-
రామోజీని జైల్లో పెట్టాలన్నది నా కోరిక కాదు: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి కేసు వివరాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, ఉండల్లి అరుణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణ హైకోర్టుకు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది. మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం. రామోజీరావు ఎవరైతే నాకేంటి. ఒక ఇష్యూలో తప్పు జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా?. అందుకే ఈ విషయాన్ని బయటకు తీశాను. నేను అడిగింది 45-ఎస్ ఉల్లంఘన గురించి. అది తేల్చండి చాలు. రామోజీరావును జైలులో పెట్టాలని లేక శిక్షించాలన్నది నా కోరిక కాదు. ఈ వ్యవహారంలో కొన్ని నిజాలు బయటకు రావాలన్నదే నాకు కావాల్సింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పాను. ఈనాడు రాసిన రాతలపైనే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను. వక్రీకరించి వార్తలు రాయడం ఈనాడుకు అలవాటుగా మారింది. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసింది. నా మాటలను వక్రీకరించి చూపారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంతమంది ఖాతాదారులకు డబ్బులు వెనక్కిచ్చారన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జ్యుడీషియల్ అధికారిగా ఏర్పాటు చేశారు. 80 నిమిషాల పాటు ఇండియాలో ఉన్న టాప్ అడ్వకేట్స్ ముగ్గురు రామోజీరావు తరపున దీనిపై వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే కేవలం జడ్జిలు వల్ల జరిగిందని భావించాలి. ఇప్పుడు 45-ఎస్ ఓపెన్.. దానిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎక్యుర్డ్ ఇంట్రెస్ట్తో సహా ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని మార్గదర్శి కోర్టు వివరించింది. ఖాతాదారులు అందరికీ కలిపి 55.39 కోట్లు వడ్డీ కింద అందజేశామని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చెప్పారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపితే 900 కోట్లు వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకును పార్టీలను చేసి తెలంగాణ హైకోర్టుకు ఈ వ్యవహారంలో అరుణ్ కుమార్ అసిస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందజేసిన మెచూరిటీ అమౌంట్కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖాతాదారుల దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి అడ్రస్తో జీమెయిల్కి పంపండి. thedepositers@gmail.com అనే జిమెయిల్ ప్రారంభించాను. జరిగిన వ్యవహారంపై పూర్తి విచారణ తెలంగాణ హైకోర్టులో జరిపించమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరుగనుంది. ఈ వ్యవహారం ఆరు నెలలలో తేల్చమంది. ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణంపై రామోజీరావుపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
-
బందిపోటు దొంగల్లా మార్గదర్శి యాజమాన్యం
-
పేద, మధ్య తరగతి ప్రజలను మార్గదర్శి మోసం చేసింది
-
రామోజీకి వణుకు.. అసలు కథ ముందుంది?
వృద్ధాప్యంలో ఉన్న ఈనాడు మీడియా యజమాని రామోజీరావుకు పెద్ద సవాలే ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నారనిపిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఇష్టారాజ్యంగా నడిపారు. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని మీడియా రాజ్యాన్ని సృష్టించారు. ఆ మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారంలో తనకు ఎదురులేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ, సీఎం జగన్ రూపంలో తనకు ఇంత ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన ఊహించలేకపోయారు. తన మార్గదర్శి సంస్థలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిని, నల్లధనం తదితర విషయాలన్నిటినీ ఏపీ సీఐడీ బహిర్గతం చేసింది. దాంతో సీఎం జగన్పై కక్ష కట్టిన రామోజీ ఇప్పుడు తన మీడియాను పూర్తి స్థాయిలో టీడీపీ కరపత్రంగా, బాకాగా మార్చేశారు. ఈసారి ముఖ్యమంత్రి జగన్ పోటీ పడుతున్నది చంద్రబాబు కాదని, రామోజీరావు అని అంతా భావించే దశకు వెళ్లారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని, ఎవరో ఒకరు తగులుతారని అంటారు. అలాగే రామోజీ సంస్థలలోని ఆర్దిక అరాచకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనిపెట్టింది. తత్ఫలితంగా ఆయన ప్రతిష్ట మసకబాసింది. దాంతో ఆయనకు సీఎం జగన్పై ఎక్కడ లేని ద్వేషం ఏర్పడింది. నిజానికి సీఎం జగన్పై రామోజీరావుకు ఉన్న పగ ఈనాటిది కాదు. ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ నుంచే రామోజీ బొడ్డుకు సున్నం రాసుకున్నట్లు వ్యవహరించేవారు. దానికి కారణం అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను రాజగురువుగా భావించి, నిత్యం సంప్రదింపులు చేస్తూ ఆయనను సంతృప్తిపరుస్తుండేవారు. 1989-1994 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో మరీ ఈ స్థాయిలో గొడవపడేవారు కారు. వారు కూడా చూసి చూడనట్లు పోతుండేవారు. రామోజీ మీడియాకు వారు కొంత భయపడేవారు. 1994లో ఎన్.టి.రామారావు అంత మెజార్టీతో అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. అయినా ఎన్టీఆర్ భారీ ఆధిక్యతతో అదికారంలోకి రావడంతో కొద్దికాలం సర్దిపెట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత పరిణామాలలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని సాకుగా చూపుతూ ఆయనను దారుణంగా చిత్రీకరిస్తూ వ్యంగ్య కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబుకు కొమ్ముకాసి ఎన్టీఆర్ను దించడంలో రామోజీ తనదైన పాత్రను పోషించారు. అప్పటి నుంచి తానే షాడో ముఖ్యమంత్రి అన్నట్లు సంతోషపడుతుండేవారు. ఆయనకు ప్రభుత్వపరంగా ఏది కావాలన్నా ఎదురులేని పరిస్థితి సృష్టించుకున్నారు. ఆ పరిస్థితిలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని ఓడించి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎందువల్లో వైఎస్ పట్ల మొదటి నుంచి అంత సానుకూలంగా ఉండేవారు కాదు. అయినా వైఎస్సార్ పెద్దగా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోయేవారు. కాకపోతే ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. వాటికి పోటీగా కాంగ్రెస్కు కూడా ఒక పత్రిక ఉండాలని, ఒక టీవీ ఉండాలని తలపోశారు. అందుకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అది రామోజీకి పుండుమీద కారం చల్లినట్లయింది. తన మీడియాకే పోటీకి వస్తారా అన్న అహంభావంతో వైఎస్ ప్రభుత్వంపై చెలరేగడం ఆరంభించారు. చివరికి సీఎంగా ఉన్న వైఎస్సార్పై ఒక సంపాదకీయం రాస్తూ ‘ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే’ అంటూ హెడింగ్ పెట్టి వైఎస్ను ఘోరంగా అవమానించారు. అదే తరుణంలో రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్తో జరుగుతున్న అక్రమ డిపాజిట్ల సేకరణపై అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణకుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో రివర్స్ కథ మొదలైంది. రామోజీ అంతవరకు తాను ఏమీ తప్పు చేయడం లేదన్నట్లుగా ప్రజల దృష్టిలో పడుతూ, మరోవైపు అక్రమంగా డిపాజట్ల సేకరణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఉండవల్లి సఫలం అయ్యారు. అయితే, తీసుకున్న డిపాజిట్లను రామోజీ సకాలంగా చెల్లిస్తున్నారుగా అన్న ప్రచారం జరిగేది. కానీ, అసలు డిపాజిట్లు సేకరించడమే అక్రమమని, నేరమని ఆర్బీఐ ప్రకటించడంతో రామోజీ తన టీవీ చానళ్లు కొన్నిటిని విక్రయించి సుమారు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. అది ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. 