-
వీడేం లవర్రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది..
ప్రేమంటే ఏంటో నాకు నీ వల్లే తెలిసింది.., గుండె మాత్రం నాదే.. కానీ అది చేసే చప్పుడు నీది.., ఒకటా రెండా.. ఎన్ని కబుర్లు చెబుతారో ప్రేమలో ఉన్నప్పుడు. బాబోయ్.. వీళ్ల మాటలను కుప్పేస్తే.. కాళిదాసుకు కూడా కన్నీరొస్తుంది! కానీ అసలు పరీక్ష ఎదురైనప్పుడు కదా..! ఆ ప్రేమకు కడదాక అండగా నిలబడగలిగేదెవరో తెలిసేది. ప్రాణ సంకటం ఎదురైనప్పుడు కదా..! ప్రేమికురాలికి నిజం తెలిసేది. సరిగ్గా ఇలాంటి సంఘటన గురించే మీరు తెలుసుకోబోతున్నారు. ఓ ప్రేమ జంట చేతిలో చేయి వేసుకుని రోడ్డు వెంట నడుస్తున్నారు. బహుశా.. తమ మనసులు మ్యాచ్ అయ్యాయని చెప్పడానికనుకుంట.. మ్యాచింగ్ డ్రస్లు వేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు వారిని అడ్డగించారు. కత్తితో బెదిరించి ఆ అమ్మాయి వద్ద ఉన్న బ్యాగ్ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో భయపడిన ప్రియుడు పలాయనం చిత్తగించాడు. దిక్కుతోచని స్థితిలో ఆ అమ్మాయి.. దొంగపై ఏ మాత్రం ప్రతిఘటన చేయకుండా ప్రియుని వైపు, దొంగ వైపు చూస్తూ దీనంగా ఉండిపోయింది. బ్యాగును దొంగ కొట్టేయడం కంటే ప్రియుడి స్వభావమే ఎక్కువగా బాధ కలిగించినట్లు అతని వైపే చూసింది. ఈ ఘటనతో బైక్ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేసిన దొంగ మనసు కరిపోయింది. ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి బ్యాగును తిరిగి ఇచ్చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్య మాల్లో తెగ వైరల్ అయింది. Her lover ran away but the robber felt sorry for her. 😂pic.twitter.com/owFtEGVHPE — The Best (@Figensport) June 27, 2023 వీడియోపై నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. ప్రేమ పరీక్షలో ప్రియుడు విఫలమయ్యాడని కొందరు కామెంట్ చేశారు. లవర్ పారిపోకపోతే.. ఆ దొంగకు సానుభూతి కలిగేది కాదని మరికొందరు స్పందించారు. ఈ క్రెడిట్ కూడా ప్రియుడిదే అని కొందరు చెప్పుకొచ్చారు. మరికొంత మంది నెటిజన్లు దొంగ స్వభావాన్ని మెచ్చుకున్నారు. ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో -
ప్రియుడిని పెళ్లాడబోతున్న బుల్లితెర నటి..!
బాలీవుడ్ బుల్లితెర నటి శ్రీజిత దే త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఉత్తరన్ సీరియల్లో ముక్తా రాథోడ్ పాత్రతో ఫేమ్ తెచ్చుకున్న భామ తన ప్రియుడు మైఖేల్ బ్లోమ్ను పెళ్లాడనుంది. బిగ్ బాస్-16వ సీజన్లో మెరిసిన ముద్దుగుమ్మ పలు టీవీ షోలలో కనిపించింది. ఆమె బాలీవుడ్ చిత్రం తాషన్లో కూడా నటించింది. (ఇది చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) జూలై 1 జర్మనీలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేసింది. మా పెళ్లికి మీ అందరికీ ఆహ్వానం అంటూ వెడ్డింగ్ కార్డ్ను పంచుకుంది. అయితే తన స్నేహితులు చాలా మంది వివాహానికి హాజరు కాకపోవడంతో తాను నిరాశకు గురవుతున్నట్లు శ్రీజిత తెలిపింది. ఇన్స్టాలో రాస్తూ..'నేను నా పెళ్లి గురించి చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ అదే సమయంలో ఒక విషయం నన్ను బాధపెడుతోంది, నా సన్నిహితలు, మిత్రులు నా వివాహానికి హాజరు కావడం లేదు. ఇది నాకు కొంచెం బాధ కలిగించింది. ఈ ప్రత్యేక ఈవెంట్లో లేనందుకు ప్రత్యేకమైన ప్లాన్ చేస్తున్నా. ఇండియాలో మరోసారి జరిగే వివాహంలో తప్పకుండా కలుసుకుంటాం. అప్పుడు అందరితో కలిసి ఎంజాయ్ చేస్తా.' అంటూ పోస్ట్ చేసింది. జూలై 1న జర్మనీలో పెళ్లి చేసుకోబోతున్న శ్రీజిత.. ప్రియుడు మైఖేల్ బ్లోమ్తో 21 డిసెంబర్ 2021న నిశ్చితార్థం చేసుకుంది. (ఇది చదవండి: అనుమానాస్పదస్థితిలో డైరెక్టర్ మృతి!) View this post on Instagram A post shared by Sreejita De (@sreejita_de) View this post on Instagram A post shared by ETimes TV (@etimes_tv) -
వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే
అక్కడ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వధువును వరునికి అప్పగించే సమయం రానే వచ్చింది. అయితే ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. వరునితో పాటు అతని బంధువర్గం ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంది. రాజస్థాన్లోని భీల్వాడాలో ఒక యువకుడు కొత్త పెళ్లికూతురును ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయాడు. అప్పగింతల అనంతరం నూతన వధూవరులు దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు.ఇంతలో ఒక యువకుడు తన స్నేహితులతో పాటు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అందరినీ బెదిరించి, వధువు మెడపై కత్తిపెట్టి, ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. వధువు తరపువారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకునిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వధువుతో పాటు ఆ యువకుడి కోసం గాలింపు చేపట్టారు. భీల్వాడా పరిధిలోని బిజోలియాకు చెందిన రవి నాయక్కు లాఛుడాకు చెందిన కవిత(మార్చిన పేరు)తో వివాహం జరిగింది. అనంతరం వధూవరులు, వారి బంధువులతో పాటు ఒక ఆలయానికి వెళ్లారు. ఇంతలో అక్కడకు ముగ్గురు యువకులు స్కూటర్ మీద వచ్చారు. వారు కత్తులు చూపించి, పెళ్లివారిని బెదిరించడంతోపాటు వధువు మెడపై కత్తి పెట్టి ఆమెను తీసుకువెళ్లిపోయారు. అయితే పెళ్లివారు ఆ యువకులను కొంత దూరం వరకూ వెంబడించారు. అయినా ఆ యువకులను పట్టుకోలేకపోయారు. తరువాత వారు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘ప్రేమికుడే ఈ పని చేశాడు’ ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ పెళ్లి అనంతరం అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యాక తాము భగవంతుని ఆశీర్వాదం కోసం ఆలయానికి వెళ్లామన్నారు. అదే సమయంలో వధువును కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆ సమయంలో తన భార్య తన చేయి పట్టుకునే ఉందని, తన చేతికి కూడా గాయం అయ్యిందన్నారు. అయితే తన భార్య ప్రేమికుడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే! -
తన బాయ్ఫ్రెండ్ ఫోటో రివీల్ చేసిన ఇలియానా
తన వయ్యారంతో అందరినీ ఆకట్టుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్లో 'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన తొలి సినిమాతోనే గుర్తింపు పొంది.. యూత్ క్రష్గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్స్టర్స్ తోనూ జతకట్టింది ఈ భామ. తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్కు మకాం మార్చేసింది. కానీ అక్కడ అనుకున్నంతగా రానించలేకపోయింది. (ఇదీ చదవండి: నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?) ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్ను ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. ఈ విషయంలో ఆమెపై నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఆమె తన బాయ్ఫ్రెండ్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో భారీ ట్రోలింగ్కు గురైంది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయినందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఇలియానా తొలిసారిగా తన బాయ్ఫ్రెండ్ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కానీ ఆ ఫోటో అంత క్లారిటీగా లేదు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) తన వాల్లో ఇలా రాసుకొచ్చింది. 'ప్రెగ్నెన్సీ అనేది అతిపెద్ద వరం. నేను ఇప్పుడు మరింత అందంగా ఉన్నాను. నా బేబీ బంప్ చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. నా బేబీని త్వరలో కలుస్తాను. ఈ ప్రయాణంలో నా ప్రియమైన వ్యక్తి ఎంతో సహకరించాడు. నాకు సమస్యలు ఎదురైన ప్రతిసారి నా కన్నీళ్లు తుడిచాడు. రాయిలా నాకు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏదీ అంత కష్టంగా అనిపించడం లేదు' అని ఇన్స్టాలో తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్తో ఇలియానా ఎఫైర్లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. -
పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి..
ప్రియురాలికి ఖరీదైన గిఫ్టులు ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేయాలని చాలామంది యువకులు తపన పడిపోతుంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తించిన ఒక యువకునికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు వైరల్గా మారింది. చాలామంది డబ్బులు ఆదా చేసేందుకు వివిధ పద్దతులను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా అరటిపండ్లను తొక్కతోనే విక్రయిస్తుంటారు. అయితే తూకానికి అరటి పండ్లను కొనుగోలు చేసినప్పుడు తొక్కతో పాటు బరువు చూస్తే.. అది కాస్త అధిక బరువు ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు డబ్బులను ఆదా చేసేందుకు అరటి పండ్ల తొక్కలను తీసి, దానిలోని పండు భాగానికి తూకం వేసి, తన ప్రియురాలి కోసం కొనుగోలు చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ పీనాసితనాన్ని అందరికీ చూపించేందుకు ఆ యువతి ఈ ఘటనను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక యువకుడు అరటిపండు తొక్కలను వేరుచేసి, తరువాత వాటి బరువును తూచడం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన అరటి పండు బరువు తగ్గుతుందని, ఫలితంగా వాటి ఖరీదు కూడా తగ్గుతుందని అతని ఆలోచన. ఈ వీడియో చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్.. ‘మీరు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితాంతం రోదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని రాయగా, మరొకరు ‘మీరు ఈ బాధల నుంచి బయపడండి. వెంటనే ఆ వ్యక్తి దూరంకండి’ అని రాశారు. ఇది కూడా చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ!
