-
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
కృష్ణా, సాక్షి: రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రొయ్యల ఫీడ్తో వెళ్తున్న కంటెయినర్ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా మునిపెడలో చేపల వేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో మృతదేహం కంటెయినర్ డ్రైవర్ది కాగా.. అతని పేరు, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రొయ్యల ఫీడ్తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్ వెళ్తోంది. ఇక బొలెరో వ్యాన్ అమలాపురం మండలం తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వెళ్తోంది. అయితే పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలో కంటెయినర్కు ఢీ కొట్టినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు.పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతికృష్ణా జిల్లా సీతనపల్లి ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆమె.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. అలాగే ఘటన తర్వాత.. గాయపడిన వాళ్లను బయటకు తీసిన స్థానికుల చొరవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
ఆగని టీడీపీ దాడులు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండ కొనసాగుతోంది. శుక్రవారం కూడా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై దాడి..ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేసిన టీడీపీ గుండాలు.#TDPGoons pic.twitter.com/yDo1iT7yql— YSR Congress Party (@YSRCParty) June 7, 2024ఇక.. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. టీడీపీ గుండాలు వంశీ ఉండే అపార్ట్మెంట్ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అయితే.. సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ.. టీడీపీ యువత మరోసారి వల్లభనేని వంశీ ఇంటి పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా టీడీపీ గుండాలు దాడికి యత్నించారు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ రౌడీలను చెదరగొట్టాయి. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.ఇక విజయవాడలోనే గత అర్ధరాత్రి రాజీవ్ నగర్లోని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి పై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి బయట ఫర్నీచర్ను పూర్తిగా నాశనం చేశారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. భయంతో వణికిపోయారు. ఆపై శివారెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తూ వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఉదయం టీడీపీ నేతల దాడిపై నున్న పోలీస్ స్టేషన్లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు.రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసంతూర్పు గోదావరి: రాజమండ్రిలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలకం నాశనం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో.. ఇలాంటి ఘటనలు సరికాదని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి హితవు పలికారాయన. అలజడులు సృష్టించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని అన్నారాయన. -
సొమ్మంతా ప్రసాదార్పణం
కృష్ణాజిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024అక్కడ వ్యాపారుల కూటమి షో అట్టర్ ఫ్లాప్ వెండితొడుగు బహూకరణ పామర్రు మండలం రాపర్లలో ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు వెండి సర్వాంగాన్ని బహూకరించారు. బెజవాడలో భారీ అగ్ని ప్రమాదంవిజయవాడలో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది. మందుల, వస్త్రాల గోడౌన్లో ప్రమాదం సంభవించింది. u8లో సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ఫండ్ పేరుతో కూటమి అభ్యర్థి అందినకాడికి వసూలు చేసేస్తున్నాడు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భాగమైన ఆ నియోజకవర్గంలో ఆ అగ్రకుల పెత్తందారు సీటు దక్కించుకునే దగ్గర నుంచి అన్నింటా వసూళ్లే. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని నిర్థారణకు వచ్చిన ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన, వసూళ్లకు తెగబడి అందినకాడికి దోచుకోవాలనే వ్యూహానికి తెర లేపారు. విజయవాడ సిటీకి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకుని తద్వారా ఇక్కడ ఉన్న సహజవనరులు దోచుకోవాలని, రియల్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టాలన్నది ఆయన లక్ష్యం. అది ఫలించే సూచనలు కనిపించకపోవడంతో ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తనకు ఇప్పుడు సహకరిస్తేనే...రేపు తన వంతు సహకారం ఉంటుందని అన్యాపదేశంగా హెచ్చరిస్తుండటం గమనార్హం. కప్పం కట్టాల్సిందేనంటూ ఇండెంట్లు జిల్లాలో హాట్ సీట్..ఇన్కం క్రియేట్ సీట్గా పేరున్న ఆ నియోజకవర్గంలో రియల్ వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిల్డర్లు, రియల్ వ్యాపారులకు ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చేశారు. వైద్యం, విద్య, వ్యాపార రంగంలో స్థిరపడ్డ వ్యక్తులను కూడా టార్గెట్ చేశారు. అన్నీ సజావుగా సాగాలంటే కప్పం కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. భవిష్యత్తు ‘‘కమ్మ’’గా ఉండాలంటే మీకు బాధ్యత ఉందా? లేదా? అనే సెంటిమెంట్నూ వాడుకుంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ఆర్ఐల జాబితాను సిద్ధం చేసి తన అనుయాయుల ద్వారా ఫోన్లు చేయించి ఫండ్ రెడీ చేసుకోమని తాము చెప్పిన వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచిస్తున్నట్టు తెలిసింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆయన ఉచిత ఇసుక, రియల్ వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో వ్యాపారాలకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. అడ్డగోలుగా సహజవనరుల్ని బొక్కేసి, అనుయాయులు నాలుగురాళ్లు వెనకేసుకునేలా తోడ్పాటునందించారు. ఈ దఫా వాళ్లందరినీ ఫండ్స్ కోసం టార్గెట్ చేసి గల్లా పెట్టె నింపుకొనే పనిలో పడ్డారు. ఎన్ఆర్ఐల ఫండ్తోనే సీటు దక్కింది ఆది నుంచి సీటు లేదని తేలిపోవటంతో ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడాయన. ఎన్ఆర్ఐల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా కప్పం కట్టించి మరీ చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడిక వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇండెంట్లు పెట్టడానికి, ముక్కుపిండి వసూలు చేసేందుకు ఓ పది మందితో కూడిన కమిటీని వేశారు. ఓ మాజీ సర్పంచ్కు ఆ కమిటీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి రంగంలోకి దించారు. ఇక ఆ కమిటీ కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు కనీసం రూ.25 కోట్లకు పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుని జల్లెడ పట్టేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి ఇచ్చేది, పార్టీ అధిష్టానం దయతలచి ఇచ్చేది కాగా వచ్చిన సొమ్ములో కొంత ఖర్చులు పోనూ మిగిలిన దాంతో ఇల్లు చక్కపెట్టుకునే పనిలో ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ద్వాదళ ప్రదక్షిణలు, పవళింపు సేవలు నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 9–30 గంటలకు దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు మంగళ స్నానాలను నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, నూతన వధూవరులుగా అలంకరణ చేస్తారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఉత్సవాలకు అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ, అగ్నిప్రతిష్టాపన, ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు. 19 నుంచి 23 వరకుగత ఎన్నికల్లో సైతం... జగన్కు అడుగడుగునా జన ప్రవాహం 7న్యూస్రీల్ఎన్నికలొస్తే ఆ అగ్రకుల అభ్యర్థికి పండగే...తన సామాజిక వర్గం దండిగా ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కోటీశ్వరులు, ఎన్ఆర్ఐల జాబితాలు తయారుచేసి వసూళ్ల పర్వం మొదలెడతాడు. వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి, మిగతా సగం వెనకేసుకుంటాడు. గతంలో ఇలాగే చేశాడు. ఈసారి ఆ పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ రాగా ఎన్ఆర్ఐల ఫండ్ గ్యారంటీతోనే చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఆయన బరితెగించి వసూళ్ల కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించాడు. ఊరూరా ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారుల జాబితాలు సేకరించి వసూళ్ల పర్వం మొదలెట్టాడు. ఆ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి వసూళ్ల పర్వం వసూళ్ల కోసం ప్రత్యేకంగా కమిటీ నియామకం బిల్డర్లు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలే లక్ష్యం కోట్లు వసూలు చేసి ఇల్లు చక్కబెట్టుకునే యత్నం ఇప్పటికే బోలెడు డెనేషన్ల వసూలు కూటమి అభ్యర్థి 2019లో అధిష్టానం ఇచ్చిన సొమ్ము, ఇతరత్రా ఫండ్స్లో ఖర్చుపెట్టగా తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో సుమారు రూ.4 కోట్లకు పైగా పందేలు కట్టారు. సొమ్ము పోయి శని పట్టింది. ఈ దఫా అలాంటి పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోయిన సొమ్ముతో పాటుగా ఈ దఫా అధికమొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఈ చందాల వసూళ్లు నియోజక వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్లో దోపిడీ ఉంటే...పొరపాటున ఈయన గెలిస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు. -
No Headline
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి ఎక్కడకు వెళ్లినా జన ప్రవాహం ఉవ్వెత్తున కదిలివస్తోంది. ఈ నెల 15వ తేదీన వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లే వరకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గన్నవరం బస్సు యాత్రలో, బహిరంగ సభ ఏర్పాటు చేసిన గుడివాడలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి. 10 ఎకరాల సభా మైదానం కిక్కిరిసిపోయి వేల మంది రోడ్లపైనే ఉండిపోయారు. జగన్ సభలకు వచ్చిన జనంతో పోలిస్తే... చంద్రబాబు కూటమి షోలు జనం లేక వెలవెలపోయాయి. సాక్షి, మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు పార్టీల కూటమితో కలిసి నిర్వహిస్తున్న షోలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రజల మద్దతు లేకపోవడంతో అసహనానికి గురవుతున్న ఆ పార్టీ నేతలు సంక్షేమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా తమ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జనసేన, బీజేపీలతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న షోలు, సభలకు ఏ మాత్రం స్పందన కానరావడం లేదు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలకు డబ్బు, మందు, బిర్యానీలు ఆఫర్ ఇచ్చి రప్పించినా.. సభ పూర్తయ్యే వరకు కూడా వారు ఉండడం లేదు. పాడిందే పాట అన్నట్లు చంద్రబాబు చెప్పిందే చెబుతుండడంతో ఆ సోది వినలేక సభ ప్రారంభమై, బాబు మైకు అందుకోగానే జనం వెనక నుంచి గుంపులు గుంపులుగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పెడన, మచిలీపట్నంలో... ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన జనసేన నేత పవన్ కల్యాణ్తో కలిసి జిల్లాలోని పెడన, మచిలీపట్నంలలో కార్యక్రమం నిర్వహించారు. సభను జయప్రదం చేసి, ఉనికి కాపాడుకోవాలనే తాపత్రయంలో కూటమి నేతలు ఎంత కసరత్తు చేసినా ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన లభించింది. ఇది ముందే ఊహించిన పార్టీ నేతలు తమ సభలను మైదానాల్లో కాకుండా ఇరుకు సందులు, ట్రాఫిక్ ఉండే రోడ్లలో ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం. పెడనలో బస్టాండ్ సెంటర్లో, మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేసి సభలు నిర్వహించారు. పెడనలో మూడు పార్టీలు కలిసినా 3వేలకు మించని జనం. మచిలీపట్నంలో సైతం 5వేలు దాటలేదు. గతంలో పామర్రు, ఉయ్యూరుల్లోనూ ఇదే పరిస్థితి. జనం లేక ఆలస్యంగా సభలు జన సమీకరణ కోసం కూటమి అభ్యర్థులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. షెడ్యూల్ ప్రకారం పెడనలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైంది. మచిలీపట్నంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటలకు ఆరంభమైంది. ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు హామీలతో కూడిన చంద్రబాబు ప్రసంగం వినే ఓపిక తమకు లేదని జనం అనుకుంటున్నారు. బాబు మాట్లాడడం ప్రారంభమైన వెంటనే జనం గుంపులు గుంపులుగా వెనుతిరిగి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించని బీజేపీ జెండాలు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు జనసేన, బీజేపీలతో జత కట్టారు. అయితే ఆయన ఆ పార్టీ అధినేతలను తన వైపు తిప్పుకున్నప్పటికీ కింది స్థాయి కేడర్, కార్యకర్తల నుంచి పూర్తి స్థాయి మద్దతు కరువైంది. మచిలీపట్నంలో జరిగిన సభలో బీజేపీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. జనాకర్షణ ఏ మాత్రం లేని చంద్రబాబు, పవన్ పర్యటన గళం వినే జనం లేక గంటల సేపు బస్సులోనే బాబు మూడు పార్టీలు కలిసి సమీకరించినా అంతంతమాత్రంగానే హాజరు మచిలీపట్నంలో కనిపించని బీజేపీ నేతలు, జెండాలు బాబు మైకు అందుకోగానే సోది వినలేక వెనుతిరిగిన జనం -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన చేశారు. దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగిసాయి. అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ ఈవో కెఎస్.రామరావు దంపతులు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈవో రమేష్బాబు, ఇతర అధికారులు ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. పుష్పార్చన వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులకు పుష్పాలను పంపిణీ చేశారు. యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ మూర్తి, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతితో పరిసమాప్తం నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఆది దంపతులకు మంగళ స్నానాలు ధ్వజారోహణతో దేవతలకు ఆహ్వానం -
జగనన్న రావాలి.. పథకాలు అందుకోవాలి
ప్రజాదీవెనలో జెడ్పీ చైర్పర్సన్ హారిక బంటుమిల్లి: రాష్ట్రంలో తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఇంటి ముందుకు వస్తాయని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బంటుమిల్లిలో ప్రజాదీవెన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నాయకులు, కార్యకర్తలతో కలసి ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా హారిక, రాము ఇద్దరు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా రామును, మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వి. చినబాబు, వైస్ ఎంపీపీ ఒ.చిన్నారి బాబు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టి.శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్చైర్మన్ పి. బాబూరావు, ఎంపీటీసీ సభ్యులు కమాల్ బాషా, పి.వీరబాబు, ఆలీం, కె. శ్రీనివాసరావు, కె.నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్. మహేష్, నాయకులు ఎం. నాగేశ్వరరావు, ఎం.రాజబాబు, ఎం.వెంకటేశ్వరరావు, జి.బాల, సీహెచ్ రాధాకృష్ణ, బి. గాంధీ, పి.నాని తదితరులు పాల్గొన్నారు. -
జగన్ ఆశయాలు ఉన్నతం
కోనేరుసెంటర్: పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యం, విద్య ఉచితంగా అందజేయాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నత ఆశయం ఎంతో గొప్పదని వైఎస్సార్ సీపీ బందరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. బందరు మండలం వాడపాలెంలో గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ సీఎం ఆశయాలు ఉన్నతమైనవన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో వేలాదిమంది ఆరోగ్యానికి భరోసా కల్పించారన్నారు. ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన వైద్య సాయాన్ని పేద, మధ్యతరగతి ప్రజలకు అందజేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు మాట్లాడుతూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను అందించేలా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టమన్నారు. గ్రామాలకే అన్ని విభాగాల వైద్య నిపుణులను రప్పించి మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సైతం వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో కూడిన ఉచిత విద్య అందుతుందన్నారు. మనందరి కోసం ఎన్నోసార్లు బటన్ నొక్కిన జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకునేందుకు వచ్చే ఎన్నికల్లో మీరంతా ఒక్కసారి ఆయన పార్టీ గుర్తుపై బటన్ నొక్కి అఖండ మెజార్టీని అందజేయాలని కోరారు. ఎన్నికల బరిలోకి దిగుతున్న తమను సహృదయంతో ఆశీర్వదించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బందరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖరరావు -
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
● అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నామినేషన్లు ● పార్లమెంట్ స్థానానికి దాఖలు కాని నామినేషన్లు చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక ఘట్టమైన అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పామర్రు అసెంబ్లీ సెగ్మెంట్కు టీడీపీ అభ్యర్థిగా వర్ల కుమార్రాజా గురువారం రిటర్నింగ్ అధికారి శ్రీదేవికి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వక్కలగడ్డ పావని రిటర్నింగ్ అధికారి ఎం.వాణికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రెండు సెట్ల నామినేషన్లు, ఆయన భార్య యార్లగడ్డ జ్ఞానేశ్వరి ఒక సెట్ నామినేషన్ రిటర్నింగ్ అధికారి గీతాంజలిశర్మకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసెంబ్లీకి 11,పార్లమెంట్కు రెండు నామినేషన్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం –1 పబ్లిక్ నోటీసు జారీ చేయడంతో ఈ నామినేషన్ల పర్వం మొదలైంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో విజయవాడ పార్లమెంట్కు సంబంధించి 2, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే తొలి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. -