2009లో రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ కేసుకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డిలు రామోజీతో రాజీపడిపోయారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్తో రామోజీ స్నేహం చేస్తూ, కాదు.. కాదు... భజన చేస్తూ.. తన ఆస్తులవైపు, తన సంస్థల లావాదేవీల వైపు రాకుండా చూసుకోగలిగారు. అదే సమయంలో విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. చంద్రబాబును భుజాన వేసుకుని వైఎస్ కుమారుడు జగన్మోహన్రెడ్డి యువకుడు అన్న ఆలోచన కూడా లేకుండా దాడి ఆరంభించారు. సోనియాగాంధీ, చంద్రబాబులకు రామోజీ తోడై సీబీఐ పెట్టిన అక్రమ కేసులపై తన మీడియా ద్వారా విపరీత వ్యతిరేక ప్రచారం చేసేవారు. అయినా.. జగన్మోహన్రెడ్డి మాత్రం వీరిని పట్టించుకునేవారుకారు. 2014 ఎన్నికలలో రామోజీ మీడియా చేసిన అబద్దపు ప్రచారం కొంత పనిచేసింది. కారణం ఏమైనా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాలేకపోయారు. అయినా ఆయన పట్టువదలకుండా రాజకీయాలు నడిపారు. అది ఈనాడుకు నచ్చలేదు. జగన్మోహన్రెడ్డిని దెబ్బతీశాం కదా అనుకుంటే మళ్లీ కెరటంలా లేస్తున్నారని గమనించారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్రెడ్డిపై దారుణమైన కథనాలు అల్లారు. కానీ, జనం నమ్మలేదు. రామోజీ రాతలను ఖాతరు చేయకుండా ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్కు పట్టం కట్టారు. అప్పటి నుంచి మళ్లీ రామోజీలో అసూయ పెరిగింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనపై దాడి ఆరంభించారు. కొంతకాలం ఓపికగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేచి చూసింది. అయినా రామోజీ తన వైఖరిని మార్చుకోకుండా, ఈనాడు మీడియాను టీడీపీ ప్రచార బాకాగా వాడడం ఆరంభించారు. అంతవరకు అయితే ఫర్వాలేదు. సీఎం జగన్పై ఉన్నవి, లేనివి కలిపి పచ్చి అబద్దాలు రాయడం ఆరంభించారు. ఈ దశలో మార్గదర్శి చిట్స్లో జరిగిన అక్రమాలు, అక్రమ డిపాజిట్ల వసూలు కొనసాగించడం సీఐడీ దృష్టికి వెళ్లి, వారు రంగంలో దిగారు. దాంతో ఒక్కసారిగా రామోజీ బిత్తరపోయారు. తాను ఎవరికి దొరకనని, ఎవరూ తన జోలికి రావడానికి సాహసం చేయరని అనుకునే రామోజీరావుకు ముఖ్యమంత్రి జగన్ రూపంలో సవాల్ ఎదురైంది. మార్గదర్శి చిట్స్లో సభ్యుల చేరిక మొదలు, చిట్టీలు పాడుకున్నవారికి సకాలంలో చెల్లించకపోవడం, డిపాజిట్ల అక్రమ సేకరణ, నల్లధనం చలామణి మొదలైనవాటిని ఏపీ సీఐడీ కనిపెట్టడంతో రామోజీకి సినిమా మొదలైంది. చివరికి ఆయన సీఐడీ అధికారుల విచారణను ఎదుర్కున్నారు. అప్పటికీ న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పట్టుతో ఈ కేసులన్నీ వేగంగా సాగకుండా అడ్డుపడుతున్నారు. ఏపీ కేసులకు కూడా తెలంగాణ హైకోర్టులో స్టేలు తెచ్చుకుని తప్పించుకోచూస్తున్నారు. మార్గదర్శి చిట్స్లో సుమారు 800కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగాయని సీఐడీ గుర్తించింది. చిట్స్ నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించడంతో ఏపీలో సంస్థ బ్రాంచ్లలో వ్యాపారం స్తంభించడం ఆరంభమైంది. టర్నోవర్పై దాని ప్రభావం పడింది. తాజాగా సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చిట్స్రూపేణా కాని, అక్రమ డిపాజిట్ల రశీదుల రూపేణా కాని సుమారు 4800 కోట్ల రూపాయల మేర బకాయిలు పడ్డారని అధికారులు అంచనా వేసినట్లు రావడం సంచలనాత్మకంగా మారింది. రామోజీ మరీ రెచ్చిపోయి, బరితెగించి వైఎస్ ప్రభుత్వంపై ఎందుకు ఇంత నీచంగా వార్తలు రాస్తున్నారు అని ఆలోచించేవారికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. తన వ్యాపార లావాదేవీల అరాచకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్న కోపం ఒకవైపు, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, తన ఆట కట్టినట్లే అవుతుందన్న భయం మరోవైపు రామోజీ బృందాన్ని వేటాడుతున్నాయి. దాంతో ఈనాడు మీడియాను పణంగా పెట్టి ముఖ్యమంత్రి జగన్పై విపరీతమైన ధోరణిలో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అదికారంలోకి వస్తే ఈ కేసులేవీ ముందుకు సాగవు అన్న భావన. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకన్నా, రామోజీకే అతి పెద్ద సవాలుగా మారాయనిపిస్తుంది. అంతే తప్ప తనపై వచ్చిన కథనాలకు సమాధానం ఇవ్వడానికి, మార్గదర్శిలో జరిగిన అవకతవకలకు సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎం జగన్ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ఆయన మార్గంగా ఎంచుకున్నారు. నిజానికి జర్నలిజంలో ఒక సూత్రం ఉంది. తన సొంత వ్యాపార ప్రయోజనాలకోసం మీడియాను అడ్డు పెట్టుకోరాదు. ఆ పరిస్థితిని మనం ఆశించలేకపోయినా, ఒక రాజకీయ పార్టీని అనైతికంగా భుజాన వేసుకుని రామోజీ తన మీడియాను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు రాస్తూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ సైతాన్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. అయినా ఈ విమర్శలన్నిటి కన్నా తన సంస్థపై వచ్చిన కేసులను కప్పిపుచ్చుకోవడానికి గాను ఆయన తన మీడియాను ఫణంగా పెట్టి మరీ దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పాలి. అందుకే టీడీపీ గెలుపు చంద్రబాబుకన్నా, రామోజీకే ఎక్కువ అవసరంగా మారింది. అయినా ఆయన ఆశలు నెరవేరే సూచనలు కన్పించడం లేదు! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
-
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
సాక్షి, అమరావతి : అక్రమ పునాదులపై ఈనాడు రామోజీరావు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యానికి చట్ట విరుద్ధంగా నిధులు అందించే కామథేనువు ‘మార్గదర్శి’ ఒట్టిపోయింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ‘మార్గదర్శి’ పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టంచేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టీపాటల ప్రైజ్మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. ష్యూరిటీలపై కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మార్గదర్శి’ ఇక ప్యాకప్ చెప్పడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. రూ.4,880 కోట్లకు పైగా బకాయిలు కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే, కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని అమలుచేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు. మరోవైపు.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సీఐడీ విభాగం 2022, నవంబరులో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరడంలేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఆ సంస్థలో మనీ టర్నోవర్ నిలిచిపోయింది. దాంతో ఇప్పటికే కొనసాగుతున్న చిట్టీ గ్రూపుల చిట్టీపాటల మొత్తం (ప్రైజ్మనీ) చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. ► ఇక రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్కు నెలనెలా రూ.260 కోట్ల టర్నోవర్ ఉంది. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్లు వరకు చిట్టీ పాటల ప్రైజ్మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబరు నుంచి ఆ ప్రైజ్మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 16 నెలలకు రూ.2,880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ► అలాగే, మార్గదర్శి చిట్ఫండ్స్ రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరునెలల నుంచి రెండేళ్ల కాలపరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెరసి మార్గదర్శి చిట్ఫండ్స్ దాదాపు రూ.4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు అంచనా వేశారు. కొర్రీలతో చందాదారులకు ముప్పుతిప్పలు ఇదిలా ఉంటే.. చిట్టీ పాటల ప్రైజ్మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ, తమ గల్లాపెట్టే ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులను మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా.. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రశీదు డిపాజిట్గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతుండటం గమనార్హం. ఇలా అక్రమంగా రశీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఆ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ, సీఐడీ అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తుండడంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది. చందాదారులకు సీఐడీ రక్షణ.. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు కూడా సీఐడీ నివేదించింది. దాంతో రామోజీ ఆర్థిక అక్రమాల ఆట కట్టింది. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు మోసపోకుండా, వారి చిట్టీల మొత్తం, డిపాజిట్లకు న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించేందుకు సీఐడీ ఉద్యుక్తమైంది. తద్వారా అగ్రిగోల్డ్ తరహాలో రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులను ముంచేయకుండా సీఐడీ కార్యాచరణను చేపట్టింది. -
