-
ప్రియుడి కోసం రూ.2 వేల కోట్లు కాదనుకున్న గొప్ప ప్రేమికురాలు
ప్రేమ.. దీన్ని వర్ణించాలంటే కవులకు సైతం కలంలో సిరా సరిపోదు. ఇది చెప్పడం కంటే అనుభూతి చెంది తెలుసుకోవాల్సిందే. అయితే ఇటీవల యువతీయువకులు కొందరు ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇదే ట్రెండ్గా పాటిస్తున్నారు చాలామంది. అయితే ఓ యువతి మాత్రం మనీ కంటే తన మనసుకు నచ్చిన వాడే కావాలనుకుంది. కోట్ల ఆస్తి కంటే బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండడమే బెటర్ అనుకుంది. ఆస్తి కాదు.. అతనే ముఖ్యం వవరాల్లోకి వెళితే.. మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛై దంపతుల కుమార్తె ఏంజెలిన్. ఆమె పైచదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరింది. ఆ సమయంలో ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.కొన్నాళ్ల తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒకటిగా మారాలనుకున్నారు. ఇక్కడ వరకు సాఫీగా సాగిన వాళ్ల లవ్స్టోరీ ఇక్కడే బ్రేక్ పడింది. తన ప్రేమ విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే జెడిడియా ధనవంతుడు కాదన్న కారణంగా ఆమె తండ్రి వాళ్ల పెళ్లికి అంగీకరించలేదు. అంతేకాకుండా తనను కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని తేల్చి చెప్పారు. దాంతో ఏంజెలిన్.. నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు, నేను ప్రేమించిన వాడితోనే నా జీవితం అంటూ ఏంజెలిన్ సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుంది. ప్రియుడే కావాలని అతడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులను వదిలి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి తన కుటుంబానికి దూరంగా జీవిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఏంజెలిన్పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే.. -
ప్రియురాలికి చివరి కాల్ చేసి.. నేను పోతున్నా, నువ్వు పెళ్లి చేసుకో
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు చావు తథ్యమని తెలుసుకుని, ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు, తన అంత్యక్రియలకు ఆహ్వానించిన కొంతసేపటికి ప్రాణం వదిలిన హృదయ విదారక సంఘటన నెలమంగలలో వెలుగు చూసింది. నెలమంగలకు చెందిన కిరణ్ అనే యువకునికి కొన్నిరోజుల కిందట కుక్క కరవడంతో పెద్దగా పట్టించుకోలేదు, దీంతో రేబిస్ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు అతన్ని బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్చగా బతకడం కష్టమని వైద్యులు నిర్ధారించారు. కిరణ్ ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. తాను ఇక బ్రతకనని తన అంత్యక్రియలకు తప్పక రావాలని, మీ నాన్న చూపించిన యువకుడినే పెళ్లి చేసుకుని, పుట్టే బిడ్డకు నా పేరు పెట్టాలని కోరాడు. తరువాత కొన్ని గంటలకు అతడు చనిపోయాడు. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి -
వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి!
చెన్నై: ప్రియుడికి మరో యువతితో వివాహం జరిగిపోయింది. అయినా సరే పట్టుబటి అతనే కావాలంటే.. కిడ్నాప్ చేసి మరీ ప్రియుడితో తాళి కట్టించుకుంది ఓ యువతి. ఈ వింత ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆమెకు సహకరించిన ముగ్గురు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని వేలచ్చేరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పార్థిబన్ తన కాలేజీ రోజుల్లో సౌందర్య అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అంగీకరించడంతో వీరి ప్రేమ కథ మొదలైంది. ఏడేళ్ల వరకు సాఫీగా వీరి లవ్ స్టోరీ.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే గత నెల 5వ తేదీన పార్తీబన్కు ఐటీలో పనిచేస్తున్న యువతితో వివాహమైంది. ఈ విషయం సౌందర్య తెలియడంతో పార్తిబన్ను మర్చిపోలేనని, అతన్నే వివాహం చేసుకుంటానని తన తల్లి, బంధువులతో చెప్పింది. ఆమె తల్లి ఉమ, బంధువులు రమేష్, శివకుమార్ సహాయంతో యువకుడిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. శుక్రవారం యథావిధిగా కార్యాలయానికి వెళ్లిన పార్తీబన్ కారులో కిడ్నాప్ చేశారు. అతను తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నేరుగా కాంచీపురంలోని ఆలయానికి తీసుకెళ్లి సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. ఈ విషయం పార్తిబన్ భార్యకు తెలియడంతో.. భర్త కిడ్నాప్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె బంధువులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. చదవండి పింఛన్ ఇస్తామని తీసుకెళ్లి.. ఆపరేషన్ చేశారు -
ప్రియుడి కోసం ప్లాన్.. తండ్రిని కారు ఆపమని, హఠాత్తుగా వెనుక నుంచి..
