-
షూటింగ్ సమయంలో ధోతీ జారిపోతూ ఉండేది: షారుఖ్
దేవదాస్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. పారూ- దేవదాస్ల అమర ప్రేమకు దృశ్యరూపమైన ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. విషాదాంతంతో ముగిసే ఈ సినిమా భగ్న ప్రేమికుల హృదయానికి అద్దం పట్టింది. షారుఖ్, మాధురీదీక్షిత్(వేశ్య పాత్ర), ఐశ్వర్యారాయ్ పోటీపడి మరీ నటించి తమ తమ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్లో ఒకటిగా ఈ మూవీని పదిలం చేసుకున్నారు. ఇక సంజల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలై 19 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు సోమవారం ఇన్స్టా వేదికగా.. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ సమయం నాటి పలు ఫొటోలను షేర్ చేశాడు. ‘‘అర్ధరాత్రి వరకు షూటింగ్లు... పొద్దుపొద్దున్నే నిద్రలేవడం.. అబ్బో ఎన్నో కష్టాలు.. అయితే అవన్నీ మంచి అవుట్పుట్ను ఇచ్చాయి... ఇందుకు కారణం.. దిగ్గజ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, జాకీ ష్రాఫ్, కిరణ్ ఖేర్... ఇంకా టీం మొత్తం కలిసికట్టుగా పనిచేయడమే... అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని సహచర నటుల పట్ల ప్రేమను కురిపించాడు. అదే విధంగా... షూటింగ్ సమయంలో ధోతీ ఎప్పుడూ జారిపోతూ ఉండేదని, అన్నింటి కంటే తాను ఎదుర్కొన్న పెద్ద సమస్యే అదేనంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక మాధురీ దీక్షిత్ సైతం.. ‘‘19 ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సంజయ్’’ అని సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా ఇటీవల మరణించిన, ‘దేవదాస్’ దిలీప్ కుమార్(1955 నాటి సినిమా)ను ఈ సందర్భంగా మరోసారి నివాళి అర్పించారు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
ఆస్తులమ్ముకున్న నటికి మాధురీ దీక్షిత్ సాయం!
Shagufta Ali: 36 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బుల్లితెర తార షగుఫ్త అలీ. ఎన్నో సీరియళ్లలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమెకు ఇప్పుడు కనీస అవకాశాలు రాక దీన స్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. దీనికితోడు రోజురోజుకూ తనను అనారోగ్యం మరింత కుంగ తీస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో సాయం కోసం అర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి విని చలించిపోయిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న షగుఫ్త తాజాగా డ్యాన్స్ దీవానీ 3 షోకు వెళ్లగా అక్కడ తన బాధలను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది. "ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 36 ఏళ్లలో 32 ఏళ్లు అద్భుతంగా నడిచాయి. ఎంతో కష్టపడ్డాను, ఎంతగానో పని చేశాను, నాకు, నా కుటుంబానికి మద్దతుగా నిలిచాను. కానీ నాలుగేళ్ల క్రితం ఎన్నో ఆడిషన్స్కు వెళ్లాను, కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. పైగా ఆ సమయంలో మధుమేహం వల్ల నా కాలు నొప్పి తీవ్రం కాసాగింది. అది నెమ్మదిగా నా కంటిచూపును దెబ్బ తీయడం మొదలు పెట్టింది. నాలుగేళ్లుగా ఈ బాధను భరించలేకపోతున్నాను. చిత్రపరిశ్రమ నాకు సొంతిల్లులాంటిది. 36 ఏళ్ల జీవితాన్ని దీనికి అంకితమిచ్చాను" అంటూ ఏడ్చేసింది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) షగుఫ్త మాటలతో అక్కడున్న వారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. రియాలిటీ షో జడ్జి, నటి మాధురీ దీక్షిత్ వెంటనే షగుఫ్తను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అమ్మడానికి కూడా ఏమీ మిగల్లేని దీన స్థితికి చేరుకున్నందుకు విచారం వ్యక్తం చేసింది. డ్యాన్స్ దీవానే టీమ్ తరపు నుంచి రూ.5 లక్షల చెక్ను అందజేసింది. దీంతో చెక్ను అందుకున్న నటి భావోద్వేగానికి లోనైంది. గతంలో నీనా గుప్తా, సుమీత్ రాఘవన్, సుశాంత్ సింగ్ తనకు సాయం చేశారని గుర్తు చేసుకుంది. అలాగే తాజాగా రోహిత్ శెట్టి కూడా ఆమెకు ఆర్థిక సాయం చేశాడని ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ మీడియాకు వివరించాడు. -
సులభమైన యోగాసనాలు మీకోసం: మాధురీ దీక్షిత్
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యోగా ఎంతో ఆదరణను పొందుతోంది. ఇప్పుడు ప్రపంచ ప్రజలంతా యోగా వైపే చూస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాతో ఆరోగ్యాన్నిపెంపొందించుకుంటున్నారు. ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా యోగాతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే మన సినీ తారలంతా యోగా ఆసనాలు వేసి వారి అందాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తప యోగా వీడియోను షేర్ చేశారు. ‘యోగా నా రోజు వ్యాయమంలో ఒక భాగం అయ్యింది. త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలు మీకోసం. రండి నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి’ అంటూ మాధురి దీక్షిత్ తన ఇన్స్టాగ్రామ్లో ఆసనాలు వేసి చూపించారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
తళుకు బెళుకు తారలు, అందాల సొగసులు..