‘మార్గదర్శి’ మోసాలపై కలిసికట్టుగా పోరాటం: బాధితుల సంఘం
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ మోసాలపై కలిసికట్టుగా పోరాడేందుకు బాధితులు సిద్ధమయ్యారు. మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం పేరుతో రిజిస్ట్రేషన్ అవ్వగా, విజయవాడ కేంద్రంగా ఈ సంఘం పనిచేయనుంది. అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బాధితుల సంఘం పేర్కొంది. మోసపోయిన వారు తమను సంప్రదించాలని, తమ సమస్యలను 9849055267 నెంబర్కు పంపించాలని బాధితుల సంఘం తెలిపింది. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. ఇదీ చదవండి: ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే -
ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే
ఈనాడు పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు ఆర్థిక నేరస్తుడే అన్నది నిగ్గు తేలింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజగురువు రామోజీ ఆర్థిక ఉగ్రవాదేనన్నది స్పష్టమైంది. ‘మార్గదర్శి’ ముసుగులో భారీగా నల్లధనం దందా నిర్వహిస్తున్నారన్నదీ రూఢీ అయ్యింది. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తొడుక్కున్న ‘పత్రికా స్వేచ్ఛ’ అనే ముసుగు తొలగిపోయింది. చట్టాలను ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ రామోజీ నిజ రూపంలో అవినీతి దిగంబరుడుగా నిలబడ్డారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసిందని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఈ కేసులో తరువాత పరిణామాలు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అక్రమ డిపాజిట్ల కేసు నిరూపితమైతే ఏకంగా రెట్టింపు జరిమానా అంటే రూ.5,200 కోట్ల జరిమానాతోపాటు కనీసం రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఏళ్ల తరబడి సాగించిన అక్రమ డిపాజిట్ల వసూళ్లు.. నల్లధనం దందాపై 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు అక్రమ డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు విస్పష్టంగా నివేదించింది. దాంతో రామోజీ అవినీతి ఆట కట్టిందని, ఇక శిక్ష పడటమే మిగిలిందని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాల కథ కమామీషు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2006లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశి్నంచే వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్టు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపిస్తూ ఉండేవి. కానీ ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించేదనే విషయం బయటి ప్రపంచానికి తెలీదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించింది. భారీగా అక్రమ డిపాజిట్లు సేకరణ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ల సేకరణ పేరిట ప్రజలను మోసం చేయకుండా కట్టడి చేసేందుకు ఆర్బీఐ స్పష్టమైన విధి విధానాలను నిర్దేశించింది. ఆర్బీఐ చట్టంలోని 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ చట్టానికి తాను అతీతం అని భావించే రామోజీ ఈ నిబంధనను నిర్భీతిగా బేఖాతరు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట యథేచ్ఛగా డిపాజిట్లు వసూలు చేశారు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. కాగా మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తప్పు ఒప్పుకోక తప్పని రామోజీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. ఈ అక్రమాలపై సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. కాగా తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించేందుకు రామోజీ యత్నించారు. హెచ్యూఎఫ్గా తాము ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించవచ్చని అడ్డగోలుగా వాదించారు. కానీ సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దాంతో తాము తప్పు చేసినట్టు రామోజీరావు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్టు కూడా సమ్మతించారు. తమ తప్పును అంగీకరిస్తూ డిపాజిట్దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. వివరాలు చెప్పం అని వితండవాదం తాము అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్లను సంబంధిత డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని రామోజీరావు న్యాయస్థానానికి తెలిపారు. కాగా అక్రమ డిపాజిట్లు ఎవరెవరి నుంచి సేకరించారు.. ఎవరెవరికి తిరిగి చెల్లించారో ఆ వివరాలు వెల్లడించాలని సీఐడీ, ఉండవల్లి అరుణ్కుమార్ కోరినప్పటికీ రామోజీరావు సమ్మతించ లేదు. ఆ వివరాలు తాము వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. కాగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలని అదీకృత అధికారి కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పనిదినాన కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. డిపాజిట్ దారుల వివరాలు వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం 2022లో ఇంప్లీడ్ అయ్యింది. డిపాజిట్దారుల వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు గత ఏడాది పేర్కొంది. కానీ ఇంతవరకు రామోజీరావు తమ డిపాజిట్దారుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. నల్లధనం దందా వల్లే గప్చుప్ ► మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకే తమ సంస్థలో డిపాజిట్దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటున్నారు. ► 2006 నాటికే ఏకంగా 32,385 మంది నుంచి రూ.2,600 కోట్ల వరకు అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. కానీ వారి పేర్లు, వివరాలను మాత్రం వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటుండటం గమనార్హం. ఎందుకంటే ఆ డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చారు. అందుకే సీఐడీతోపాటు న్యాయస్థానం కోరినప్పటికీ వారి వివరాలను వెల్లడించేందుకు సమ్మతించడం లేదు. ► కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్లో దాదాపు అన్ని డిపాజిట్లు కూడా నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలు రూ.50 వేలకు మించి ఉన్నప్పటికీ వాటిని రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓ లుగా మార్చింది. ► మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ► మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,610.38 కోట్లుగా రామోజీరావు 2006లో తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన రూ.800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ రూ.800 కోట్లు రామోజీకి అత్యంత సన్నిహితుడైన పచ్చ బాబు, ఆయన గ్యాంగ్వే అని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో చెప్పడానికి రామోజీ ససేమిరా అంటున్నారు. -
మార్గదర్శి ఫ్రాడ్ కేసులో రామోజీకి శిక్ష తప్పదు : అడ్వకేట్ శివరామి రెడ్డి
-
రామోజీకి భారీ షాక్.. ఫలించిన ఉండవల్లి పోరాటం
-
అమ్మ రామోజీ.. అన్నీ తెలిసి ఇన్ని తప్పులా?