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వధువు మాయమయ్యింది. విషయం తెలుసుకున్న వధువు తండ్రి నిర్ఘాంతపోయాడు. కొద్దిసేపటికి తేరుకుని ఆయన చేసిన పనికి అక్కడున్నవారంతా అతనిని అభినందనలతో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్లోని బాందాలోని ఒక ఇంటిలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఇంతలో వధువు తన ప్రియునితో పరారయ్యింది. విషయం తెలియగానే వధువు తండ్రితో పాటు పెళ్లికి హాజరైనవారంతా ఆందోళనకు లోనయ్యారు. అయితే వధువు తండ్రి తన చిన్న కుమార్తెను అదే వరునికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగే తన పెద్ద కుమార్తెను తీసుకువెళ్లిపోయిన యువకునిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం తిద్వారీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తె వివాహం జూన్ 8న నిశ్చయించామన్నాడు. కన్నౌజ్ జిల్లా నుంచి మగపెళ్లివారు వచ్చారన్నారు. ఇంతలో గ్రామానికి చెందిన ఒక యువకుడు తన కుమార్తెను తీసుకువెళ్లిపోయాడని ఫిర్యాదు చేశాడు.అతనిపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరాడు. పెద్ద కుమార్తె వెళ్లిపోయిందని, చిన్న కుమార్తెతో.. మగపెళ్లివారు కల్యాణమండపానికి చేరుకున్నంతలో వధువు తన ప్రియునితో పరారైన విషయం అక్కడున్నవారందరికీ తెలిసింది. వెంటనే వధువు తండ్రి తన చిన్న కుమార్తెతో ఈ వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అతని చిన్న కుమార్తె, వరునితో పాటు అతని తరపువారంతా సమ్మతించారు. దీంతో వివాహ వేడుక యధావిధిగా జరిగింది. పోలీసులు ఏమన్నారంటే.. ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఒక యువతిని ఒక యువకుడు తీసుకుని వెళ్లిపోయాడంటూ ఫిర్యాదు అందింది. ఆ యువతి తండ్రి దీనిపై ఫిర్యాదు చేశాడన్నారు. ఆ యవతీ యువకులను వెదికేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: హిందూ యువకుని ముస్లిం ‘వ్యవహారం’ -
లవర్కి ఊహించని షాకిచ్చిన యువతి.. నేరుగా ఆఫీస్కు వెళ్లి
భోపాల్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి అతని ఆఫీస్కు వెళ్లి చొక్కా పట్టుకుని నిలదీసింది. ఈ ఘటన బీహార్లో భాగల్పూర్లోని చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. భాగల్పూర్లోని మధుసూదన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భథోడియా గ్రామానికి చెందిన కరిష్మా అనే యువతి అదే గ్రామానికి చెందిన రోహిత్ కుమార్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో వారిద్దరూ రెండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా యువతి పెళ్లికి పట్టుబట్టడంతో రోహిత్ ఆమె నుదుటిపై సిందూరం పెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, రోహిత్ కుటుంబం కరిష్మాను కోడలిగా అంగీకరించలేదు. అంతేకాకుండా ఆమెను వారి ఇంటి నుంచి గెంటేసారు. దీంతో కరిష్మా అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో రోహిత్ జైలు పాలయ్యాడు. ఆ తర్వాత రోహిత్ బెయిల్పై బయటికి వచ్చాడని తెలిసి కరిష్మా నేరుగా అతన పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్లింది. పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ అందరి ముందు కాలర్ పట్టుకుని నిలదీసింది. అతను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో అందరూ చూస్తుండగానే షర్టు పట్టుకుని దగ్గర్లోని గుడికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఒకవేళ అతను పెళ్లికి నిరాకరిస్తే విషం తీసుకుంటానని బెదిరించింది. దీంతో రోహిత్ పని చేస్తున్న ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. తదుపరి విచారణ కోసం ఇద్దరి కుటుంబాలను కూడా పిలిపించారు. చదవండి: మెుబైల్ మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్త.. కేంద్రం అలర్ట్.. -
గొడవలతో భర్తకు దూరం.. గోపితో ప్రేమ, పెళ్లి కోసం ఆందోళన..