♦ అదితి భాటియా సెల్ఫీ మోడ్ ♦ నేనిలాగే ఉంటా, కానీ ఇది యాటిట్యూడ్ మాత్రం కాదంటోన్న కౌశల్ మండా ♦ ఆకాశమే హద్దుగా సాగిపో అని చెప్తోన్న ముమైత్ ఖాన్ ♦ మంచు లక్ష్మీకి కూతురి సర్ప్రైజ్ ♦ అప్పట్లో ఎంతో సేఫ్గా ప్రయాణించేవాళ్లమంటోన్న నోయల్ సేన్ ♦ గుడ్ హెయిర్డే అంటోన్న మాధురీ దీక్షిత్ ♦ ఎందుకో తెలీదు గానీ నిన్నుచూసిన మరుక్షణం నా పెదాల మీద చిరునవ్వు ప్రత్యక్షమవుతుందంటోన్న అషూ రెడ్డి ♦ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆర్ ఎక్స్ 100 భామ ♦ నన్ను నమ్మండి, నేను నిజంగానే పని చేస్తున్నాను అంటోన్న సన్నీలియోన్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niveditha Gowda 👑 (@niveditha__gowda) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
పాట పాడిన లావణ్య.. స్టెప్పులేసిన మాధురీ దీక్షిత్
మేము ఎంటర్టైనర్స్ అంతేకాని ప్యాక్ట్ చెకర్స్ కాదంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది సమంత ఉగాది శుభాకాంక్షలు అంటూ లంగా ఓణిలో దర్శనం ఇచ్చింది బిగ్బాస్ బ్యూటీ అరియానా నల్లకోటు ధరించి ఫొటోకు పోజులచ్చింది హీరోయిన్ మాళవికశర్మ లావణ్య త్రిపాఠి గాయణి అవతారమెత్తింది. ఓ ఇంగ్లిష్ పాట పాడుతూ ఆమె ఓ వీడియోని షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
మాల్దీవుల్లో వాలిపోయిన బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్!
సమ్మర్ వెకేషన్ మొదలైందో లేదో బాలీవుడ్ సెలబ్రిటీలు ‘ఛలో మాల్దీవులు’ అంటున్నారు. తాజాగా డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తన భర్త డా.శ్రీరామ్ నానే, ఇద్దరు పిల్లలు ఆరిన్, రెయాన్లతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. తమ వినోద, విహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇవి నెటిజనులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వ్యూ ఆఫ్ ది డే...పేరుతో పడవ ప్రయాణం, చల్లటి తీయటి ఐస్క్రీమ్తో ఆనందం, క్యాండిల్ లైట్ డిన్నర్.. మొదలైన ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా తనదైన శైలిలో వాటికి వ్యాఖ్యలు జోడించారు మాధురీ. కుటుంబ సభ్యులతో మాల్దీవులలో మాధురీ దీక్షిత్ మరి శ్రీరామ్ ఏమైనా తక్కువ తిన్నాడా! ఆమెతో దిగిన సెల్ఫీలకు ప్రేమకవిత్వంలాంటి పంక్తులు జోడించాడు. అంతే కాదు తన కాలేజీ రోజుల నాటి ఫొటోకు, కుమారుడి ఫొటో జోడించి ‘ఎవరు వీరు?’ అనే ప్రశ్న వేశాడు. జవాబు కూడా తానే సరదాగా చెప్పాడు... -
సోషల్ హల్చల్ : హీటెక్కిస్తున్న అనన్య.. చంపేస్తున్న శ్రీముఖి
♦ హాఫ్ సారీలో అదరగొడుతున్న బిగ్బాస్ ఫేం అరియానా గ్లోరీ ♦ చూపులతో చంపేస్తున్న శ్రీముఖి ♦ లేటు వయసులోనూ తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న మాధురీదీక్షిత్ ♦ అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది బాలీవుడ్ భామ అనన్య పాండే. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న లైగర్ ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ ♦ ప్రామిస్.. ఇవన్నీ నా కోసం కాదు అంటూ రష్మిక ఓ ఫన్నీ ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసింది. ♦ న్యూలుక్తో అదరగొడుతున్న యంగ్ హీరో కార్తికేయ ♦ డాన్స్తో అదరగొడుతున్న దీపికా పదుకొణె View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) Believe in this beautiful machine called your body and it will show you what you are capable of..@kuldepsethi (my super trainer) made this possible pic.twitter.com/hb8qinaN7E — Kartikeya (@ActorKartikeya) February 16, 2021 View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
‘సోషల్’ హల్చల్: విష్ణుప్రియ సెగలు.. ఊరిస్తున్న శ్రీముఖి
♦హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్స్ట్రాగ్రామ్లో సెగలు కక్కిస్తోంది. వాలెంటైన్స్డే సందర్భంగా హాట్ ఫోటోని షేర్ చేసి కుర్రకారుల మతులో పొగొడుతోంది. సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ♦ ప్రేమను ప్రతి రోజు సెలెబ్రేట్ చేసుకోమని సలహాలు ఇస్తూ వాలెంటైన్స్ డే సందర్భంగా హబ్బీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్ ♦ తన అందాలతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది బుల్లితెర యాంకర్ విష్టుప్రియ. గత కొద్ది రోజులుగా హాట్ ఫోటోలు పెట్టి హల్చల్ చేస్తున్న ఈ హాట్ యాంకర్.. ప్రేమికుల రోజు సందర్భంగా అందాలు ఆరబోస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ♦ సరైన వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే ప్రతి రోజు వాలెంటైన్స్డేనే అంటుంది మంజుల ఘట్టమనేని. ప్రేమికుల రోజు సందర్భంగా తన భర్త సంజయ్ స్వరూప్తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ విషెష్ తెలియజేసింది. ♦ సింగిల్ కుర్రాళ్లకు వాలెంటైన్స్డే విషెష్ చెబుతూ హాట్ వీడియోని షేర్ చేసింది బ్యూటీ సిమ్రత్కౌర్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డర్టీహరి’ చిత్రంలో ఈ అమ్మడు ఒక హీరోయిన్గా చేసింది. ♦ అందం అంటే శరీరానికి సౌకర్యంగా ఉండడమే అంటున్న మంచు లక్ష్మీ ♦ మీకో బిగ్ న్యూస్ చెబుతానని నిన్నటి నుంచి ఊరిస్తుంది హాట్ యాంకర్ శ్రీముఖి. ఈ వాలెంటైన్స్ డే తనకు మిక్స్డ్ పీలింగ్ని మిలిల్చిందని చెబుతోంది. మరికొద్ది గంటల్లో మీకో న్యూస్ చెబుతానంటూ తన ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
నటుడితో మాధురీ దీక్షిత్ ప్రేమాయణం!