సాక్షి, ఢిల్లీ: సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆర్బీఐ తొలిసారి నోరు విప్పింది. హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్.బి.ఐ తరపు న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన రామోజీరావు.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు. ఇదీ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? -
మార్గదర్శి స్కాం కేసులో రామోజీ రావుకు సుప్రీం కోర్ట్ షాక్
-
అప్పులంటూ అబద్ధాల డప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రం అప్పులపై ‘ఈనాడు’ రామోజీ అట్టడుగు స్థాయికి దిగజారి తప్పుడు కథనాలు ప్రచురించారని, నిరాధారమైన గణాంకాలతో దు్రష్పచారానికి దిగారని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయటమే లక్ష్యంగా అప్పులపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ భయపడిందని, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించిందని, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను అప్రమత్తం చేసిందని, ఆర్థిక దిగ్గజాలు భయపడుతున్నారని, ఏపీ అప్పులను చూసి దేశం ఆశ్చర్యపోతోందంటూ దుర్మార్గంగా వండి వార్చిన కథనాలను చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పత్రికకు ఉన్న ద్వేషం, కక్ష అర్ధం అవుతున్నాయన్నారు. ఈనాడు కథనంలో డొల్లతనాన్ని నిరూపిస్తూ.. ఆర్బీఐ, కాగ్ అధికారిక నివేదికలను దువ్వూరి కృష్ణ బయటపెట్టారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాకు వాస్తవాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే... అబద్ధాలే.. ఆధారాలేవి? ఊహాజనిత గణాంకాలతో, లేని అప్పులు ఉన్నాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను అచ్చు వేసింది. ప్రతి గొంతుతోనూ అబద్ధాలాడే ‘దశకంఠుడి’గా రామోజీ దిగజారిపోయారు. రాష్ట్ర అప్పులు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనల మేరకు పరిమితికి లోబడే ఉన్నాయి. కోవిడ్తో రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ హయాంలో కన్నా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వృద్ధి తక్కువగా ఉంది. మార్కెట్ రుణాలతో పాటు నాబార్డు, విద్యుత్ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, బాండ్ల గ్యారెంటీతో పాటు గ్యారెంటీ ఇవ్వకుండా తీసుకున్న మొత్తం అప్పులు రూ.6.38 లక్షల కోట్లు మాత్రమే. దాన్ని రూ.10.11 లక్షల కోట్లగా పేర్కొంటూ ‘ఈనాడు’ ఏ అధికారిక నివేదిక ఆధారంగా రాసిందో చెప్పాలి. లేదంటే కాగ్, ఆర్బీఐ అధికారిక నివేదికల ప్రకారం నేను వెల్లడించిన గణాంకాలను ప్రచురించాలి. పెండింగ్ బిల్లులపై సొంత లెక్కలా? పెడింగ్ బిల్లులు రూ.21 వేల కోట్లు మాత్రమే ఉన్నాయని ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించగా రూ.1.70 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులున్నట్లు రామోజీ పచ్చి అబద్ధాలు ఎలా ప్రచురిస్తారు? ప్రభుత్వం బడ్జెట్లో చేసే అప్పులతో పాటు గ్యారెంటీతో చేసిన అప్పులు, గ్యారెంటీ ఇవ్వని అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు అసెంబ్లీకి సమర్పించాం. ఈనాడు తనకు నచ్చిన ఊహాజనిత గణాంకాలతో అప్పులుపై తప్పుడు కధనాలు రాస్తోంది. అప్పులపై ఎన్నిసార్లు వాస్తవాలు వెల్లడించినా పదేపదే దు్రష్పచారానికి పాల్పడుతూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. హెచ్చరికలంటూ అవగాహనారాహిత్యం.. ఆర్బీఐ గానీ కేంద్ర ఆర్థికశాఖగానీ అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు. అసలు నిబంధనల మేరకు అప్పులకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనలు మీరితే అప్పులు ఇవ్వడం నిలిపేస్తారు. అంతేగానీ హెచ్చరికలు ఉండవు. ఈ మాత్రం కనీస అవగాహన కూడా రామోజీరావుకు లేదు. కేంద్రానికి గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ అనధికారిక అప్పులు ఉండవనే సంగతి తెలియకపోవడం ‘ఈనాడు’ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. అనధికారిక అప్పులా? మార్గదర్శి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక డిపాజిట్లు సేకరించడం రామోజీకే చెల్లింది. ప్రభుత్వాలకు బ్యాంకులు గానీ, ఆర్థిక సంస్ధలు గానీ ఏ అప్పులిచ్చినా అవి అధికారికంగానే ఇస్తాయి. అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వరనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? మార్వాడీ దగ్గరకు వెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడం కేంద్రంతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ సాధ్యం కాదు. ప్రభుత్వానికి అప్పులు చెల్లించే ఉద్దేశం లేదంటూ మరో అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. అప్పులను వాయిదాల ప్రకారం ప్రభుత్వాలు తీరుస్తూ ఉంటాయి. తీర్చకపోతే డిఫాల్ట్ అవుతాయి. అది కూడా తెలియదా? గత అప్పులకు ఇప్పుడు కోత రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు తక్కువే. వాస్తవానికి గత సర్కారు నిబంధనల కంటే ఎక్కువగా అప్పులు చేసింది. దాంతో కేంద్రం ఇపుడు వాటిని తగ్గిస్తోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల జారీ ద్వారా రుణం తీసుకోవడానికి సెబీ అనుమతించింది. అయితే అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు. దీన్ని కూడా వక్రీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధం అన్నట్లు తప్పుడు కథనాలు ప్రచురించారు. పరిమితికి లోబడే గ్యారెంటీలు గ్యారెంటీలు రాష్ట్ర ఆదాయంలో 80 శాతమే ఉన్నాయి. ఇవి నిబంధనల కన్నా తక్కువే. పెండింగ్ బిల్లుల విషయంలో ‘ఈనాడు’వి పచ్చి అబద్ధాలు. జీతాలు గానీ పెన్షన్లు గానీ ఆగలేదు. అలాంటప్పుడు ఇన్ని పెండింగ్ బిల్లులు ఎలా ఉంటాయి? కోవిడ్ కారణంగా రాష్ట్రం రూ.66 వేల కోట్లు ఆదాయం కోల్పోయినప్పటికీ టీడీపీ హయాంతో పోలిస్తే తక్కువగానే అప్పు చేసింది. గత సర్కారు హయాంతో పోల్చితే ఆస్తుల కల్పనకు వెచ్చించిన మూల ధన వ్యయం ఇప్పుడే ఎక్కువ. -
సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై విచారణ
-
రామోజీ, శైలజతో పాటు మరో 13 మందికి నోటీసులు
-
చిట్ఫండ్ చట్టం తెలియదట.. కంపెనీ లా చట్టం వర్తించదట
-
రామోజీ చిత్రహింసలు బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
-
రామోజీ చీకటి చిట్ వ్యాపారానికి ఇక చెక్ పడ్డట్టేనా?