అగ్నిప్రమాదంలో రూ.కోటి ఆస్తినష్టం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ బందరు రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయం ఎదురుగా ఉన్న జనరిక్ మందుల గోడౌన్, వస్త్రాల గోడౌన్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. సేకరించిన వివరాల మేరకు.. బందరు రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయం ఎదురుగా ఉన్న జీప్లస్2 కమర్షియల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీసు, జనరిక్ మందుల గోడౌన్, సెకండ్ ఫ్లోర్లో వస్త్రాల గోడౌన్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణాలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో బిల్డింగ్ టెర్రస్పై నున్న వర్కర్లు మెట్ల మార్గం గుండా కిందికి వస్తూ కిటికీల్లోంచి దట్టమైన పొగ వస్తుంటాన్ని గమనించి, దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. నగరంలోని ఎనిమిది అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపుచేశారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో రూ.కోటి వరకు నష్టం వాట్లిల్లి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో కరెంట్ పోయిందని ఆ సమయంలో మంటలు వ్యాపించినట్లు గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందని, పూర్తి స్థాయిలో ఆస్తినష్టం అంచనా వేస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): అత్మహత్య చేసుకోవాలని ఇంటి నుంచి వెళ్లిన బాలుడిని రైల్వే అధికారులు, జీఆర్పీ పోలీసులు కాపాడారు. ఆ బాలుడిని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..కాకినాడకు చెందిన రేష్మన్(17) ఈనెల 12న విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రేష్మన్ ఈనెల 16వతేదీన ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా కనిపించకపోవడంతో బస్టాండ్, రైల్వేస్టేషన్లోనూ బాలుడి ఫొటో చూపించి వాకబు చేశారు. ఈ క్రమంలో కాకినాడ నుంచి బెంగుళూరు వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్లో బాలుడు ఎక్కినట్లు అక్కడి రైల్వే పోర్టర్లు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేయగా, వారు శేషాద్రిలో విధులు నిర్వర్తిస్తున్న టీటీఈ, జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈక్రమంలో రాజమండ్రి రైల్వేస్టేషన్లో రైలు ఆగినపుడు, రైలులోని ఎస్–11 బోగిలో ఫుట్బోర్డుపై రేష్మన్ కూర్చొని ఉండటాన్ని టీటీఈ ఎస్.చంద్రమౌళి గుర్తించారు. బాలుడిని రాజమండ్రి రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వేపోలీసులు ఆ బాలుడిని బుధవారం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి బాలుడిని ఆచూకీ కనుగొన్న టీటీఈ చంద్రమౌళి, జీఆర్పీ సిబ్బందిని ఈసందర్భంగా విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ గురువారం అభినందించారు. -
గ్రూపుల గోల
● వెనిగండ్లను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ● టీడీపీ ప్రచారానికి స్పందన కరువు ● నిస్తేజంలో తెలుగు తమ్ముళ్లు ● మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్న కొడాలి నాని గుడివాడ టీడీపీలోగుడివాడ రూరల్: గుడివాడ టీడీపీ గ్రూపుల గోలతో సతమతమవుతోంది. రాజకీయాలకు కొత్త అయిన వెనిగండ్ల రాముకు టీడీపీ సీటు దక్కగా...ఆ టిక్కెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు తీవ్రఅసంతృప్తితో ప్రచారంలో అంటీముట్టనట్లు ఉంటుండటంతో గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన ఊపుతో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారానికి జనం స్పందన అంతంత మాత్రంగానే ఉండటం టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల గుడివాడ పట్టణంలో మచిలీపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలసి వెనిగండ్ల రాము నిర్వహించిన ప్రచార ర్యాలీలో పట్టుమని 50మంది కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఎంపీ అభ్యర్థి వల్లభనేని సైతం అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఎన్ఆర్ఐగా ఎన్నికల బరిలో దిగుతున్న వెనిగండ్ల రాము విచ్చలవిడిగా డబ్బు వెద జల్లుతూ ప్రచారానికి వచ్చేవారికి రోజువారీగా తగినమొత్తం ఇస్తామని చెబుతున్నప్పటికీ జనం రాకపోతుండటంతో టీడీపీ కేడర్ రోజురోజుకు డీలాపడుతోంది. కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా గుడివాడలో పార్టీకి ఇంకా ఓ ఊపురావడం లేదని రాము వర్గీయులతోపాటు తెలుగుతమ్ముళు మథనపడుతున్నారు. రావి వర్గీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత.... గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వర్గీయుల నుంచి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వ్యాపారాలు వదిలేసి అధినేత ఆదేశాల మేరకు కోట్లు ఖర్చుచేసి పార్టీని నిలబెట్టిన రావికి సీటు ఇవ్వకుండా ఆర్థికంగా బలవంతుడైన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముకు సీటు కేటాయించినప్పటీ నుంచి రావి వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలతో పాటు పట్టణంలో కూడా రావికి బలమైన వర్గం ఉంది.అదేసమయంలో వెనిగండ్ల రాము, రావి వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోతుండటంతో కూడా వారు దూరంగా ఉండటానికి మరో కారణమని చెప్పవచ్చు. ఇటీవల టీడీపీ ఎన్నికల కార్యాలయంలో రావి వర్గానికి చెందిన మైనార్టీ నాయకుడుపై నాయకులంతా చూస్తుండగానే వెనిగండ్ల వర్గానికి చెందిన ఓ మహిళ కుర్చీతో దాడిచేయడంపై రావి వర్గీయులు రగిలిపోతున్నారు. రావి కుటుంబానికి అత్యంత సన్నితంగా ఉండే బీసీ నాయకుడు దేవరపల్లి కోటి కూడా వెనిగండ్ల వర్గీయులతో ఇమడలేక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో ఇటీవల పార్టీలో చేరడం గమనార్హం. ఒంటెద్దు పోకడలే కారణం.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నేతలతోనూ అంటీముట్టనట్లుగా ఉంటుండటంతో వారు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. జనసేనలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, మిగిలినవారిని పట్టించుకోకపోతుండటంతో ఆపార్టీ నాయకులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో దళితులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇటీవల జనసేన దళిత నేతలు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. బీజేపీ నాయకులను కూడా పట్టించుకోకపోతుండటంతో కూటమి అభ్యర్థి రాముతీరుపై వారు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇలా ఒంటెద్దు పోకడల కారణంగానే కూటమి పార్టీల నాయకులు రాముకు దూరమవుతున్నారని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. దూసుకుపోతున్న కొడాలి.. ప్రతిష్టాత్మక గుడివాడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కొడాలి నానికి నియోజకవర్గంపై గట్టిపట్టు ఉంది. సాయం కావాలని ఎవరూ వచ్చినా, వారికి సాయం చేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పడంతోపాటు వారికి అండగా నిలబడటం కొడాని నాని ప్రత్యేకత. ప్రజాసమస్యల పరిష్కారానికి తనదైనశైలిలో కృషిచేస్తూ, ప్రజలకు అండగా ఉంటుండటంతో ఎన్నికల ప్రచారంలో ఏవార్డు..