మెరా దిల్ భీ కిత్నా పాగల్ హై యే ప్యార్ తో తుమ్సే కర్తా హై.. పర్ సామ్నే జబ్ తుమ్ ఆతే హో కుచ్ భీ కహ్నే సే డర్తా హై.. ఓ మేరే సాజన్.. ఓ మేరే సాజన్... 1990ల్లో యువ హృదయాల మధురాలాపనగా మిగిలిపోయిన పాట అది. ‘సాజన్’ సినిమాలోనిది. ఆ చిత్రాన్ని కూడా ఓ ప్రేమ కావ్యంలా ఆరాధించింది నాటి యువత. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ల నిజమైన ప్రేమా కథలుకథలుగా మీడియాలో అచ్చేసుకుంది. ‘నిజమే’ అని ఆ ఇద్దరూ స్పష్టం చేయకపోయినా అకస్మాత్తుగా వేరైన వాళ్ల దారులు ఆ కథనాలు వాస్తవమనుకునేలా చేశాయి. ఆ సినిమాతోనే మొదలు.. మాధురి, సంజయ్ దత్ సాజన్ కంటే ముందు నాలుగు సినిమాల్లో కలసి నటించారు. ఆ సాన్నిహిత్యంతో మంచి స్నేహితులుగా మారారు. సినిమాల్లో హిట్ పెయిర్గా పేరూ తెచ్చుకున్నారు. సాజన్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ టైమ్లో మాధురి.. పత్రికలకు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా సంజయ్ దత్ గురించి ‘సినిమాల్లో నా ఫేవరేట్ పార్ట్నర్. నన్ను భలే ఎంటర్టైన్ చేస్తాడు. ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. రియల్ జోకర్ అండ్ జెంటిల్మన్’ అని ఒకసారి, ‘ఎమోషన్స్తో గేమ్స్ ఆడే జిత్తులమారి కాదు సంజు. స్వచ్ఛమైన మనసు అతనిది. ప్రేమగల మనిషి. ఫెంటాస్టిక్ పర్సన్. మంచి సెన్సాఫ్ హ్యూమర్ అతని సొంతం. ఈ ప్రపంచంలో నన్ను నవ్వించే మనిషి అతనొక్కడే’ అంటూ ఇంకోసారి తన మనసులో మాటలను పంచుకుంది. సాజన్ సినిమా షూటింగ్ కబుర్ల కంటే మాధురి ఇంటర్వ్యూలే పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆ ఇద్దరి మధ్యలో ఏదో ఉందన్న ఊహలనూ రేపాయి. పత్రికలూ ఆ డాట్స్ను కనెక్ట్ చేసుకుంటూ మాధురి, సంజయ్ల ఇష్క్కి స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాయి. ఈలోపు ‘సాజన్’ విడుదలై సూపర్ హిట్ అయింది. వాళ్ల ప్రేమ కథా పత్రికలకు కవర్ స్టోరీ అయింది. మాధురి, సంజయ్లకు ఒకరంటే ఒకరికి ఉన్న పట్టింపు, శ్రద్ధ, పెరిగిన చనువును చూసి పరిశ్రమలో వాళ్లూ అనుకున్నారు ‘వాళ్లిద్దరూ కలసి ఏడు అడుగులు వేస్తారు’ అని. ఏమైంది మరి? సంజయ్ దత్కి అదివరకే పెళ్లయింది. ఒక కూతురు కూడా. కాని స్పర్థలతో విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు విడాకులు తీసుకోకుండా. ఈలోపే భార్య రీచా శర్మ క్యాన్సర్ బారిన పడింది. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లింది. సంజయ్, మాధురిల ముచ్చట అక్కడున్న రిచాకు చేరింది. చింత పడింది. ‘నాకు విడాకులివ్వాలనుకుంటున్నావా?’ అని అడిగింది భర్తను. ‘ఛ.. అలాంటి ఆలోచనేం లేదు’ అన్నాడు సంజయ్. కాస్త కుదుటపడినా.. అక్కడ ఉండలేకపోయింది. కూతురిని తీసుకొని ఇండియాకు వచ్చేసింది. కానీ వచ్చాక భర్త ప్రవర్తనలో మార్పు కనిపించింది రిచాకు. తన పట్ల అతనిలో మునుపటి ఆదరణ లేదు. పైగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. తట్టుకోలేకపోయింది. అందుకే వచ్చినంత వేగంగా.. కేవలం పదిహేను రోజుల్లోనే తిరిగి న్యూయార్క్ వెళ్లిపోయింది రిచా కూతురిని తీసుకొని చెదిరిన మనసుతో. ‘విడాకులు తీసుకోలేదు. తీసుకోవాలని ఆయనకు, నాకూ లేకుండింది. మళ్లీ కలసి ఉంటామనే అనుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. కలిసున్నా లేకపోయినా.. ఆయన నన్నెలా ట్రీట్ చేసినా ఐ లవ్ హిమ్. ఆయన నా ప్రాణం’ అని చెప్పింది రిచా. తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్తో కన్ను మూసింది ఆమె. ‘మాధురి, సంజయ్ మంచి ఫ్రెండ్స్ అనుకున్నాం. వాళ్లిద్దరిమధ్య ఇంకేదో ఉందని మేమేనాడూ అనుమానించలేదు. సంజయ్ స్పేస్ను రెస్పెక్ట్ చేశాం. అయినా మా అక్కతో అంత నిర్దయగా ప్రవర్తించిన మనిషిని ఎలా కావాలనుకుంటుందో మరి మాధురి?’ అని కామెంట్ చేసింది రిచా శర్మ చెల్లెలు ఇనా శర్మ. టాడా.. భార్యకు దూరమైన సంజయ్.. ప్రేమను దక్కించుకొని మాధురీకి దగ్గరయ్యాడా అంటే అదీ జరగలేదు. 1993లో చట్టవిరుద్ధంగా మారణాయుధం కలిగి ఉన్నందుకు టాడా కింద సంజయ్ మీద కేస్ నమోదైంది. జైలుకీ వెళ్లాడు. ఈ పరిణామానికి మాధురి షాక్ అయ్యింది. వెంటనే సంజయ్తో గడిపిన కాలానికి చెక్ పెట్టింది. ఆ జ్ఞాపకాలు మెదలకుండా మెదడును కట్టడి చేసుకుంది. జైల్లో ఉన్న సంజయ్ను కనీసం పలకరించడానిక్కూడా వెళ్లకుండా ఉండేంత. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఆమెకు అపరిచితుడయ్యాడు. మాధురి ఈ నిర్ణయం సంజయ్ను బాధించింది. లోలోపలే కుమిలిపోయాడు. జైలు నుంచి అతను బయటకు వచ్చాక ఒక సినీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మాధురి ప్రవర్తనకు మీరెలా ఫీలయ్యారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘ఏమీ ఫీలవలేదు. నాతో నటించే ప్రతి నటితో మంచి ర్యాపోతో ఉండాల్సి వస్తుంది. మాధురీతో అలాగే ఉన్నాను. అందుకే ఆమె మాటలు కానీ, చేతలు కానీ నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.. చూపవు కూడా’ అని చెప్పాడు సంజయ్. మరో పత్రికా విలేకరి ఇంకో సందర్భంలో మాధురితో ప్రేమ, పెళ్లి మీద వచ్చిన ప్రచారాన్ని గురించి అడిగితే.. ‘నాకూ అనిపిస్తుంది మాధురితో నా లైఫ్లో లవ్ సీన్ ఉంటే బాగుండు అని.. కానీ లేదు కదా. ఇక పెళ్లి అంటారా.. అసలు మా మధ్య ఏమీలేనప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది?’ అని కొట్టిపారేశాడు సంజయ్. మాధురిని దృష్టిలో పెట్టుకొని.. ఆమె ఇబ్బంది పడకుండా ఉండడానికే సంజయ్ అలా చెప్పాడు అంటారు అతని సన్నిహితులు. చాలా ముందుకెళ్లింది సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమా విడుదలప్పుడు మళ్లీ వాళ్ల లవ్ స్టోరీ గుర్తొచ్చింది మీడియాకు. మైక్ తీసుకెళ్లి మాధురి ముందు పెట్టారు.. ‘ఇప్పుడు ఆ విషయం అనవసరం. ఇన్నేళ్లలో జీవితం చాలా ముందుకెళ్లింది’ అని జవాబు చెప్పింది మాధురి. 2019లో ‘కళంక్’ అనే సినిమా వచ్చింది. సంజయ్ దత్, మాధురీ కలసి నటించిన సినిమా! పర్సనల్ లైఫ్, ప్రొఫెనల్ లైఫ్ రెండు వేర్వేరు అన్నదానికి సూచనగా. - ఎస్సార్ -
