-
‘లాలా’ కోసం భగత్సింగ్ ఏం చేశారు? విప్లవకారుల పొరపాటు ఏమిటి?
బ్రిటీషర్ల బానిసత్వ సంకెళ్ల నుండి దేశానికి విముక్తి కల్పించడంలో స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ విశేష కృషి చేశారు. ఆయన నిష్ణాతుడైన రాజకీయవేత్త, చరిత్రకారుడు, న్యాయవాది, రచయితగా పేరుగాంచారు. లాలా లజపతిరాయ్ కాంగ్రెస్లో అతివాద గ్రూపు నేతగా, పంజాబ్ కేసరిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర వీరుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా విప్లవకారులకు లాలా లజపతిరాయ్ అంటే ఎంతో గౌరవం. యువతను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడేలా లాలా లజపతిరాయ్ పురిగొల్పారు. నేడు లాలా లజపతిరాయ్ జయంతి. పంజాబ్లోని మోగా జిల్లాలోని అగర్వాల్ కుటుంబంలో 1865, జనవరి 28న లాలా లజపతిరాయ్ జన్మించారు. 1928, అక్టోబర్ 30న సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో భారీ ప్రదర్శన జరిగింది. దీనిలో లాలా లజపతిరాయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిపై లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో, లాలా మాట్లాడుతూ ‘నా శరీరంపై పడే ప్రతీ లాఠీ దెబ్బ.. బ్రిటిష్ ప్రభుత్వ శవపేటికపై దిగబడే మేకులా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. 1927, నవంబరు 8న భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. దానికి సైమన్ కమిషన్ అనే పేరు పెట్టింది. దీనిలో ఏడుగురు బ్రిటిష్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. భారతీయులకు దానిలో స్థానం దక్కలేదు. మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల పరిశీలనకు ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. సైమన్ కమిషన్ 1928, ఫిబ్రవరి 3న భారతదేశానికి వచ్చింది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్తో సహా దేశమంతా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘సైమన్ కమిషన్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పంజాబ్లో జరిగిన ఈ నిరసనకు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. లాహోర్ పోలీస్ ఎస్పీ జేమ్స్ ఎ స్కాట్ నేతృత్వంలో లాఠీ ఛార్జ్ జరిగింది. లాలా తీవ్రంగా గాయపడి 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరకు 1928 నవంబర్ 17న కన్నుమూశారు. లాలా లజపతి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భగత్ సింగ్తో సహా పలువురు విప్లవకారులు బ్రిటిష్ అధికారి జేమ్స్ ఎ. స్కాట్ హత్యకు ప్లాన్ చేశారు. అయితే అతనిని గుర్తించడంలో పొరపాటు జరిగి, 1928, డిసెంబరు 17న భగత్ సింగ్, రాజ్గురులు బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ పి. సాండర్స్ను కాల్చిచంపారు. ఆ సమయంలో సాండర్స్ లాహోర్ ఎస్పీగా ఉన్నారు. లాలా లజపతిరాయ్ మృతి విషయంలో దేశం మౌనంగా ఉండదని, బ్రిటిష్ వారికి తగిన సమాధానం చెప్పాలని భావించిన విప్లవకారులు బ్రిటిష్ వారికి ఇటువంటి సందేశం ఇచ్చారు. -
Akshara Singh: హీరోయిన్ షోపై రాళ్ల దాడి.. వీడియో వైరల్
భోజ్పురి ప్రముఖ నటి, గాయని అక్షర సింగ్ నిర్వహించిన ఓ లైవ్ షో స్వల్ప ఉద్రిక్తలకు దారి తీసింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఫ్యాన్స్ని అదుపు చేసేందకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా..కొంతమంది తిరగబడి పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ అక్షర సింగ్కి భోజ్పురిలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి గాయని, డ్యాన్సర్ కూడా. తాజాగా అక్షర బిహార్లోని జౌరంగాబాద్ జిల్లాలో ఓ షాప్ ఓపెనింగ్కి వెళ్లింది. (చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే: సమంత) పేపర్ ప్రకటన ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. పెద్ద ఎత్తున ఆ షాపింగ్ మాల్కి తరలి వచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన అక్షర.. స్టైజ్పైకి వెళ్లి ఓ అద్భుతమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపు చేసేకుందు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం అక్షర సింగ్ని అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో చాలా మంది అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు అక్షర సింగ్కి రక్షణ కవచంగా మారి అక్కడి నుంచి సేఫ్గా పట్నాకు తరలించారు. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి స్పందిస్తూ.. అక్షర చాలా ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకుందని, దీంతో అక్కడ ఉన్న జనం అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు. (చదవండి: ఏం చేస్తోందసలు.. యాక్టింగా? గుర్తుపట్టడం కష్టమే!) 2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్పురి సినిమాతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్షరకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్లలో నటించారు. కొన్నాళ్ల తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో 2021లో బిగ్బాస్ ఓటీటీ వర్షన్లో పాల్గొంది. #Bhojpuri star Akshara Singh पर Fans ने फेंके पत्थर, बेकाबू भीड़ पर Police ने किया लाठीचार्ज#Akshara #AksharaSingh #BhojpuriSongs #Bihar #AksharaSinghNews #AksharaSinghSongs #AksharaSinghHot #BhojpuriNews #Bollywood #Bhojiwood #BhojpuriMovies #BhojpuriFilms #PawanSingh pic.twitter.com/hPwCDe784o — JAYANTIKA TRIPATHI (@Jayantika_t) January 18, 2024 It’s late cold but still fans in thousands came to sherni event in Daudnagar..that’s the love she has earned. Some Bollywood stars don’t have such craze as humari bhojpuri Queen @AKSHARASINGH1 . #Bollywood #Bhojpuri #AksharaSingh #BiggBoss 🔥🔥🔥🔥 pic.twitter.com/z73tBwHKdB — Sherni Akshara Fan (@queen_twirl3) January 17, 2024 -
