ క్యాపిటల్) కూడా భారీ మార్పు చవిచూసింది. ఆపిల్ మూలధనం 746 బిలియన్ డాలర్లకు దిగి రాగా, 753 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అతిపెద్ద (మార్కెట్ క్యాప్లో)సంస్థగా నిలిచింది. అమెజాన్, గూగుల్ సంస్థలు ఆపిల్ కంటే కిందే ఉన్నప్పటికీ, ఆపిల్ షేర్లు ఇప్పటిలాగే పడిపోతుంటే రానున్న రోజుల్లో మరింత దిగజారే అవకాశం ఉంది. -
టీసీఎస్ మళ్లీ టాప్
సాక్షి, ముంబై: మార్కెట్ క్యాప్పరంగా ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మళ్లీ టాప్కు దూసుకువచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో మరో మైల్స్టోన్నుకు చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవలికాలంలో ఈ టాప్ ర్యాంక్కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మధ్య తీవ్రమైనపోటీ నెలకొంది. తాజాగా మార్కెట్ క్యాప్ పరంగా భారత్లో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ని వెనక్కి నెట్టి ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.8 లక్షల కోట్లను అధిగమించింది. రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లల కొనుగోళ్ల హవా నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు టిసిఎస్ స షేరు 54.6 శాతం పెరిగింది. ముఖ్యంగా సెప్టెంబరు 6 వ తేదీన జరగనున బై బ్యాక్ ఆఫర్ కారణంగా రోజువారీ లాభాలనే నమోదు చేస్తోంది. టీసీఎస్ షేరు మంగళవారం 2 శాతానికిపైగా లాభపడి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ రూ.8 లక్షల కోట్ల (రూ.8,00,478 కోట్లు) కంపెనీగా అవతరించింది. కాగా ఈ మార్క్ను తొలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిగమించింది. అయితే రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో కంపెనీగా టీసీఎస్ నిలిచింది. అలాగే ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ 3.05 శాతం, మైండ్ట్రీ 2.45 శాతం, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి కంపెనీలు 1.85 శాతం లాభపడ్డాయి. ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆగస్ట్ 23న రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను సాధించి భారత్లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా రికార్డ్ సాధించింది. అయితే ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.7,86,943 కోట్లుగా ఉంది. ఇటీవలే 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,329ని తాకిన షేరు ప్రస్తుతం రూ.1,242 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.1,263 వద్ద ట్రేడవుతున్నప్పుడు కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు అధిగమించింది. -
దూసుకొచ్చిన ఆర్ఐఎల్
సాక్షి, ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్మార్కెట్లు వరుస రికార్డు గరిష్టాలతో దూసుకుపోతోంది. మరోవైపు కొర్పొరేట్ దిగ్గజం, ముకేశ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. మార్కెట్క్యాప్లో 8లక్షలకోట్లనుదాటి ఆకర్షణీయంగా నిలిచింది. దేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆర్ఐఎల్ షేరు 1.28శాతం పుంజుకుని 52వారాల గరిష్టాన్ని టచ్ చేసింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలేజేషన్ 8,00,128 కోట్ల రూపాయలను అధిగమించింది. ఈ క్రమంలో ఈ రేసులో ముందున్న టెక్ దిగ్గజం టీసీఎస్ను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. . టీసీఎస్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 7,77,870కోట్లుగా ఉంది. -
క్యూ1 లాభాల కిక్: నెంబర్ వన్గా రిలయన్స్