ముంబై: తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని ఓ కూతురు దారుణానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసి ప్లాన్ కూడా చేసింది. అందుకోసం కొందరిని మాట్లాడుకుని సఫారీ కూడా ఇచ్చింది. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. అసలేం జరిగిందంటే.. పోలీసుల కథనం ప్రకారం.. షోలాపూర్ జిల్లా మాదా తాలూకాకు చెందిన మహేంద్ర షా వ్యాపారి. అతని కుమార్తె సాక్షి. ఆమె చైతన్య అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరి ప్రేమకు తన తండ్రి అంగీకరించడని భావించిన సాక్షి.. ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.అయితే తన తండ్రి నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని.. ఏకంగా కన్న తండ్రినే అడ్డుతొలగించుకోవాలనుకుని పథకం వేసింది. అందులో భాగంగా పూణె వెళ్లిన సాక్షి ఆదివారం రాత్రి మాదాకు తిరిగి వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్సు దిగి తన తండ్రిని రమ్మని పిలిచింది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు మహేంద్ర కారులో వచ్చాడు. తర్వాత తిరిగి వెళ్తుండగా వడచివాడి గ్రామ సమీపంలో సాక్షి తండ్రిని కారు ఆపమంది. అసలు విషయం తెలియన ఆ తండ్రి కారు ఆపగానే.. హఠాత్తుగా రెండు బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. వారు అతన్ని తీవ్రంగా కొట్టారు, అతని రెండు కాళ్ళు విరిచారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచాడు. మహేంద్ర గట్టిగా అరవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మహేంద్ర అరుపులు విన్న వాడచివాడి గ్రామ ఉపసర్పంచ్ బాపు కాలే, రామ్ చరణ్ అనే మరో వ్యక్తి సంఘటనా స్థలానికి వచ్చారు. తీవ్ర గాయాలపాలైన మహేంద్రను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కుమార్తె ప్రధాని నిందితురాలిగా తేలింది. ఈ కుట్రలో ఆమె ప్రియుడు కూడా హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Hyderabad: అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య ఆత్మహత్య -
ఫేస్బుక్లో పరిచయం.. ఆపై పెళ్లి, అంతా బాగుందని ఆనందపడేలోపే
అన్నానగర్(చెన్నై): ఆత్మహత్యకు యత్నించిన నవవధువు చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపూర్ జిల్లా ఉడుమలైపేటకు చెందిన మయిలత్తాల్ (65) మనవరాలు భూమిక (20). తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ సంరక్షణలో పెరిగింది. భూమిక, అదేప్రాంతానికి చెందిన అబ్బాయి సహజీవనం చేశారు. ఈ క్రమంలో తిరుచ్చికి చెందిన రఘు(25) భూమికకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. తల్లిదండ్రుల అంగీకారంతో జూలై 5న అతడితో వివాహం జరిగింది. భూమిక రఘుతో కలిసి తిరుచ్చిలో నివసిస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఉడుమలైపేటకు వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 6న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడికి అమ్మమ్మ రాగా సహజీవనం చేసిన వ్యక్తి చనిపోయాడిని తెలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది. భూమిక చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. చదవండి: Viral Video: 36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. మామూలు విషయం కాదు! -
బావా కలవాలని ఉంది.. అని మెసేజ్ పెట్టి
కొమరం భీమ్: తన కూతుర్ని ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని హతమార్చేందుకు యత్నించాడు ఆ యువతి తండ్రి. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల మండలంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. గుండాయిపేట గ్రామానికి చెందిన ఎల్ములే గణపతి, వనిత దంపతుల చిన్న కుమారుడు ఎల్ములే సాయిరాం కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. గ్రామంలోని సమీప బంధువు, పదో తరగతి చదువుతున్న నాగపూరి శంకర్ కూతురు, సాయిరాం ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. బావా కలవాలని ఉంది..అని మెసేజ్ పెట్టి సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ‘బావా నిన్ను కలవాలని ఉంది’అని సాయిరాం ఫోన్కు యువతి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో సాయిరాం రాత్రి సమయంలో గ్రామంలోని ఓ షాప్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వచ్చి మత్తు మందు కర్చిప్తో నోటిని ముసివేయడంతో సాయిరాం స్పృహ కోల్పోయాడు. అనంతరం పొలాల్లోకి తీసుకెళ్లి తీ వ్రంగా కొట్టారు. తర్వాత గ్రామ శివారులోని వ్యవ సాయ బావిలో పడేశారు. కాసేపు అక్కడే ఉండి.. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. బావిలో తక్కువ నీరు ఉండడంతో సాయిరాం నీటిలో మునగలేదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో యువకుడికి మెలకువ రావడంతో ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు వెంటనే కౌటాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయిరాం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుండాయిపేట్ గ్రామానికి చెందిన నాగపూరి శంకర్, నాగపూరి పంకజ్, నాగపూరి సందీప్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కౌటాల ఎస్సై మధుకర్ తెలిపారు. -
అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చిన భామ పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలోనే టచ్లో ఉంటోంది కోలీవుడ్ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటోంది. తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి రొమాంటిక్ వీడియోస్ సైతం అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: సురేఖవాణి కూతురు బర్త్డే.. పబ్లో డ్యాన్స్ చేస్తూ! ) అయితే తాజాగా శ్రుతి హాసన్ తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న ముద్దుగుమ్మ.. షూటింగ్లు లేకపోతే వెంటనే ఫ్లాట్కు వెళ్లి శంతనుతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ జంట నెట్టింట్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. చాలా గ్యాప్ తరువాత యాక్షన్ సీక్వెన్స్, బాక్సింగ్లో ట్రైనింగ్ తీసుకుంటోంది శృతి. తాజాగా శంతనుతో కలిసి ఫన్నీ క్విజ్ను నిర్వహించగా.. వీరికి ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధించారు. ఎవరు బాగా వండుతారు? అనే ప్రశ్నకు నేనే బాగా వండుతా ఉంటూ ఆన్సరిచ్చింది. ఆ తర్వాత ఎవరు బాగా తింటారు? అనే దానికి శంతను అంటూ చెప్పుకొచ్చింది. మీ లవర్లో నచ్చే లక్షణాలు ఏంటి? అనే ప్రశ్నకు శృతి హాసన్ ఆసక్తికర సమాధానం చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. తన లవర్ గురించి శృతి మాట్లాడుతూ..'శంతను ఎంతో టాలెంట్ ఉన్నవాడు. నన్ను బాగా నవ్విస్తాడు. అయితే కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడు. నన్ను ఎక్కువగా ఇష్టపడతాడు. అతని కళ్లు అంటే చాలా ఇష్టం. ' అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని నెటిజన్స్ ప్రశ్నించగా.. ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ముద్దులతో రెచ్చిపోయిన శృతిహాసన్.. మండిపడుతున్న నెటిజన్స్..!) -
రెండేళ్ల ప్రేమ, పెద్దలు కూడా ఒప్పుకున్నారు.. అంతలో ఊహించని ట్విస్ట్
క్రిష్ణగిరి(బెంగళూరు): ఇటీవల ప్రేమ వ్యవహారాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే వీటిలో కొందరు మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల వరకు వెళ్లి దంపతులుగా మారుతున్నారు. చాలా మంది వారి ప్రేమకు మధ్యలోనే బ్రేకప్ చెప్పడమో లేదా మోసం చేయడమో వంటి ఘటనలే ఎక్కువ జరుగుతున్నాయి. అయితే కొందరు ఈ బాధను ఎలాగోఒకలా బయటపడుతుండగా.. మరికొందరు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సూళగిరి వద్ద జరిగింది. వివరాలు.. సూళగిరి తాలూకా ముదుగురికి సమీపంలోని బి. సింగిరిపల్లి గ్రామానికి చెందిన యల్లప్ప కూతురు యశోద (19), కడతూరు గ్రామానికి చెందిన ప్రదీప్లు గత రెండేళ్లుగా ప్రేమించుకొన్నారు. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలని తీర్మానించారు. ఇంతలో ప్రియుడు ప్రదీప్ ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పడంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. మోసపోయానని విరక్తి చెందిన యశోద మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చదవండి: అమ్మకు బై చెప్పిన 5 నిమిషాల్లోనే.. -
బర్త్డే అని పిలవడంతో ప్రియురాలి ఇంటికి.. వంటగదిలో చూడగా షాకై గట్టిగా కేకలు..