రసాయన వ్యర్థాల తరలింపుతో ఉద్రిక్తత
మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఇథనాల్ కంపెనీ నుంచి వ్యర్థాల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ను స్థానికులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలవరకు హైడ్రామా నడిచింది. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో వారు తిరగబడి ఎదురు దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ నుంచి ఓ ట్యాంకర్ రసాయన వ్యర్థాలను నింపుకొని బయటకు వచ్చింది. ఆ వ్యర్థాలను మరికల్ మండలం ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల శివారులో పారపోస్తున్నారని స్థానికులు ట్యాంకర్ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు గ్రామస్తులు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేయడంతో మరికల్, మక్తల్, కృష్ణ, నర్వ, ధన్వాడ మాగనూర్ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంటుంది. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆందోళనకారులను అదుపు చేయాలని చెప్పడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో ట్యాంకర్ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు రాళ్లు, ఇటుకలు, కర్రలతో పోలీసులపైకి దాడికి దిగారు. దీంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పోలీసులు పరుగులు పెట్టగా.. మక్తల్ సీఐ రాంలాల్ను కొందరు పొల్లాలో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొంత మంది పోలీసులు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్లి దాక్కున్నారు. ఆందోళనకారులు ఒక పోలీసు వాహనంతోపాటు రెండు బైక్లకు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆందోళనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. -
అదనపు కట్నం కోసం పోలీస్ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ
కర్ణాటక: పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని వేధిస్తూ లాఠీతో కొడుతున్న పోలీసు కానిస్టేబుల్ ఉదంతమిది. వివరాలు.. బాధితురాలు సహన భర్త సునీల్ కుమార్ తుమకూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. అరసికెరెకు చెందిన సహనకు ఏడాదిన్నర క్రితం సునీల్కుమార్తో పెద్దలు పెళ్లి చేశారు. 67 గ్రాముల బంగారం ఇచ్చి, అలాగే రూ. 18 లక్షలు ఇచ్చి అరసికెరె వీరశైవ కళ్యాణ మండపంలో ఘనంగా వివాహం చేశారు. పెళ్లయిన రెండు నెలల తర్వాత సహనకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసి బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది. మరోవైపు అదనపు కట్నం కోసం సునీల్ కుమార్ వేధిస్తున్నాడు. ఇల్లు కట్టాలని, కారు కొనాలని, రూ. 20 లక్షలు తీసుకుని రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాక లాఠీతో తరచూ కొడుతున్నాడని విలపించింది. తుమకూరు ఎస్పీని కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తుమకూరు మహిళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి
ముంబై: మహారాష్ట్ర అలందిలోని శ్రీ క్షేత్ర దేవాలయంలో వార్కారీ భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కేవలం 75 మంది భక్తులకు మాత్రం ప్రవేశమున్న ఆలయ ప్రాంగణంలోనికి ఒకేసారి 400 మంది భక్తులు ప్రవేశించడానికి ప్రయత్నం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జి చేశామని పూణే పోలీసులు తెలిపారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొఘలులు మళ్ళీ పునర్జన్మ పొందారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. పూణే నగరానికి 22 కి.మీ దూరంలో ఉన్న శ్రీ క్షేత్రం దేవాలయంలో జరిగే తీర్థయాత్రలో ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. శ్రీ కృష్ణుడికి మరో రూపమైన విఠోబాకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఘనంగా మొదలైన ఈ ఉత్సవాలకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం రోజున ఈ రద్దీ మరీ ఎక్కువైంది. ఇదే క్రమంలో కేవలం 75 మందికి మాత్రమే అనుమతున్న ఆలయ ప్రాంగణంలోకి సుమారు 400 మంది భక్తులు ఒకేసారి దూసుకొచ్చారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో లాఠీచార్జి చేశారు. పోలీసులు లాఠీచార్జి చేస్తున్న ఈ వీడియో బయటకు రావడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అరెరె.. హిందూత్వ ప్రభుత్వం యొక్క అసలు రూపం బయటపడింది. ముసుగు తొలగిపోయింది. ఔరంగజేబు ఇంత భిన్నంగా ఎలా ప్రవర్తించాడు? మహారాష్ట్రలో మొఘలులు మళ్ళీ జన్మించారా?" అని రాసి పోలీసులు భక్తులపై లాఠీచార్జి చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ కూడా స్పందిస్తూ.. వార్కారీ సోదరులపై జరిగిన లాఠీచార్జి అమానుషం. వార్కారీల దైవస్వరూపం సాక్షాత్తు స్వామి జ్ఞానేశ్వర్ మహారాజ్ సమక్షంలో ఇలాంటి సంఘటన జరగడం ఖండించదగినది. వార్కారీల పట్ల ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటోందా? అనడిగారు. మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఆలయం వద్ద ఎటువంటి లాఠీచార్జి జరగలేదని అన్నారు. అక్కడ జరిగింది చిన్న గొడవ మాత్రమే. గతేడాది జరిగిన తొక్కిసలాట వంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. अरे अरे.. हिंदूत्ववादी सरकारचे ढोंग उघडे पडले.. मुखवटे गळून पडले..औरंगजेब यापेक्षा वेगळे काय वागत होता?वारकऱ्यांचा हिंदू आक्रोश सरकार असा चिरडून टाकतआहे. मोगलाई महाराष्ट्रात पुन्हा अवतरली आहे..@BJP4Maharashtra @Dev_Fadnavis @AUThackeray @ https://t.co/pnUc45IZ01 — Sanjay Raut (@rautsanjay61) June 11, 2023 श्री क्षेत्र आळंदी येथे वारकरी बांधवांवर पोलिसांनी लाठीमार केल्याचा प्रकार अत्यंत संतापजनक आहे. वारकरी संप्रदायाचा पाया रचणारे थोर संत ज्ञानेश्वर महाराज यांच्या आळंदीत वारकरी बांधवांचा झालेला हा अपमान अत्यंत निषेधार्ह आहे. वारकरी संप्रदाय, वारकरी बांधव यांच्याबद्दल सरकारची काही… pic.twitter.com/IDtIy1azn3 — Chhagan Bhujbal (@ChhaganCBhujbal) June 11, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్.. -