చీరాల రూరల్: మనస్తాపంతో సచివాలయ ఉద్యోగి రైలుకిందపడి బలవన్మరణం చెందింది. ఈఘటన బుధవారం రాత్రి చీరాల–జాండ్రపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న (30)చీరాలలోని వైకుంఠపురం విఠల్నగర్ సచివాలయంలో శానిటేషన్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈమెకు గతంలోనే వివాహం జరగగా కుటుంబ కలహాల నేపథ్యంలో విడివిడిగా ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఈమె విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో మృతురాలు లక్ష్మీప్రసన్న, గోపి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి వివాహం విషయంలో కొంత కాలంగా ఆమె ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎరుకుల హక్కుల పోరాట సమితి ధర్నా.. మృతురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తండ్రి వారి బంధువులు ఎరుకుల హక్కుల పోరాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్కుమార్ ధర్మతో కలసి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. ఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. -
సీఎం యోగిని చంపేస్తానని వచ్చిన బెదిరింపు కాల్లో ప్రేమకోణం..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ప్రేమ కోణం ఉన్నట్లు విచారణలో తేలింది. తాను ప్రేమించిన యువతి తండ్రిపై కోపంతో ఓ యువకుడు అతని ఫోన్ దొంగిలించి సీఎంకు చంపేస్తానని కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. ప్రేయసి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపాలని పథకం పని యువకుడు ఈ పని చేసినట్లు వెల్లడించారు. అతడిపై ఫోన్ చోరీ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడ్ని 18 ఏళ్ల అమీన్గా గుర్తించారు. ఏం జరిగిందంటే..? మంగళవారం ఉదయం 112 నంబర్కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానని బెదిరింపు కాల్ చేశాడు. యూపీ పోలీసుల హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్కు కూడా ఈ సందేశాన్ని పంపాడు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు ఆ నంబర్ను ట్రేస్ చేశారు. లక్నోలో ఉంటున్నాడని తెలిసి వెంటనే అతని వద్దకు చేరుకున్నారు. అయితే తన ఫోన్ను రెండు రోజుల క్రితమే ఎవరో దొంగిలించారని, ఈ కాల్ తాను చేయలేదని సజ్జాద్ హుస్సేన్ పోలీసులకు చెప్పాడు. దీంతో పొరుగింటి వారిని పోలీసులు వాకబు చేశారు. అప్పుడే అమీన్ గురించి వాళ్లు చెప్పారు. హుస్సేన్ను ఇరికేందుకు అతడే ఈ పని చేసి ఉంటాడని పేర్కొన్నారు. వెంటనే పోలీసులు అమీన్ వద్దకు చేరుకుని అరెస్టు చేశారు. హుస్సేన్ కూతుర్ని తాను ప్రేమించానని, ఆయన తమ ప్రేమకు ఒప్పుకోలేదనే ఇలా చేసినట్లు విచారణలో తెలిపాడు. హుస్సేన్పై ప్రతీకారంతోనే ఫోన్ దొంగిలించి సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు కాల్ చేసినట్లు అంగీకరించాడు. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..? -
హైదరాబాద్లో దారుణం.. యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది
సాక్షి, హైదరాబాద్: బోరబండలోని బంజారానగర్లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. సురేష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు. అయితే యువకుడి ప్రేమను లక్ష్మీ నిరాకరించింది. ఈ క్రమంలో సోమవారం స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించిన సురేష్.. ఒక్కసారిగా కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. దీంతో లక్ష్మీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది ప్రేమోన్మాదిని అడ్డుకున్నారు. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని చితకబాదిన స్థానికులు.. ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్లో..
క్విటో: బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి ముందు తమ ప్రియమైన వారికి వీరు పంపిన సందేశాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్లో ఉన్నామని, ఎదో జరగబోతుందని ముందే పసిగట్టి వారు మెసేజ్లు పంపిన కాసేపటికే కిరాతకంగా హత్యకు గురయ్యారు. దండగులు వీరి గొంతులు కోసి చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు. ఈక్వెడార్లోని క్వినెడే సమీపంలో ఎస్మరాల్డస్ బీచ్లో ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). ఏప్రిల్ 4న అదృశ్యమైన వీరు ఆ మర్నాడే దారుణంగా హత్యకు గురయ్యారు. మంచి స్నేహితులైన వీరు బీచ్కు వెళ్లి సరదాగా గపడపాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 4న అనుకున్నట్టే బీచ్కు వెళ్లారు. స్విమ్ సూట్ లాంటి దుస్తులు ధరించి అక్కడే హాయిగా సేదతీరారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఈ ముగ్గురూ ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఎవరో వారిని వెంబడించారు. దీంతో తమకు ఏదో జరగబోతుందని భావించి తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు. అయితే మెసేజ్లు రాత్రి 11:10 గంటల సమయంలో పంపడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. వారు అనుకున్నట్టే.. జరగకూడని ఘటన జరిగింది. నయేలి, డెన్నిసి చనిపోయే ముందు నయేలి తన సోదరికి వాట్సాప్ సందేశం పంపింది. 'ఏదో జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మెసేజ్ చేస్తున్నా' అని నయేలి మెసేజ్ చేసింది. సోదరి వెంటనే ఆమెకు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నయేలికి పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్ఫ్రెండ్కు సందేశం పంపింది. 'ఏదో జరగబోతుందని నాకు అన్పిస్తుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఒక్క విషయం గుర్తుంచుకో.. ఐ లవ్ యూ వెరీ మచ్' అని మెసేజ్ చేసింది. జాలర్లు చూసి.. ఆ తర్వాత కాసేపటికే ముగ్గురిని ఎవరో దారుణంగా హత్య చేశారు. బీచ్లో అర్ధనగ్నంగా ఉన్న వీరిని చిత్ర హింసలు పెట్టి పదునైన ఆయుధాలతో గొంతులు కోశారు. ఆ తర్వాత శవాలను పూడ్చిపెట్టారు. ఏప్రిల్ 5న చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం చూసి అక్కడకు వెళ్లగా శవాలు కన్పించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ హత్యలు ఎవరు చూసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ముగ్గురిలో ఓ యువతి బీచ్కు వెళ్లినరోజు సమీపంలోని ఓ హోటల్లో గడిపింది. దీంతో అధికారులు క్లూ కోసం సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మంచి భవిష్యత్ కోసం వేరే దేశం వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: వేరొకరి ఇంటి డోర్బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి.. -
పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయించిన నవవధువు.. భర్త అదృశ్యం
సాక్షి, అనంతపురం: వివాహమైన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో నవ వధువు పరారయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన బండ్లపల్లి తిమ్మరాజు, ప్రశాంత్కుమార్ సోదరులు. వీరికి తండ్రి లేడు. బతుకు తెరువు కోసం తల్లి అంజనమ్మ కువైట్కు వెళ్లింది. ఈ క్రమంలో సోదరులిద్దరూ అనంతపురానికి వలసవచ్చి నగర శివారులోని కురుగుంట వైఎస్సార్ కాలనీ నివాసముంటున్నారు. తిమ్మరాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండగా, ప్రశాంత్కుమార్ డిగ్రీ పూర్తయి ఇంటివద్దనే ఉంటున్నాడు. గత నెల 9న ఓ యువతితో తిమ్మరాజుకు వివాహమైంది. ఈ పెళ్లి ఇష్టంలేని ఆమె పెళ్లైన మూడో రోజే అంతకు ముందు తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. నవ వధువు కనిపించకపోయే సరికి కంగారుపడ్డ తిమ్మరాజు, బంధువులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన తిమ్మరాజు ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోదరుడు ప్రశాంత్కుమార్ పలుచోట్ల వెతికాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తే. -
ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తే.