చెన్నై: కోయంబత్తూరులో ప్రియురాలి పుట్టినరోజు వేడుకల కోసం ఆమె ఇంటికి వచ్చిన ఓ యువకుడు మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షాక్కు గురైన ప్రియురాలు కూడా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వివరాలు.. నీలగిరి జిల్లా మసినగుడి మేయర్ ప్రాంతంకి చెందిన శ్రీనివాసన్ కుమారుడు ప్రదీప్ (26). ఇతను మైసూరులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. మసనకుడి లక్ష్మీనగర్ 2వ వీధికి చెందిన రమేష్ కూతురు కావ్య (26). ఈమె ప్రదీప్ స్కూల్ ఫ్రెండ్. వీరు గత 6 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. కావ్య కోవై శరవణం పట్టి నెహ్రూ నగర్ 3వ రోడ్డులో అద్దెకు ఉంటూ బీలమెట్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కావ్య పుట్టినరోజు సంబరాలు చేసుకోవడానికి ప్రదీప్ కావ్య ఇంట్లో బస చేశాడు. మంగళవారం ఉదయం కావ్య తన తల్లితో ఫోన్లో మాట్లాడేందుకు మేడపైకి వెళ్లింది. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా వంటగదిలో ప్రదీప్ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో షాక్కు గురైన కావ్య కేకలు వేసింది. అనంతరం పక్కనే ఉన్నవారి సహాయంతో ప్రదీప్ను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రదీప్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కావ్య ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కావ్యను రక్షించి కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరవణంపాటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో! -
నా పేరు గీతా.. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది అని చెప్పి.. కొన్ని రోజుల తర్వాత
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఫేస్బుక్లో గీతా సెక్సీ పేరుతో ఉన్న ప్రొఫైల్ నిజమని నమ్మిన కనకపురకు చెందిన యువకుడు సైబర్ నేరస్తుల మాయలో పడి రూ.41 లక్షలు పొగొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. కనకపుర నివాసి రాజేశ్ రూ.41 లక్షలు సమర్పించుకున్న బాధితుడు. కొన్ని రోజుల క్రితం రాజేశ్కు గీతా సెక్సీ పేరుగల ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తన పేరు గీత అని చెప్పిన సైబర్ నేరస్తుడు బెంగళూరు, రామనగర, శివమొగ్గ తదితర జిల్లాల్లో ఎస్కార్ట్ సర్వీస్లు ఇస్తానని, నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన రాజేశ్ తన పర్సనల్ విషయాలు ఫోటోలు షేర్ చేసాడు. కొన్ని రోజులకు అపరిచిత వ్యక్తి ఫొటోలు, వివరాలు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. పలు దఫాలుగా మొత్తం రూ.41 లక్షలు తన ఖాతాలోకి వేయించుకున్నాడు. దీంతో బాధితుడు రామనగర సెన్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. చదవండి 45 నిముషాల ప్రయాణానికి మూడు గంటలకు పైగా వెయిటింగ్.. -
లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే
సాక్షి, వరంగల్: ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఓ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగరంలోని బొల్లికుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన జున్న చేరాలు కుమారుడు జున్న గణేష్(25) ఖోఖోలో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో పీపీడీ చదువుతున్నాడు. గణేష్కు ఐనవోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులకు తెలిసింది. దీంతోవారు ఆదివారం సాయంత్రం ఆగ్రహంతో బొల్లికుంటకు వచ్చి గణేష్ను బెదిరించారు. దీంతో ప్రేమ విఫలమైనట్టేనని మనస్తాపానికిలోనైన గణేష్ సోమవారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ప్రేమికురాలతో మాట్లాడుతూ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, ఫ్యాన్కు వేలాడుతూ గణేష్ మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి చేరాలు సమాచారంతో ఎస్ఐ కృష్ణవేణి సంఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రుల నుంచి సేకరించింది. గణేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్న అంశంపై పోలీసులను వివరణ కోరగా, గణేష్ ఉరి వేసుకున్న చోట ఫోన్కింద పడి ఉందని, దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. చదవండి: తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం! -
పాకిస్థాన్కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత..
జైపూర్: పాకిస్థాన్కి పంపించండి అంటూ వచ్చిన ఓ మైనర్ బాలిక జైపూర్ ఎయిర్పోర్టులో అధికారులను షాక్కు గురిచేసింది. పాక్లో ఉన్న తమ ప్రియున్ని కలవడానికి వెళ్తున్నట్లు బాలిక చెప్పుకొచ్చింది. ఎలాంటి పాస్పోర్టు, వీసాగానీ లేకుండానే ఎయిర్పోర్టుకు వచ్చిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితమే వచ్చా.. ఎయిర్పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన బాలిక పాకిస్థాన్కు టిక్కెట్టు అడిగింది. అనుమానంతో విచారించగా.. మూడేళ్ల క్రితమే ఇస్లామాబాద్ నుంచి భారత్కు వచ్చినట్లు కట్టుకథను చెప్పింది. తన ఆంటీతో పాటే వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం వారితో సఖ్యతలేదని తెలిపిన బాలిక.. మళ్లీ పాకిస్థాన్కు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పింది. కానీ దర్యాప్తులో తేలిన విషయాలు చూసి అధికారులు షాక్కు గురయ్యారు. ఎయిర్పోర్టులో మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నాం. తన ప్రియున్ని కలవడానికి లాహోర్కు వెళ్లాలని చెప్పింది. ఎయిర్పోర్టులోని టిక్కెట్ కౌంటర్ వద్దకు వచ్చి పాకిస్థాన్కు టిక్కెట్టు ఇవ్వమని అడిగినప్పుడు అందరం షాక్గు గురయ్యాం. బాలిక మొదట జోక్ చేస్తోందని టికెట్ మాస్టర్, సెక్యూరిటీ అధికారులు అనుకున్నారు. కానీ అది నిజమని తెలిసి ఆశ్చర్యపోయాం.' అని అధికారులు తెలిపారు. ప్లాన్ ఇచ్చింది ఆయనే.. పాకిస్థాన్లో ఉన్న బాలుడు కొన్ని విషయాలు తెలిపినట్లు బాలిక దర్యాప్తులో అధికారులకు చెప్పింది. పాకిస్థాన్కు రావడానికి పాటించాల్సిన నియమాలను ఆ బాలుడు చెప్పినట్లు తెలిపింది. అధికారులతో మాట్లడేప్పుడు కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాలని ఆ బాలుడే తెలిపినట్లు వెల్లడించింది. అందుకు భాగంగానే ఆ కట్టుకథను అధికారులకు చెప్పినట్లు పేర్కొంది. కానీ దర్యాప్తులో బాలిక స్థానికంగా రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని రత్నపుర గ్రామానికి చెందినదని అధికారులు గుర్తించారు. చివరికి తల్లిదండ్రులను పిలిచి వారి ముందే మళ్లీ ప్రశ్నించగా.. అందరూ గుర్తించాలని ఇలా చేశానని బాలిక చెప్పుకొచ్చింది. దీంతో తల్లిదండ్రులతో పాటే బాలికను ఇంటికి పంపించారు. ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్లోకి దూసుకొచ్చిన కారు.. -
మతం మారలేదు.. మేం పెళ్లి చేసుకోలేదు!
