-
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్లో భారీగా ఉద్యోగాల కోత
దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల కోతలు సర్వసాధారణమై పోతున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రకటించింది. ఫలితంగా 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.వ్యయ నియంత్రణ, సమర్థవంతమైన కార్యకలాపాల నిర్వహణ కోసం యెస్ బ్యాంక్ ఇటీవల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రకటించిన తొలగింపులతోపాటు రానున్న వారాల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పెడుతుందని భావిస్తున్నారు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. మల్టీనేషనల్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకున్న యెస్ బ్యాంక్ ఆ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు తొలగింపులు చేపట్టింది. హోల్సేల్, రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభారం పడింది.ఆపరేషన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, సిబ్బంది వినియోగాన్ని మెరుగుపరుచుకోవడమే పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా బ్యాంక్ పేర్కొంటోంది. అయితే వ్యయ నియంత్రణలో భాగంగానే డిజిటల్ బ్యాంకింగ్ వైపు యెస్ బ్యాంక్ మరింతగా మళ్లుతోందని నివేదికలు చెబుతున్నాయి. -
స్టార్టప్ ట్రబుల్స్: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు
నిధుల లేమి భారతీయ స్టార్టప్ కంపెనీలను పట్టిపీడిస్తోంది. దీని ప్రభావం అందులో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులపై పడుతోంది. దీంతో గత్యంతరం లేని ఆయా కంపెనీలు లేఆఫ్ల పేరుతో సగానికి సగం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.ఏకంగా 80 శాతం మంది తొలగింపుపట్టు నూలు ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే బెంగళూరుకు చెందిన రేషామండి అనే స్టార్టప్ సిరీస్ బీ ఫండింగ్ పొందడంలో విఫలమవడంతో ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదిగా కంపెనీ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. గతేడాది జనవరిలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 500 ఉండగా అది ఈ సంవత్సరం చివరి నాటికి 100కు పడిపోయింది. వీరిలో దాదాపు 300 మంది ఉద్యోగులు తమ తుది బకాయిలు, జీతాల కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.2020లో ఏర్పాటైన రేషామండి క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓమ్నివోర్, వెంచర్ క్యాటలిస్ట్స్ వంటి ఇన్వెస్టర్ల నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా ఈక్విటీ నిధులను సేకరించింది. వెంచర్ డెట్ ఇన్వెస్టర్లు, రుణదాతల నుంచి కంపెనీ దాదాపు రూ.300 కోట్ల రుణాన్ని పొందింది. దీని తరువాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది జూన్ నుంచి ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది.10 వేల మందికి ఉద్వాసనఈ ఏడాది ఆరంభం నుంచి స్టార్టప్ లేఆఫ్స్ పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయి. పునర్నిర్మాణం, నిధులపై పరిమితులు, ఇతర కారణాలతో 2024లో ఇప్పటివరకూ భారతీయ స్టార్టప్లు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఫ్లిప్కార్ట్, ఓలా, స్విగ్గీ, పేటీఎం తదితర టాప్ కంపెనీలు ఈ ఏడాది వివిధ విభాగాల్లో భారీగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది 5,000 నుంచి 6,300 ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు ఉద్యోగాల కోతలు, జీతాల జాప్యం వంటి పలు అంశాలతో బైజూస్ సతమతమవుతోంది. ఇక స్విగ్గీ దాదాపు 400 మంది ఉద్యోగులను తొలగించగా, భవీష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా 600 మందిని తొలగించనుంది. ఇదిలా ఉంటే చాలా స్టార్టప్లు సైలెంట్ లేఆఫ్స్ పాటించాయి. అయితే 2024లో లేఆఫ్స్ ఉన్నప్పటికీ, పరిశ్రమలు నెమ్మదిగా వృద్ధిని, రికవరీ సంకేతాలను చూపుతున్నాయని, ఈ ఏడాది నియామకాలు పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.మెరుగుపడుతున్న నిధుల సమీకరణ2024 ప్రథమార్ధంలో భారతీయ టెక్నాలజీ స్టార్టప్ లు 4.1 బిలియన్ డాలర్లు నిధులు సమీకరించాయి. 2023 ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. కానీ అంతకు ముందు 2023 ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఇప్పటికీ 13 శాతం. అయినప్పటికీ టెక్ స్టార్టప్ ల్యాండ్ స్కేప్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిధులు సమకూరుస్తున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
మరో 600 జాబ్స్కి గండం!
Tesla Layoffs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.టెస్లా సోమవారం ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీసు ప్రకారం, కాలిఫోర్నియాలో అదనంగా 601 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్లలో 6,020 మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది.టెస్లా కార్ల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది. -
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్ఫోర్స్లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. -
ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్లు అలజడి సృష్టిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వరుసపెట్టి కంపెనీని వీడుతున్నారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు.అరేబాలో ఇక కంపెనీలో కనిపించరని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) చెప్పినట్లుగా మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్కి రిపోర్టింగ్ చేసే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమె కంపెనీని వీడారా.. లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనిపై అటు మస్క్ గానీ, అరేబాలో గానీ స్పందించలేదు.ఈ ఎలక్ట్రిక్-వెహికల్ మేకర్ కంపెనీ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తోందని, సుమారు 20 శాతం సిబ్బంది తగ్గింపును లక్ష్యంగా చేసుకుందని బ్లూమ్బెర్గ్ గత నెలలో నివేదించింది. టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు.ఇటీవలి నెలల్లో వాహన విక్రయాలు క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్ మస్క్ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్చార్జర్ టీమ్లో చాలా మందిని ఇప్పటికే తొలగించారు. అరేబాలో కంపెనీలో అత్యంత సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్లలో ఒకరు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో ఉన్నారు. అలాగే సుమారు ఆరేళ్లుగా టెస్లాలో పనిచేస్తున్నారు. -