బెంగాల్, మహారాష్ట్రల్లో ‘నవమి’ ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/హౌరా: రామనవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగాల్లోని హౌరా నగరంలోని కాజీపారా ప్రాంతంలో గురువారం సాయంత్రం రామనవమి ర్యాలీ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. రెచ్చిపోయిన దుండగులు వాహనాలకు నిప్పుపెట్టారు. పలు ఆటోలు, దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కిరాద్పురా రామాలయం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్లాస్టిక్ బుల్లెట్లను ప్రయోగించడంతోపాటు కాల్పులు కూడా జరిపారు. సుమారు 500 మందితో కూడిన గుంపు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ సందర్భంగా 10 మంది పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి ఇదే ప్రాంతంలో సంఘ విద్రోహ శక్తులు 13 వాహనాలకు నిప్పుపెట్టాయి. రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో శ్రీరామ్భగవాన్ ప్రతిమ యాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే, కొందరు నిషేధాజ్ఞలు ధిక్కరిస్తూ యాత్ర నిర్వహించారు. గత ఏడాది ఇక్కడే హనుమాన్ జయంతి వేడుక రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. గుజరాత్లోని వడోదరాలో రెండు రామనవమి ర్యాలీలపై దుండగులు రాళ్లు రువ్వారు. అయితే, ఎవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు. -
‘సల్మాన్’ అభిమానులపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 57వ బర్త్ డే వేడుకలు ఆయన నివాసంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. బంద్రాలోని ఆయన నివాసం వద్దకు వందల మంది చేరుకున్నారు. బర్త్డే సందర్భంగా అభిమానులను పలకరించిన సల్మాన్ ఖాన్ వారి ఆశిస్సులు తీసుకున్నారు. అయితే, రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ తన ఇంటిలోని బాల్కనీ నుంచి కనిపించిన సమయంలో ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాల్కనీలో నుంచి అభిమానులను పలకరించారు సల్మాన్. ఈ క్రమంలో పోలీసుల మాటసైతం లెక్కచేయకుండా రోడ్డుపైకి వచ్చేశారు అభిమానులు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. లాఠీఛార్జి మొదలు పెట్టడం వల్ల అక్కడి నుంచి కొద్ది క్షణాల్లోనే అంతా వెళ్లిపోయారని వెల్లడించారు. #SalmanKhanBirthday #Police#lathicharge #fans #waiting #Outside #SalmanKhan #House #Bandra @MumbaiPolice @DGPMaharashtra pic.twitter.com/dHHQBK4pR3 — Indrajeet chaubey (@indrajeet8080) December 27, 2022 सलमान के घर के बाहर बेकाबू हुई भीड़, पुलिस ने किया लाठीचार्ज#SalmanKhan #salmankhanfans #lathicharge #mumbaipolice #SalmanKhanBirthday #lathichargeonfans@BeingSalmanKhan @MumbaiPolice pic.twitter.com/farkLDSI0b — Topchand (@topchandnews) December 27, 2022 ఇదీ చదవండి: Salman Khan: మాజీ లవర్ను ముద్దాడిన సల్మాన్ ఖాన్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ -
‘సెస్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్స్వీప్
సిరిసిల్ల: తెలంగాణలోని ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంఘ (సెస్) పాలకవర్గం ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15 డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం వేములవాడలో లెక్కింపు చేపట్టగా.. మొత్తం 15 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అయితే వేములవాడ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి బి.మమత తొలుత ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు రీకౌంటింగ్ కోరడంతో ఓట్ల లెక్కింపు చేపట్టి.. బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజు 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. అలాగే చందుర్తిలో బీజేపీ అభ్యర్థి అల్లాడి రమేశ్ 18 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేశారు. రాత్రి 8 గంటల తర్వాత చందుర్తి డైరెక్టర్గా బీఆర్ఎస్ అభ్యర్థి పి.శ్రీనివాసరావు రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ రెండు ఉదంతాలపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేసి.. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ అడ్డదారులు: సంజయ్ ‘సెస్’ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కిందని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ రూరల్, చందుర్తిల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆ మేరకు ఫలితాలు వెల్లడించకుండా చేశారని ఆరోపించారు. ఆ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘సెస్’ ఎన్నికల్లో అధికారులు అధికార పార్టీ నేతలకు చెంచాల్లా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమాదేవి ఒక ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా జిల్లాలో బలపడిన బీజేపీని ప్రజల మనసుల్లోంచి తొలగించలేరని పేర్కొన్నారు. -