సాక్షి, ముంబై: ముకేష్ అంబానీ సొంతమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను వెనక్కి నెట్టి ఆగ్ర భాగాన నిలిచింది. క్యూ1ల సాధించిన ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్ఐల్ కౌంటర్లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రా డేలో 2 శాతానికి పైగా లాభపడింది. మంగళవారం షేరు ధర పెరగడంతో రిలయన్స్ మొత్తం విలువ 7 లక్షల 46 వేల 472 కోట్లకు పెరిగింది. తాజా లాభాలతో దాదాపు 2.7 లక్షల కోట్లను మార్కెట్ క్యాప్లో జత చేసుకుంది. జులై 13న తొలిసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్ల మార్క్ను దాటింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 7.39 లక్షల కోట్లగా ఉంది. కాగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.9459 కోట్లకు చేరింది. గతేడాది కంటే 17.9 శాతం లాభాలు పెరిగాయి. సంస్థ ఆదాయం 56.5 శాతం పెరిగి 1,41,699 కోట్లకు చేరింది. -
హెచ్యూఎల్కు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లో వరుస లాభాలతో దూసుకుపోతున్న ఐటీసీ షేరు జోరుతో సంస్థ అత్యంత విలువైన ఎఫ్ఎంసీజీగా ఐటీసీ అవతరించింది. అలాగే దేశీయంగా అత్యంత విలువైన కంపనీల్లో నాల్గవదిగా నిలిచింది. శుక్రవారం నాటి మార్కెట్లో ఐటీసీ షేరు ర్యాలీ కావడంతో సంస్థ మార్కెట్ క్యాప్ భారీగా పుంజుకుంది. ఐటీసీ షేర్లు 5.24 శాతం పెరిగి 302.20 వద్ద ముగిశాయి. ఇంట్రా డేలో 6.91 శాతం పెరిగి 307 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఆల్టైం గరిష్టస్థాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,69,259 కోట్లకు పెరిగింది. తద్వారా మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్యూఎల్ను వెనక్కి నెట్టింది. హెచ్యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.3,58,798.88 కోట్లతో పోలిస్తే ఐటీసీ విలువ 10,460 కోట్ల రూపాయలు పెరిగింది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఐటీసీ నికర లాభం 10 శాతం పెరిగి రూ .2,818.68 కోట్లకు చేరింది. సిగరెట్ అమ్మకాలు క్షీణించినప్పటికీ వ్యవసాయ వ్యాపార వృద్ధి, ఇతర ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి వృద్ధి సాధించింది. దీంతో భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఫలితాల నేపథ్యంలో నిన్నటి బుల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఐటీసీ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ కొనుగోళ్లతో భారీగా లాభపడింది. గత ఏడు సెషన్లుగా వరుసగా లాభపడుతున్న ఐటీసీ షేరు మొత్తం 13 శాతానికిపై ఎగిసింది. కాగా మార్కెట్వాల్యూలో టీసీఎస్ 7,43,930 కోట్ల రూపాయలతో ప్రథమ స్థానంలో ఉండగా, రిలయన్స్ 7,15,772 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలోనూ, 5,82,045కోట్ల రూపాయలతో హెచ్డీఎఫ్సీ మూడవ స్థానంలో నిలిచాయి. -
ఎం అండ్ ఎం సరికొత్త రికార్డు
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త రికార్డును సాధించింది. మంగళవారం నాటి లాభాలతో రూ.1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్లో చేరింది. వాతావరణ శాఖ అందించిన సాధారణ వర్షపాత అంచనాలు ( 97 శాతం వర్షపాతం) ఎం అండ్ ఎండ్ షేర్కు పాజిటివ్ సంకేతాలను అందించాయి. దీంతో ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచాలు వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలపడింది. ట్రాక్టర్ల దిగ్గజం ఎం అండ్ ఎం కౌంటర్లో కొనుగోళ్లు చేపట్టారు. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. వెరసి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకోవడం విశేషం. మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం క్యాప్) నిన్నటి రూ .99,605 కోట్ల నుంచి ,225.32 కోట్ల రూపాయల మేర పెరిగి రూ .1,01,829.91 కోట్లకు చేరింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా కంపెనీ తాజాగా 30వ ర్యాంకును అందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 1.5 శాతం పెరిగి రూ. 