నాలుగు నెలలు కాకుండానే.. మార్కెటింగ్ టీమ్ మొత్తానికి మంగళం!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా కంపెనీ వ్యాప్త తొలగింపులలో భాగంగా కొత్తగా ఏర్పడిన మార్కెటింగ్ బృందం మొత్తాన్ని తొలగించింది. సాంప్రదాయ ప్రకటనలకు భిన్నంగా కొన్ని నెలల కిందటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ ఈ టీమ్ను ఏర్పాటు చేశారు. సీనియర్ మేనేజర్ అలెక్స్ ఇంగ్రామ్ పర్యవేక్షణలో యూఎస్లో 40 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన "గ్రోత్ కంటెంట్" టీమ్ అంతటినీ తొలగించిట్లు తెలిసింది. గ్లోబల్ టీమ్కు నాయకత్వం వహించిన ఇంగ్రామ్, జార్జ్ మిల్బర్న్లను తొలగించినట్లు వారు తెలిపారు. అయితే ఐరోపాలో కంపెనీకి ఇప్పటికీ తక్కువ సంఖ్యలో మార్కెటింగ్ సిబ్బంది ఉన్నట్లు ఒకరు చెప్పారు.అలాగే కాలిఫోర్నియాలోని హౌథ్రోన్లో ఉన్న టెస్లా డిజైన్ స్టూడియో సిబ్బందిలో కూడా గణనీయమైన తొలగింపులు జరినట్లుగా తెలిసింది. కాగా బ్లూమ్బెర్గ్ నివేదికకు ఎలాన్ మస్క్ ప్రతిస్పందిస్తూ కంటెంట్ బృందం పని గురించి ‘ఎక్స్’ పోస్ట్లో "ప్రకటనలు చాలా సాధారణంగా ఉంటున్నాయి.. ఏదైనా కారుకైనా సరిపోవచ్చు" అంటూ రాసుకొచ్చారు. తొలగింపులకు గురైన గ్రోత్ టీమ్ను ఇంగ్రామ్ నాలుగు నెలల క్రితం నుంచే నిర్మించడం ప్రారంభించారు.టెస్లా గ్రోత్ టీమ్ తొలగింపు సంస్థలో అతిపెద్ద ఉద్యోగాల కోతను సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు ఎలాన్ మస్క్ గతవారం తెలిపారు. అయితే కంపెనీ సీఈవో 20 శాతం ఉద్యోగులను తొలగింపులకు ఆదేశించినట్లుగా బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. 20,000 మందిపైగా ఉద్యోగులను కంపెనీ తొలగించవచ్చు. -
ఉద్యోగులను తొలగించిన లిప్స్టిక్ కంపెనీ
పర్సనల్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 12-15 నెలల్లో వివిధ విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన కంపెనీగా ఉండాలనే దృఢమైన లక్ష్యానికి ఈ వ్యూహాత్మక చొరవ దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గుడ్ గ్లామ్ గ్రూప్ ఇటీవల పోప్గ్జో, ప్లిగ్సో, బేబీ చక్ర, మామ్స్కో, స్కూప్ఊప్, ట్వీక్ ఇండియా కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా మనన్ జైన్, గ్రూప్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫౌండర్ ఇనిషియేటివ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కార్తీక్ రావు, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్గా అంకితా భరద్వాజ్ని నియమించింది. ఇటీవలే గ్రూప్ కొత్త గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ లత్ నియామకాన్ని కూడా ప్రకటించింది. -
ప్రముఖ టెక్ కంపెనీలో తొలగింపులు, బదిలీలు
Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్లతో గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్లలో గూగుల్ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. -
కలల కెరియర్ కుప్పకూలుతోంది! 1400 మంది జీవితాలు..
SpiceJet layoff : ఎయిర్లైన్స్లో పనిచేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్లలో పైలట్లుగా, ఇతర సిబ్బందిగా పనిచేయడం ఎంతో మందికి డ్రీమ్ కెరియర్. ఆకర్షణీయమైన వేతనాలతో పాటు దీన్నో ఉత్తమ ప్రొఫెషన్గా చూస్తారు. అలాంటి కలల కెరియర్ కుప్పకూలిపోతోంది.. 1400 మంది జీవితాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. 15 శాతం మంది లేఆఫ్ చౌక ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే ఎయిర్లైన్గా పేరొందిన స్పైస్జెట్ తీవ్రమైన నగదు కొరతతో సతమతమవుతోంది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడానికి తమ వర్క్ఫోర్స్లో దాదాపు 15 శాతం మంది అంటే సుమారు 1400 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ చర్య ద్వారా పెట్టుబడిదారుల ఆసక్తిని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉద్యోగుల తొలగింపు విషయాన్ని స్పైస్జెట్ ధ్రువీకరించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఆపరేషనల్ అవసరాల కోసం కంపెనీలో అన్ని రకాల ఖర్చులను సర్దుబాటు చేసుకోవడంలో భాగంగా లేఆఫ్లు అమలు చేస్తున్నట్లు స్పైస్జెట్ ప్రతినిధిని ఉటంకిస్తూ పేర్కొంది. తొలగింపులు అనివార్యం స్పైస్జెట్లో ఉద్యోగుల జీతాల బిల్లు రూ. 60 కోట్లు ఉంది. ఈ కారణంగానే ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు కంపెనీ అంతర్గత పరిణామాలు తెలిసినవారు చెబుతున్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు కంపెనీ ఇప్పటికే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా స్పెస్జెట్ కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యం చేస్తోంది. చాలా మందికి జనవరి నెల జీతం ఇప్పటికీ అందలేదు. ప్రస్తుతం స్పైస్జెట్లో 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ 30 విమానాలను నడుపుతోంది. 2019లో స్పైస్జెట్లో గరిష్ట స్థాయిలో 16,000 మంది ఉద్యోగులు ఉండేవారు. 118 విమానాలను ఈ సంస్థ నడిపేది. రూ. 2,200 కోట్ల నిధులు పొందే ప్రక్రియలో ఉన్నామని, అయితే కొంత మంది ఇన్వెస్టర్లలో విశ్వాసం కొరవడిందని స్పైస్జెట్ చెబుతోంది. “ఫండింగ్ జాప్యాలు ఏవీ లేవు. మా ఫండ్ ఇన్ఫ్యూషన్తో బాగా పురోగమిస్తున్నాం. తదనుగుణంగా ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేశాం. తదుపరి పురోగతిని త్వరలో తెలియజేస్తాం. చాలా మంది ఇన్వెస్టర్లు మాతో చేరుతున్నారు” అని స్పైస్జెట్ ప్రతినిధి పేర్కొన్నారు. -
కత్తికట్టిన కంపెనీలు.. వందలాది ఉద్యోగులకు ఉద్వాసన!