గ్రామానికి వెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో కూడా ఎమ్మెల్యే కొడాలి నానికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుడివాడలో ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన మేమంతా సిద్ధం సభతో వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అభివృద్ధి, సంక్షేమం ఆయన విజయానికి దోహదపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. గత 20ఏళ్లుగా ప్రజాబలంతో అప్రతిహతంగా వరుస విజయాలు సాధిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానితో తలపడే విషయంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారని టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటుండటం గమనార్హం. -
యార్డులో 88,176 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 88,176 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 83,908 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.8,000 నుంచి రూ. 17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.8,000 నుంచి 19,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. యార్డులో ఇంకా 68,946 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. -
టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయింది
నందిగామ టౌన్: తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నందిగామలోని ఏడోవార్డుకు చెందిన 80మంది పెద్దముఠా సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ అరుణకుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణకుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి ఆపార్టీలో చేరిన పెద్దముఠా సభ్యులు, టీడీపీ వారి మోసపూరిత హామీలను గ్రహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. అబద్దాలు, మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకోవడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా టీడీపీ నాయకులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. నాయకులు మాడుగుల మనోహర్, బోజవాడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కంచికచర్లలో 42కుటుంబాలు చేరిక కంచికచర్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాల ద్వారా లబ్ధిపొంది, అభివృద్ధిపథంలో పయనిస్తున్న మహిళలే ఈ ఎన్నికల్లో జగనన్నకు స్టార్ క్యాంపెయినర్లని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. కంచికచర్ల అరుంధతీ, అంబేడ్కర్నగర్ నుంచి 42కుటుంబాలు టీడీపీని వీడి గురువారం రాత్రి వైఎస్సార్సీపీలో చేరాయి. ఎమ్మెల్సీ అరుణకుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నందిగామ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావును మరోసారి గెలిపించాలని వారికి సూచించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ అరుణకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు మహిళలు నమ్మించి మోసం చేయగా, సీఎం జగనన్న మహిళలకు ఆర్థికంగా అండగా నిలవడంతోపాటు అన్నిరంగాల్లో సముచితస్థానం కల్పించారన్నారు. అందుకే మళ్లీ ప్రతి మహిళ జగనన్నకు అండగా ఉంటామని చెబుతున్నారన్నారు. అందరికీ మేలు చేసిన సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కంచికచర్ల పట్టణ కన్వీనర్ వేమా సురేష్బాబు, నాయకులు అమర్లపూడి యోహాన్, మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అరుణకుమార్ -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో ఇసుకలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణానదిలో రైల్వేట్రాక్ కింద రెండు, మూడు నంబర్ల ఫిల్లర్ మధ్యన ఇసుకలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుని ఆచూకీ తెలిపే వివరాలేవి లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 40ఏళ్లు ఉంటుందని, ఎరుపు, తెలుపు, బ్లూ, బ్లాక్ డిజైన్ గుర్తులు కలిగిన తెలుపురంగు పుల్హాండ్స్ చొక్కా, నలుపురంగు జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. కాళ్లకు ఆరెంజ్, తెలుపు, బ్లాక్ రంగు కలిగిన షూ వేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు రైల్లోంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి మరణించాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ఎవరైనా హత్యచేసి నదిలో పడేసి ఉంటారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ యువకుడు.. మృత్యుంజయుడు హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం బొమ్ములూరులో 150 అడుగుల లోతైన వ్యవసాయ గాడిబావిలో ప్రమాదవశాత్తూ పడిన ఓ యువకుడిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రక్షించారు. వివరాల్లో వెళ్లితే..