812 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 819 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. తద్వారా దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్కు సైతం చేరువైంది. ప్రస్తుతం టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ డీవీఆర్లతో కలిపి రూ. 1.08 లక్షల కోట్ల వద్ద ఉంది. మార్చిలో వాహన విక్రయాలు 10 శాతం పుంజుకున్న నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు ఈ నెలలో 9 శాతం లాభపడింది. -
ఫేస్బుక్కు షాకిచ్చిన టెన్సెంట్
అమెరికా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు చైనా సోషల్ మీడియాదిగ్గజం షాక్ ఇచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా చైనాకు చెందిన టెన్సెంట్ ఫేస్బుక్ను బీట్ చేసింది. మంగళవారం ఇన్వెస్టర్ల కోనుగోళ్లతో ప్రపంచ దిగ్గ సంస్థల టాప్ 5లో చోటు దక్కించుకుంది. చైనా సోషల్ మీడియా, వీడియో గేమ్ దిగ్గజం టెన్సెంట్ మార్కెట్ విలువలో ఫేస్బుక్ను అధిగమించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి టెన్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.15 ట్రిలియన్ హాంకాంగ్ డాలర్లు ( 531 బిలియన్ డాలర్లు)డాలర్లుగా నమోదైంది. దీంతో ప్రపంచంలోని ఐదు అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా టెన్సెంట్ నిలిచింది. కాగా ఫేస్బుక్ మార్కెట్ క్యాప్ 519 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మరో దిగ్గజ సంస్థ ఆపిల్ మార్కెట్ క్యాప్ 873 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఆపిల్ సరికొత్త రికార్డ్
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఆపిల్ అరుదైన రికార్డును సొంతంచేసుకుంది. భారీ మార్కెట్ క్యాపిటలైజేషన్తో తొలిసారి అమెరికాలో టాప్ కంపెనీగా అవతరించింది. మంగళవారం మార్కెట్ క్యాపిటలైజేషన్లో సుమారు 800 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 53.22 లక్షల కోట్లు) మార్కును తాకి మొట్టమొదటి అమెరికా కంపెనీగా ఆపిల్ ఇంక్ నిలిచింది. రెండేళ్ల కిత్రం నాటి 700 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 46.56 లక్షల కోట్లు) స్థాయిని స్వల్పంగా అధిగమించి ఈ ఘనతను సాధించింది.దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సంస్థగా ఆపిల్ నిలిచిందిక్లోజింగ్ మార్కెట్ క్యాప్ 802.8 బిలియన్డాలర్ల వద్ద ముగిసింది. కాగా అమెరికాలో 50 రాష్ట్రాల్లో 45 లో దూసుకుపోతోంది. ప్రధానంగా ఇల్లినాయిస్, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉంది.ఇందులో ఐ ఫోన్ వాటా 33 శాతం పుంజుకుంది. ముఖ్యంగా నవంబర్లో అమెరికా ఎన్నికల తర్వాత 50 శాతం లాభాలుపుంచుకున్నాయి. 2012 సెప్టెంబరులో ఆపిల్ అనంతరం ఎస్అండ్పి 500 యొక్క 4.9శాతం వాటాను కలిగి ఉంది, అయితే ఇండెక్స్ 7శాతం కన్నా ఎక్కువ సాధించింది. ఆపిల్ ఎంత శక్తివంతైన సంస్థ నిరూపితమైందనీ, దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ సంస్థగా నిలిచిందనీ న్యూజెర్సీలోని లిబర్టీవ్యూ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ ప్రెసిడెంట్ రిక్ మెక్లర్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో బలమైన ప్రత్యర్థులు ఉన్నా, పరిమిత సంఖ్యలో ఉత్పత్తులను కలిగి ఉన్నప్పటికీ మార్కెట్లో నిజంగా ఆధిపత్యాన్ని చాటుకుందన్నారు. కాగా బిలియనీర్ వారెన్ బఫ్ఫెట్ ఆపిల్ సంస్థపై తన ఇష్టాన్ని ఇటీవల మరోసారి ప్రకటించారు. సంస్థలో సుమారు 20 బిలియన్ డాలర్ల వాటా ఉన్నట్టు వెల్లడించారు. ఐఫోన్ మేకర్ల కాంపిటీటివ్ స్థితితోపాటు, వారిని ఫాలో అవుతున్న ఇతర కంపెనీలను చాలా సులభంగా గుర్తించవచ్చని వ్యాఖ్యానించడం విశేషం. -
షేర్ మార్కెట్ కింగ్... ఎస్బీఐ!