నెట్టింట్లో సినీతారలు: స్టైల్గా ల్యాండైన లైగర్
♦ ధైర్యంగా ఉంటే అద్భుతమైన శక్తులు వస్తాయని అంటున్నారు మంచు లక్ష్మీ. వీకెండ్ మూడ్ అంటూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ♦ వీకెండ్ మూడ్ అంటూ నవ్వుతూ కళ్ల జోడు పెట్టుకొని నవ్వుతూ ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ♦ నీతో ఉంటే జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుందంటూ హబ్బీకి బర్త్డే విషెష్ చెప్పింది మాధురీదీక్షిత్. ♦ వీకెండ్ని ఎంజాయ్ చేయండంటూ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన బిగ్బాస్ ఫేం సావిత్రి ♦ నవ్వుతూ ఉండండి.. సంతోషంగా ఉండంటూ పప్పీ హ్యాపీ మూడ్ పిక్ని ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసిన గాయని మధుప్రియ ♦ లైగర్ ముంబైలో ల్యాండ్ అయిందంటూ విజయ్దేవరకొండ ఫోటోలను చార్మి ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసింది. ♦ అల్లు శిరీష్ జిమ్ చేస్తున్న వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. ♦ View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) I'm back... To discipline, clean diet and strength training. pic.twitter.com/9FS6sSZnHU — Allu Sirish (@AlluSirish) February 13, 2021 View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) -
మాధురీ దీక్షిత్ను ఫిదా చేసిన యువతి
మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉన్నారు. తమలో ప్రతిభ ఉన్నప్పటికీ దానిని గుర్తించి సరైన ప్రోత్సాహం అందించేవారు లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదు. అలాంటి వారికి సోషల్ మీడియాలో వేదికగా మారుతోంది. దేశం నలుమూలలా జరిగే చిన్న చిన్న సంఘటనలను సైతం ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలాంటి ఓ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ పల్లెటూరి యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను నటి మాధురీ దీక్షిత్ ట్విటర్లో షేర్ చేశారు. రాగిరీ అనే ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను మొదట షేర్ చేస్తూ అలనాటి తారలు మాధురీ దీక్షిత్, హేమ మాలినిని ట్యాగ్ చేశారు. యువతి నృత్యంపై వారి అభిప్రాయాలు తెలపాలని కోరారు. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఓ విలేజ్ గర్ల్ పొలాల మధ్య అద్భుతంగా స్టెప్పులు వేస్తూ కనిపిస్తోంది. 1957లో వచ్చిన హిట్ చిత్రం ‘మదర్ ఇండియా’లోని రాజేంద్ర కుమార్, కుమ్కుమ్ నటించిన గోగత్ నహీన్..అనే పాటకు ఆ యువతి ఎక్కడా తడబడకుండా సూపర్ ఎక్స్ప్రెషన్స్తో అలరించింది. ఈ డ్యాన్స్ వీడియోపై స్పందించిన ఈ బాలీవుడ్ భామ.. యువతిపై ప్రశంసలు కురిపించారు. ఆ పోస్టుకు ‘వావ్! అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. ప్రపంచానికి పరిచయం చేయాల్సిన టాలెంట్ ఎంతో ఉంది’. అంటూ కొనియాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా. ఆ యువతి వివరాలు తెలియరాలేదు కానీ, వీడియోను షేర్ చేసిన ‘రాగిరీ’ సంస్థవారు సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరి అంతలా ఆకట్టుకుంటున్న ఆ యువతి డ్యాన్స్ను మీరు కూడా చూసేయండి. చదవండి: ఆమె విషయంలో చిరంజీవి చెప్పిందే నిజమవుతోంది! మూడోసారి తల్లి కాబోతున్న నటి लाजवाब, वाह! She is dancing so beautifully. There is so much talent waiting to be discovered. https://t.co/HZYFwVbj88 — Madhuri Dixit Nene (@MadhuriDixit) February 8, 2021 -
మా ఆయన బాగా వండుతాడు: మాధురీ
బాలీవుడ్ నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ కిచెన్లో దూరారు. ఆమె వెంట భర్త శ్రీరామ్ నేనే కూడా ఉన్నారు. ఆయన భార్య చేసే వంటకాన్ని దగ్గరుండి చూస్తూ మరాఠీ పదాలను నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు గరిటె తిప్పడం ఎంత బాగా వచ్చనే విషయాన్ని ఆమె బయటపెట్టారు. "చిన్నప్పటి నుంచే నాకు కాస్తో కూస్తో వండటం నేర్చుకున్నా. ఆమ్లెట్ వేయడం, పులిహోర చేయడం లాంటివి వచ్చు. కానీ వర్క్ బిజీలో పడి వంట చేసే అవకాశం రాలేదు. అయితే పెళ్లయ్యాక మాత్రం ఈ వంటల గురించి బాగా నేర్చుకున్నాను. ఇక నా భర్త రామ్కు అమెరికాలో ఫ్రెంచ్ వంటగాడు ఉన్నాడు. అలా అతడు అక్కడి డిషెస్ నేర్చుకున్నాడు. (చదవండి: అనుకోని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్) ఇక నా విషయానికొస్తే.. భారతీయ వంటకాలను నేను అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా అమ్మ వంటకాలే! నావల్ల రామ్ కూడా ఇక్కడి రెసిపీలను ఎంతో కొంత నేర్చుకుంటున్నాడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, రామ్ నాకంటే బాగా వండుతాడు, అలా అని నేనేమీ చెత్తగా వండనులెండి" అని మాధురీ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ‘యాక్ట్రెస్’ (నటి)అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశేషమేంటంటే.. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ ఈ సిరీస్లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. (చదవండి: కథ రొమాంటిక్గా ఉందని ఒప్పుకున్నా: మాధురీ) -