టెక్ పరిశ్రమలో జోరుందుకున్న లేఆఫ్లు ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ వంటి ఇతర పరిశ్రమలకూ విస్తరిస్తున్నాయి. ఈ పరిశ్రమలలో పనిచేస్తున్న వందలాది మంది చిన్నపాటి ఉద్యోగులకూ ఉద్వాసన తప్పడం లేదు. కొత్త ఏడాదిలో ఇప్పటికే లేఆఫ్లను ప్రకటించిన అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాల సరసన ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా చేరాయి. వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. ఈ లేఆఫ్లు నిధుల కొరతతో సతమతమవుతున్న స్టార్టప్ రంగం కష్టాలను తెలియజేస్తున్నాయి. స్విగ్గిలో 400 మంది! ఖర్చులను తగ్గించుకుని, లాభదాయకత వైపు పయనించడానికి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ దాదాపు 350-400 మంది ఉద్యోగులను లేదా దాని వర్క్ఫోర్స్లో దాదాపు 7 శాతం మందిని తొలగించనున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. స్విగ్గీలోని టెక్ టీమ్తో పాటు కస్టమర్ కేర్ విభాగంలో పనిచేసే ఉద్యోగుపైనే లేఆఫ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. లిస్టింగ్కు సిద్ధమవుతున్న స్విగ్గీలో ఇది రెండో రౌండ్ లేఆఫ్. గతేడాది జనవరిలో స్విగ్గీ 380 ఉద్యోగాలను తొలగించింది. ఫ్లిప్కార్ట్లో 1000 మంది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్కార్ట్ పనితీరు ఆధారంగా 1,000 మంది ఉద్యోగులను లేదా 5 శాతం వర్క్ఫోర్స్ను వదులుకుంటున్నట్లు పలు నివేదికలు పేర్కన్నాయి. -
‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’
బెంగళూరుకు చెందిన ఫామ్పే అనే స్టార్టప్ సంస్థ ఒకేసారి 18 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు తాజాగా ప్రకటించారు. హైపర్-గ్రోత్ నుంచి సస్టైనబిలిటీకి తమ ఫోకస్ మారడం వల్ల తొలగింపులు తప్పడం లేదని ఫామ్పే కో ఫౌండర్ సంభవ్ జైన్ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేశారు. అయితే తాము తొలగించిన సిబ్బందికి ఎవరైనా జాబ్ ఇవ్వాలని రిక్రూటర్లను అభ్యర్థించాడు ఆ ఫిన్టెక్ యాప్ సహ వ్యవస్థాపకుడు. ఇక మరో కో ఫౌండర్ కుష్ తనేజా కూడా సంభవ్ జైన్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఉద్యోగాలు కోల్పోయినవారు కొత్త జాబ్ పొందేలా సహాయం చేయాలని కోరారు. ‘ఈరోజు చాలా కఠినమైన రోజు. ఎందుకంటే 18 మంది ఉద్యోగులను వదులుకోవాల్సి వచ్చింది. ఓ ఫౌండర్గా ఇది నాకు చాలా కష్టమైన పని. ఉద్యోగులను వదులుకోవడం తమలాంటి ‘పీపుల్ ఫస్ట్’ సంస్థలకు అంత సులభం కాదు’ అని సంభవ్ జైన్ ట్వీట్ చేశారు. తాను, తనేజా సంవత్సరాలుగా తాము నిర్మించుకున్న జట్టు గురించి చాలా గర్విస్తున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు తగిన జాబ్లను తాము అందించలేకపోయామన్నారు. వీరిని ఎవరైనా నియమించుకోవాలని కోవాలని కోరారు. తనేజా కూడా ట్వీట్ చేస్తూ 18 మంది ఉద్యోగులను విడిచిపెట్టవలసి వచ్చినందున ఈ రోజు తమకు చాలా విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఫామ్పే సంస్థను నిర్మించడంలో వారి సహకారానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలని ఇందు కోసం తమను సంప్రదించాలని రిక్రూటర్లను అభ్యర్థించారు. అయితే వీరి పోస్ట్లపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వీరిని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Today was an extremely sad day for us as 18 of our FamStars had to leave 😔 We are forever grateful to their contributions in building the Fam! Please DM if you are looking for super passionate and extraordinary folks for your team https://t.co/fmQTH90xP8 — Kush (@iamkushtaneja) August 2, 2023 -
లేఆఫ్స్ దారుణం.. ఒకటీ రెండు కాదు.. నాలుగు సార్లు పీకేశారు!
టెక్ కంపెనీల్లో లేఆఫ్ల పరంపరకు అడ్డుకట్ట పడటం లేదు. కొన్నేళ్ల క్రితమే మొదలైన తొలగింపులు ఇటీవల ఎక్కువయ్యాయి. కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి లేఆఫ్కు గురై ఉద్యోగం కోల్పోతేనే జీవనం దుర్భరంగా మారుతుంది. మరి చేరిన ప్రతి కంపెనీ ఉద్యోగం పీకేస్తే.. ఒకటీ, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు..(ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!)బిజినెస్ ఇన్సైడర్ కథనంప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 33 ఏళ్ల జానెట్ అన్నే పనెన్ తన టెక్ కెరీర్లో వరుసగా నాలుగుసార్లు లేఆఫ్స్కు గురై ఉద్యోగాలు కోల్పోయారు. ఆమె మొదటి ఉద్యోగం రెడ్డిట్లో రెండు నెలల పాటు సోషల్ మీడియా అసిస్టెంట్గా చేశారు. ఆ కంపెనీ ఆమెతో పాటు మొత్తం బృందాన్ని తొలగించింది. ఆ తర్వాత ఆమె ఉబర్ హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం సంపాదించగలిగింది. అయితే అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత కంపెనీ ఆమెకు పింక్ స్లిప్ అందజేసింది. ఆ తర్వాత ఆమె డ్రాప్బాక్స్ కంపెనీలో సపోర్ట్ ఇంజనీర్గా చేరారు. రెండేళ్ల తర్వాత ఆ కంపెనీ ఆమెను తొలగించింది. గత వారమే స్నాప్డాక్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరింది. ఇంతలోనే నాలుగో ఉద్యోగం కూడా పోయింది.(త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్కుక్!)తన లేఆఫ్స్ గురించి పనెన్ భావోద్వేగంతో పేర్కొన్నారు. మొదటిసారి తనను తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పిన ఆమె మూడో సారి అయితే తనతో పనిచేసిన బృందాన్ని వీడుతున్నందుకు మనసుకు చాలా కష్టంగా ఉండిందని వివరించారు. ఇక తాజాగా నాలుగో సారి లే ఆఫ్తో తన ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.టెక్ దిగ్గజాలు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఒక్క మెటా, అమెజాన్, గూగుల్ కంపెనీలు మాత్రమే 60,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 11,000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించిన మెటా ఇటీవల మరో 10,000 మందిని తొలగించింది. అమెజాన్ కూడా రెండు రౌండ్లలో 27,000 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్ 12,000 మందిని తప్పుకోవాలని ఆదేశించింది.(జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) -
ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం
గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉద్యోగాలు పోగోట్టుకున్న వారికి ఎలాంటి ఊరట లేదని యూఎస్సీఐఎస్(USCIS), మరియు అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ( US Department of Homeland Security) తేల్చిచెప్పింది. హెచ్1బీ(H1B) వీసా మీద అమెరికాకు వచ్చి ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఎవరైనా లేఆఫ్ కింద ఉద్యోగం పోతే కేవలం 60 రోజులు మాత్రమే వారు ఆ దేశంలో ఉండవచ్చు. ఒక వేళ 60 రోజుల్లో మరో ఉద్యోగం రాకపోతే.. తక్షణం అమెరికా వీడాల్సి ఉంటుంది. ఒక వేళ అమెరికా వదలి వెళ్లకపోతే వాళ్లు చట్ట విరుద్ధంగా ఉన్నారన్నముద్ర పడుతుంది. ఈ మేరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ (US House of Representatives) కు సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తరపున ఆ సంస్థ డైరెక్టర్ జడ్డో ఒక లేఖ రాశారు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ను యూఎస్సీఐఎస్ అమెరికా ప్రభుత్వం పెంచవచ్చన్న ఊహాగానాలకు ఇప్పుడు తెరపడినట్టయింది. -
మాంద్యం ముప్పు ఎవరికి?