హిజాబ్ హీట్: పాఠశాలలో పోలీసుల లాఠీఛార్జ్.. 15ఏళ్ల బాలిక మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించి.. హిజాబ్లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. హిజాబ్ ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టటం వల్ల మృతి చెందినట్లు ద గార్డియన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి హిజాబ్లు తొలగించి నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 13న అర్దాబిల్లోని షహేద్ గర్ల్స్ హైస్కూల్లో భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు నిరాకరించారు విద్యార్థులు. దీంతో స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు ద గార్డియన్ పేర్కొంది. ఈ దాడిలోనే గాయపడిన 15 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా దళాలు కొట్టటం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతోనే మరణించినట్లు బాలిక బంధువు ఒకరు తెలపటం గమనార్హం. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్.. సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల దాడిలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా బలగాల దాడుల్లో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. “Death to the dictator!” School girls waving forced-hijabs, chanting in the streets of Sanandaj. Oct 17 #Mahsa_Amini #مهسا_امینی pic.twitter.com/CggC37eVy9 — IranHumanRights.org (@ICHRI) October 17, 2022 ఇదీ చదవండి: హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్! -
వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్.. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 73 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది వీఆర్ఏలు మంగళవారం ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. కానీ దీనికి అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాళ్లను బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: మునుగోడుకు రూ. 22 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం -
జింఖానా గ్రౌండ్ ‘తొక్కిసలాట’దృశ్యాలు
-
సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్
సాక్షి, సిద్దిపేట: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు నష్టపరిహారం కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టడం.. విద్యుత్ సరఫరా నిలిపివేసి, పలువురిని అరెస్టు చేయడం.. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జీతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనితో నిర్వాసితులు ఆందోళనను మరింత ముమ్మరం చేశారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గూడాటిపల్లిలో 8.23 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాజెక్టు కాల్వ నిర్మాణం కోసం సర్వే పనులు జరుగుతున్నాయి. అయితే తమకు పూర్తి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలంటూ నిర్వాసితులు రెండు రోజులుగా పనులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గూడాటిపల్లిలో మోహరించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇళ్లలోని నిర్వాసితులను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మహిళలు, కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీకి దిగి చెదరగొట్టడంతో.. పలువురికి గాయాలయ్యాయి. పాదయాత్రగా హుస్నాబాద్కు.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు గూడాటిపల్లి నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. హుస్నాబాద్ ఎల్లమ్మ గుడివద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు దిగివచ్చి అనుమతి ఇవ్వడంతో నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి నిర్వాసితులతో మాట్లాడారు. అరెస్టైన వారిని విడుదల చేయించారు. పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నిర్వాసితులు వెనక్కి తగ్గలేదు. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు నిరసన చేపట్టారు. అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం హుస్నాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. పోలీసులు క్షమాపణ చెప్పాల్సిందే: సీపీఐ నారాయణ భూనిర్వాసితులపై లాఠీచార్జీ చేసిన పోలీసు లు క్షమాపణ చెప్పాలని, వారిని వెంటనే స స్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆ ధ్వర్యంలో సోమవారం హుస్నాబాద్ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భం గా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాకలో నిర్వాసితులకు చెల్లించినట్టు గా గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేసిన పా పాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం జాతీ య స్థాయికి వెళ్తున్నారని మండిపడ్డారు. దాడి క్షమించరానిది: రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ వారికి సరైన పరిహారం ఇవ్వాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ నిర్వాకంతో నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా పరిహార ప్యాకేజీ అమలు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకో ఎకరం డబ్బులు రావాలి గౌరవెల్లిలో 5 ఎకరాల భూమి కోల్పోయాను. 4 ఎకరాలకు సంబంధించిన డబ్బులే చెల్లించారు. ఇంకా ఎకరం డబ్బులివ్వాలి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద స్థలమిస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించాకే ప్రాజెక్టు పనులు చేయాలి. – భూక్యా స్వప్న, సేవగాని తండా భూమికి భూమి ఇవ్వాలి గౌరవెల్లి రిజర్వాయర్ కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమి సేకరించారు. అందులో 88 ఎకరాలకు సంబంధించిన రైతులు సంతకాలు చేయలేదు. కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతున్నాం. మల్లన్నసాగర్ నిర్వాసితులతో సమానంగా మాకూ నష్టపరిహారం చెల్లించాలి. – బద్దం ఎల్లారెడ్డి, గూడాటిపల్లి -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
పెటి కేసులో సైఫాబాద్ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి?