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని ఒంగోలు చెందిన ఓ బాలిక తను ప్రేమించిన వ్యక్తి కోసం హైదరాబాద్కు వచ్చింది. కాగా ప్రేమించిన ఆ యువకుడు ఆమెను సోమవారం రామచంద్రాపురం పట్టణంలోని లింగంపల్లిలో వదిలేసి వెళ్లాడు. దీంతో ఆ బాలిక రోడ్డుపై రోదిస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రస్తుతం పటాన్చెరులో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడని అతని కోసం ఇక్కడికి వచ్చానని వివరించింది. అతడి ఫోన్ నంబరు కూడా తన వద్ద లేదని సీఐ సంజయ్కు చెప్పగా, స్టేట్ హోంకు తరలించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయిందని.. పటాన్చెరు టౌన్: ఉద్యోగం పోయిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ పోలీసుల కథనం ప్రకారం..సాయి విల్లాస్లో నివాసం ఉండే హరీశ్(30) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. అయితే ఇటీవలే హరీశ్ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఆదివారం భార్య నందిని బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హరీశ్ చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంటికి రాగా ఉరివేసుకొన్న భర్త కనిపించాడు. స్థానికుల సాయంతో భర్తను మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు హరీశ్ సోదరుడు రమేశ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలిని కెనడా నుంచి రప్పించి.. పొలంలోకి తీసుకెళ్లి
ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలని ఎన్నో ఆశలతో కెనడా వచ్చిన ఓ యువతి పోలంలో అస్థి పంజరంగా కనిపించింది. ఆమె మృతదేహాన్ని మంగళవారం భివానీలో పోలీసులు గుర్తించారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే? వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల నీలం ఐఈఎల్టీఎస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అనంతరం ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లింది. అయితే ఆమె భారత్లో ఉండగానే సునీల్ అనే వ్యక్తిని ప్రేమించింది. గత ఏడాది జనవరిలో సునీల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి భారత్కు రప్పించాడు. నీలం తిరిగి వచ్చిన తర్వాత హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో సునీల్ కూడా కొన్నాళ్లు స్థానికంగా కనిపించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో నీలం సోదరి రోష్ని గత జూన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్గా కేసు నమోదు చేయగా, ఫిర్యాదు చేసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసులో ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో ఆమె కుటుంబం సభ్యులు హర్యానా హోం మంత్రిని కలిశారు. ఆ తర్వాత కేసును భివానీలోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేశారు. దీంతో యూనిట్ సునీల్ను అరెస్ట్ చేసింది. చివరికి నీలంను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సునీల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతను ఆమె తలపై రెండుసార్లు కాల్చి చంపాడని, ఆపై తన నేరాన్ని దాచడానికి ఆమె మృతదేహాన్ని తన పొలంలో పాతిపెట్టాడని తెలిపారు. -
ఎంత స్టార్ హీరో అయినా ఆమె చెప్పులు మోయాల్సిందే!