నవంబరు 9న ‘మెటా’ అనే కంపెనీ తన ఉద్యోగుల్లో 11 వేల మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ‘ట్విట్టర్’ అనే కంపెనీ 3 వేల 7 వందల మందినీ, ‘బైజూ’ అనే కంపెనీ 2 వేల 5 వందల మందినీ.. ఇలా అనేక డజన్ల కంపెనీలు తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని వందల్లో, వేలల్లో తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా గత 6 నెలల నించీ జరుగుతూనే వుంది. మొన్న జులై నెలలో ‘అమెజాన్’ అనే కంపెనీ లక్షమందిని ఉద్యోగాల్లో నించీ తీసేసింది. ఈ జాబితా చాలా పొడుగ్గా వుంటుంది. ఈ ఉద్యోగాలు పోవడం అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే కాదు, వస్తువులు తయారు చేసే పరిశ్రమల్లో (మాన్యుఫ్యాక్చర్ రంగంలో) కూడా లక్షల్లో జరుగుతోంది. కొన్ని నెలలుగా ఆర్థిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం సేకరించే సంస్థల (ఉదా: సి.ఎం.ఐ.ఇ) నివేదికలు చూస్తే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికుల్ని ఉద్యోగాల్లో నించీ తీయదలుచుకుంటే వాళ్ళకి గులాబీ రంగు కాగితం (పింక్ స్లిప్) మీద ‘రేపటి నించీ నువ్వు పనిలోకి రానక్కరలేదు’ అని రాసిచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక ఎక్కడెక్కడో నివసించే ఉద్యోగులందరినీ ఒక తెర మీద కనిపించేలాగా సమా వేశపరిచి (దీన్ని బడాయిగా ‘జూమ్ మీటింగ్’ అని చెప్పుకుంటారు.) చల్లగా చావు కబురు చెపుతారు. ఆ మధ్య ‘బెటర్.కామ్’ అనే కంపెనీ ఒకే ఒక్క జూమ్ సమావేశం పెట్టి ఒక్క దెబ్బతో 3 వేలమంది ఉద్యోగుల్ని ‘రేపటినించీ మీరు పనిలోకి రానక్కర లేదు’ అని చెప్పేశారని ఒక వార్త! ఇంతగా ఉద్యోగాలు పోవడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. కేవలం పెట్టుబడిదారీ విధానంతోనే అది మొదలైంది. గత సమా జాలలో లేదు. బానిసలకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఫ్యూడల్ కౌలు రైతులకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఎటొచ్చీ ఈనాటి కార్మికులకే (వీళ్ళది ‘వేతన బానిసత్వం’ అంటాడు మార్క్స్) ఈ నిరుద్యోగ సమస్య వుంది. కార్మికులు అన్నప్పుడు వాళ్ళు శారీరక శ్రమలు చేసేవారే అనుకోకూడదు. మేధాశ్రమలు చేసే వారందరూ (ఉదా: టీచర్లూ, డాక్టర్లూ, జర్నలిస్టులూ) కూడా కార్మికులే! ఉద్యోగుల్ని తీసేయడానికి కంపెనీల వాళ్ళు చెప్పుకునే కారణాలు (సాకులు) కొన్ని: 1. కంపెనీకి ఆదాయాన్ని మించిన ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగుల సంఖ్యని తగ్గించుకోవడం మినహా మార్గం లేదు. 2. ఉద్యోగులు ఎక్కువగానూ, సమర్థంగానూ ఉత్పత్తి చెయ్యడం లేదు. (దీన్నే ఉత్పాదకత –ప్రొడక్టివిటీ – సమస్యగా చెపుతారు). 3. బ్యాంకులు వడ్డీరేట్లని పెంచేస్తూ పోతున్నాయి. ఇలాంటప్పుడు, వ్యాపారాన్ని నడపాలన్నా, పెంచాలన్నా అప్పులు తీసుకోవాలంటే పెంచిన వడ్డీ రేట్లు పెద్ద భారం. అందుకే ఉన్న ఉద్యోగుల్ని తగ్గించి, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడమే మార్గం. 4. ఇతర దేశాలలో కూడా ఇవే పరిస్థితులు ఉండడం వల్ల ఎగుమతులు కూడా తగ్గి పోతున్నాయి. 5. ఒకే రకమైన సరుకులు తయారు చేసే ఇతర కంపెనీలతో పోటీ ఒకటి తలనొప్పిగా వుంది. 6. తయారైన సరుకులు మందకొడిగా (నెమ్మదిగా) అమ్ముడవుతున్నాయి. (దీన్నే ‘మాంద్యం’ అంటారు. కాబట్టి, ఉన్న సరుకులు అమ్ముడు కాకుండా కొత్త సరుకులు తయారు చేయించడం కుదరదు. అందుచేత, కొంతమందిని ఉద్యోగాల్లోనించీ తీసివేయక తప్పదు). ఈ రకమైన పరిస్థితిని చూపించి ఆర్థికవేత్తలు ‘ముంచుకొస్తున్న మాంద్యం’ అని హెచ్చరికలు చేస్తారు. అంతేగానీ తయారైన సరుకుల అమ్మకాలు మందకొడిగా ఎందుకు జరుగుతాయి? దానికి పరిష్కారం ఏమిటి?– అనే ప్రశ్నలకు వారి దగ్గిర సరైన సమాధానం వుండదు. మార్క్స్ తన ‘కాపిటల్’ లో విమర్శించినట్టు, ‘‘పాఠ్య పుస్తకాల ప్రకారం ఉత్పత్తి విధానం సాగించి వుంటే సంక్షోభాలు సంభ వించవు.. అని నొక్కి చెప్పడం ద్వారా పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు సంతృప్తి పడతారు’’. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే, అనేక కంపెనీల్లో సరుకుల గుట్టలు మార్కెట్ అవసరాల్ని మించిపోయి ఆకాశం ఎత్తున పెరిగిపోవడం వల్ల! ఈ గుట్టలు పెరగడం ఎందుకు జరుగు తుందంటే, ఆ ఉత్పత్తుల్ని తయారు చేయించే వాళ్ళ మధ్య సమష్టి ప్లాను లేకపోవడం వల్ల! ఆ సమిష్టి ప్లాను లేకపోవడం ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళందరూ ప్రైవేటు పెట్టుబడిదారులు అవడం వల్ల! పెట్టుబడిదారీ జన్మ ప్రారంభమైన తర్వాత, ఆ జన్మకి లక్ష్యం లాభం రేటే! ఆ లక్ష్యానికి ఒక పరిమితీ, ఒక నీతీ, ఏదీ ఉండదు. ఆఖరికి మార్కెట్ అవసరాల్ని గమనించుకోవాలనే తెలివి అయినా ఉండదు. పోటీలో నిలబడడానికి ఏకైక మార్గం – ఉత్పత్తి శక్తుల్ని పెంచడం! అంటే, సరుకుల్ని తక్కువ ఖర్చులతో తయారుచేసి, వెనకటి ధరలతోనే అమ్మాలని ప్రయత్నం! ఆ రకంగా కొంతకాలం జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కంపెనీల నిండా సరుకుల గుట్టలు పేరుకుపోయి కనపడతాయి. అమ్మకాలు మందగించిన ప్రమాద సంకేతాలు ఎదురవుతాయి. దాన్ని గమనించుకున్న కంపెనీ యజమాని, పునరుత్పత్తి క్రమాల్ని తగ్గించెయ్యడం గానీ, ఆపెయ్యడం గానీ చేస్తాడు. అలా ఆపెయ్యడం వల్ల కార్మికులతో అవసరం తగ్గిపోతుంది. ఆ కంపెనీ నించి ఒక పిడికెడు మంది కార్మికులు తప్ప, మిగతా అందరూ ఉద్యోగాలు పోయి వీధుల్లో పడతారు. అసలు కార్మిక వర్గంలో, కొంత జనం ఎప్పుడూ నిరుద్యోగంలోనే వుంటారు. కానీ, సంక్షోభాల కాలాల్లో ముంచుకువచ్చే నిరుద్యోగాల పరిస్థితి అలాంటిది కాదు. ఒక కంపెనీలో నిన్నటి దాకా 100 మంది కార్మికులు వుంటే, ఇవ్వాల్టికి కనీసం 90 మంది నిరుద్యోగులైపోతారు. ఇది ఒక్క శాఖలోనే కాదు, అనేక శాఖల్లో జరుగుతుంది. శారీరక శ్రమల్లోనూ, మేధా శ్రమల్లోనూ కూడా ఇది జరుగుతుంది. సరుకుల పునరుత్పత్తి క్రమాలే తగ్గిపోయి, యంత్రాలే ఆగిపోయినప్పుడు, ఇక కార్మికులతో ఏం