ఓవైపు పాక్ మహిళ సీమ వ్యవహారం వార్తల్లో ఉండగానే.. ఫేస్బుక్ స్నేహితుడు(ప్రియుడి!) కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిన రాజస్థానీ వివాహిత అంజు ఎపిసోడ్కు విపరీతమైన హైప్ వచ్చింది. ఈలోపు ఈ ప్రేమకథా చిత్రమ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మతం మార్చుకుని ఫాతిమా పేరుతో ఆమె నస్రుల్లాను వివాహం చేసుకుందని.. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు, వివాహ సర్టిఫికెట్ కూడా వైరల్ అయ్యాయి. అయితే.. భారత్కు చెందిన ఓ జాతీయ ఛానెల్ అంజు-నస్రుల్లాను విడివిడిగా సంప్రదించగా.. మీడియాలో వస్తున్న కథనాలన్నింటిని, తమకు వివాహం జరిగిందన్న ప్రచారాన్ని ఇద్దరూ కొట్టేశారు. నస్రూల్లా ఏమన్నాడంటే.. నేను అంజుని పెళ్లి చేసుకోలేదు. మా పేరుతో వైరల్ అవుతున్న సర్టిఫికెట్ కూడా ఫేక్. అన్నీ పుకార్లే. ఆమె కేవలం నాకు మంచి స్నేహితురాలే. మా ఇద్దరి గురించి మీడియాలో రావడంతో భద్రత కోసమే కోర్టుకు వెళ్లాం. ఇక్కడ బుర్ఖా సంప్రదాయం కాబట్టి ఆమె ధరించింది అంతే. అంజూ విదేశీయురాలు. పైగా భారతీయురాలు. ఆమెకు ముప్పు పొంచి ఉండడం సహజం. గనుక.. ప్రభుత్వం కూడా మాకు భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. 50 మంది పోలీసులు మాకు భద్రత కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మేం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆమె ఇంకా హిందువుగానే ఉంది. టూరిస్ట్ వీసా మీద పాక్ను చూడడానికి వచ్చింది. భర్తతో ఆమెకు గొడవలు వచ్చాయని.. విడాకుల ప్రక్రియ నడుస్తోందని నాకూ తెలుసు. విడాకులు మంజూరు అయ్యాక నన్ను ఇష్టపడితే ఆమెను తప్పకుండా వివాహం చేసుకుంటా. కానీ, అది ఆమె నిర్ణయం. ఇప్పటికైతే.. ఆగష్టు 4 వీసా గడువు ముగిశాక ఆమె తిరిగి భారత్కు వెళ్లిపోతుంది. అంజూ ఏమందంటే.. పాక్కు వెళ్లాలనుకున్నాను.. వెళ్లాను. నేనేం మతం మారలేదు. ఎవరినీ వివాహం చేసుకోలేదు. ఇక్కడ ఓ ఫేమస్ వ్లోగర్ మా ఇద్దరినీ కలిపి షూట్ చేశాడు. అంతేగానీ.. అదేం ప్రీ వెడ్ షూట్ లేదంటే పోస్ట్ వెడ్ షూట్ కాదు. అంతా పుకార్లే. నేను నస్రుల్లా మంచి స్నేహితులం మాత్రమే. నేనింకా భారతీయురాలినే. భారత్కు తిరిగొచ్చాక.. నా వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకుంటా అని పేర్కొందామె. అక్కడే చచ్చిదనుకంటాం అంజూ(34) ఇంటి నుంచి వెళ్లిపోయి మరీ మతం.. ఫాతిమాగా పేరు మార్చేసుకుని పాకిస్తాన్ ఖైబర్ ఫంక్తుఖ్వా ప్రావిన్స్కు చెందిన నస్రుల్లా(29)ను వివాహం చేసుకుందంటూ పాక్ నుంచి కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలియగానే.. ఆమె తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. స్వస్థలం మధ్యప్రదేశ్ గ్వాలియర్ బౌనా గ్రామం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన .. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు పిల్లలు, భర్త గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కనీసం బిడ్డల గురించి కూడా ఆలోచించలేదు. తన ఇష్టం, తన జీవితం తనది కావొచ్చు. కానీ, ఇలా చేయాలనుకుంటే.. ముందు భర్తకు విడాకులు ఇవ్వాలి కదా. కానీ, ఇలా పరువు తక్కువ పని చేయకూడదు కదా. అన్ని బంధాలను తెంచుకున్న అంజూ ఇక మా దృష్టిలో చచ్చినట్లే అని అంజు తండ్రి గయా ప్రసాద్ థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక స్థితి సరిగ్గా లేదని, తిరిగొస్తుందన్న నమ్మకం తనకు ఉందంటూ అంతకు ముందు వ్యాఖ్యానించిన ఆయన.. కూతురి నిఖా చేసుకుందనే వార్త తెలిసే సరికి దిగ్భ్రాంతికి లోనయ్యారు. తిరిగి ఆమెను భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తారా?.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? అంటే.. అలాంటి ప్రయత్నమేమీ చేయబోమని తెలిపారాయన. చస్తే అక్కడే చావనివ్వండి.. తన ఇద్దరి పిల్లలను మేం చూసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. #WATCH | Gwalior, Madhya Pradesh | Gaya Prasad, father of Anju who travelled to Pakistan says, "We don't have any relations with her (Anju). The moment she left India, we cut off all ties with her...I had never imagined that my daughter can do something like this...What she has… pic.twitter.com/aN0YvI8RpM — ANI (@ANI) July 26, 2023 ఇదీ చదవండి: ఆకాశంలో వింత.. స్వర్గానికి దారి ఇదేనా? -
బైక్పై ప్రియురాలిని వదిలేసి.. రాత్రి స్నేహితుడితో కలిసేందుకు వెళ్లి
అన్నానగర్(చెన్నై): నెల్లై జిల్లా దిసైయాన్ విలై తాలూకా స్వామిదాస్ పట్టణంలో చెప్పులు కుట్టే కార్మికుడు కన్నియప్పన్ కుమారుడు ముత్తయ్య (19). సంగనాన్ కుళం గ్రామంలో వివాహ ఆహ్వాన పత్రికలు తయారు చేసే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఓ యువతి పని చేస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన చెందిన ముత్తయ్య, సదరు యువతి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముత్తయ్య ఇంటికి ప్రియురాలు వచ్చింది. అనంతరం 4.30 గంటలకు ముత్తయ్య తన బైకులో యువతిని ఇడమొళిలో వదిలేసి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన ముత్తయ్య చాలా సేపటి వరకు ఇంటికి రాలేదు. సోదరులు అతన్ని వెతకగా ఆ ప్రాంతంలో మృతదేహమై పడివున్నాడు. దిసైయాన్విలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముత్తయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. నెల్లై ఎస్పీ శిలంబరసన్, వల్లీయూరు డీఎస్పీ యోగేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ హత్య చోటు చేసుకుందని భావిస్తున్నారు. చదవండి Hyderabad IIT Student Commits Suicide: హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతం -
ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