-
కంపెనీనే సొంతంగా చిట్స్ తీసుకుంటుంది: సీఐడీ అడిషనల్ డీజీ
-
అందరికి నీతులు చెప్పే రామోజీకి.. ఈ వయసులో ఇది స్వయంకృతాపరాధమే
ఈనాడు అధినేత రామోజీరావు ఈ వయసులో ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఆయన స్వయంకృతాపరాధమే అనిపిస్తుంది. మార్గదర్శి చిట్ ఫండ్స్కు సంబంధించి సీఐడీ సోదాలలో వెలుగు చూస్తున్న అంశాలు ఆందోళన కలిగించేవే. ఎంత పెద్ద సంస్థ అయినా సిస్టమ్స్ను సరిగా అమలు చేయకపోయినా, స్వయంగా యాజమాన్యమే నిబంధనలను ఉల్లంఘించినా, ఎప్పుడో అప్పుడు సంక్షోభంలోకి వెళతారనడానికి ఇదో ఉదాహరణ. గతంలో కూడా చాలా పెద్ద కంపెనీలు ఇలాగే దెబ్బతిని మూతపడ్డాయి. మార్గదర్శికి ఆ దశ రావాలని ఎవరూ కోరుకోరు. రామోజీ అతీతుడా? కాని అందరికీ నీతులు చెప్పే రామోజీరావు తాను మాత్రం అతీతుడిని అన్నట్లుగా వ్యవహరించడమే బాగోలేదు. ఈనాడు పత్రికలో ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తున్నాం కాబట్టి కక్ష బూనారని, అందుకే మార్గదర్శి చిట్స్పై దాడులు చేస్తున్నారని వీరి అభియోగం. నిజమే ఎవరిపైన అయినా కక్ష ఉండరాదు. అలాగని ఏదైనా సంస్థలో నిబంధనలు అమలు చేయడం లేదని తెలిస్తే, ఆ సంస్థ ప్రమాదంలో పడుతుందని సమాచారం వచ్చినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకుండా ఎలా ఉంటారు? ప్రభుత్వాలలోని లోపాలు ఎత్తి చూపడానికి మీడియా ఉంది. దానిని ఎవరూ కాదనలేరు. ప్రభుత్వంపై నీచంగా అసత్యాలు, వ్యతిరేక కథనాలు కాని మీడియా ఉంది కదా అని పత్రికలో పచ్చి అబద్దాలు రాసినా అదే పత్రికా స్వేచ్చ అట. మార్గదర్శిలో సోదాలు చేసినా, అక్రమాలు ఉన్నాయని చెప్పినా అది కక్ష అట. ఈనాడు మీడియా గత నాలుగేళ్లుగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత నీచంగా అసత్యాలు, అర్ద సత్యాలు, వ్యతిరేక కథనాలు రాసి ప్రచారం చేసింది, ఇంకా ఎలా విష ప్రచారం సాగిస్తున్నది ఎవరికీ తెలియదా? ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపవచ్చు. కాని అదే పనిగా ఉన్నవి, లేనివి రాయడం మాత్రం పత్రికా స్వేచ్చను దుర్వినియోగం చేయడమే అవుతుంది. గతంలో వాతావరణం అనుకూలంగా ఉండబట్టే ఏమి రాసినా నడిచిపోయింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మార్గదర్శి విషయంలో ఎందుకు చేయలేదు? ఈనాడుకు పోటీగా మరికొన్ని మీడియా సంస్థలు వచ్చాయి. సోషల్ మీడియా ఉండనే ఉంది. అయినా జర్నలిజం విలువలకు కట్టుబడి ఉంటే మార్గదర్శి అక్రమాలను సమర్ధిస్తూ రాయగలుగుతారా? ఇతర చిట్ సంస్థలకు సంబంధించి, ఇలా ఎక్కడైనా సోదాలు జరిగితే చిలవలు, పలవలు చేసి వార్తలు రాశారా? లేదా? అంతదాకా ఎందుకు అగ్రిగోల్డ్ విషయంలో ఎన్ని కథనాలు ఇచ్చారు? ఎక్కడైనా దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతుంటే, వారు పక్కన కూర్చుని చూసినట్లు రాస్తుంటారు కదా! మరి మార్గదర్శి విషయంలో ఎందుకు అలా చేయలేకపోయారు. భుజనా వేసుకొని ప్రచారం చేస్తే ఎలా? పైగా పత్రిక తమ చేతిలో ఉంది కదా అని పేజీల కొద్దీ ఎదురు దాడి. మార్గదర్శి చందాదారులకు భారీగా బాకీ పడి ఉంటుందని సీఐడీ అంచనా అన్నట్లు వార్తలువచ్చాయి..అవి నిజమా? కాదా? వారు చెబుతున్న అంశాలలో ఉన్న మెటీరియల్ ఏమిటి. నల్లదనం యధేచ్చగా ప్రవహిస్తోందా? లేదా? చిట్దారులకు డబ్బు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారా? లేదా? ఘోస్ట్ చందాదారులు ఉన్నారని చెబుతున్నారు. ఇలా సీఐడీ చెబుతున్న వాటి గురించి మార్గదర్శి వివరణ ఇస్తే పర్వాలేదు. కాని ఈనాడు మీడియానే భుజనా వేసుకుని ప్రచారం ఎలా చేస్తోంది. ఆ విషయం ఈనాడుకు తెలీదా? ఇతర సంస్థల విషయంలోనూ అలాగే చేస్తారా? పన్నెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన సాక్షి, భారతీ సిమెంట్ వంటి వాటికి వ్యతిరేకంగా ఈనాడు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసింది తెలియదా? సాక్షిని ఎలాగైనా మూసివేయించాలని విశ్వయత్నం చేశారా? లేదా? ఆ రోజుల్లో సోనియా గాందీ, చంద్రబాబు నాయుడు, సీబీఐఅధికారి ఒకరు, అలాగే రామోజీరావు వంటివారు ఆ కుట్రలో భాగస్వాములా? కాదా? మాట్లాడితే జగన్కు అలా అవుతుంది? ఇలా అవుతుంది? ఆయన ఇక జైలు నుంచి బయటకు రారు. తీహారు జైలుకు తరలిస్తారు.. అంటూ ఎన్ని కథనాలు రాశారు. చట్టాలే మాకు వర్తించవని చెబితే కుదురుతుందా? సీబీఐ విచారణ జరిగిందో, లేదో.. తెల్లారేసరికి ఆ విచారణలో అలా జరిగింది? ఇలా జరిగింది? ఈ ప్రశ్నలకు సమాదానం చెప్పలేదు? అంటూ ఎలా రాశారు. మరి ఇప్పుడు సీఐడీ చేస్తున్న విచారణ గురించి రాయకుండా మార్గదర్శిని వేధిస్తున్నారని ఎందుకు రాస్తున్నారు? పోనీ వేధింపులని ఫీల్ అయ్యి రాస్తే రాశారని అనుకుందాం. మరి సోదాలలో ఏమి బయటపడిందో కూడా వార్తలు ఇవ్వాలి కదా! మార్గదర్శి నిధులను చట్ట విరుద్దంగా ఇతర కంపెనీలకు తరలించారన్నది ఆరోపణ. దానిపై వీరు ఇచ్చే వివరణ ఏమిటి? అసలు చట్టాలే తమకు వర్తించవని చెబితే కుదురుతుందా? కోర్టులలో తాము పెద్ద లాయర్లను పెట్టి రక్షణ పొందగలమన్నది వారి విశ్వాసం కావచ్చు. జర్నలిజం అవుతుందా? గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వంపై ఈనాడు మీడియా అనండి.. రామోజీరావు అనండి..ఎంతలా దాడి చేస్తున్నారు? ప్రభుత్వంలోని లోపాలు ఎత్తి చూపడం, నిర్దిష్ట ఆదారాలతో ఏవైనా రాయడం మంచిదే.అలా కాకుండా అచ్చం తెలుగుదేశం కరపత్రం మాదిరి తప్పుడు వార్తలను నింపి ప్రజల మనసులను కలుషితం చేయాలని అనుకోవడం జర్నలిజం అవుతుందా? ప్రభుత్వాన్ని అస్దిర పరచాలని అనుకోవడం, కుట్రపూరితంగా ప్రజలలో వ్యతిరేకత పెంచాలని అనుకోవడం వంటివి సరైనదేనా? ఈనాడు వైఖరికి కోపం గతంలో కూడా కొందరు రాజకీయ నేతలు, లేదా ఇతర సంస్థలతో విభేదాలు వస్తే రామోజీరావు ఇలాగే వారిపై విరుచుకుపడేవారు. ఎక్కువ మంది ఈయనతో తగాదా పడలేక వదలివేసేవారు. ఉదాహరణకు ఈనాడు ప్రారంభానికి ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు బాగా ఉపయోగపడ్డారని అంటారు. కాని ఆ తర్వాత కాలంలో విబేధాలు వచ్చాయి. ఈనాడు వైఖరికి కోపం వచ్చిన జలగం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి ఆఫీస్లో సోదాలు చేయించారు. తదుపరి అది ఏమైందో తెలియదు .