అవసరం ఉంటుంది? అయితే, ఆ కార్మికులందరూ ఏమైపోతారు? రెగ్యులర్గా జీతాలు అందుతూ వున్నప్పుడే కార్మిక కుటుంబాలు, సమస్యల వలయాల్లో కూరుకుపోయి వుంటాయి. అలాంటి కుటుంబాలకు జీతాలే ఆగిపోతే, తిండే ఉండదు. అద్దె ఇళ్ళు ఖాళీ చేసి చెట్ల కిందకి చేరవలసి వస్తుంది, చెట్లయినా వుంటే! పిల్లల్ని స్కూళ్ళు మానిపించవలసి వస్తుంది. ఆకలి – జబ్బులు మొదలవుతాయి. వైద్యం ఉండదు. చావులు ప్రారంభం! బతికి వుంటే పిచ్చెత్తడాలూ, ఆత్మహత్యలూ, నేరాలూ పెరిగి పోతాయి. కార్మిక జనాలు పిట్టలు రాలినట్టు రాలి పోతారు. ఉదాహరణకి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో 2021లో లక్షా 64 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళలో 43 వేలమంది రోజూ వారీ కూలీలూ, నిరుద్యోగులూనూ అని తేలింది. లెక్కకు రానివి ఎన్నో! రంగనాయకమ్మ, ప్రముఖ రచయిత్రి -
BookMyShow: తప్పని కోవిడ్ కష్టాలు
వెబ్డెస్క్ : ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్సైట్ బుక్ మై షోపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కరోనా సంక్షోభ సమయంలో ఛారిటీ సేవల్లో ముందున్న ఈ సంస్థకు కష్టాలు తప్పలేదు. చాలా రోజులుగా కంపెనీ కార్యాకలాపాలు నిలిచిపోవడంతో రెండు వందల మంది ఉద్యోగులను బయటకు పంపింది. ఈ మేరకు బుక్ మై షో ఫౌండర్, సీఈవో ఆశీష్ హేమ్రజనీ ప్రకటించారు. నైపుణ్యం కలవాళ్లు కరోనా ప్యాండమిక్ కష్టకాలంలో తామంతా కలిసికట్టుగా పని చేశామని, ఎంతో మందికి సేవలు అందించినట్టు ఆశీష్ పేర్కొన్నారు. అయితే పరిస్థితులు గాడిన పడకపోవడంతో ఎంతో కష్టంగా 200 మంది ఉద్యోగులను వదులుకున్నట్టు ఆయన చెప్పారు. కంపెనీ వదులుకున్న ఉద్యోగులంతా నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వారని, ఎవరైనా వాళ్లకి అవకాశం ఇవ్వాలంటూ ట్విట్టర్ వేదికగా ఆశీష్ కోరారు. 15 నెలలుగా ఈ కామర్స్ రంగం మొగ్గదశలో ఉన్నప్పుడు 1999లో ఆశీష్ హేమ్రజనీ బుక్మైషో ను ప్రారంభించారు. అంచెలంచెలుగా దేశమంతటా తమ సర్వీసులు విస్తరించారు. అయితే కరోనా కారణంగా ఈవెంట్స్, సినిమా థియేటర్లు మూత పడటంతో బుక్ మై షో పరిస్థితి తారుమారైంది. దాదాపు 15 నెలలుగా బుక్ మై షో నామమాత్రపు సేవలు అందిస్తోంది. చదవండి: 5జీతో ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు COVID19 has taught me many lessons & I learnt another one today. As we let go of 200 of the most incredibility talented & performance driven individuals, each & everyone has messaged, thanking me for the opportunity, the love for @bookmyshow and asking me if they could help (1/4) — ashish hemrajani (@fafsters) June 10, 2021 -
సింగరేణి యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి యాజమాన్యంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేతనంలో 50శాతం కోత విధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. అలాగే లే ఆఫ్ కాకుండా బొగ్గు గనుల్లో లాక్డౌన్ ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేపడతామని సింగరేణి కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు సింగరేణి సీఎండీకి గురువారం నోటీస్ ఇచ్చారు. నోటీస్లోని ముఖ్యాంశాలు ‘కరోనా వైరస్ వలన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు-కార్మికులు అందరికీ పూర్తి జీతంతో కూడిన లాక్డౌన్ ప్రకటిస్తే, డీజీఎమ్ఎస్ నోటీసు ఇచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ మైన్స్ కార్మికులకు సగం జీతంతో కూడిన లే ఆఫ్ ప్రకటించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం లాక్ డౌన్ చేయాలి తప్ప లే ఆఫ్ చేయకూడదు. రాష్ట్ర బడ్జెట్లో డబ్బు లేనందువలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50శాతం జీతంలో కోత విధించాలని నిర్ణయించారు. దీనికి సింగరేణికి సంబంధం లేదు. ఎందుకంటే సింగరేణి కార్మికుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. సింగరేణి బొగ్గు అమ్మిన డబ్బుల నుండే చెల్లిస్తుంది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం కూడా కార్మికుల జీతం కట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కోల్ ఇండియాలో అనుమతి ఇచ్చిన కార్మికుడు జీతం నుండి ఒక్క రోజు జీతం ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం కార్మికులను సంప్రదించకుండానే ఒక్క రోజు జీతం ఏడు కోట్ల 50 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చారు. ఇది చట్టవిరుద్ధం. గత 15 రోజులుగా సింగరేణి కార్మికులు అయోమయానికి గురై దిక్కుతోచక ప్రాణాలకు తెగించి పోలీసులు కొట్టినా డ్యూటీ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే 15-4-2019 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. -
అయ్యో! ప్రమాదంలో 2 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: దేశంలో అతిపెద్ద హోటల్ బ్రాండ్ ఓయో దేశంలో కనీసం 2 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం జనవరి చివరినాటికి 2 వేల మందిని తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ముఖ్యంగా అమ్మకాలు, సరఫరా, ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని హాస్పిటాలిటీ సంస్థ ఓయో ప్రతి నెలా తన ఉద్యోగుల పనితీరు సమీక్షిస్తుంది. ఈ ఫలితాలు, గ్రేడ్స్ ఆధారంగా కొంతమంది అభ్యర్థులను పనితీరు మెరుగుదలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమానికి పంపడం లేదా తొలగించడం చేస్తుంది. అయితే సంస్థ పునరుద్ధరణలో భాగంగా సంతృప్తికరమైన గ్రేడ్స్ వచ్చిన ఉద్యోగులను కూడా తీసివేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోందన్న అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా ‘డి’ రేటింగ్ ఉన్న ఉద్యోగులపై వేటు వేసే కంపెనీ, బీ అంతకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ఉద్యోగులకు కూడా ఉద్వాసన పలకనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉద్యోగుల సగటు జీతాలు రూ. 10 నుంచి 12 లక్షల పరిధిలో ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఐపీవోకు రావాలని ఆలోచిస్తున్న ఓయో ప్రణాళికలకు భారీ నష్టం బ్రేక్ వేసింది. మార్చి 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ నికర నష్టం రూ.2,384 కోట్లకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ. నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల సంబంధిత ఖర్చులు పెరగడం వల్ల నష్టం పెరిగిందని కంపనీ అంచనా. ఖర్చులు వార్షిక ప్రాతిపదికన ఆరు రెట్లు పెరిగి రూ.1,539 కోట్లకు చేరుకోగా, నిర్వహణ ఖర్చులు ఐదు రెట్లు పెరిగి 6,131 కోట్లకు చేరుకున్నాయి. -