⇔ ప్రభుత్వ రంగ సంస్థల్లో నెంబర్–1 స్థానానికి ⇔ మార్కెట్ విలువ పరంగా ఓఎన్జీసీని వెనక్కి నెట్టిన ఎస్బీఐ ⇔ ప్రయివేటు సంస్థలనూ కలిపిచూస్తే... ఎస్బీఐకి 5వ స్థానం ⇔ మొదటి స్థానంలో టీసీఎస్; నువ్వానేనా అంటున్న రిలయన్స్ ⇔ ఓఎన్జీసీని తోసిరాజని అగ్రస్థానంలోకి ముంబై: స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత విలువైన సంస్థేదో తెలుసా? ఇప్పటివరకూ ఓఎన్జీసీ. కానీ మంగళవారం ఈ స్థానాన్ని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆక్రమించింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఓఎన్జీసీ మార్కెట్ క్యాప్ (మొత్తం షేర్ల విలువ) రూ.2,32,346 కోట్లుగా ఉండగా, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ దీనికంటే రూ.2,962 కోట్లు అధికంగా రూ.2,35,308 కోట్ల స్థాయికి చేరింది. ఇక ప్రయివేటు సంస్థల్ని కూడా కలుపుకొంటే... స్టాక్ మార్కెట్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్ర స్థానంలో ఉన్న తొలి పది కంపెనీల్లో ఎస్బీఐ ఐదో స్థానంలో, ఓఎన్జీసీ ఏడో స్థానంలో నిలిచాయి. ఒకప్పుడు అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా ఓఎన్జీసీయే ఉండేది. ఎస్బీఐ 0.1 శాతం లాభపడి రూ.290 వద్ద, ఓఎన్జీసీ 1.1 శాతం క్షీణించి రూ.181 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా ఎస్బీఐ 16 శాతం పెరగ్గా, ఓఎన్జీసీ 4 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో అగ్రస్థానంలోకి రిలయన్స్.. కాగా ఇంట్రాడేలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న భారత కంపెనీగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) నిలిచింది. కానీ ట్రేడింగ్ చివరవరకూ దీనిని నిలుపుకోలేకపోయింది. చివరికి 1.5% క్షీణించి రూ.1,370 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,45,579 కోట్లకు పరిమితమైంది. టీసీఎస్ 0.5% నష్టపోయి రూ.2,309 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,54,903 కోట్లుగా ఉంది. నాలుగేళ్ల క్రితం అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న భారత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ను తోసిరాజని టీసీఎస్ ముందుకెళ్లింది. అప్పటి నుంచీ అది తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. టెలికం సంస్థ జియో కారణంగా రిలయన్స్ ఇటీవల బాగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఆర్ఐఎల్ 27% పెరగ్గా, టీసీఎస్ 2% నష్టపోయింది. ఒక కంపెనీ షేర్ ప్రస్తుత మార్కెట్ ధరను, అ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్గా పరిగణిస్తారు. -
25 నిమిషాల ఆ స్పీచ్కు రూ.3000 కోట్లు ఆవిరి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 25 నిమిషాల స్పీచ్కు మేజర్ టెలికాం స్టాక్స్ అన్నీ గజగజలాడాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత సేవల ఆఫర్ మరో మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించగానే దిగ్గజ టెలికాం స్టాక్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో టెలికాం దిగ్గజాల మార్కెట్ విలువ రూ.3000 కోట్లు ఆవిరైపోయింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 1.66 శాతం, ఐడియా సెల్యులార్ 5.93 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం కుదేలయ్యాయి. ఈ సమయంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభపడింది. ఒకటిన్నర మధ్యలో రూ.324గా ట్రేడ్ అయిన ఎయిర్టెల్ షేర్లు, ముఖేష్ స్పీచ్ ప్రారంభం కాగనే రూ.318.3కు దిగొచ్చాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,276 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. అదేవిధంగా 76.60గా ట్రేడ్ అయిన ఐడియా సెల్యులార్ షేర్లు కూడా ముఖేష్ స్పీచ్తో రూ.74.20కి పడిపోయాయి. ఈ కంపెనీ కూడా రూ.792 కోట్లను మార్కెట్ విలువను పోగొట్టుకుంది. నేడు దేశీయ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ భారీగా నష్టపోయినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమవుతుందని వారు పేర్కొన్నారు. సంచలమైన ఆఫర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు(సెప్టెంబర్1న) కూడా ఎయిర్టెల్, ఐడియా షేర్ల మార్కెట్ విలువ భారీగా కోల్పోయినట్టు, రూ.16,000కోట్లు తుడిచిపెట్టుకుపోయినట్టు వెల్లడించారు. మరోసారి హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో సేవలను పొడిగించనున్నట్టు సంచలనమైన ప్రకటనను వాటాదారుల సమావేశంలో గురువారం రిలయన్స్ అధినేత వెల్లడించడంతో ఈ కంపెనీలు భారీగా నష్టపోయాయి. రూ.3000 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి. -
పోకిమాన్ గేమ్ తో నింటెండో షేర్లు రికార్డు
వీడియో గేమ్ దిగ్గజం నింటెండో మార్కెట్ విలువలో దూసుకెళ్తూ మరో దిగ్గజ కంపెనీ సోనీని వెనక్కు నెట్టేసింది. పోకీమాన్ గో గేమ్ విడుదలతో, మార్కెట్లో ఈ గేమింగ్ దిగ్గజం దూసుకుపోతోంది. పోకిమాన్ గో గేమ్ రిలీజ్ అనంతరం నింటెండో తన స్టాక్ ను రెండింతలు పెంచుకుంది. నింటెండో కంపెనీ షేర్లు మంగళవారం రోజు దాదాపు 11శాతం జంప్ అయి, 290 డాలర్లుగా(రూ.19,472) నమోదయ్యాయి. జూలై6 ముగింపు అనంతరం ఇప్పటివరకూ ఈ షేర్లు 100 శాతంకు పైగా దూసుకెళ్లాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.36 ట్రిలియన్ యెన్(రూ.2,75,658 కోట్లకు పైగా)తో, జపాన్ లోని ఉత్తమ ప్రసిద్ధ కంపెనీల జాబితాలో ఒకటిగా నింటెండో చేరిపోయింది. శుక్రవారం ఒక్క రోజే జపాన్ లో అత్యధిక వాటాలు ట్రేడ్ అయి, రోజు వారీ వర్తకంలో నింటెండో రికార్డు సృష్టించింది. రెండు వారాల క్రితమే ఈ గేమ్ ను లాంచ్ చేశారు. ఈ గేమ్ ప్రవేశంతో, మొబైల్ గాడ్జెట్స్ లో, స్మార్ట్ ఫోన్లలో దీనికి ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. పోకిమాన్ క్రేజ్ కేవలం నింటెండో కంపెనీకి మాత్రమే కాదంట. టోక్యోలో ట్రేడ్ అయ్యే ఇతర షేర్లకు ఇది లాభాలను పండిస్తోంది. ఆహార భద్రతా కుంభకోణాలతో ముప్పుతిప్పలు పడుతున్న జపాన్ మెక్ డొనాల్డ్ కు, భారీ ఊరట కలిగిస్తోంది. పీకాచు వంటి గేమ్ క్యారెక్టర్లతో హ్యాపీ మీల్స్ ను శుక్రవారం నుంచి మెక్ డొనాల్డ్స్ ఆఫర్ చేస్తోంది. దీంతో కంపెనీ షేర్లు 23శాతం పెరిగాయి. ఈ గేమ్ ను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో మొదట లాంచ్ చేశారు. వారం నుంచి దాదాపు రెండు డజన్ల దేశాల్లో దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం జపాన్ లో ఈ గేమ్ రిలీజ్ కావాల్సి ఉంది. -