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున పోలీసుల దురుసు ప్రవర్తన ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న పెటి కేసు వివాదంలో ముస్లిం మహిళలపై సైఫాబాద్ ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ లాఠీలతో కొట్టారు. సైఫాబాద్ నుంచి ఇద్దరు హిళలు కారులో నాంపల్లి వైపు వెళుతుండగా అదే దారిలో ప్రయాణిస్తున్న బస్సుతో మైనర్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో మహిళలు, బస్సు డ్రైవర్కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సూరజ్, ఓ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తమను ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ లాఠీతో కొట్టినట్లు ఇద్దరు మహిళలు ఆరోపించారు. దీంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న యువకులు, బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలని రోడ్డు పై ఆందోళనకు దిగారు. చదవండి: రాకాసి రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా ఎన్హెచ్–44 తమకు న్యాయం చేయాలని ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను లాఠీతో గాయపరిచిన ఎస్సై, కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ సీఐ జలీల్ పాషా, సైఫాబాద్ డీఐ రాజు నాయక్లు బాదితులను శాంతింపజేసీ ప్రయత్నం చేశారు. విచారణ జరిపి ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని బాధిత మహిళకు నచ్చజెప్పారు. బాధిత మహిలు ఇచిన ఫిర్యాదును నాంపల్లి సీఐ కలిల్ పాషా స్వీకరించి , విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
గిరిజన వర్సిటీ కావాలని..
ఆదిలాబాద్టౌన్: గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆదిలాబాద్లో సోమవారం చేపట్టిన మహాధర్నాలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ధర్నాలో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వాహనాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పినా విద్యార్థి నేతలు మాట వినకపోవడంతో లాఠీచార్జికి దిగారు. అప్పటికే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నా రు. ఆయన ఆదేశాల మేరకు ఆందోళనకారులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
‘పోలీసులు లాఠీఛార్జీ చేసినా నిరసనలు ఆగవు’
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థులు, నాయకులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. పోలీసుల లాఠీఛార్జీపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ జయంతి రోజు విద్యార్థి, నిరుద్యోగ అంశాలపై కాంగ్రెస్ పార్టీ శాంతియుత పోరాటం చేసిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని తెలిపారు. ప్రభుత్వం ప్రజాస్వాయ్యయుతంగా ఉండాలి తప్ప.. నిరంకుశత్వంగా వ్యవహరించరాదని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు కూడా పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులను గృహ నిర్భంధించడాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని అన్నారు. శాంతియుత పోరాటాలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. దీనిని ప్రజాస్వామ్యవాదులంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నదే కొలువుల కోసమని, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా కొలువులు మాత్రం రావడం లేదని మండిపడ్డారు. పోలీసులు లాఠీఛార్జీ చేసినంత మాత్రాన తమ నిరసనలు ఆగుతాయనుకుంటే అది పొరపాటేనని అన్నారు. తుపాకులు, మరఫిరంగులు ఎక్కుపెట్టిన బ్రిటీష్ సామ్రాజ్యాన్నే ఎదిరించి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల కోసం, సిద్దాంతాల కోసం ముందుకు పోతూనే ఉంటుందని తెలిపారు. -
అసోంలో ఆక్రమణదారులపై పేలిన పోలీసు తూటా
గువాహటి: అసోంలోని దరాంగ్ జిల్లా సిఫాజర్లో ఆక్రమణదారుల తరలింపు ప్రక్రియ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య గురువారం జరిగిన ఘర్షణలు రణరంగాన్ని తలపించాయి. ఖాకీల తూటాలకు ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం కావల్సిన భూసేకరణలో భాగంగా ధోల్పూర్లోని సిఫాజర్లో 800 కుటుంబాలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ కొన్ని దశాబ్దాల నుంచి ఆ కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం వారిని అక్కడ్నుంచి ఖాళీ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే దీనిని వ్యతిరేకించిన ఆ కుటుంబాలు తమకు పునరావాసం కల్పించాలంటూ నిరసనలకు దిగారు. వారిని చెదరగొట్టడానికి లాఠీలు, తుపాకీలతో పోలీసులు క్రౌర్యాన్ని ప్రదర్శించారు. విచక్షణా రహితంగా నిరసనకారుల్ని చితకబాదడమే కాకుండా వారిపై నేరుగానే కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలన్నింటినీ వీడియో తీయడానికి జిల్లా యంత్రాంగం నియమించిన కెమెరామ్యాన్ విజయ్శంకర్ బనియా