ఐటీ ఉద్యోగులపై కాస్ట్ కటింగ్ కత్తి
► తక్కువ రేటింగ్ ఇస్తూ ఉద్యోగులపై వేటు ► భారీ ఎత్తున ఉద్యోగాల కోత ► ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనలు బెంగళూరు: సాఫ్ట్వేర్ ఇంజినీర్... ఐదంకెల వేతనం, వారంలో రెండు రోజుల సెలవు, పిక్ అండ్ డ్రాప్ సౌకర్యం వెరసి హ్యాపీ లైఫ్. కాని ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. సాఫ్ట్వేర్ రంగం సంక్షోభం రోజు రోజుకు ముదురుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. విస్తృతంగా పెరిగిన ఆటోమేషన్తో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా వరుస నష్టాలు ఎదురుకావడంతో ఐటీ రంగం తన ప్రభను కోల్పోతోంది. సౌలభ్యాలలో కోతలు విధించడంతో పాటు నైపుణ్యత లేదంటూ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగుల్లో అలజడి : ఐటీ కంపెనీల తీరుతో ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. ప్రత్యామ్నాయ అవకాశాలు లేని సమయంలో వేటు వేస్తే కుటుంబాలు రోడ్లమీద పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ సహచరులు ఉద్యోగాలను కోల్పోతుండటంతో మిగిలిన ఉద్యోగుల్లో భయం పట్టుకుంది. గతంలో ఎంతో లగ్జరీగా బతికిన ఈ ఐటీ కుటుంబాలు ప్రతి రూపాయి లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మానసిక ఒత్తిళ్లు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తామా లేదా అనే భయం వారిని పట్టుకుంది. బెంగళూరుకు చెందిన మనోహర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బంగారు పతకం సాధించారు. దీంతో ప్రాంగణ ఎంపికలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ మనోహర్ను ఐదంకెల జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంది. అలా ఐదు సంవత్సరాలుగా అదే కంపెనీలో పని చేస్తున్న మనోహర్ ప్రస్తుతం ఉన్నత స్థానానికి చేరుకున్నారు. లక్షల్లో వచ్చే జీతంతో సోదరి వివాహం చేసి తమ్ముడిని కూడా తానే చదివిస్తున్నారు. ఇటీవల ఓ యువతితో ఆగస్ట్లో వివాహం కూడా నిశ్చయించుకున్నారు. అయితే సాఫ్ట్వేర్ రంగంలో సంక్షోభం తలెత్తడంతో ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు సదరు కంపెనీ మనోహర్ను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో మనోహర్ వివాహాన్ని కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక్క మనోహర్కి మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల ఇటువంటి సంఘటనలు కొకొల్లలు. ఆర్థిక పరిస్థితిని అదుపు చేయడానికి కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సౌలభ్యాలలో కోతలు విధించడంతో పాటు నైపుణ్యత లేదంటూ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. పనితీరు సరిగా లేదంటూ (లే ఆఫ్) ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫైర్ ఎగ్జిట్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి మరే కంపెనీల్లోను ఉ ద్యోగాలు లభించవని తమ జీవితాలు నాశనమవుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలను తొలగించే సమయంలో కనీసం కార్మిక నిబంధనలు పాటించడం లేదని అంటున్నారు. 12 నుంచి 17 గంటల పాటు పని చేయిస్తున్నారని ఇదేమని ప్రశ్నిస్తే ఉద్యోగాల్లో తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయంటూ ఉద్యోగులు వాపోతున్నారు. తొలగించడానికి మూడు నెలల ముందే ఉద్యోగికి సమాచారం ఇవ్వాల్సి ఉన్నా అవేమి పాటించట్లేదని కనీసం మూడు నెలల జీతం ఇవ్వమని ఉద్యోగులు చేస్తున్న విన్నపాన్ని కూడా కంపెనీలు పట్టించుకోవట్లేదంటూ ఆరోపిస్తున్నారు. బెంగళూరు విషయమే తీసుకుంటే... ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరుకు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ లే ఆఫ్ బెడద ఎక్కువగా ఉంటోంది. ఒక్క బెంగళూరులు నగరంలోనే దాదాపు 1850 ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు (డాటా ఎంట్రీ ఉద్యోగులు మొదలుకొని డిప్యూటీ సంస్థ బిజినెస్ హెడ్ వరకూ) ఉన్నట్లు వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జనరల్ సెక్రెటరీ శ్యామ్రెడ్డి చెబుతున్నారు. ఐదు నెలల కాలంలో ఒక్క బెంగళూరులోనే ఈ లేఆఫ్ వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకోగా అందులో 35 వేల మంది బెంగళూరుకు చెందిన సంస్థల్లో పనిచేస్తున్నవారేనని ఆయన పేర్కొన్నారు. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ...లే ఆఫ్ విషయంలో ఐటీ సంస్థల అధినేతలు కనీసం మానవీయ కోణంలో ఆలోచించడం లేదని వాపోయారు. ఒక్కసారిగా ఉద్యోగంలో నుంచి తీసివేయడం వల్ల సామాజికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. కనీసం మూడు నెలల ముందుగా నోటీసు ఇచ్చి ఆరునెలల జీతాన్ని ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆయన సంస్థ తరఫున రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ఖర్గేను కలిసి వినతి పత్రం అందజేశారు. -
'6,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం'