23 ఏళ్ల తర్వాత మళ్లీ అతనితో
మాధురీ దీక్షిత్ నటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి.. ‘నటి’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంటీ అంటే... ఆమె నటించనున్న తాజా వెబ్ సిరీస్ టైటిల్ ‘యాక్ట్రెస్’ (నటి). ఈ సిరీస్లో మాధురి టైటిల్ రోల్లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కుతోంది. విశేషం ఏంటంటే.. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ ఈ సిరీస్లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే సినిమా ‘రాజా’. 1995లో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్. ఆ తర్వాత ‘మొహబ్బత్’ (1997) సినిమాలో మళ్లీ కలసి నటించారు. ఇన్నేళ్లకు మళ్లీ కలసి నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ జరుగుతోంది. -
అందమైన ప్రయాణం
‘‘మా జీవితంలో మరో అద్భుతమైన ఏడాది ప్రారంభమైన రోజు ఇది (అక్టోబర్ 17). నా కలల రాకుమారుడితో ప్రతిరోజూ నా జీవితం కొత్తగా, సాహసోపేతంగా ఉంటోంది. మా ఇద్దరి మనస్తత్వాలు వేరు. అయినప్పటికీ నా జీవితంలో నువ్వు (భర్త శ్రీరామ్ నేనేని ఉద్దేశించి) ఉండటాన్ని గొప్పగా అనుకుంటాను. నాకూ నీకూ హ్యాపీ యానివర్సరీ.. రామ్’’ అని పెళ్లిరోజు సందర్భంగా మాధురీ దీక్షిత్ తన ఫీలింగ్స్ని పంచుకున్నారు. ‘‘21 ఏళ్ల క్రితం నా సోల్మెట్ను కనుగొన్నాను. అప్పటినుండి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రతిరోజూ మాకు కొత్తగా, అందంగా ఉంటుంది. ఇలాగే మా ప్రయాణాన్ని మేమిద్దరం కలిసి ఎంతో ఎడ్వంచరస్గా కొనసాగిస్తాం. హ్యాపీ ట్వంటీఫస్ట్ యానివర్సరీ’’ అన్నారు శ్రీరామ్ నేనే. కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే అమెరికాలో డాక్టర్గా చేస్తున్న శ్రీరామ్ నేనేను 21 ఏళ్ల క్రితం అక్టోబర్ 17న వివాహం చేసుకున్నారు మాధురి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కథ రొమాంటిక్గా ఉందని ఒప్పుకున్నా: మాధురీ
ముంబై: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. 1991లో తాను నటించిన ‘సాజన్’ చిత్రానికి సంబంధించిన ఓ అసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఆదివారం ఆ సినిమా విడుదలై 29 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మాధురీ ఆ సినిమాకి షూటింగ్ సమయంలో దిగిన ఓ త్రోబ్యాక్(పాత)ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఈ సినిమాలో నటించడానికి గల కారణాలను వెల్లడించారు. ‘‘సాజన్’ సినిమా ప్రాజెక్టును స్క్రిప్ట్ చదివిన తర్వాత వెంటనే అందులో భాగం కావాలని నిర్ణయించుకున్నాను. సినిమా కథ చాలా రొమాంటిక్గా ఉంది. సినిమాలో ఉన్న డైలాగ్లు కవితాత్మకంగా ఉన్నాయి. సంగీతం చాలా అద్భుతంగా ఉంది’ అని ఆమె కాప్షన్ జత చేశారు. (బిగ్బాస్ ఎంట్రీ: కొట్టిపారేసిన నటి) ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ అనాథ పాత్రలో నటించారు. హీరో సల్మాన్ ఇందులో గొప్పింటికి చెందిన వ్యక్తి పాత్రలో నటించారు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులుగా కనిపిస్తారు. సంజయ్ దత్ సాగర్ అనే పేరుతో గొప్ప కవిగా ఎదుగుతారు. కవి సాగర్కి మాధురీ అభిమాని పాత్రలో నటిస్తారు. మాధురీ సాగర్ కవిత్వాన్ని అమితంగా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఎంట్రీతో ట్రైయాంగిల్ ప్రేమ మొదలవుతుంది. ఈ సినిమాకి లారెన్స్ డిసౌజా దర్శకత్వం వహించారు. సాజన్ 1991లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటి. ఇందులోని పాటలు.. దేఖా హై పెహ్లి బార్, తుమ్ సే మిల్నే కి తమన్నా హై, బహుత్ ప్యార్ కార్తే హై, తు షాయర్ హై, జియే టు జియే కైస్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. ఈ పాటలు నేటికి అభిమానుల గుండెల్లో మారుమోగుతున్నాయి. ఇక కరణ్ జోహార్ నిర్మించబోయే నెట్ఫ్లిక్స్ సిరీస్తో మాధురి దీక్షిత్ త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్లోకి అడుగుపెట్టనున్నారు. మాధురీ గతంలో నెట్ఫ్లిక్స్తో కలిసి ఓ మరాఠీ డ్రామాను నిర్మించిన విషయం తెలిసిందే. View this post on Instagram #29YearsOfSaajan After reading the script of this film, I instantly decided to be a part of it. The story was romantic, the dialogues were poetic and the music was brilliant! 🎬 A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on Aug 29, 2020 at 11:02pm PDT -
‘ఇతరుల ఆనందం మా సొంతం’