నిరసనకారులపై అత్యంత దారుణంగా ప్రవర్తించారు. బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయి నేలపై పడి ఉన్న ఒక వ్యక్తిని విజయ్శంకర్ కాళ్లతో తన్నిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ప్రభుత్వం ఆ కెమెరామ్యాన్ అరెస్ట్ చేసింది. ఈ ఘటనలపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో అస్సాం ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. మరోవైపు నిరసనకారులు పోలీసులపైకి పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేశారని, వారు చేసిన దాడిలో ఎనిమిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని దరాంగ్ ఎస్పీ, ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా సోదరుడు సుశాంత్ బిశ్వా శర్మ చెప్పారు. గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మొనిరుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని సద్దామ్ హుస్సేన్, షేక్ ఫోరిడ్గా గుర్తించారు. అస్సాం ప్రభుత్వమే కాల్పుల్ని స్పాన్సర్ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ సర్కార్ అధికారంలోకొచ్చాక ప్రజలపై వేధింపులు పెరిగినట్లు అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ బోరా అన్నారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
లాఠీఛార్జిపై రైతుల ఆగ్రహం
చండీగఢ్: కర్నాల్లో రైతులపై పోలీస్ లాఠీచార్జికి నిరసనగా పంజాబ్ రైతులు రోడ్లను దిగ్బంధించి, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలపాటు సాగిన ఆందోళనలతో ప్రధాన హైవేలపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. శనివారం కర్నాల్లో బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా హైవేపైకి భారీగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 10 మంది రైతులు గాయపడిన విషయం తెలిసిందే. కర్నాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆదివారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) ఆయుష్ సిన్హాను ఆయన సర్కారీ తాలిబన్గా పేర్కొన్నారు. ‘మీరు మమ్మల్ని ఖలిస్తానీ అంటే, మేం మిమ్మల్ని సర్కారీ తాలిబన్లని అంటాం. ఇలాంటి వారిని మావోయిస్టు ప్రాంతాలకు పంపించాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం కర్నాల్లో సమావేశం కానున్నట్లు హరియాణా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చెప్పారు. ఇలా ఉండగా, రైతులపై పోలీస్ లాఠీచార్జిని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ సమర్ధించుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపు తామని మాటిచ్చిన రైతులు.. ఆ తర్వాత హైవేను దిగ్బంధించి, పోలీసులపైకి రాళ్లు రువ్వారన్నారు. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులను ప్రేరేపించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హామీ ఇచ్చారు. -
రైతులపై లాఠీచార్జ్: సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మళ్లీ రైతుల రక్తం చిందింది. దేశం సిగ్గుతో తలవంచుకుంటోందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్న ఒక రైతు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా రక్త మోడుతున్న రైతు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (రాబోయే మునిసిపల్ ఎన్నికల గురించి చర్చించడానికి) నేతృత్వంలోని సమావేశానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనకు దిగారు రైతులు. కర్నాల్లోని ఘరౌండ టోల్ప్లాజా వద్ద ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వేలాదిగా తరలివచ్చిన రైతులు రోడ్ల మీద మంచాలు వేసుకొని కూర్చొని మరీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఓసీ ధంకర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకు పడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. ఈ లాఠీఛార్జ్ ఘటనలో పలువురు రైతులు తీవ్రంగా గాయ పడ్డారు. దీంతో పోలీసుల దమనకాండను నిరసిస్తూ పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశామని పోలీసు అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రధాన రోడ్లు ,హైవేలను దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా సంఘం నేతలు పిలుపు నిచ్చారు. అలాగే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, గాయపడిన వారికి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీలతో క్రూరంగా దాడి చేసారనీ, వందలాది మంది రైతులను అరెస్టు చేశారని ఎస్కేఎం నేత దర్శన్ పాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు రోడ్లన్నీ బ్లాక్ చేయాలని బీకేయూ నాయకుడు రాకేశ్ తికాయత్ కోరారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసే వరకు రహదారుల దిగ్బంధనం కొనసాగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. -
ధోని ఫ్యాన్స్పై లాఠీచార్జ్..