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో తన భార్య సుసానే ఖాన్తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సానికి తన లవర్తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు. ప్రియురాలి హీల్స్ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు. అయితే గతేడాది డిన్నర్ డేట్లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్షిప్ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్తో క్లోజ్గా ఉంటున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Amit Aggarwal (@amitaggarwalofficial) -
ప్రేమకు తలొగ్గిన కోర్టు..లవర్ను పెళ్లి చేసుకునేందుకు హత్యకేసు దోషికి పెరోల్
బెంగళూరు: కర్ణాటక హైకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి.. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రేమికుల మనసును గెలుచుకున్నాయి. 'ఇతడ్ని విడుదల చేడయం అనివార్యం. లేకపోతే జీవితాంతం ప్రేమను కోల్పోతాడు. జైలులో ఉన్న ఇతడు.. తన ప్రేయసి వేరే వాళ్లను పెళ్లి చేసుకుందని తెలిస్తే భరించలేడు. అందుకే ఎమర్జెన్సీ పెరోల్ వినతికి అంగీకరిస్తున్నాం.' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రేయసిని పెళ్లాడేందుకు పెరోల్ పొందిన ఇతని పేరు ఆనంద్. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతని సత్ప్రవర్తన కారణంగా శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్షాకాలం పూర్తయింది. ఇంకో 4 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంది. అయితే నీతా అనే యువతి, ఆనంద్ 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జైలులో ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోయారు. దీంతో తనకు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారని, ఆనంద్కు పెరోల్ మంజూరు చేస్తే అతడ్నే పెళ్లి చేసుకుంటానని నీతా కోర్టును ఆశ్రయించింది. ఆనంద్ తల్లి కూడా ఈమెకు మద్దతుగా నిలిచింది. ఈ ప్రేమ గురించి తెలుసుకున్న న్యాయస్థానం.. ఇద్దరు ఒక్కటి కావాలని పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఏప్రిల్ 5న ఆనంద్ జైలు నుంచి విడుదల కానున్నాడు. మల్లీ 20వ తేదీ సాయంత్రం తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలనే నిబంధన లేకపోయినప్పటికీ ఇది అసాధారణ పరిస్థితి అని భావించి కోర్టు ఈ తీర్పునిచ్చింది. చదవండి: మద్యం నిషేధించాలని వినతి..బీజేపీ ఎమ్మెల్యే సమాధానం విని బిత్తరపోయిన మహిళ -
ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా..
లక్నో: ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించింది ఓ కూతురు. ప్రియుడితో మాట్లాడవద్దని చెప్పినందుకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేసింది. ఇంటి రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మార్చి 15న ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం శిఖాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమ్ చంద్ శర్మ వెల్లడించారు. యూపీలోని బులందషహర్ ప్రాంతంలో మహ్మద్ షబ్బీర్(47). రెహానా(44) కుటంబం నివాసం ఉంటోంది. వీరికి నలుగురు కూతుళ్లు. పెద్ద అమ్మాయి (15 ఏళ్లు)8 తరగతి చదువుతోంది. ఇటీవల బాలికకు ఓ యువకుడితో(22) పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రియుడితో తరుచూ ఫోన్లో మాట్లాడటం, బయట తిరగడం గమనించిన తల్లిదండ్రులు కూతురిని మందలించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొన్ని రోజులుగా పాఠశాలకు కూడా పంపించడం లేదు. దీంతో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న కూతురు వారిని అడ్డుతొలగించుకునేందుకు కుట్ర పన్నింది. మార్చి 14న మెడికల్ షాప్లో పనిచేసే తన ప్రియుడి ద్వారా నిద్రమాత్రలు తీసుకొచ్చింది. వీటిని అన్నంలో కలిపి తల్లిదండ్రులకు ఇచ్చింది. తిన్న తర్వాత దంపతులు ఇంటి ముందు మంచంపై నిద్రలోకి జారుకున్నారు. దీంతో కూతురు గొడ్డలితో తల్లిదండ్రుల తలలు నరికి చంపింది. మృతదేహాలను బెట్షీట్తో కప్పేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బయట నుంచి తాళం వేసి, తాళాలను తన తండ్రి దిండు కింద దాచిపెట్టింది. అనంతరం పక్కింటి వాళ్ల డాబా ఎక్కి ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పక్కింటి వారి సమాచారంతో అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కూతురిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె సెల్ఫోన్లో ఓ వ్యక్తిని నిద్రమాత్రలు తీసుకురమ్మని చెప్పినట్లు ఉండటంతో హత్య చేసింది 15 ఏళ్ల మైనరేనని పోలీసులు నిర్దారించారు. తన ప్రియుడితో మాట్లాడకుండా నిబంధనలుపెట్టినందుకే చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. మైనర్ నిందితురాలిని అరెస్ట్ చసి జువైనల్ హోంకు తరలించారు., ఆమెకు సహకరించిన ప్రియుడును కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
వెరైటీ వెడ్డింగ్: 4 గంటలు బెయిల్.. జైలులో యువతి వివాహం