ప్రేమకు హద్దులు ఉండవని అంటుంటారు. అందుకేనేమో ప్రేమించిన వారి కోసం ఏకంగా దేశాలు దాటుతున్నారు. కుటుంబాన్ని, ఉన్న ఊరును విడిచి ప్రేయసి, ప్రియుడు కోసం దారులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు ప్రేమ పావురాలు. సోషల్ మీడియా వినియోగంతో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. పబ్జీ ప్రేమ ఓ మహిళను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రప్పిస్తే..ఫేస్బుక్ ప్రేమ మరో మహిళను భారత్ నుంచి పాకిస్థాన్కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్కు చెందిన అజు అనే మహిళ ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాక్స్థాన్కు వెళ్లిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై మీడియాలో వస్తున్న వార్తలపై అంజూ స్పందించింది. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తను కేవలం సందర్శన కోసమే పాకిస్థాన్ వచ్చిన్నట్లు పేర్కొంది. పాక్లో ఓ పెళ్లి ఉందని, దానికి హాజరు అయ్యేందుకు వచ్చానని తెలిపింది. ఇందుకు అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించినట్లు చెప్పింది. మూడేళ్లుగా పరిచయం తన పాకిస్థాన్ రాకపై ఎవరికీ ఏం తెలియదని, తన భర్తతో జైపూర్కు వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపింది. ‘ముందుగా భివాడి నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత అమృత్సర్కు వెళ్లాను. ఆ తర్వాత వాఘా బోర్డర్కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. తన పేరు నస్రుల్లా. మేం ఫేస్బుక్ ద్వారా స్నేహితులం. తను రెండుమూడేళ్లేగా నాకు తెలుసు. ఈ విషయం మా అక్క, అమ్మలకు కూడా తెలుసు. మా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. సీమా హైదర్తో పోల్చకండి కేవలం పెళ్లి కోసమే వచ్చాను. నాకు ఇక్కడ ఇంకేం పని లేదు. నన్ను సీమా హైదర్తో పోల్చకండి.. నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. త్వరలోనే తిరిగి భారత్ వస్తాను. నా భర్తకు నాకు మనస్పర్థలు తలెత్తాయి. నా భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో కలిసి నివసించాలనుకుంటున్నాను’ అని తెలిపింది. సంబంధిత వార్త: ఆమెకు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి.. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు మరోవైపు అంజూ ఆగస్టు 20న భారత్కు రానుందని ఆమె పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లా(29) తెలిపాడు. అంజూ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ లేదని పేర్కొన్నాడు. ఆమె పాకిస్థాన్కు పర్యటనకు వచ్చిందని, ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపాడు. ఆమె వీసా గడువు ఆగస్టు 20న ముగియనుండటంతో అప్పుడే భారత్కు తిరిగి వెళ్లనుందని చెప్పాడు. ఆమె తన ఇంట్లోనే వేరే గదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని తెలిపాడు. 2019లో పరిచయం కాగా ఉత్తరప్రదేశ్లోని కైలోర్కు చెందిన అంజూ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో నివాసముంటోంది. ఈమెకు అరవింద్ అనే వ్యక్తితో 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన నస్రుల్లాతో 2019లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వాలిడ్ పాస్పోర్టుతో.. అయితే అతడిని నస్రుల్లాను కలవడానికి అంజు 30 రోజుల పాకిస్తాన్ వీసాపై గురువారం పాక్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఎఅప్పర్ దిర్ జిల్లాకు వెళ్లిన్నట్లు తేలింది. అయితే, అంజు పాకిస్థాన్లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమె గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని, పాక్కు వెళ్లేందుకు అంజూ వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్గానే ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. -
ప్రియుడిని పిలిచి.. గ్రామానికి కరెంట్ తీసేసి..
గ్రామస్తులందరి కన్నుగప్పి తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె ఒక పథకం వేసింది. అది విజయవంతం కావడంతో నిరాటంకంగా ప్రియుడిని కలుసుకుంటూ వస్తోంది. ఒక రోజు ఆమె పథకం విఫలమయ్యింది. దీంతో ఆమె ప్రియునితో పాటు బహిరంగంగా దొరికిపోయింది. బీహార్లోని బేతియాలో ఈ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. జిల్లాలోని నైతాన్ ప్రాంతానికి చెందిన ప్రీతి తన ప్రియుడిని రహస్యంగా కలుసుకునేందుకు గ్రామానికి విద్యుత్ సరఫరా కాకుండా చూసేది. తరచూ విద్యుత్ పోతుండటంతో గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒకరోజు ప్రీతి తన ప్రియుడు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామానికి కరెంట్ కట్ చేసింది. అయితే అంతటి చీకటిలోనూ ఆ ప్రేమ జంటను గ్రామస్తులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంటనే గ్రామస్తులు ఆ యువకునిపై దాడి చేశారు. ఆ యువకుడిని సమీప గ్రామానికి చెందిన రాజ్కుమార్గా గుర్తించారు. తరువాత రాజ్కుమార్ ప్రీతిలకు వివాహం జరిపించారు. గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ మాట్లాడుతూ తన తోటలో ఈ ప్రేమికులను అభ్యంతరకర స్థితిలో చూశామన్నారు. తరువాత గ్రామస్తులు వారిపై దాడి చేశారన్నారు. మరో గ్రామస్తుడు గోవింద్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం పీత్రి తన ప్రియుడిని తోటలో ఎవరికంటపడకుండా కలుసుకునేందుకు ప్రతీరోజూ గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్ను కట్ చేస్తున్నదని తాము గ్రహించామన్నారు. ఇది కూడా చదవండి: పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు! -
వివాహితతో పరిచయం.. భర్త ఉండగానే ప్రియుడిని ఇంటికి పిలిచి