జైపూర్: రాజస్థాన్లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్పై లాఠీచార్జీ జరిగింది. ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో టెంట్లు చిరిగిపోయి, కుర్చీలు విరిగిపోయాయి. ప్రశాంతంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అభిమానులు.. బారికేడ్లు తోసుకుని ధోనితో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్తిన్న ధోని.. హడావిడిగా రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. కాగా, స్నేహితుల కోరిక మేరకు జాలోర్ జిల్లాలోని జాఖల్ గ్రామంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ధోనీ అక్కడికి వెళ్లారు. -
పోలీసుల లాఠీఛార్జీలో నా చెయ్యి విరిగింది
-
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్పై లాఠీచార్జ్
-
చూపు పోయింది.. అవార్డు వచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ: సీఏఏకి నిరసనగా గత డిసెంబరు 15 న ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనలో మహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్ధి కంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. లాఠీ దెబ్బలు అతని ఎడమకంటికి బలంగా తగిలాయి. అంతే ! తీవ్ర గాయమైన మిన్హాజుద్దీన్ కంటి చూపు పోయింది. ఆ సమయంలో అతను మానవహక్కులకు సంబంధించిన వ్యాసం రాస్తున్నాడు. గాయం అనంతరం డాక్టర్ల వద్దకు వెళ్లగా అతని కంటిని పరీక్షించిన వారు ఇక శాశ్వతంగా చూపు రాదని స్పష్టం చేశారు. (కొట్టరాని చోటా కొట్టారు) ఆశ్చర్యం ఏమిటంటే పోలీసు లాఠీ తనపై విరగడానికి కేవలం కొద్ది నిముషాల ముందే మిన్హాజుద్దీన్ తన వ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత కంటి చూపు కోల్పోయి తలనొప్పి ఎంతగా బాధిస్తున్నా.. ఆ పేపర్ కి తుదిమెరుగులు దిద్ది తన యూనివర్సిటీ అధ్యాపకుల సంఘానికి సమర్పించాడు. రెండు నెలలు గడిచిపోయాయి. మానవ హక్కులపై మిన్హాజుద్దీన్ రాసిన ఆర్టికల్ కే ఉత్తమమైనదిగా జామియా టీచర్స్ అసోసియేషన్ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఆ విద్యార్ధి పొంగిపోలేదు. మానవ హక్కులు రోజురోజుకీ ఎందుకిలా దిగజారిపోతున్నాయా అన్నదే ఇప్పుడా 26 ఏళ్ళ విద్యార్ధి మనోవేదన ! ఒక చట్టానికి నిరసనగా ఆందోళన చేసినంత మాత్రాన ఎక్కడో లైబ్రరీలో ఉన్న తనలాంటి విద్యార్థుల మీద పోలీసు లాఠీ విరగడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. (‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’) చదవండి: టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది.. -
‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు విచక్షణరహితంగా విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. ఈ పోలీసుల దాడిలో మిన్హాజుద్దీన్ కంటికి తీవ్రంగా గాయం కావటంతో పాక్షికంగా చూపు కోల్పోయారు. లైబ్రరీలో చదువుకుంటున్న సమయంలో అకారణంగా పోలీసులు తనపై లాఠీచార్జ్ చేశారని తెలిపారు. నిరసనలు ఏడో గేటు వద్ద జరుగుతుంటే పోలీసులు లైబ్రరీలోకి చొరబడి దాడి చేశారని పేర్కొన్నారు. తాను అసలు నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదని మిన్హాజుద్దీన్ వెల్లడించారు. తనకు శాంతి భద్రతలపై పూర్తి నమ్మకం ఉందని.. ‘నేను చేసిన నేరం ఏంటి’ అని మిన్హాజుద్దీన్ సూటిగా ప్రశ్నించారు. పోలీసుల లాఠీచార్జ్లో తన కంటికి గాయం అయిందని దీంతో మరో కంటికి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనతో నాకు చాలా భయంగా ఉంది. అలాగే ఇకనుంచి లైబ్రరీలో చదుకోమని ఏ విద్యార్థికి నేను చెప్పలేను. ఆ భయంతో నేను లైబ్రరీలోకి చదుకోవడానికి వెళ్లలేను. విశ్వవిద్యాలయంలో భద్రత లేదు. ఈ ఘటనతో నా తల్లిదండ్రులు బిహార్కి వచ్చేయాలని కోరుతున్నారు’ అని మిన్హాజుద్దీన్ తెలిపారు. తాను న్యాయ విద్యను అభ్యసించి, శిక్షణ తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అది పూర్తైన తర్వాతే బిహార్కి వెళ్తానని... అయితే. ఈ ఘటనతో తాను ఎందుకు ఢిల్లీకి వచ్చానా? అని బాధ పడుతున్నానని తెలిపారు. ఎందుకో ఢిల్లీని సురక్షితమైన నగరంగా తాను భావించటం లేదని.. ఇక్కడికి వచ్చి పెద్ద తప్పుచేశానని మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం
న్యూఢిల్లీ: భారత్లోని అన్ని ప్రాంతాలకు ‘పౌర’ ఆగ్రహ జ్వాలలు విస్తరించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఆందోళనలతో అట్టుడికింది. నిరసనల సందర్భంగా యూపీలో శుక్రవారం ఆరుగురు చనిపోయారు. పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను ఐదుగా పేర్కొన్నారు. బిజ్నోర్లో ఇద్దరు, మీరట్, సంభాల్, ఫిరోజాబాద్లో ఒక్కరు చొప్పున చనిపోయారని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. కాన్పూర్లోనూ ఒకరు చనిపోయినట్లు సమాచారం. పోలీసు కాల్పుల కారణంగా ఈ మరణాలు సంభవించాయా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆందోళనకారుల దాడుల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని సింగ్ తెలిపారు. ఢిల్లీలోనూ ఆందోళనలు పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు దారి తీశాయి. ఇప్పటివరకు ఆందోళనలు జరగని ప్రాంతాల్లోనూ శుక్రవారం భారీ స్థాయిలో నిరసనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదుల ముందు వేలాదిగా నిరసన తెలిపారు. యూపీలో గోరఖ్పూర్ నుంచి బులంద్షహర్ వరకు దాదాపు అన్ని పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగాయి. ఢిల్లీలో జాతీయ పతాకం చేతపట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదాలతో నిరసనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, జామా మసీదు వద్ద భారీ ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల నిరసనకారులు తమది శాంతియుత నిరసన అని తెలిపేందుకు పోలీసులకు గులాబీ పూలను అందించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన మంగళూరు, ఒకరు చనిపోయిన లక్నో సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాలను మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో.. సీఏఏపై, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్నార్సీపై సలహాలు, సూచనలను స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఢిల్లీలో.. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆందోళనకారులు కారును తగలబెట్టారు. ఢిల్లీగేట్ వద్ద రాళ్లు రువ్వడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. రోడ్లపై భారీగా బారికేడ్లను నిలిపినప్పటికీ, మెట్రో స్టేషన్లను మూసేసినప్పటికీ, నిషేధాజ్ఙలను ఉల్లంఘిస్తూ వేలాదిగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. జామా మసీదు, ఇండియా గేట్, సెంట్రల్ పార్క్ల వద్ధ భారీ స్థాయిలో గుమికూడారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ భారీ ర్యాలీకి నేతృత్వం వహించారు. పోలీసులు డ్రోన్లతో ఆందోళనలపై నిఘా పెట్టారు. హోంమంత్రి అమిత్ షా నివాసం దగ్గరలో నిరసన తెలుపుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, ఢిల్లీ మహిళ కాంగ్రెస్ చీఫ్ శర్మిష్ట ముఖర్జీ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భిన్నాభిప్రాయాన్ని పోలీసు బలంతో అణచేందుకు మోదీ సర్కారు పనిచేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆరోపించారు. జాతీయ గీతంతో.. బనశంకరి: పోలీసు అధికారి జాతీయ గీతాన్ని ఆలపించి ఆందోళనకారులను శాంతింపజేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పౌరసత్వ సవరణ చట్టంపై అందోళనలు చేయడానికి బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ గురువారం కొన్ని సంఘాల నాయకులు టౌన్హాల్ వద్ద ధర్నాకు దిగారు. అక్కడకు చేరుకున్న డీసీపీ చేతన్సింగ్రాథోడ్ మాట్లాడుతూ ‘నేను మీవాడిని అనుకుంటే నేను ఆలపించే జాతీయ గీతాన్ని ఆలకించాల’ని కోరారు. అనంతరం ఆయన జాతీయగీతం ఆలపించగా అందోళనకారులు గౌరవంగా లేచి నిల్చుని, ధర్నా విరమించారు. డీసీపీ చేతన్సింగ్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ నేరవిభాగ ఐజీ హేమంత్ నింబాళ్కర్ ట్వీట్ చేశారు. మిత్రపక్షాల వేరు బాట జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని బిహార్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితిశ్ కుమార్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్లో జేడీయూ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మరో మిత్రపక్షం ఎల్జేపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీ తీరును తప్పుబట్టారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించే విషయంలో కేంద్రం విఫలౖ మెందన్నారు. ఎన్నార్సీపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు ఒరిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సీఎంలు వ్యతిరేకత తెలిపిన విషయం తెలిసిందే. యూపీలో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గోరఖ్పూర్, సంభాల్, భదోహి, బహ్రెచ్, ఫరుఖాబాద్, బులంద్ షహర్, ఫిరోజ్బాద్లో మధ్యాహ్న ప్రార్థనల అనంతరం ఆందోళనకారులు రోడ్లను నిర్బంధించారు. వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ యా ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. లక్నో, అలహాబాద్, కాన్పూర్, అలీగఢ్ సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ► మహారాష్ట్రలోని బీడ్, నాందేడ్, పర్బాని జిల్లాల్లో బస్సులను ధ్వంసం చేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం భారీ ర్యాలీ నిర్వహించింది. భారత్లో హిందువులే ఉండేలా మోదీ సర్కారు చట్టాలు తీసుకువస్తోందని ఆరోపించింది. ► కర్ణాటకలోని మంగళూరులో పోలీసుల కాల్పుల్లో గురువారం ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో కేరళలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ► అస్సాంలో ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించినట్లు సీఎం శర్బానంద సోనోవాల్ తెలిపారు. మమత యూ టర్న్ పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని గురువారం డిమాండ్ చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మాట మార్చారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టం విషయంలో జోక్యం చేసుకుని, రద్దుకు చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయమన్నారు. దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు విషయంలోనూ వెనక్కు తగ్గాలని కోరారు. డీసీపీ చేతన్