శాన్ఫ్రాన్సిస్కో: గ్లోబల్ నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో 6,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. గతంలో 5,500 మందిని తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని మరో 1100 మంది ఉద్యోగులను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 2016 ఆగష్టులో తీసుకున్న రీ స్ట్రక్చరింగ్ ప్లాన్లో భాగంగా కీ ప్రయారిటీ ఏరియాల్లో పెట్టుబడుల కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వివరించింది. 2018 తొలి క్వార్టర్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఓ వైపు ఉద్యోగులకు పింక స్లిప్లు ఇస్తుండగా తాజాగా ఆ జాబితాలోకి సిస్కో కూడా వచ్చి చేరింది. -
ఐటీ ఉద్యోగులపై ‘లే ఆఫ్’ కత్తి
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఐదంకెల వేతనం... వారంలో రెండ్రోజులు సెలవులు.. పిక్ అండ్ డ్రాప్ సౌకర్యం.. హ్యాపీ లైఫ్! కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో సంక్షోభం ముదురుతోంది. కంపెనీలు లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఆర్థిక సర్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. దిగ్గజ ఐటీ కంపె నీలు సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఏడు ప్రముఖ ఐటీ కంపెనీలు (ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, డీఎక్స్సీ, క్యాప్ జెమినీ) 56 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్వాసన (లే ఆఫ్) పలకాలని చూస్తున్నాయి. ఇది గతేడాది వివిధ కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్యకు రెట్టింపు కావడం ఐటీ సంక్షోభానికి అద్దంపడుతోంది. హైదరాబాద్లో 50కి పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలుండగా.. మరో 2 వేల వరకు మధ్య, చిన్న తరహా సంస్థలున్నాయి. ఈ కంపెనీల్లో దాదాపు 3 లక్షల మంది పనిచేస్తున్నట్లు అంచనా. తాజాగా ఐటీ కంపెనీలు.. పనితీరు సంతృప్తికరంగా లేదంటూ ఉద్యోగుల తొలగింపు చర్యలకు సిద్ధమయ్యాయి. ఉద్యోగులకు ఇబ్బడిముబ్బడిగా పింక్ స్లిప్లు జారీ చేస్తున్నాయి. మరికొందరికి నిర్ణీత గడువు ఇస్తూ ఆలోగా ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లో ఈ ఏడాది కనీసం 10 వేల మందిపై వేటు పడనున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ రేటింగ్ ఇస్తూ.. ఉద్యోగుల పనితీరుకు తక్కువ రేటింగ్ ఇస్తూ ఏడు ప్రముఖ కంపెనీలు ఇప్పట్నుంచే వారి తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నాయి. కాగ్నిజెంట్ కంపెనీ 15 వేల మందికిపైగా ఉద్యోగులకు తక్కువ స్థాయి కేటగిరీ(బకెట్–4)లో చేర్చింది. ఇన్ఫోసిస్ కూడా 3 వేల మంది సీనియర్ మేనేజర్లను ‘పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన ఉద్యోగుల జాబితా’లో చేర్చింది. డీఎక్స్సీ టెక్నాలజీ కంపెనీ రానున్న మూడేళ్లలో దేశంలో ప్రస్తుతం ఉన్న 50 కార్యాలయాలను 26కు తగ్గించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఈ ఏడాది తమ కంపెనీలోని మొత్తం 1,70,000 సిబ్బందిలో 10 వేల మందిని ఇంటి కి పంపేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలు మాత్రం దీన్ని నిరాకరిస్తున్నాయి. ఇది పని తీరు ఆధారంగా ఏటా సాధారణంగా జరిగే మధింపు మాత్రమేనని చెబుతున్నాయి. ‘‘ప్రతి రెండేళ్లకోసారి పనితీరుపై మధింపు జరుపుతాం’’అని ఇన్ఫోసిస్ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగుల్లో అలజడి.. ఐటీ కంపెనీల తీరుతో ఎగువ, మధ్యస్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయ అవకాశాలు లేని సమయంలో వేటు వేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కొలువు నుంచి తొలగిస్తే మరో కంపెనీలో ఉద్యోగం దొరకడం అసాధ్యం. దీంతో ఉద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ కాగ్నిజెంట్ సంస్థలో వేటు పడిన వారిలో 8 మంది తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కంపెనీలతో కార్మిక శాఖ చర్చలు ఉద్యోగుల ఫిర్యాదుపై కార్మిక శాఖ స్పందిం చింది. గురువారం కంపెనీ ప్రతినిధులతో సమావేశమైంది. కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన చర్చల్లో కాగ్నిజెంట్ వైస్ చైర్మన్తో పాటు నలుగురు హెచ్ఆర్ ఉద్యోగులు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రతినిధులు, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ యూనిట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై ప్రాథమిక సమాచారం తీసుకున్న కాగ్నిజెంట్ ప్రతినిధులు రెండు వారాల గడువు కోరారు. దీంతో ఈ నెల 26న మరోమారు చర్చలు నిర్వహించనున్నట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖరం మీడియాకు తెలిపారు. -
రెండు నెలల్లో 30శాతం ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: దేశీయ ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ భారీగా ఉద్యోగుల్లో కోత పెట్టనుంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో దాదాపు 30 శాతం ఉద్యోగులకు ఇంటికి పంపించేందకు రంగం సిద్ధం చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారీ ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో వేలమంది ఉద్యోగులు పత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం వాల్యూయేషన్స్ భారీగా కుంగిపోవడం, పెట్టుబడులు క్షీణిచడంతో ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఉద్యోగులను కుదించుకునేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు టీం మేనేజర్లకు పంపిన అంతర్గత ఈ మెయిల్ సమాచారంలో ఆదేశాలు జారీచేసింది. తమ టీంలోని సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాల్సింది కోరింది. ఈ నేపథ్యంలో దాదాపు 40-50 మందిని ఇప్పటికే ఇంటికి పంపించేసింది. దీంతో పాటు స్నాప్డీల్ డైరెక్ట్ ఉద్యోగులు మరో వెయ్యిమంది దాకా, అలాగే దాదాపు 5వేలకు పైగా క ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభావితంకానున్నారు. వీరిలో 30శాతం మంది రోడ్డున పడనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా సుమారు 200 మంది ఉద్యోగులను స్నాప్ డీల్ తొలగించింది. కాగా జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంకు కార్ప్ స్నాప్డీల్లో 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై 35 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో స్నాప్డీల్ లో పెట్టిన పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో ఫలితాలు అందని నేపథ్యంలో డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను 35 కోట్ల డాలర్లు రైటాఫ్ చేసిన సంగతి తెలిసిందే -