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తారు. తాజాగా మాధురీ ఓ అద్భుతమైన త్రోబ్యాక్(పాత) ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మన ముఖం మీద కొద్దిగా ఆనందాన్ని తీసుకురావడం ద్వారా ఇతరులకు కంటే భిన్నంగా కనిపిస్తాము. అభిమానులు, ప్రజలు చిరునవ్వులు చిందించడానికి కారణాలను వెతుకుతూ ఉంటారు. ఇతరుల ఆనందాన్ని మా సొంతం చేసుకున్నాము’ అని మాధురీ కామెంట్ జత చేశారు. (నటి మూడో పెళ్లిపై విమర్శలు; పోలీసులకు ఫిర్యాదు) View this post on Instagram लाकर थोड़ी सी खुशी अपने चेहरे पर, हमने खुद को दूसरों से अलग बना लिया, लोग ढूंढते रहे मुस्कुराने का कारण, हमने दूसरों की खुशी को अपना बना लिया। ✨ #QuarantineThoughts A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on Jul 14, 2020 at 6:29am PDT మాధురీ 90ల్లో దిగిన స్టన్నింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతూ ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు చాలా అందంగా ఉంటారు’ అని నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు ఎప్పటికీ ఎవర్ గ్రీన్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మాధురీ ముంబైలోని తన నివాసంలో హోం క్వారంటైన్కి పరిమితమయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. మాధురీ చివరగా ‘కలంక్’ చిత్రంలో కనిపించారు. ఇటీవల మాధురీ గాయనిగా అవతారమెత్తి ‘క్యాండిల్’ పేరుతో ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఆమె ఈ పాటను కరోనా వైరస్ నివారణకు పోరాడుతున్న ‘కరోనా వారియర్స్’కు అంకితం చేశారు.(రజని, విజయ్లపై మీరామిథున్ ఫైర్) -
నా భర్త కేశాలంకరణపై ప్రయోగాలు చేశా
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించి నేటి(మంగళవారం)లో వంద రోజులు పూర్తైంది. లాక్డౌన్వేళ సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ లాన్డౌన్లో తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మాధురీ తన భర్త శ్రీరాం మాధవ్ నేనేతో దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. (ప్రేయసిని పెళ్లాడిన నటుడు..) ‘నేటి(జూన్30)కి సెల్ఫ్ క్వారంటైన్కి పరిమితమై వంద రోజులు పూర్తైంది. ఈ వంద రోజుల్లో నా భర్త శ్రీరాం మాధవ్ నేనే కేశాలంకరణపై అనేక ప్రయోగాలు చేశాను. అదే విధంగా లాక్డౌన్ నుంచి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. ఇతరులపై ఆధారపడకుండా నాకు కావల్సిన చిన్న చిన్న ఉత్పత్తులను సొంతంగా తయారు చేయటం ఎలానో తెలుసుకున్నాను’ అని మాధురీ కామెంట్ జతచేశారు. (బిహార్ బాలికపై 'ఆత్మనిర్భర్' చిత్రం) View this post on Instagram Self quarantine - Day 100 🗓️ Had fun experimenting with Ram's hairstyle 💇♂️ One important lesson that this lockdown has taught us is, how to be self-reliant! #100DaysInQuarantine #QuarantineThoughts A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on Jun 29, 2020 at 11:03pm PDT దీని కంటే ముందు మాధురీ భర్త శ్రీరాం తన కొత్త హెయిర్ స్టైల్తో ఉన్న ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.‘హాట్సాఫ్ నా కొత్త హెయిర్ స్టైలిస్ట్. కృతజ్ఞతలు హనీ!’అని కామెంట్ జతచేశారు. లాక్డౌన్ రోజుల్లో మాధురీ తన పాత ఫొటోలను, ఇటివల తన తల్లి పుట్టిన రోజుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram Hats off to my new hair Stylist. Thanks honey!! ❤️ A post shared by Dr Shriram Nene (@drneneofficial) on Jun 26, 2020 at 8:46am PDT -
క్యాండిల్... ఓ ఎనర్జీ
మాధురీ దీక్షిత్లోని నటికి, డ్యాన్సర్కి ఇండియా మొత్తం ఫిదా అయింది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు మాధురి. గాయనిగా తన ప్రతిభను చూపించబోతున్నారు. ‘క్యాండిల్’ పేరుతో ఓ పాట పాడారు మాధురి. ఈ పాటను శనివారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పాట టీజర్ను విడుదల చేశారు. ‘‘ఇన్నేళ్లుగా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నా నుంచి ఓ చిన్న బహుమానం ఇది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఓ చిన్న ఆశలాగా, పాజిటివ్ ఎనర్జీలాగా ఈ పాట ఉంటుంది. మనందరం ఈ కష్టాన్ని (కరోనా) కలసి దాటేద్దాం’’ అని ట్వీట్ చేశారు మాధురీ దీక్షిత్. -
మాధురీకి.. భర్త ప్రత్యేక బర్త్డే విషేష్
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తను చేసిన డాన్స్ వీడియోను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తారు. ఆమె మే15 (శుక్రవారం) 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మాధురీకి బర్త్డే విషెష్ తెలిపారు. ఆమె భర్త శ్రీరాం మాధవ్ నేనే.. మధురీకి బర్త్డే విషెష్ తెలుపుతూ వారిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ’ మనం చాలా అద్భుతమైన జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. చాలా తెలివైన నా అర్ధాంగి, నా అత్మబంధువు. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ఆయన కామెంట్ జత చేశారు. View this post on Instagram Here’s wishing my soul mate and very talented better half a very Happy Bday! It’s been the most amazing ride so far. Here is to many happy returns of the day, sweetheart! A post shared by Dr Shriram Nene (@drneneofficial) on May 15, 2020 at 8:03am PDT ఇక బర్త్డే సందర్భంగా మాధురీ దీక్షిత్ తన ‘క్యాండిల్’ సాంగ్ ప్రివ్యూను ట్వీటర్లో పోస్టు చేశారు. ‘బర్త్ డే విషెష్ తెలిపిన అందరికి కృతజ్ఞతలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. క్యాడిల్ పాట ప్రివ్యూ చూడండి. క్యాండిల్ అంటే నమ్మకానికి సంకేతం. ప్రస్తుతం మనందిరికీ అది ఎంతో అవసరం’ అంటూ కామెంట్ జతచేశారు. మాధురీ దీక్షిత్, శ్రీరాం మాధవ్ నేనే 1999లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి అరిన్, రాయన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. లాక్డౌన్లో నేపథ్యంలో ప్రస్తుతం మాధురీ దీక్షిత్ ముంబైలోని తన ఇంటికే పరిమితమై కుంబుంబంతో గడుపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. మాధురీ చివరగా ‘కలంక్’ చిత్రంలో కనిపించారు. View this post on Instagram Thanks for all the good wishes and birthday love! Wanted to give some love back to you. Sharing an exclusive preview of my first ever single. Will share the song soon. It's called Candle and it's about hope, something we need in large supply right now. A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on May 15, 2020 at 2:40am PDT -
ఫ్యాన్స్కు మాధురీదీక్షిత్ సవాల్.. కనిపెట్టగలరా?
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రటీలు నిత్యం సోషల్ మీడియాలో టచ్లో ఉంటున్నారు. షూటింగ్లతో ఎప్పడూ బిజీబిజీగా గడిపే స్టార్స్ కు బోలెడంత సమయం మిగలింది. దీంతో తమ కొత్త టాలెంట్లను బయటపెడుతూ సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్య త్రోబ్యాక్ చాలెంజ్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. పాత ఙ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒక్కసారిగా ఫ్లాష్బ్యాక్లోకి వెళుతున్నారు. అప్పటి అనుభవాలు, విశేషాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. (1000 మంది ప్రేక్షకుల మధ్య ఆ పాటను చిత్రీకరించాం ) తాజాగా బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు. తన సోదరితో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. నా సోదరితో ఉన్న అత్యంత మధుర జ్ఞాపకాలలో ఇది కూడా ఒకటి అంటూ క్యాప్షన్ జోడించారు. అంతేనా.. ఇద్దరిలో ఎవరు మాధురీ దీక్షితో కనిపెట్టాలంటూ ఫ్యాన్స్కు ఓ సవాల్ కూడా విసిరారు. నిజానికి ఇద్దరికీ చాలా దగ్గరి పోలికలుండటంతో ఎవరు మాధురీ దీక్షిత్ అన్నది కనిపెట్టడం చాలా కష్టంగానే ఉంది. చిన్నప్పడు తన సోదరితో కలిసి అనేక డ్యాన్స్ కాంపిటీషన్లలో పాలు పంచుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఇక 52 ఏళ్ల మాధురీ.. ఇప్పటికీ తన డ్యాన్స్ తో అభిమానులను అలరిస్తున్నారు. View this post on Instagram This is one of my favourite memories that I have with my sister. We used to always take part in school competitions. Here's sharing a #MajorThrowback childhood memory with my favourite dance buddy❤️ Let me know what is your favourite childhood memory! P.s. Can you tell us apart? A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on May 7, 2020 at 10:27pm PDT -
అది తెలిసి షాకయ్యాను: మాధురీ దీక్షిత్
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన హిట్ సాంగ్ ‘ఏక్ ధో తీన్’ గురించిన సరదా విషయాలను, జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అంతేగాక ఈ పాటకు సంబంధించిన సందేహాలను, జ్ఞాపలకాలను తనతో పంచుకోవాలని అభిమానులను కోరారు. అయితే ఈ పాటను దాదాపు 1000 అర్టిస్టులతో కాకుండా నిజమైన ప్రేక్షకులతో చిత్రీకరించినట్లు ఆమె ట్విటర్లో తెలిపారు. ఈ పాటను షూట్ చేయడానికి 10, 15 రోజుల ముందు నుంచే ప్రేక్షకుల మధ్య రిహార్సల్స్ చేశామని వెల్లడించారు. (కరోనాతో హాలీవుడ్ నటి మృతి) Let's start our #SunoSunaoWithMD Listening Party with #EkDoTeen! Right from starting the rehearsals 10-15 days before the shoot to shooting with a real crowd of 1,000 people, the song has been so special. Send me your questions & share your memories of the song with me. — Madhuri Dixit Nene (@MadhuriDixit) April 10, 2020 ‘ఈ పాటలోని హుక్ స్టేప్ బాగా పాపులర్ అయ్యింది. ఇక సినిమా విడుదలయ్యాక ధియోటర్లలో సినిమా కొనసాగుతున్నంతసేపు మళ్లీ మళ్లీ ఈ పాటను రీప్లే చేయాలని అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసి షాకయ్యాను. ఇక ఆ సమయంలో అందరూ నన్ను మోహినీ అని పిలవడం ప్రారంభించారు. వావ్.. ఈ సందర్భంగా అప్పటీ ఎన్నో జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చేల చేసింది’ అంటూ ట్విట్ చేశారు. ఇక ఈ పాట అంతగా ఫేమస్ అవుతుందని మీరు ఊహించారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘ఈ పాట అంతగా ప్రజాదరణ పొందుతుందని నేను ఊహించలేదు. కానీ కచ్చితంగా మంచి పేరు మాత్రం సంపాదింస్తుందని నమ్మాను’ అని మాధురీ సమాధానం ఇచ్చారు. ఇక మాధురీ ‘ఏక్ ధో తీన్’ పాట ఇప్పటికీ ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిన విషయమే. కాగా 1988లో విడుదలైన ‘తేజాబ్’ సినిమాలో హీరోగా అనిల్ కపూర్ నటించగా... దర్శకుడు ఎన్ చంద్ర తెరకెక్కించారు. (అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం) -
ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసిన విక్కీ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, అందాల భామ కత్రినా కైఫ్ మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై స్పందించిన విక్కీ తన ఫస్ట్ లవ్ కత్రినా కాదని బాంబు పేల్చాడు. వివరాల్లోకి వెళితే.. ఈ హీరో ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు ఎలాంటి విసుగు ప్రదర్శించకుడా తీరికగా సమాధానమిచ్చాడు. దొరికిందే చాన్సు అనుకున్న అభిమానులు హీరో నుంచి వీలైనన్ని సీక్రెట్స్ రాబట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బాలీవుడ్లో మీరు తొలుత ప్రేమించిన వ్యక్తి ఎవరు అని అభిమాని ప్రశ్నించగా విక్కీ.. ఎలాంటి తత్తరపాటు లేకుండా ఫొటోతో సహా సమాధానమిచ్చాడు. అలనాటి అందాల నటి మాధురీ దీక్షిత్ అంటే ఇష్టమంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక మీరు ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారన్న ప్రశ్నకు కుటుంబంతో గడుపుతూ, సినిమాలు చూస్తూ, అప్పుడప్పుడు అమ్మతో యోగా, ఫ్రెండ్స్తో వీడియో కాల్ ద్వారా కాలాన్ని నెట్టుకొస్తున్నానన్నాడు. ఈ "ఉరి: ద సర్జికల్ స్ట్రైక్" హీరో కరోనాపై పోరుకు రూ.1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆయన తాజాగా స్వాతంత్ర్య సమర యోధుడు "సర్దార్ ఉద్ధమ్ సింగ్ "బయోపిక్లో నటించగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. (నటుడు కావాలని నిర్ణయం తీసుకున్నాక విక్కీ చేసిన మొదటి పని) -
మాధురి దీక్షిత్ పాటకు గ్రీక్ యువతి డ్యాన్స్
-
‘కరోనా ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి’
గ్రీక్ దేశానికి చెందిన ఓ యువతి బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ యువతి పేరు క్యాథరినా కొరోసిడో. ప్రస్తుతం ఆమె జర్మనీలో నివసిస్తుంది. కాగా కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడా ఈ వైరస్ బారిన పడతామోనని ప్రజలంతా ఆందోళన పడుతున్నారు. (కరోనా కథలు ; మా ఇంటికి రాకండి) ఇక ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ యువతి తన అభిమాన నటి మాధురీ దీక్షిత్ పాపులర్ సాంగ్ ఏక్, దో, తీన్ పాటకు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె సహోద్యోగి బెలుట్చ్ అనే వ్యక్తి తన ట్విటర్లో బుధవారం షేర్ చేశాడు. ‘ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా ఆందోళ చెందుతుంటే నా కోలిగ్ చూడండి ఏం చేస్తుందో. కరోనా ఒత్తిడి నుంచి బయటపడటానికి తనకు ఇష్టమైన హిందీ నటి మాధురి దీక్షిత్ పాటలు వింటూ డ్యాన్స్ చేస్తోంది’ అంటూ షేర్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 73 వేలకు పైగా వ్యూస్ రాగా.. 5వేల లైక్లు వచ్చాయి. (‘ఇలాగైతే అమెరికాలో 22 లక్షల మరణాలు’) అంతేగాక వీడియోకు మాధురీ కూడా స్పందించారు. ‘ఈ వీడియో నాకు బాగా నచ్చింది. కరోనావైరస్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజిగా ఉండే మీరు ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకొండి. అంతేగాక కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. కుటుంబ సభ్యులతో సరదగా గడపండి. వ్యాయమ చేయండి. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి’ అంటూ చెప్పుకొచ్చారు. -
‘హ్యాపీ బర్త్డే మమ్మీ.. లవ్ యూ ఎవర్’
ముంబై : బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్, ప్రొడ్యూసర్ ఫరా ఖాన్ గురువారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ రోజుతో ఆమె 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఫరాఖాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ స్టార్ మాధురి దీక్షిత్.. ఫరాతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ‘మనం కలిసినప్పుడల్లా నవ్వుతూనే ఉంటాం. ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. యే జవానీ హై దివానీ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఫరా కొరియాగ్రాఫిలో మాధురీ, రణ్బీర్ కపూర్ కలిసి ఘాగ్రాకు పాటకు స్టెప్పులేశారు. మరోవైపు ఫరాఖాన్ను ప్రేమగా అమ్మ అని పిలుస్తూ.. ‘హ్యాపీ బర్త్డే మమ్మీ.. లవ్ యూ ఎవర్’ అంటూ కత్రినా కైఫ్ విష్ చేశారు. బాలీవుడ్ నడుటు అనిల్ కపూర్ సైతం ఫరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తెలిపారు. వీరితోపాటు రవీనా టండన్, అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ తదితరులు ఫరాకు బర్తడ్ విషేస్ తెలిపారు. ఇక దాదాపు వంద పాటలకు పైగా కొరియోగ్రఫి చేసిన ఫరా.. ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram Love you faru @farahkhankunder to the moon and back! Happpyyyy Birthdayyy ! The karmic connection continues.. 😜😜andar bahar, bahar andar 😂😂😂😂😂😂😘😘😍 A post shared by Raveena Tandon (@officialraveenatandon) on Jan 9, 2020 at 2:04am PST