స్నేహం, ప్రేమ.. వీటి కోసం మనకు నచ్చిన వాళ్లని ఎంచుకుంటుంటాం, అయితే పెళ్లి విషయంలో మాత్రం అలా కుదరదు. ఎందుకంటే వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు అంటుంటారు. అందుకు తగ్గట్టే కొందరికి ఊహించని రీతిలో వివాహాలు కూడా జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి పెళ్లి ఈ తరహాలోనే జైలులో జరిగింది. అసలేం జరిగిందంటే.. పశ్చిమ చంపారన్లోని బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్గావ్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ హాజీపూర్లో ఇంజనీరింగ్ చదివాడు. రాహుల్ తన కుటుంబంతో కలిసి లక్నోలో సత్సంగానికి వెళ్లాడు. జైలులో పెళ్లి... అక్కడ అతనికి యూపీలోని కప్తంగంజ్కు చెందిన 21 ఏళ్ల కాజల్ ప్రజాపతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ గోపాల్గంజ్లోని తావే దుర్గా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవితం మొదలుపెట్టారు. ఇటీవల మార్చి 5న కాజల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను రాహుల్ ఆసుపత్రిలో చేర్చాడు. అయితే విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. రాహుల్ కుమార్పై అత్యాచారం చేశాడని ఆరోపణలతో పోలీసులతో అతడిని అరెస్ట్ చేయించి జైలుకు తరలించారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. చివరికి వారిద్దరికి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అయితే రాహుల్ జైలులో ఉండడంతో గోపాల్గంజ్లోని సీజేఎం కోర్టులో కుటుంబం తరపున ఒక దరఖాస్తు దాఖలు చేశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో కోర్టు పెళ్లికి అనుమతించింది. దీంతో అతని పెళ్లికి నాలుగు గంటల పెరోల్ బెయిల్ లభించింది. గోపాల్గంజ్లోని చనావే జైలు నుంచి నాలుగు గంటలపాటు పెరోల్పై వచ్చిన ఓ ఖైదీ తావే దుర్గా ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. తావే దుర్గా ఆలయంలో జరిగిన ఈ అపూర్వ వివాహానికి అబ్బాయి, అమ్మాయితో పాటు పోలీసులు కూడా పెళ్లికి అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో వివాహ వేడుక తర్వాత, థావే వాలి కోర్టులో దంపతులు భార్యాభర్తలుగా నిర్ధారించింది. తావే దుర్గ గుడిలో ఓ నేరస్థుడి వివాహ వేడుక సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారు. అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ వినూత్న వివాహం ప్రస్తుతం వైరల్గా మారింది. -
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. యువతితో సహజీవనం.. చివరికి ఊహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అని యువతితో సహజీవనం చేసి..గర్భందాల్చాక నమ్మక ద్రోహానికి పాల్పడటమే కాకుండా అబార్షన్ చేయించుకోకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీ నగర్లో నివసించే యువతి(22) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. 2020లో వరంగల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ బూక్యా కల్యాణ్(25)తో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఇద్దరూ షికార్లు కొట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె కల్యాణ్తో శారీరక సంబంధాలు కూడా కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భందాలి్చంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను అబార్షన్ చేయించుకోవాలని, లేకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత వారం రోజులుగా ఆమె ఫోన్ చేస్తే స్పందించడంలేదు. దీంతో బాధితురాలు వరంగల్లోని కల్యాణ్ స్వగ్రామానికి వెళ్లి ఆరా తీయగా.. అప్పటికే మరో యువతితో కల్యాణ్కు వివాహ నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని తెలిసింది. తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించగా రూ.10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 493, 420, 417,313 506, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
ముద్దులతో రెచ్చిపోయిన శృతిహాసన్.. మండిపడుతున్న నెటిజన్స్..!
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది. తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. అయితే తాజాగా ఈ కోలీవుడ్ భామ శాంతను హజారికాతో ఉన్న వీడియోను తన ఇన్స్టాలో పంచుకుంది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వీడియోలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండపడుతున్నారు. మరికొందరేమో దారుణమైన కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) శృతిహాసన్ తన ఇన్స్టాలో వీడియో షేర్ చేస్తూ..' శాంతను తిరిగి ఇంటికి వచ్చాడు. అతను నా జీవితంలోకి వచ్చాక శాశ్వతంగా మార్చేశాడు.' అంటూ శాంతనుకు ముద్దు పెడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో రొమాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
Shraddha Walkar Case: ఆ అనుభవంతోనే..
క్రైమ్: అఫ్తాబ్ పూనావాలా.. యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఏకైక, ప్రధాన నిందితుడు. మనస్పర్థలతో సహ భాగస్వామి శ్రద్ధను చంపేసి, శరీరాన్ని 35 ముక్కలు చేసి, ఫ్రిడ్జ్లో భద్రపర్చి ఆపై ఆ భాగాలను వివిధ చోట్ల పడేశాడతను. అయితే.. ఈ కేసులో ఇప్పుడు పోలీసులు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఢిల్లీ కోర్టుకు వెల్లడించారు. ఆఫ్తాబ్ పూనావాలా శిక్షణ పొందిన చెఫ్ అని, మాంసాన్ని సైతం ఎలా భద్రపర్చాలో అతనికి తెలుసని పోలీసులు కోర్టుకు తాజాగా నివేదించారు. తాజ్ హోటల్లో అఫ్తాబ్ చెఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే మాంసాన్ని ఎలా భద్రపర్చడమో కూడా అతనికి తెలుసు. నేరంలో అది తనకి సాయపడిందని అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. డ్రై ఐస్, అగరబత్తీలతో పాటు శ్రద్ధను హత్య చేసిన తర్వాత నేలను శుభ్రం చేసేందుకు.. కొన్ని రసాయనాలను ఆర్డర్ చేశాడు అని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. శ్రద్ధను హత్య చేసిన వారంలోపే మరో యువతితో డేటింగ్ ప్రారంభించాడని, ఆ కొత్త గర్ల్ఫ్రెండ్కు శ్రద్ధ రింగ్నే బహుకరించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ వాదనలు వినిపిస్తున్నారు. తాజా విచారణ సందర్భంగా.. ఆయన కేసు దర్యాప్తులో పోలీసులు తాజాగా సాధించిన పురోగతిని కోర్టుకు తెలిపారు. -