అనంతరం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈయన పత్రికను నడిపినా, మరీ అంత అడ్డగోలుగా రాసేవారు కాదు. చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీతో రాయబారం పైగా కాంగ్రెస్లోని ఏదో ఒక గ్రూప్తో బాగుండేలా జాగ్రత్తపడేవారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం సంబంధాలు సజావుగానే ఉన్నా, తదుపరి తేడా వచ్చింది. హైదరాబాద్ అసెంబ్లీ ఎదుట ఉన్న మార్గదర్శి భవనానికి అధిక అంతస్తులకు ఎన్టీఆర్ ప్రభుత్వం భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేదని అంటారు. దాంతో వీరిద్దరి మధ్య తగాదా పెరిగిందని అనేవారు. అప్పట్లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు టీడీపీలో ప్రవేశించడం, ఆయన కర్షక పరిషత్ పదవి చేపట్టడం, ఆనాటి కొన్ని పరిణామాలను రామోజీ విమర్శిస్తూ వ్యతిరేక కార్టూన్లు వేయించేవారు. కాని చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీతో రాయబారం చేసుకుని మంచి సాంగత్యం సంపాదించారు. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్పై విపరీతమైన వ్యతిరేక కార్టూన్లు వేశారు. కాంగ్రెస్ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి మీడియా రంగంలోకి వస్తుండడంపై ఆయనను దెబ్బతీయడానికి మద్య నిషేధ ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారని చెబుతారు. ఆ రోజుల్లో కోట్ల విజయ భాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఈనాడు ఉద్యమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆయన సారాను నిషేధించారు. అయినా రామోజీరావు మధ్య నిషేధ ఉద్యమం ఆపకపోవడానికి మాగుంట నుంచి పత్రికాపరంగా వచ్చే పోటీనేనని చాలా మంది నమ్ముతారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ఒక సందర్భంలో రామోజీ గురించి బాధపడ్డారు. రామోజీ ఆడింది ఆట పాడంది పాట ఆయనను గౌరవించి రామోజీ ఫిలింసిటీకి రోడ్డు కోసం సంఘీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని ఇస్తే, దానికి కృతజ్ఞత చూపలేదని బాధపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ ఆడింది ఆట పాడంది పాట అన్నట్లుగా సాగింది. టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు కుమద్దతు ఇవ్వడం, ఎన్టీఆర్ను అవమానించడం వంటి ఘట్టాలతో ఎన్టీఆర్ నేరుగా రామోజీని తీవ్రంగానే విమర్శించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొంతకాలం పాటు వివాదం లేకుండా చూసుకునే యత్నం జరగకపోలేదు. అయినా పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. వైఎస్ మీద దారుణమైన సంపాదకీయం రింగ్రోడ్డులో ఆయన భూమి కొంత పోతోందని కోపం తెచ్చుకుని వైఎస్ మీద దారుణమైన సంపాదకీయం రాశారు .దాంతో వారి మధ్య పూర్తిగా సంబంధాలు చెడిపోయాయి. ఇంతలో మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం బయటకు రావడంతో రామోజీ 2600 కోట్ల రూపాయలకు తన టీవీ చానళ్లను అమ్ముకోవలసి వచ్చిందని చెబుతారు. అప్పటి నుంచి వైఎస్ ఆర్ కుటుంబంపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు. సాక్షితో రామోజీకి మరింత ఆగ్రహం ఈ నేపథ్యంలో వైఎస్ తమకు సొంతమీడియా ఉండాలని భావించి సాక్షి పేపర్, టీవీ చానల్ ఆరంభించారు. అది రామోజీకి మరింత ఆగ్రహం తెప్పించింది. ఈనాడుకు సాక్షి గట్టి పోటీ అనే భావన ఏర్పడడం ఆయనకు ఇబ్బందిగా మారింది. దాంతో వైఎస్ కుటుంబంపై ఆయన పగ పెంచుకున్నారు. అంతలో వైఎస్ మరణంతో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో తెలివిగా సత్సంబంధాలు నెరపేవారు. కానీ వైఎస్ కుమారుడు జగన్పై మాత్రం వ్యతిరేక వార్తలు రాయడమే పనిగా పెట్టుకుని జగన్ కేసుల సందర్భంలో విపరీతమైన ద్వేషం ప్రచారం చేశారు. సీబీఐ విచారణను దగ్గరుండి చూసినట్లు రాసేవారు. ఆ ప్రభావం కూడా కొంతపడి 2014లో జగన్ అధికారంలోకి రాలేకపోయారు. ముగ్గురు దొంగలు కలిసి వెంటాడుతున్నారు అయినా జగన్ పోరాటం ఆపకుండా, తనదైన ఎజెండాతో ముందుకు వెళ్లారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్ పై దారుణమైన కథనాలు ఇచ్చినా జనం నమ్మలేదు. జగన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అది రామోజీకి సహించలేదు. ఆయనకు తోడు ఆంద్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 తోడయ్యారు. ముగ్గురు కలిసి గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వన్ని వేంటాడి ,వేటాడుతున్నారు. అయినా జగన్ మొండితనంతో ముందుకు సాగబట్టి వారిని తట్టుకోగలిగారు. చివరికి జగన్ ప్రభుత్వంలో సహనం నశించి రామోజీ మార్గదర్శిలోని అక్రమాలను బయటకు తీసింది. అప్పుడు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా రామోజీపై , ఆయన కోడలు శైలజపై కేసులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. రామోజీ ప్రభుత్వాన్ని వేధిస్తే అది పత్రికా స్వేచ్చ అని ప్రచారం చేసేవారు. మార్గదర్శి అక్రమాలను ప్రశ్నిస్తే మాత్రం అది కక్ష అని వాదిస్తున్నారు. అందులోనే వారి పక్షపాతం తెలిసిపోతుంది. గతంలో రామోజీ దందాకు వైఎస్ సవాల్ విసరగా, ఆయన కుమారుడు జగన్ ఇప్పుడు రామోజీ మూలాలు కదిలేలా చేశారు. మార్గదర్శి లోగుట్టును జనానికి తెలియచేశారు. ఇంతా రామోజీ స్వయంకృతాపరాధం కాదా! --కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉంది: మాజీ ఎంపీ ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రామోజీరావుకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉందని, ఆయన అడ్వకేట్లు