ఉద్యోగులను తొలగించలేదు: ఫ్లిప్కార్ట్
పనితీరు బాగోని కారణంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగులను తాము తొలగించామంటూ వచ్చిన కథనాలను ఫ్లిప్కార్ట్ ఖండించింది. ఈ అంశం గురించి సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. చాలా సందర్భాలలో ఉద్యోగుల పనితీరు అంత బాగోదని, అలాంటప్పుడు వారి పనితీరు మెరుగుపరుచుకోడానికి సూచనలు ఇస్తామని చెప్పారు. కొంత కాలం తర్వాత కూడా వాళ్లు తగినంతగా మెరుగుపడని పక్షంలో వాళ్లకు కంపెనీ వె లుపల తమ నైపుణ్యాలను మెరుగ్గా ఉపయోగించుకునేచోట అవకాశాలు వెతుక్కునేందుకు ప్రోత్సహిస్తామన్నారు. తమ కంపెనీ పనితీరు ఆధారంగా నడుస్తుందని, అందువల్ల చాలా పారదర్శకమైన మదింపు ప్రక్రియను అనుసరిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్లిప్కార్ట్ ఆధ్వర్యంలోనే నడిచే మైంత్రా సంస్థ ఇటీవలే జబాంగ్ అనే మరో ఈటైలర్ను టేకోవర్ చేసింది. ఫ్యాషన్, లైఫ్స్టైల్ రంగాలలో తన మార్కెట్ను విస్తరించుకోడానికి రూ. 471 కోట్లతో ఈ టేకోవర్ ప్రక్రియను చేపట్టింది. 2014 మేలో మైంత్రాను ఫ్లిప్కార్ట్ దాదాపు రూ. 2వేల కోట్లతో కొనుగోలు చేసింది. -
రోడ్డునపడిన నిజాం షుగర్స్ ఉద్యోగులు
హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ నిజాం దక్కను షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్ ) మూత పడిన నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. ముందస్తు నోటీసు లేకుండా లే ఆఫ్ ప్రకటించడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన బాట పడ్డాయి. నిజాం దక్కను షుగర్స్ లిమిటెడ్ పరిధిలో శక్కర్నగర్ (బోధన్), మెట్పల్లి, మంభోజిపల్లి (మెదక్) యూనిట్లు వుండగా.. నష్టాలను సాకుగా చూపుతూ ప్రస్తుత సీజన్ 2015-16లో చెరకు క్రషింగ్ చేయలేమంటూ యాజమాన్యం చేతులెత్తేసింది.ఓ వైపు చెరుకు క్రషింగ్ను నిలిపివేసిన యాజమాన్యం తాజాగా.. లే ఆఫ్ను ప్రకటిస్తూ ఈ నెల 23న ఆయా యూనిట్లకు నోటీసులు అంటించింది. క్రషింగ్కు అవసరమైన చెరుకు లేకపోవడం, నీటి కొరత మూలంగా లే ఆఫ్ ప్రకటిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మూడు నెలలుగా ఫ్యాక్టరీ పరిధిలోని 307 మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. కో జెన్ నడిపించాలిః కార్మికులు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం సమస్యను పరిష్కరించే అవకాశం లేనందున ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలని కార్మికులు ప్రతిపాదిస్తున్నారు. ఎన్డీఎస్ఎల్కు అనుబంధంగా వున్న డిస్టిలరీ, కో జెన్ యూనిట్ను నడిపించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరమ్మతులకు రూ.3 కోట్లు చెల్లిస్తే ఫ్యాక్టరీ తిరిగి నడిపే వీలుందని చక్కెర పరిశ్రమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అయితే ప్రస్తుతం చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలించేందుకు రవాణా చార్జీల రూపంలో రూ.7 కోట్ల మేర చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య పరిష్కరిస్తాం: మంత్రి జూపల్లి ఎన్డీఎస్ఎల్ కుట్ర పూరితంగా లే ఆఫ్ ప్రకటించిందని ఆరోపిస్తూ ఉద్యోగులు, కార్మికులు మంగళవారం పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సచివాలయంలో కలిశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, చక్కెర పరిశ్రమ శాఖ డైరక్టర్ భద్రు మాలోత్, ఎన్డీఎస్ఎల్ ప్రతినిధి సుబ్బరాజు, ఎన్ఎస్ఎల్ జీఎం రమేశ్, ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రి చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్డీఎస్ఎల్ ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తానని కృష్ణారావు వెల్లడించారు. కార్మికులకు బకాయిలను తక్షణమే చెల్లించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించామన్నారు. -
మైక్రోసాఫ్ట్ నుంచి 18వేల మందికి ఉద్వాసన!
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు దుర్వార్త. 2015 నాటికల్లా దాదాపు 18 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. వీళ్లలో 12,500 మంది నోకియా పరికరాలకు సంబంధించిన వాళ్లు. వీళ్లందరికీ త్వరలోనే పింక్స్లిప్పులు అందుతాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మొత్తం ఉద్యోగులందరికీ లేఖలు పంపారు. మొత్తం ఉద్యోగులను సరిచేసుకుని, ఉత్పాదకత సాధించే దిశగా వెళ్లడంలో భాగమే ఈ కోతలని అందులో ఆయన తెలిపారు. ముందుగా 13 వేల మందిని తగ్గించుకుంటున్నామని, వాళ్లకు రాబోయే ఆరు నెలల్లో విషయం తెలియజేస్తామని అన్నారు. అయితే.. ఉద్యోగులను తొలగించే విధానం మాత్రం చాలా పారదర్శకంగా సాగుతుందని నాదెళ్ల తెలిపారు.ఇలా ఉద్యోగాలు కోల్పోయేవారికి జాబ్ ట్రాన్సిషన్ అసిస్టెన్స్ పేరుతో కొంతకాలం పాటు సాయం కూడా అందిస్తామని ఆయన అన్నారు. నోకియా పరికరాలు, సేవల బృందాలను పూర్తిగా మైక్రోసాఫ్ట్లో కలిపేందుకు కంపెనీ యోచిస్తోందని చెప్పారు. నోకియా ఎక్స్ ఉత్పత్తులు కూడా లూమియా ఉత్పత్తుల లాగే విండోస్ మీద నడిచేలా డిజైన్ మార్చాలనే ఆలోచన కనిపిస్తోంది. దీంతో నోకియా ఎక్స్ ఫోన్లు ఇక ఆండ్రాయిడ్ ప్లాట్ఫాం మీద రాబోవన్న మాట.