ప్రియుడితో ఉండగా వాట్సాప్కి మెసేజ్.. కోపంగా ఇంటికి వెళ్లి
సాక్షి, హైదరాబాద్(జగద్గిరిగుట్ట): 15 ఏళ్ల వయసులోనే ప్రేమలో మునిగిన ఓ బాలిక.. ప్రేమికుడికి వాట్సాప్లో వేరే యువతి పంపిన మెసేజ్ చూసి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం... శ్రీనివాస నగర్లో నివాసం ఉండే సూర్య ప్రభకు భర్త లేడు. కూతురితో కలిసి ఉంటుంది. సోమయ్య నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక స్థానికంగా ఉండే సాయితేజతో ప్రేమలో పడింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం జగద్గిరిగుట్టలో వీరిద్దరు కలుసుకున్నారు. అదే సమయంలో సాయితేజకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. నాతో ఉంటూ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నావు అంటూ అలిగి ఇంటికి వెళ్లి బాలిక సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సాయంత్రం వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి వెళ్లిన సీఐ సైదులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రీతి కేసు ఎటువైపు? ఇంకెన్ని రోజులు? టాక్సికాలజీ రిపోర్టులో నెగెటివ్ వల్లే.. -
చంచల్గూడ జైలుకు నిహారిక
సాక్షి, క్రైమ్: నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేసి.. తాజా నిందితులుగా చేర్చి సోమవారం హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్లను ఏ2, ఏ3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చంచల్గూడ జైలుకు, హసన్ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హాసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక గర్ల్ఫ్రెండ్. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్ను అతి కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేశాడు. ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్య జరిగిన తర్వాత.. ప్రియుడు హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఆపై అవసరం ఉందని చెబితే రూ.1500 ట్రాన్స్ఫర్ కూడా చేసింది. నవీన్ను హత్య చేసిన ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని పోలీసులు తేల్చారు. మరోవైపు తన ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం ద్వారా ఆధారాలను మాయం చేసేందుకు నిహారిక ప్రయత్నించిందని తెలుస్తోంది. -
ప్రియుడితో భార్య పరార్.. అతడి భార్యను పెళ్లాడిన బాధిత భర్త
పాట్నా: ఈయన పెళ్లాన్ని ఆయన.. ఆయన పెళ్లాన్ని ఈయన పెళ్లాడారు.. విధి ఆడిన వింత నాటకంలో ఒకరి భార్య మరొకరికి అర్థాంగి అయ్యింది. అర్థం చేసుకోవడానికి గందరగోళంగా ఉన్నా.. బిహార్లో జరిగిన వాస్తవం ఇది. ఖగారియా జిల్లాలో ఒకరి భార్యను మరొకరు పెళ్లాడారు. హార్డియా గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ సింగ్.. పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. నలుగురు పిల్లల తల్లైన నీరజ్ భార్య రూబీ దేవికి పెళ్లికి ముందు నుంచే తన గ్రామానికి చెందిన ముకేష్ అనే వ్యక్తితో పరిచయముంది. ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించింది. అయితే ముకేష్కు గతంలో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళల పేర్లు రూబీనే కావడం విశేషం. గతేడాది ఫిబ్రవరి 6న నీరజ్ భార్య రూబీ దేవి తన ముగ్గురు పిల్లల్ని(ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) తీసుకొని.. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడు ముకేష్ను పెళ్లి చేసుకుంది. ఇటు నీరజ్ తన కుమార్తెతో మిగిలిపోగా.. ముఖేష్ భార్య రూబీ దేవి కూడా తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉండిపోయింది. ముకేష్తో తన భార్య వెళ్లిపోయిన సంగతి నీరజ్కు తెలియడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టగా.. ప్రియురాలిని విడిచి ఉండేందుకు ముకేష్ అంగీకరించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన నీరజ్ పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ముకేష్ మొదటి భార్య ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇలా ఇద్దరూ నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఫిబ్రవరి 11న ఇంట్లో నుంచి పారపోయి. ఫిబ్రవరి 18న స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు జంటలు మధ్యప్రదేశ్లోని వేర్వేరుపట్టణాల్లో నివసిస్తున్నారు. నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేష్ రోజుకూలీగా పనిచేస్తున్నాడు. -
ఐదేళ్ల ప్రేమ, పెళ్లి చేసుకుంటానని బాండ్ కూడా రాసి.. చివర్లో షాక్ ఇచ్చాడు!
సాక్షి,సనత్నగర్(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రబుద్దుడిపై ఎస్సార్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం..ఇందిరానగర్ కాలనీ ఐడీపీఎల్ గుడిసెల సమీపంలో నివసించే యువతి (23) ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. బోరబండ భవానీశంకర్నగర్కు చెందిన ఆతం మల్లేష్ (27) ఐదేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని 2022 ఏప్రిల్ 29న ఓ బాండ్ కూడా రాసిచ్చాడు. అయితే ఇటీవల పెళ్లి చేసుకోమని యువతి కోరగా అందుకు నిరాకరిస్తూ వస్తున్నాడు. అంతేకాక వేరొక యువతితో వివాహానికి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లేష్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. చదవండి అర్ధరాత్రి 70 మంది రౌడీలు న్యాయవాది ఇంట్లోకి చొరబడి..