3వ అత్యంత విలువైన కంపెనీగా ఐటీసీ
ముంబై: ఐటీసీ తాజాగా మార్కెట్ క్యాప్ ఆధారంగా మూడవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,61,403 కోట్లుగా ఉంది. ఐటీసీ కన్నా ముందు వరుసలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి మార్కెట్ క్యాప్ వరుసగా రూ.4,48,272 కోట్లుగా, రూ.3,18,260 కోట్లుగా ఉంది. ఇక ఐటీసీ తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్ (రూ.2,58,291 కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.2,48,947 కోట్లు) ఉన్నాయి. -
ద్వితీయశ్రేణి షేర్లవైపు చూడండి
♦ బాగా పెరిగినవాటికి దూరంగా ఉండటం మంచిదే ♦ ఈ సారి మీ వ్యూహం మార్చాల్సి రావచ్చు సాధారణంగా అధిక వృద్ధి అవకాశాలున్న, నాణ్యమైన కంపెనీల షేర్ల కొనుగోలుకే ప్రాధాన్యమిస్తుంటాం. ఈ వ్యూహం ఇప్పటిదాకా సత్ఫలితాలనే ఇచ్చి ఉండవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఇదే వ్యూహం సరి కాకపోవచ్చు. అధిక వృద్ధి కనపర్చిన స్టాక్స్లో చాలా మటుకు ప్రస్తుతం అధిక వేల్యుయేషన్లతోనే ఉన్నాయి. ఎంపిక చేసిన 50 లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు గత నాలుగేళ్లలో వృద్ధి చెందిన తీరు, వాటి వేల్యుయేషన్లు దీనికి నిదర్శనం. నిఫ్టీతో పోలిస్తే ఈ అధిక వృద్ధి స్టాక్స్ గత నాలుగేళ్లలో గణనీయంగా రాబడులిచ్చాయి. 2010 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి లాభాలు రూ.89,385 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగి రూ.2,00,088 కోట్లకు చేరాయి. అలాగే వీటి మార్కెట్ క్యాప్ సైతం 33 శాతం వార్షిక ప్రాతిపదికన ఎగిసి రూ.23,86,095 కోట్ల నుంచి ఏకంగా రూ.77,45,173 కోట్లకు చేరింది. పీఈ నిష్పత్తి 26.7 రెట్లు నుంచి 38.7 రెట్లకు చేరింది. మరోవైపు నిఫ్టీ ఆదాయాలు 9 శాతం స్థాయిలోనే ఉన్నాయి. అయితే, ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ల లాభాలు మెరుగుపడే కొద్దీ .. ఇప్పటిదాకా భారీ రాబడులు ఇచ్చిన స్టాక్స్లోనే పెట్టుబడులు పెట్టే వ్యూహం ఆశించిన స్థాయిలో పనితీరు కనపర్చకపోవచ్చు. ఆర్థిక వృద్ధి మళ్లీ కోలుకుంటుందని, కార్పొరేట్ల లాభదాయకత మెరుగుపడుతుందనే రెండే ఆశలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతున్నాయి. కానీ, కార్పొరేట్ల లాభాలు ఒకవేళ మెరుగుపడితే.. గత నాలుగేళ్లుగా జరగని విధంగా ఆ వృద్ధి అన్ని రంగాల్లోనూ కనిపించాలి. అలాంటప్పుడు.. వృద్ధి కేవలం కొన్నింటికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం అన్నింటింలోనూ ప్రతిఫలించాలి. నిజంగానే అలా జరిగితే.. ప్రస్తుతం వృద్ధి కోసం చెల్లిస్తున్న అధిక ప్రీమియం.. నిజంగానే అధిక రాబడులు అందించగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ తరహా ‘నాణ్యమైన, వృద్ధి ఆధారిత’ స్టాక్స్లో పెట్టుబడుల వ్యూహం ఎలా పనిచేసే అవకాశాలున్నాయో ఒకసారి చూద్దాం. ఈ కోవకి చెందిన అనేక స్టాక్స్ గత నాలుగేళ్లలో చాలా తక్కువ స్థాయి హెచ్చుతగ్గులనే చూశాయి. కాబట్టి రాబోయే రోజుల్లో.. ముఖ్యంగా ఆర్థిక పలితాల సమయంలో ఇవి భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు.. మిగతా మార్కెట్తో పోలిస్తే ఈ స్టాక్స్ పనితీరు దిగువ స్థాయిలోనే ఉండవచ్చు. అప్పుడు ద్వితీయ శ్రేణి స్టాక్స్ కోలుకుని పరుగు మొదలుపెట్టొచ్చు. నాలుగేళ్లుగా సరైన పనితీరు కనపర్చని ‘నాణ్యమైన, అధిక డివిడెండ్ ఇచ్చే’ స్టాక్స్లో పెట్టుబడుల వ్యూహం ఇకపై మెరుగ్గా పనిచేయవచ్చు. ‘నాణ్యమైన, వృద్ధి ఆధారిత’ స్టాక్స్ మన పోర్ట్ఫోలియో విలువ తరిగిపోకుండా కొంత మేర కాపాడవచ్చేమో గానీ.. ఎల్లకాలం అత్యధిక రాబడులు ఇస్తాయని చెప్పలేం. కనుక ఇన్వెస్ట్ చేసే ముందు ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుకు అడుగేయాలి. -
సుజ్లాన్ షేర్ల కోసం ఓపెన్ ఆఫర్
- ప్రమోటర్ల నుంచి 23 శాతం వాటా కొన్న సన్ఫార్మా దిలీప్ సంఘ్వి - మరో 26 శాతం వాటాకు షేరుకు రూ. 18 ధరపై ఆఫర్ - 20 శాతం ఎగసిన షేరు ధర న్యూఢిల్లీ: పవన విద్యుదుత్పత్తిలో ఉపయోగపడే విండ్ టర్బైన్లు తయారు చేసే సుజ్లాన్ ఎనర్జీ షేర్ల కోసం డీఎస్ఏ(దిలిప్ సంఘ్వి ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్) ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఒక్కో షేర్ను రూ.18 చొప్పున 26 శాతం వాటాను(157.64 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనున్నామని డీఎస్ఏ తెలిపింది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం రూ.2,838 కోట్లు కేటాయించింది. సుజ్లాన్ ఎనర్జీలో 23 శాతం వాటా కొనుగోలు (రూ.1,800 కోట్లతో) కోసం సుజ్లాన్ ఎనర్జీ, సన్ ఫార్మాకు ప్రమోటర్ అయిన దిలిప్ సంఘ్వి, కుటుంబ సభ్యులు(డీఎస్ఏ) మధ్య గత వారంలో ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తర్వాత సుజ్లాన్ ఎనర్జీలో డీఎస్ఏ వాటా 23 శాతంగా, సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి కుటుంబానికి 24 శాతం చొప్పున వాటాలుంటాయి. ఒప్పందం ప్రకారం యాజమా న్య నియంత్రణ తంతి కుటుంబానికే ఉంటుంది. వెయ్యి కోట్లు పెరిగిన మార్కెట్ క్యాప్ ఈ పరిణామాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 23 వద్ద ముగిసింది. ఒక్క సోమవారం రోజే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,089 కోట్లు పెరిగి రూ.7,606 కోట్లకు చేరింది. -
మార్కెట్ క్యాప్ పదేళ్లలో పది రెట్లు..!
అంతర్జాతీయంగా భారత్ సరైనస్థాయిని అందుకుంటే వచ్చే 10-15 ఏళ్లలో స్టాక్ మార్కెట్ విలువ పది రెట్లు పెరిగి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈఓ అశీష్ చౌహాన్ అన్నారు. అలా వృద్ధిచెందాలంటే మార్కెట్లు ట్రేడింగ్ ప్లాట్ఫామ్గా కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులకు వేదికగా మారాల్సిన అవసరం వుందన్నారు. ప్రస్తుత మార్కెట్ క్యాప్ 1.6 ట్రిలియన్ డాలర్లు (రూ.100 లక్షల కోట్లకుపైగా) ఉంది. మంచి మార్కెట్లలో పెట్టుబడుల కోసం అంతర్జాతీయంగా 40 ట్రిలియన్ డాలర్ల సంపద వేచిచూస్తున్నదని, అందులో తగిన వాటాను భారత్ పొందడానికి ప్రయత్నించాలని చౌహాన్ ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం భారత్లో 2.7 కోట్ల మంది ఇన్వెస్టర్లు వున్నారని, ఈ సంఖ్యను 2030కల్లా 27 కోట్లకు పెంచడానికి చాలా చర్యలు అవసరమన్నారు.