క్రిష్ణగిరి(బెంగళూరు): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసిన కేసులో నిందితులను సింగారపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... సింగారపేట సమీపంలోని కోనార్కొటాయ్ గ్రామానికి చెందిన కార్మికుడు ఇళంసూర్యన్ (47), ఇతడి భార్య పరిమళ (43). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్ (42)తో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలుసుకొన్న భర్త ఇళంసూర్యన్ భార్యను మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ఆవేశానికి గురైన పరిమళ ప్రియుడు లక్ష్మీకాంత్ను ఇంటికి రప్పించుకొని ఇళంసూర్యన్పై వేటకొడవలితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సింగారపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్య పరిమళ, లక్ష్మీకాంతంలను అరెస్ట్ చేశారు. చదవండి ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం -
అప్పు చేసి నా భార్యను చదివించా.. జాబ్లో చేరగానే అసలు కథ మొదలు
లక్నో: ప్రభుత్వం ఉద్యోగం చేయాలనే కొందరు కలల కంటారు. ఈ జాబితాలో ఆడపిల్లలు ఉండగా.. వాళ్లకు పెళ్లి కాగానే వారి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. భర్తలు భార్యలను అర్థం చేసుకుంటూ వాళ్ల లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం చేస్తున్నారు. అయితే... కొందరు దీన్ని పూర్తిగా మిస్ యూస్ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరగానే.. తమ కలల కోసం కష్టపడిన భర్తలకు షాక్కిస్తూ ఇతరులతో వివాహతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, యూపీలోని ఉన్నావ్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఎస్డీఎం జ్యోతి మౌర్య స్టోరీ గుర్తుందా. సరిగ్గా అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్లో ఒకటి వెలుగు చూసింది. భౌనిఖేడా గ్రామానికి చెందిన విజయపాల్ సింగ్, బెల్సి గ్రామానికి చెందిన ఛాయా సింగ్ను 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే ఛాయా సింగ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనేది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త భర్త విజయపాల్ సింగ్ ముందుకు వచ్చాడు. తన కుటుంబం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, అతను తన భార్య కలను తనదిగా భావించాడు. ఉన్నావ్ నగరంలో మంచి కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించాడు. మధ్య తరగతి కుటుంబం కావడంతో అతను కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి ఆమెను చదివించాడు. చివరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరుకగా.. ఆమె 2016లో మహిళా కానిస్టేబుల్గా నియమితులైంది. శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని భర్త రూ.50 వేలు అప్పు తీసుకుని భార్యకు ఇచ్చాడు. చివరికి బారాబంకి జిల్లాలో కానిస్టేబుల్గా విధుల్లో కూడా చేరింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. జాబ్లో చేరగానే ఆమె మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇంట్లో తెలిసేసరికి ప్రియుడితో పెళ్లి సిద్ధమైంది. ఆమె భర్త తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 16న ప్రియుడితో తన భార్య నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని..తన భార్యపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజయ్పాల్ ఎస్పీ ఉన్నావ్కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. చదవండి ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
రోజూ ఒకే టైంలో పవర్ కట్.. అసలు సంగతి తెలిసి గ్రామస్తుల మైండ్ బ్లాక్!
పాట్నా: ప్రేమికులు సిటీలో సులభంగా కలుసుకునే వెసలుబాటు ఉంటుంది. అయితే గ్రామంలో ఇలాంటివి కుదరవన్న సంగతి తెలిసిందే. రోజంతా ఇంట్లో పనులు, పోనీ మధ్యలో కలుద్దామా అంటే ఎవరైన చూస్తారన్న భయం కూడా ఉంటుంది. అయితే ఓ యువతి మాత్రం తన ప్రియుడిని కలుసుకునేందుకు కొత్త ప్లాన్ వేసింది. రాత్రి పూట్ అయితే బెటర్ అని భావించి ఓ వింత పనికి పూనుకుంది. రాత్రి వేళలో తాము కలిసే సమయంలో ఎవరి కంట పడకూడదనే ఆలోచనతో ఆ ఊరి మొత్తానికి కరెంట్ కట్ చేసేది. ఈ వింత ఘటన బీహార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేతియా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే, ఒకే గ్రామం కావడంతో ఇద్దరూ కలుసుకోవడం కుదరడం లేదు. పగలు ఎంత ప్రయత్నించిన కుదరకపోయేసరికి యువతి, రాత్రి సమయంలో కలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకేముంది అందుకు వారి ప్లాన్ ప్రకారం ప్రతి రోజూ రాత్రి పూట ఊరిలో కరెంట్ కట్ చేసేసేది.అందుకోసం సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. అనంతరం ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయేది. ఇలా కొంతకాలంగా వారిద్దరూ కలయిక కోసం గ్రామం మొత్తం అంధకారంలోకి నెట్టేది. దీంతో ప్రతి రోజూ ఇలా ఎందుకు జరుగుతోందా అని అనుమానం వచ్చిన గ్రామస్థులు ఒక రోజు మాటు వేయడంతో.. చీకట్లో యువతి, యువకుడి ప్రేమ వ్యవహారం బైటపడింది. ప్రేమికులిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారమంతా ప్రేమ వ్యవహారానికి సంబంధించినదిగా గ్రామస్థులు గుర్తించారు. యువతి చేస్తున్న పనికి చిరెత్తుకొచ్చిన గ్రామస్తులు ఆమె ప్రియుడిని చితకబాదడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో వైరల్గా మారింది. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా ముగ్గురు అదపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ప్రేమికురాలు, ప్రియురాలి కుటుంబాల మధ్య సెటిల్మెంట్ కూడా జరిగి.. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపారు. చదవండి Video: షాకింగ్.. ఢిల్లీ వీధుల్లో మహిళా పైలట్, భర్తను లాక్కొచ్చి, చితకబాది! -
సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి..
పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ మాదిరిగానే గత ఏడాది తన హిందుస్తానీ ప్రేమికుని కోసం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి కృష్ణ మండల్ భారత్ చేరుకుంది. ఆమెకు ఫేస్బుక్ ద్వారా కోల్కతాకు చెందిన ఆభిక్ మండల్తో తొలుత స్నేహం ఏర్పడింది. పాస్పోర్టులేని ఆమె రహస్యంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకుంది. ఇక్కడ ఆమె తన ప్రియుడని పెళ్లాడాలనుకుంది. అయితే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రేమికుల కథ ఏ విధంగా సాగిందంటే.. ప్రేమకు హద్దులు ఉండవు. సీమా హైదర్ దీనిని అక్షరాలా నిరూపించింది. అయితే ఈ జాబితాలో ఆమె ఒక్కర్తే లేదు.. ప్రేమలో మునిగితేలుతూ తమ దేశాన్ని విడిచిపెట్టి భారత్ చేరుకున్న పలువురు యువతుల కథలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గత ఏడాది అంటే 2022, మే 28న దేశ సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ ఒకటి వెలుగు చూసింది. బంగ్లాదేశ్కు చెందిన 22 ఏళ్ల యువతి కృష్ణ తన ప్రేమికుని కోసం రహస్యంగా సరిహద్దులను దాటి భారత్ చేరుకుంది. సీమా హైదర్-సచిన్ కేసుకు దీనికి పోలిక కనిపిస్తుంది. సీమా హైదర్ తన స్నేహితుడిని పబ్జీ గేమ్ ద్వారా కలుసుకోగా, బంగ్లాదేశ్కు చెందిన కృష్ణ తన స్నేహితుడిని ఫేస్బుక్ మాధ్యమంలో కలుసుకుంది. వీరి స్నేహం అతి త్వరలోనే ప్రేమగా పరిణమించింది. తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో కృష్ణ తన ప్రియుడిని పెళ్లాడేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ దారిలో ఆమెకు దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు లాంటి ఆటంటకాలు ఎదురైనా ఆమెకు ప్రేమ ముందు ఎంతో చిన్నవిగా కనిపించాయి. వాటిని దాటుకుని ఆమె తన ప్రియుడిని మనువాడేందుకు భారత్ వచ్చింది. దట్టమైన అటవీప్రాంతం మీదుగా.. కృష్ణకు కోల్కతాలోని నరేంద్రపూర్ ప్రాంతానికి చెందిన రానియా అభిక్ మండల్తో 2021లో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. అది వీరిద్దరి ప్రేమకు దారితీసింది. అనంతరం కృష్ణ తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రేమలో నిండా మునిగిన ఆమె పులులు సంచరించే దట్టమైన అటవీప్రాంతంగా పేరొందిన సుందరవనాలను దాటింది. అడవుల్లోని నదులను ఈదుకుంటూ వచ్చి భారత్ చేరుకుంది. ఈ దశలో పలుమార్లు దారి తప్పిపోయింది. పాస్పోర్టు లేనందున జనాల కంటపడకుండా రహస్యంగా పశ్చిమబెంగాల్ చేరుకుంది. అక్కడ అభిక్ను కలుసుకుంది. కోల్కతాలో ప్రేమికులిద్దరూ ఒక ఆలయంలో వివాహం చేసుకోవాలనుకున్నారు. పోలీసుల అరెస్టుతో.. అయితే ఇక్కడే ఈ జంటకు ఆటకం ఎదురయ్యింది. కృష్ణ అక్రమంగా భారత్లోకి చొరబడిందంటూ పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు. తన దగ్గర ఎటువంటి పాస్పోర్టు లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకరమైన మార్గంలో ఇక్కడికి వచ్చానని పేర్కొంది. సురేంద్రపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. తరువాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్కు పంపించారు. ఇది కూడా చదవండి: రోడ్డుపై సడన్గా విగ్రహంలా మారిన మహిళ.. టైమ్ ట్రావెల్ చేస్తున్నదంటూ.. -
వివాహితతో పరిచయం.. ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైం చూసి
చెన్నై: వివాహేతర సంబంధం విషయంలో మహిళకు నిప్పు అంటించి హత్య చేయడానికి ప్రయత్నించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెంగల్పట్టులో సంచలనం కలిగింది. వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లా పాలరు భగత్ సింగ్ నగర్కు చెందిన ప్రతాప్ అనే కుళ్లన్ (33) పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమైంది. అయితే పిల్లలు లేరు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అరుణ్ ప్రకాష్ భార్య ప్రియ (27)తో పరిచయం ఏర్పడి వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర వ్యవహారం ప్రతాప్ భార్యకు తెలిసింది. దీంతో ప్రతాప్ను వారించింది. కానీ ఈ మాటలు పట్టించు కోకుకుండా ప్రియురాలతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ప్రతాప్ బావ అతని పై దాడి చేశాడు. దీంతో ప్రతాప్ ప్రియతో మాట్లాడడం ఆపేశాడు. అయితే తనతో సంబంధం కొనసాగించాలని ప్రియ ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో గురువారం పాలరు రోడ్డులో ప్రతాప్, ప్రియ గొడవ పడ్డారు. అనంతరం శనివారం ఉదయం ప్రియ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి వెళ్లిన ప్రతాప్.. ఆమె పై కిరోసిన్, పెయింట్ కొట్టడానికి ఉపయోగించు టర్బెంట్ ఆయిల్ను రెండు కలిపి పోసి నిప్పంటించాడు. పాలరు సహాయ ఇన్స్పెక్టర్ కోదండన్ ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన ప్రియను చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చదవండి భార్య మిస్సింగ్ అంటూ 12 మంది భర్తల ఫిర్యాదు.. ఫోటో చూడగానే పోలీసులకు దిమ్మ తిరిగింది! -
ప్రియుడి గొడవ.. ‘అమ్మా.. అందరి ముందు పరువు పోయింది’ అంటూ
సాక్షి, మేడ్చల్: అమ్మా.. అందరి ముందు నా పరువు పోయిందని లేఖ రాసి ఇంట్లో పెట్టిన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి సుతారిగూడలో చోటు చేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి సుతారిగూడకు చెందిన వరగంటి శైలజ(25) రెండేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమించింది. కొన్ని రోజులుగా అతడితో మాట్లాడటం మానేసింది. ఈ నెల 9న రాత్రి సమయంలో ప్రేమించిన యువకుడు మద్యం మత్తులో శైలజ ఇంటికి వచ్చి బూతులు తిట్టి వెళ్లిపోయాడు. దీంతో మరుసటి రోజు 10వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా శైలజ వెళ్లిపోయింది. ఇంట్లో లెటర్ కనిపించింది. అందులో ‘అమ్మా.. అందరి ముందు నా పరువు పోయింది, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా.. నా కోసం వెతకకండి’ అంటూ శైలజ లేఖలో పేర్కొంది. దీంతో కుటుంబికులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ రావడంతో బయటకు వెళ్లి.. ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కండ్లకోయలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండం వెంకటేశ్వరి(22) కొంత కాలంగా ఓ అపార్ట్మెంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తోంది. ఈ నెల 7వ తేదీన రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆమెకు ఫోన్ వచ్చింది. దీంతో ఫొన్ మాట్లాడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబికులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు. మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్తో డ్యాన్స్లు -