ఎలా కావాలనుకుంటే అలా చేయగలరంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘అపురూప కళాఖండాల విదేశాలకు తరలిస్తున్న కళాంజలి అని ఏబీకే ప్రసాద్ 1996లో రాశారు. భారత ప్రభుత్వం పెట్టిన కేసు గురించి రాస్తే ఏబీకేకి శిక్ష పడింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘చిట్ఫండ్ చందాదార్లకు నోటీసులు ఇవ్వమని కోర్టు చెప్పింది. ఏ కేసుకు సంబంధించిన అఫిడవిట్ లోనైనా మొదట ఆయన నడుపుతున్న పత్రికల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. నర్మగర్భంగా రాయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఏపీ చిట్ఫండ్ యాక్ట్ మార్గదర్శికి వర్తిస్తుందో వర్తించదో కచ్చితంగా తేల్చి చెప్పండి. ఉండవల్లిపై వేసిన డిఫర్ మెషన్ కేసులో రామోజీరావు ఎవరో తెలియదని రాజాజీ స్పష్టం చేశారు. మరో కేసులో రామోజీరావు తమ ఛైర్మన్ అని ఇదే రాజాజీ అఫిడవిట్ ఫైల్ చేశారు. మార్గదర్శి రూల్ వయలేషన్ చేసినా సరే తప్పు కాదని తేల్చేయండి. ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకొన్న డబ్బు పూర్తిగా వాళ్ల దగ్గర ఉండాలి కానీ లేదు. న్యాయవ్యవస్థ తీరు మారాలి. ఎవరికి ఆన్సర్ బుల్గా ఉండటం లేదు’’ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం ‘‘మార్గదర్శి వ్యవహారాల్లో నిజాలు బయటపెట్టాలంటే ప్రభుత్వం నాకు సహకరించాలి. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు. రాజాజీ అనే వ్యక్తి పై కంటెమ్ట్ ఆఫ్ కోర్టు వేయరా.. హైదరాబాద్లో ఒక్క చిట్ ఫండ్ కూడా రూల్ ఫాలో కావటం లేదు. రాజు గురువుకు కోపం వస్తే పునాదులు కదులుతాయని చంద్రబాబుకు భయం. అందుకే అదిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చి కూడా రామోజీ గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు’’ అని ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. -
ఉండవల్లి ప్రశ్నలకు సమాధానాలు లేవా రామోజీ?
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో మార్గదర్శి ఫైనాన్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేశారట. ఈనాడు మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తోందని, అందుకే తమపై కక్ష వహిస్తున్నారని అంటున్నారు.. మీరేమో ప్రభుత్వంపై వ్యతిరేకతతో రాస్తారు. వారు మీ తప్పులు కనుగొని ఎత్తి చూపుతారు. ఇందులో తప్పేముందని అన్నారట. మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి సుప్రీంకోర్టులో రామోజీరావుపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ మార్గదర్శి చిట్ఫండ్ కేసుల్లో ఇరుకునపడ్డారు. ఏపీ సీఐడీ వారు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు వారు సూటీగా సమాధానం చెబుతున్నట్లు అనిపించదు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం తమపై దాడి చేస్తోందని వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరిపైన అయినా కారణం ఉన్నా, లేకపోయినా, దాడి చేసే హక్కు ఒక్క ఈనాడు మీడియాకు, దాని అధినేత రామోజీరావుకే ఉందని అనుకోవాలి. ఉండవల్లి అంటున్నట్లు ఈ దేశంలో రామోజీ ఎన్ని చట్టాలను అతిక్రమించినా ఆయనను నిలదీసే పరిస్థితి లేదని, ఆయా రాజకీయ పార్టీలు, వ్యవస్థలను అలా మేనేజ్ చేయగలుగుతున్నారని చెప్పుకోవాలి. ఉదాహరణకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు ఏపీకి తరలివెళ్లే చివరి రోజున గౌరవ హైకోర్టు వారితో ఎలా తన కేసును కొట్టివేయించుకోగలుగుతారని ఆయన ప్రశ్నిస్తుంటారు. కనీసం పిటిషనర్ అయిన తనకు కూడా తెలియకుండా చేయగలిగారని ఆయన వివరిస్తుంంటారు. ఆ తర్వాత ఎప్పటికో సమాచారం తెలిసి ఉండవల్లి సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వచ్చింది. మార్గదర్ళి చిట్ కేసులలో కూడా రామోజీ కోర్టులలో ఎన్ని పిటిషన్లు వేస్తున్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లు వెచ్చించగలుగుతున్నారు. నిజంగా తానేమీ తప్పు చేయకపోతే చిట్ రిజిస్ట్రార్ అధికారులు కాని సీఐడీ అధికారులు కాని అడిగిన రికార్డులను ఎందుకు చూపించలేదు. చదవండి: తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా? సుమారు 800 మంది కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయడంలోని మతలబు ఏమిటి? ఇవన్ని నగదు డిపాజిట్లా? కాదా? చట్టబద్దమైన డిపాజిట్లే అయితే వారి పేర్లు బయటపెట్టవద్దని ఎందుకు కోరుతున్నారు? దీనికి ఆయన ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఒక్కదానిలోనే సోదాలు చేయలేదు కదా. అన్ని చిట్ ఫండ్ సంస్థలపై సోదాలు చేసి కొన్నిటిపై కేసులు పెట్టిన విషయం మరిచిపోకూడదు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన చిట్ సంస్థలపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టులు కూడా చేశారే. మార్గదర్శి సంస్థలో చిట్ గ్రూప్లు నిలిపివేస్తూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై సంస్థ వారు కోర్టుకు వెళితే చిట్ గ్రూపులను నిలిపివేయడానికి ముందు వారికి నోటీసు ఇవ్వాలని ఆదేశం మేరకే ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసినట్లుంది. దానిని ప్రచార ప్రకటన రూపంలో ఇవ్వడం ఈనాడుకు అభ్యంతరం కావచ్చు. అదే వేరే కంపెనీలపై ఇలాంటి వాటిని ప్రభుత్వం ఇస్తే ఈనాడు తీసుకోకుండా ఉంటుందా? చట్ట ఉల్లంఘనలు వివరిస్తూ ప్రభుత్వ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. దానిని ప్రజాధనంతో దాడి చేస్తారా అని ఈనాడు ప్రశ్నించింది. మరి నిత్యం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పై అసత్యాలు వండి వార్చుతూ దాడి చేస్తున్న ఈనాడును ఏమనాలి. పాఠకులకు విలువైన వార్తలు ఇవ్వవలసిన పత్రిక స్థలాన్ని తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఈనాడు మీడియా ఎలా వాడుతోంది. పేజీలకు