వివాహితతో అడ్డంగా దొరికితే.. చితకొట్టి పెళ్లి చేశారు
పాట్నా: వివాహేతర సంబంధం ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నలుగురిలో పరువు పోయేలా చేయడంతో పాటు కన్నబిడ్డలకూ దూరం చేసేసింది. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఆమెకు బలవంతంగా మళ్లీ పెళ్లి చేశారు ఆమె భర్త, అత్తలు. బీహార్ నవాడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆమె.. భర్తలేని టైంలో ఇంటికే రప్పించుకుంటోంది. అయితే పక్కింటి వాళ్లు ఇచ్చిన సమాచారంతో నిఘా వేసిన భర్త, అతని తల్లి వాళ్లిద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ ప్రియుడిని దొరకబుచ్చుకుని చితకబాదేశారు. అయితే.. ఆ తర్వాతే అసలు కథ నడిచింది. ఈ ఊరి సెంటర్లో ఉన్న గుడి వద్దకు ఆమెను, ఆ ప్రియుడిని తీసుకెళ్లారు. అతని చేత ఆమె నుదుటిపై సింధూరం అద్దించారు. గ్రామస్తులంతా చూస్తుండగా.. ఆమె రోదిస్తుండగానే వాళ్లిద్దరికీ వివాహం చేశారు. ఆపై పిల్లలిద్దరినీ తీసుకుని ఆ భర్త, అత్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు ఆ ప్రియుడు, ఆ వివాహిత అక్కడ మిగిలిపోయారు. స్థానికులెవరూ అది అడ్డుకోకపోగా.. తమ ఫోన్లకు పని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పోలీసులు చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఆ వ్యక్తికీ వివాహమై ముగ్గురు పిల్లలున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదెక్కడ న్యాయమంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ కనిపిస్తున్నారు మరి!. Bihar News : दो बच्चों की मां का 3 बच्चों के पिता से चल रहा था अफेयर, पति ने करा दी शादी ! | Politicians India #bihar #nawada #viral #viralvideo #lovemarriage #marriage #temple #biharnews #extramaritalaffair #news pic.twitter.com/FwcU4NtuDb — Politicians India (@Politicians_IND) July 8, 2023 -
కొన్నాళ్లుగా ప్రేమ.. నడిరోడ్డుపై దుస్తులు విప్పించి నగ్నంగా వదిలేసి
ముంబై: కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే తాను అనుకున్న టైం రానే వచ్చింది. వెంటనే మాట్లాడాలని పిలిచి తన స్నేహితులతో తీవ్రంగా కొట్టించడమే గాక.. బాయ్ఫ్రెండ్ దగ్గరున్న డబ్బు, నగదు లాగేసుకుంది ఓ ప్రియురాలు. అంతటితో ఆగకుండా దుస్తులు విప్పించి నడిరోడ్డుపై అతడిని నగ్నంగా వదిలేసి వెళ్లిపోయింది. బాధితుడిని షాహాపూర్లో నివాసం ఉంటున్న బాలాజీ శివ్భగత్గా పోలీసులు గుర్తించారు. అతను నిర్మాణ వ్యాపారం చేస్తున్నాడు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని భావికా బోయిర్, నదీమ్ ఖాన్లుగా గుర్తించారు. మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివభగత్ గత కొన్నాళ్లుగా ఓ యువతితో రిలేషన్షిప్లో ఉన్నాడు. జూన్ 28న, తన ప్రియురాలు శివ్భగత్తో మాట్లాడాలని.. షాహాపూర్లోని అట్గావ్ హైవేపై సాయంత్రం ప్రాంతంలో రావాలని కోరింది. అయితే, ఆ లేడి కిలేడి అని తెలియని భగత్.. ప్రియురాలు చెప్పిన ప్రదేశానికి ఒంటరిగా వెళ్లాడు. ఆమె కోసమని కొన్ని బహుమతులు కూడా తీసుకెళ్లాడు. యువతి అతను మాట్లాడుతుండగా, నలుగురు ఎక్కడి నుంచో వచ్చారు గానీ అకస్మాత్తుగా భగత్పై దాడి చేశారు. అతడి వద్ద ఉన్న బంగారు చైన్, ఉంగరాలు లాగేసుకున్నారు. బాలాజీ తెచ్చిన బహుమతులను ఆ యువతి తీసేసుకుంది. ఆ తర్వాత అందులో ఒకడు బాలాజీని బెదిరించి దుస్తులు విప్పించాడు. ఈ తతంగమంతా మరో వ్యక్తి వీడియోలో రికార్డ్ చేశాడు. చివరిలో భగత్ కళ్లలో కారం కొట్టి అక్కడి నుంచి కారుతో సహా ఉడాయించారు. ఆ యువతి కూడా వారితో పాటే వెళ్లిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: బండ్లగూడ ప్రమాదం: లైసెన్స్ లేదు.. బర్త్డే నాడు దోస్తులతో హుషారుగా వెళ్తూ.. -
పబ్జీ ప్రేమ.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో ఇండియాకు.. చివరికి!
స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్లు పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గేమ్లకు అడిక్ట్ అవుతున్నారు. చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మరిచిపోయి అందులో లీనమవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. భారత్లో పబ్జీ వంటి గేమ్లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిన పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్ను డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పబ్జీలో పరిచమైన యువకుడి కోసం ఓ మహిళ తన పిల్లలతో కలిసి భర్తను వదిలేసి వచ్చింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రయాణమైంది. ఈ వింత ఘటన నోయిడాలో చేసుకుంది. నోయిడాకు చెందిన యువకుడు సచిన్కు పాకిస్థాన్కు చెందిన మహిళ సీమా గులామ్ హైదర్తో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే మహిళకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టేందుకు సిద్ధంమైంది. ఈ క్రమంలో గత నెల నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. అటు నుంచి బస్లో గ్రేటర్ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకుంది. మహిళ, తన పిల్లలతో కలిసి సదరు యువకుడు రబుపెర ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవించడం ప్రారంభించారు. అయితే పాకిస్తాన్ మహిళ నోయిడా అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సీమా సంగతి పోలీసులకు పసిగట్టారన్న విషయం తెలుసుకున్న సచిన్ ఆమెతోపాటు పారిపోయాడు. ఎట్టకేలకు నోయిడా అక్రమంగా నివసిస్తున్న సీమా, తన పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన నోయిడా యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళ, నలుగురు పిల్లలు, నోయిడా యువకుడి పోలీస్ కస్టడీలో ఉన్నట్లు నోయిడా డీసీపీ సాద్ మియా ఖాన్ పేర్కొన్నారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు తెలిపాడు. సదరు మహిళ పాకిస్తాన్కు చెందినామెలా కనిపించలేదని, ఆమె సల్వార్ సూట్, చీరలుధరించేదని యజమాని పోలీసులకు చెప్పాడు.