పేజీలు రాసి ప్రజలపై దాడి చేస్తోంది ఈనాడు కాదా? అదంతా లెక్క వేస్తే ఎన్ని వందల కోట్ల వ్యయం అవుతుంది? ఇలా జర్నలిజాన్ని, వ్యాపారాన్ని కలగలిపి చేయడం విలువలతో కూడిన విషయమే అవుతుందా? ఉండవల్లి మరో ప్రశ్న వేశారు. టివి 9 రవిప్రకాష్పై కేసులు వచ్చినప్పుడు, ఆయనను జైలులో పెట్టినప్పుడు రామోజీపై కేసులు పెట్టకూడదని ఎలా అంటారని ఆయన అడిగారు. రవి ప్రకాష్ కేసులలో రాజకీయ పార్టీలు ఏవీ ఆయనకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. రవిప్రకాష్కు ఒక న్యాయం, రామోజీకి ఒక న్యాయం ఉంటుందా? అని ఆయన అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి చందాదారులకు నిర్దిష్ట సమాచారాన్ని ఇస్తూ ఆ ప్రకటన చేసింది. దానికి ఖండనగా ఈనాడు మీడియా పెద్ద ఎత్తున ఒక పేజీ నిండా వార్తల రూపంలో ప్రచురించింది. అందులో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న బుకాయింపు తప్ప స్పష్టత ఎంత మేర ఉందన్నది సందేహం. చిట్ దారుల డబ్బును ప్రత్యేక ఖాతాలలో ఉంచుతున్నారా? లేదా? అన్నదానికి జవాబు దొరికినట్లు లేదు. తమకు చట్టాలు వర్తించవని రామోజీ భావిస్తే ఏమి చేయాలి. తమపై దాడి అంటూ ఈనాడు రాసిన కథనంలో ప్రభుత్వంపై ఎలా అబద్దపు దాడి చేశారో చూడండి. గోదావరి వరదలతో రాష్ట్రం అల్లకల్లోలమైందట. గోదావరికి వరద వచ్చిన మాట నిజం. పలు గ్రామాలు నీటి ముంపునకు గురైన సంగతి వాస్తవం. కాని అంతవరకు రాయకుండా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందని, అయినా మార్గదర్శిపై దాడి చేశారని రాస్తోంది. అంటే రాష్ట్రంలో వారు అనుకున్నవి తప్ప ఇంకేమీ పనులు ప్రభుత్వాలు చేయరాదన్నమాట. నిజంగానే గోదావరి వరదలతో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితే ఆ వార్తను బానర్గా ఇవ్వకుండా డేటా చౌర్యం అంటూ మరో తప్పుడు వార్తను ఈనాడు ఎలా ఇచ్చింది. ఆ పక్కనే మార్గదర్శి రిజాయిండర్ వార్తను ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ప్రభుత్వాన్ని దూషించడానికి కొన్ని కథనాలు ఇచ్చారు. వాటిలో వరద బాధితులకు సహయం అందడం లేదంటూ మరో కథనం అల్లారు. నిజానికి ప్రభుత్వం డెబ్బైవేల మందికి పైగా పునరావాస శిబిరాలకు తరలించింది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వార్త ఇవ్వవచ్చు. కాని దానిని చిలవలు, పలవలు చేసి ప్రభుత్వంపై విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు గమనించరా? పడవలలో కూడా వెళ్లి వలంటీర్లు ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్న విషయాన్ని వీరు గుర్తించరా? ఇలా ఒకటి కాదు.. ఎక్కడెక్కడి చెత్త, చెదారాన్ని అంతటిని పోగు చేసుకు వచ్చి ఏపీ ప్రజలపైన రద్దుతున్న ఈనాడును ఏమనాలి. మరి తెలంగాణలో ఎందుకు నోరు మెదపడం లేదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తడానికే గజగజలాడుతున్నారే. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత బరితెగించి దాడి చేస్తూ వస్తున్నారు. కేవలం తెలుగుదేశం అధికారం కోల్పోయిందని, తమ ఎదుట కూర్చునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్న దుగ్దతో పాటు తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతోనే కదా ఇలా చేస్తున్నారు. ఎక్కడ అక్రమాలు జరిగినా దానిపై చర్య తీసుకోవడమే కదా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఇతరుల అక్రమాలపై చర్య తీసుకోకపోతే ఇంకేముంది .. ప్రభుత్వం కుమ్మక్కైపోయిందని రాసే ఈనాడు మీడియా తమ గ్రూప్ సంస్థలోని మార్గదర్శి అక్రమాలపై వార్తలు ఇస్తే మాత్రం దాడి అని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా రామోజీ స్వయంకృతాపరాధం మాత్రమే కాదు. అహంకార పూరితంగా, తాను అన్నిటికి అతీతుడను అన్న భ్రమలో ఉండి చట్టాలను ఉల్లంఘించారు. ఒకప్పుడు రామోజీకి మద్దతుగా ప్రజలలో ఒకరకమైన భావం ఉండేది. కాని ఇప్పుడు అదే రామోజీ పై ప్రజలలో సానుభూతి లేకపోగా ఆయన ఏమి చేసినా చర్య తీసుకునే మగాడే లేడా అన్న ప్రశ్న ప్రజలలో తరచుగా వినిపిస్తోంది. వారందరికి జగన్ రూపంలో ఒక మగాడు కనిపిస్తున్నాడు. ఉండవల్లి కే కాదు.. చాలా మందికి ఇప్పుడు ఒక జవాబు దొరికింది కదా. వైఎస్సార్పై పగబట్టి వార్తలు రాసినా 2009లో ఆయనను రామోజీ ఓడించలేకపోయారు. ఇప్పుడు కూడా రామోజీ ఎంత విషం చిమ్మినా 2024లో కూడా అదే తరహాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి తిరిగి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు. పలు సర్వేలు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజ కిరణ్ తాము గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు, రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హాజరుకాలేమని ఈ–మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చందాదారుల సొమ్మును చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లించడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్తోపాటు మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఉన్న చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించారు.. కాబట్టి నిందితులిద్దర్నీ ఏపీలో విచారించడం సరైందని సీఐడీ అధికారులు భావించారు. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం మరోవైపు.. హైదరాబాద్లో విచారణ సందర్భంగా సీఐడీ అధికారులను తమ నివాసంలోకి అనుమతించకుండా రామోజీరావు తన సిబ్బంది ద్వారా చాలాసేపు అడ్డుకోవడం గమనార్హం. దీంతో ఈ నెల 5న గుంటూరులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రామోజీరావు, శైలజ కిరణ్లకు సీఐడీ అధికారులు సీఆర్పీసీ 41(ఏ) కింద గత నెల 22న నోటీసులు జారీచేశారు. చదవండి: మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్ -
A1 రామోజీ, A2 రామోజీ శైలజకు నోటీసులు రండి మాట్లాడాలి..