గ్రామానికి చెందిన కత్తుల పవన్ అనే యువకుడు గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ వ్యవసాయ గాడిబావిలో పడిపోయాడు. గమనించిన తోటిమిత్రులు భయాందోళనతో హనుమాన్జంక్షన్ పోలీసులకు సమాచారం అందించగా, ఎస్ఐ ఏడీఎల్ జనార్దన్ హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే హనుమాన్జంక్షన్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ ఆఫీసర్ గరికపాటి రామ్మోహనరావు తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని 150అడుగుల లోతైన గాడిబావిలో పడిన యువకుడిని సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీశారు. అపస్మారకస్థితిలో ఉన్న కత్తుల పవన్ను చినఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ వైద్యశాలకు చికిత్సనిమిత్తం తరలించారు. రాత్రివేళలో పవన్, అతని మిత్రులు వ్యవసాయ గాడిబావి వద్దకు ఎందుకు వెళ్లారు?, ప్రమాదవశాత్తూ గాడిబావిలో పడ్డాడా? లేక మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో హనుమాన్జంక్షన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏసీబీకి చిక్కిన ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులు తెనాలి రూరల్: ఏసీబీ వలకు ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులు, మరో ప్రైవేట్ బిల్డింగ్ ప్లానర్ చిక్కారు. ఓ భవన నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్గా దొరికిపోయారు. గుంటూరు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే వివరాల మేరకు.. చేబ్రోలు మండలం వడ్లమూడికి చెందిన ఓ వ్యక్తి జీ ప్లస్ టూ భవన నిర్మాణం కోసం తెనాలిలోని సీఆర్డీఏ జోనల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్న లీల చంద్రశేఖరరావు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సాయినాథ్ అతనిని రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. నగదును తెనాలిలోని ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్ ఇమ్రాన్ ఖాన్ ద్వారా పంపాలని షరుతు పెట్టారు. అనుమతులకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తి, సమీప బంధువు రత్నబాబుతో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగానే నగదును ఇమ్రాన్ఖాన్కు గురువారం అందజేయగా అతను తీసుకెళ్లి సీఆర్డీఏ కార్యాలయంలో ఉన్న చంద్రశేఖరరావు, రాజేంద్రసాయినాథ్కు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులతో పాటు ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్పైనా కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు సత్యానంద్, ప్రతాప్కుమార్, ఆరుగురు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. రూ.1.01లక్షల విరాళం కోడూరు: కోడూరులో నూతనంగా నిర్మిస్తున్న శివరామకృష్ణ క్షేత్రానికి అల్లంశెట్టి రాజేంద్రప్రసాద్–లక్ష్మి, నందకిషోర్–సుమప్రియ దంపతులు రూ.1,0,1,116 నగదును విరాళంగా అందజేశారు. ఈ మేరకు నగదును గురువారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. పూర్తి గ్రానైట్తో నిర్మిస్తున్న ఆలయానికి తమవంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్, నందకిషోర్ దంపతులు తెలిపారు. కమిటీ సభ్యులు అన్నం వెంకటసుబ్బారావు, బూరగడ్డ హరినాథ్బాబు, జూపూడి సుభాష్చంద్రబోస్, బడే భావన్నారాయణ, అన్నం శివరామకృష్ణ, ఉల్లి రంగారావు పాల్గొన్నారు. భవన నిర్మాణ అనుమతులకు రూ.30వేలు లంచం డిమాండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు మరో ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్పై కూడా కేసు నమోదు -
రమణీయం.. రథోత్సవం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వన్టౌన్లో సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతుడైన కల్యాణరాముని రథోత్సవం గురువారం సాయంత్రం కనులపండువగా జరిగింది. కొత్తపేట కోమలవిలాస్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీనగరాల సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సాయంత్రం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, వేదమంత్రాలు, విచిత్ర వేషధారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి వారి రథోత్సవం ఘనంగా ముందుకు సాగింది. తొలుత డీసీపీ హరికృష్ణ కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. కమిటీ ప్రముఖులు అతిథులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి రథానికి వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో నయనానందంగా అలంకరణ చేశారు. అనంతరం సీతా, లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి వారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో రథంపై అధిష్టింపజేశారు. రథోత్సవానికి తొలుత పలు ప్రత్యేక వైధిక కార్యక్రమాలను నిర్వహించారు. వారు పోసి, కుంభం సమర్పించి రధాన్ని ముందుకు లాగారు. బ్రాహ్మణవీధి ఆలయం నుంచి ప్రారంభమై నెహ్రూబొమ్మ సెంటర్, కేటీరోడ్డు, కోమలవిలాస్ సెంటర్ తదితర ప్రాంతాల మీదుగా ముందుకు సాగి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు లింగపల్లి అప్పారావు, మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు తదితర ప్రముఖులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రథోత్సవం సందర్భంగా స్థానిక ప్రజానీకం దారిపొడవునా హారతులిస్తూ స్వాగతం పలికారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్శాఖ, పోలీస్ శాఖలు ప్రత్యేక బందోబస్తు చేపట్టాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. -
మళ్లీ సీఎంగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలి
ఎలకుర్రు(పామర్రు): రానున్న ఎన్నికల్లో లంచాలు లేని ప్రభుత్వం కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని పామర్రు ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. మండలంలోని ఎలకుర్రు గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత పామర్రులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా ఎలకుర్రు గ్రామం బయలుదేరారు. ఎలకుర్రు, కొరిమెర్ల ప్రాకర్ల గ్రామాల్లో ఉదయం, నిమ్మలూరు, మలయప్పన్నపేట, కాపవరం, సప్తర్ఖాన్పాలెం, మల్లవరం, పరిశేపల్లి, పసుమర్రు గ్రామాల్లో సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యేగా తనను, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. పెత్తందార్లు పక్షాన నిలిచే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేస్తారన్నారు. కార్యక్రమంలో పామర్రు, మొవ్వ ఎంపీపీలు దాసరి అశోక్కుమార్, కుందేటి ఇందిర, పామర్రు, తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యులు కె. స్వరూపరాణి, జొన్నల రామ్మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు రత్నకుమారి, నాగమల్లేశ్వరరావు, కాకొల్లు రాజ్యలక్ష్మీ, నాయకులు కాకర్ల వెంకటేశ్వరరావు, పెయ్యల రాజు, ముప్పిడి సురేష్రెడ్డి, ఆరుమళ్ల శ్రీనాఽథ్రెడ్డి, బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.పామర్రు ఎమ్మెల్యే అనిల్కుమార్ -
దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీలతో అర్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 9వ రోజైన బధవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీలతో అర్చన నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష పుష్పార్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈఓ ఎన్. రమేష్బాబు, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు అమ్మ వారి పుష్పార్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. రాజగోపురం వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరిన ఆలయ అధికారులు, అర్చకులు ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేదిక వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలు, చామంతి, మందార పుష్పాలు, మొరం, దవళంతో పుష్పార్చన నిర్వహించారు. పూజ అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. నేడు పూర్ణాహుతి.. వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన నిర్వహించనున్నారు. -
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
కోనేరుసెంటర్: సాధారణ ఎన్నికల సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయానికి ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ కేంద్రంలో సెగ్మెంట్ల వారీగా కేటాయించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలతో వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రాంత చదును పనులను పరిశీలించారు. కృష్ణా విశ్వవిద్యాలయ భవనాలకు నలువైపులా ఏర్పరచిన మార్గాలకు వాహనాలు చేరేలా చదును చేయాలని సిబ్బందికి సూచించారు. నియోజకవర్గాల వారీగా మార్గ సూచికలు (సైనేజ్ బోర్డులు) ఏర్పాటు చేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ పనులను మరింత వేగంగా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్వో కె. చంద్రశేఖరరావు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, సర్వే ఏడీ మనీషా త్రిపాఠి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, కృష్ణా విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ సుందరకృష్ణ, తదితరులు ఉన్నారు. ఎన్నికల అధికారులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు బందోబస్తు ఏర్పాట్లపై ఆదేశాలు -
వైభవంగా శ్రీరామచంద్రుని శోభాయాత్ర
విజయవాడకల్చరల్: శ్రీ రామనవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర సమితి ఆధ్వర్యంలో దుర్గాపురంలోని బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన బైక్ ర్యాలీ వైభవంగా సాగింది. తాళ్లాయపాలెం శైవ పీఠాధిపతి శివస్వామి ర్యాలీని ప్రారంభించారు. శారదా కళాశాలలోని ఆదిశంకరా మార్గ్లో ప్రారంభమైన శోభాయాత్ర, సంగీత కళాశాల, బీఆర్టీఎస్ రోడ్డు, సత్యనారాయణ పురం, ఏలూరు రోడ్డు మీదుగా సాగింది. జై శ్రీరాం అంటూ వందలాది మంది శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర కన్వీనర్ నాగలింగం శివాజీ మాట్లాడుతూ.. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల భవ్య రామమందిరం నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. -
రామదర్శనం.. జన్మధన్యం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీరామచంద్రుడి దర్శనం.. జన్మధన్యం అంటూ భక్తజనం రఘురాముడిని మనసారా కొలిచారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శ్రీరామ నవమి వేడుకలను బుధవారం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధి నుంచి హనుమత్ సమేత సీతారామలక్ష్మణస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపుగా ఆలయ ఈవో కె.ఎస్.రామరావు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పల్లకీని మోసుకుంటూ కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేద పండితులు సీతారామ కల్యాణ విశిష్టతను వివరిస్తుండగా, అభిజిత్ లగ్నంలో స్వామి వారు అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. ఆలయ ఈవో రామరావు స్వామివారికి, సీతాదేవికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు వేదిక వద్దకు తరలిరాగా, వారికి అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం చేసింది. చలువ పందిరి కింద కూలర్లు, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు స్వామి వారి తలంబ్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, యజ్ఞనారాయణ మూర్తి, కోట ప్రసాద్, లింగంభోట్ల బద్రీనాఽథ్బాబు, ఇతర అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై సీతారాముల కల్యాణం వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు -
మతసామరస్యానికి ప్రతీక ఈద్ మిలాప్
లబ్బీపేట(విజయవాడతూర్పు): రంజాన్ తర్వాత మతసామరస్యానికి ప్రతీకగా ఈద్ మిలాప్ నిలుస్తుందని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటు, తూర్పు అసెంబ్లీ అభ్యర్థులు కేశినేని శ్రీనివాస్, దేవినేని అవినాష్ అన్నారు. అల్ మునీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఈద్మిలాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహాత్మాగాంధీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ మండపంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు మునీర్ అహ్మద్ షేక్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. దీనిలో కేశినేని శ్రీనివాస్, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, షేక్ ఆసిఫ్లతో పాటు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నెలరోజుల పాటు ఎంతో నిష్టగా ఉపవాసాలు పాటించి జరుపుకునే పండుగ రంజాన్ అన్నారు. కులం, మతం, వర్గం, వర్ణం ప్రాంతాల కతీతంగా మానవులంతా ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే అనే విశ్వజనీన సుహృద్భావం ఈద్మిలాప్ సందేశంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు సమాన అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తూ పారదర్శక పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అందరికీ అన్ని వేళలా అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మత పెద్దలు రఫీక్సాహేబ్, ముఫ్తీ యూసఫ్ సాహెబ్, మతీన్, ఫారూఖ్ సాహెబ్, ముఖ్తియార్, మహిందర్సింగ్ సహాని, నత్తా బాలస్వామి, కసగోని దుర్గారావుగౌడ్, పాల భాగ్యరాజ్లతో పాటు, పలువురు కార్పొరేటర్లు, మత పెద్దలు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటు, తూర్పు అభ్యర్థులు కేశినేని శ్రీనివాస్, దేవినేని అవినాష్ -
వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు
కంచికచర్ల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవారి జీవితాల్లో వెలుగులు నింపుతుండటంతో పలువురు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. కంచికచర్ల ఇందిరాకాలనీ నుంచి 10 కుటుంబాలవారు బుధవారం టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ అరుణకుమార్ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణకుమార్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావును మరోసారి గెలిపించాలని కోరారు. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉప్పుతల జమలయ్య, బత్తుల ప్రసాద్, బత్తుల కోటి, తమ్మిశెట్టి శ్రీను, కుమార్, రాజు, బండి నాగరాజు, చంద్రగిరి వసంత్, బత్తుల వెంకటకోటయ్య, వేముల వెంకటేశ్వరరావు, చల్లా నాగేశ్వరరావు ఉన్నారు. వైఎస్సార్సీపీ మండల, పట్టణ కన్వీనర్లు నన్నపనేని నరసింహారావు, వేమా సురేష్బాబు, సొసైటీ అధ్యక్షుడు కాలవ పెదబాబు, ఎంపీటీసీ సభ్యులు వేమా రోజారమణి, నాయకులు గుగులోతు శివనాయక్, వేముల గోపీ మోగులూరు జగన్మోహనరావు, యర్రంశెట్టి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. మరో 25 కుటుంబాబు చేరిక... నందిగామ టౌన్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి కుట్ర పన్ని కట్టిన కూటమిని ప్రజలు విశ్వసించడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందర్లపాడు మండలం గుడిమెట్ల, చింతలపాడు గ్రామాలకు చెందిన 25కుటుంబాలు మంగళవారం రాత్రి టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మరిబోయిన పెద్ద అంకమ్మ, నర్సింగుల నరసింహారావు, పూర్ణ, రంగ, కామా కోటేశ్వరరావు, కురగంటి నాగార్జున, కురగంటి నవీన్లతోపాటు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాయల జానకి రామయ్య, గుడేటి శ్రీనివాసరావు, లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో.. జగ్గయ్యపేట అర్బన్: పేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన కనపర్తి ఏసుపాదం, కనపర్తి బుజ్జి, కనపర్తి ప్రభాస్, దారమళ్ల రాజేష్ టీడీపీని వీడి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో బుధవారం వైఎస్సార్ సీపీలోకి చేరారు. వారికి ఉదయభాను పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా ఇటీవల టీడీపీలో చేరిన గౌరవరం గ్రామానికి చెందిన కత్తుల రమేష్, ఆదూరి లక్ష్మణరావు, కత్తుల ఇశ్రాయేలు, గజ్జల బుజ్జి తిరిగి వైఎస్సార్ సీపీలో చేరారు. -
చంద్రబాబు మాటలు నమ్మరు
వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావురామవరప్పాడు: చంద్రబాబు దొంగ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు చెప్పారు. రామవరప్పాడులో బుధవారం మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్తో కలిసి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో అమలు కాని హామీలిచ్చి చంద్రబాబు మోసం చేసిన విషయాన్ని ప్రజలు మరిచి పోలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణే జగన్ను రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తోక పార్టీల కుట్ర రాజకీయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక తోక పార్టీలన్నీ కుట్రరాజకీయాలు చేస్తున్నాయని తమ విలువైన ఓట్ల ద్వారా వారికి బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న జగన్పై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేయించడం దుర్మార్గ చర్య అన్నారు. సంక్షేమమే అజెండాగా జగన్ ప్రజల మధ్యే పర్యటిస్తున్నారన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు విజయం చేకూరుస్తాయన్నారు. సీఎం జగన్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, తమ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అఖండ విజయం చేకూరుస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. గ్రామంలోని ఒకటో వార్డు సభ్యురాలు బర్రె దేవుడమ్మతో పాటు పలు కుటుంబాలు వంశీమోహన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మా కోటేశ్వరరావు, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు సువర్ణరాజు, నియోజకవర్గ ఎలక్షన్ ఇన్చార్జి ఆర్.వెంకటేశ్వరరావు, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు శీలం రంగారావు, గ్రామ సర్పంచి వరి శ్రీదేవి, పలు గ్రామాల సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
చిట్టీల పేరుతో మోసం
హనుమాన్జంక్షన్ రూరల్: చిట్టీల వ్యాపారం పేరుతో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేసి పరారైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తురకా పుల్లయ్యపై హనుమాన్జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడరోడ్డులో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర చిట్ఫండ్స్ కంపెనీ ఏర్పాటు చేసి తోటి టీచర్లు, ఉద్యోగులను నుంచి రూ.కోట్లలో చిట్టీలు, డిపాజిట్లు కట్టించుకుని చివరికి ఊడాయించాడు. ఖాతాదారులంతా లబోదిబోమంటూ తురకా పుల్లయ్య బాధితుల సంఘంగా ఏర్పడి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 420, 406, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్ల రక్షణ చట్టం కింద తురకా పుల్లయ్య, ఆయన కుమారుడు అశోక్రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఏడీఎల్ జనార్ధన్ బుధవారం తెలిపారు. పక్కా పథకం ప్రకారం ముందస్తుగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) చేయటంతో పాటుగా, స్థిరాస్తులను ఇతరుల పేరిట బదలాయించి కుటుంబ సభ్యులతో సహా గ్రామం నుంచి పరారయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఇప్పటికే కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా, మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిర్వాహకుడు ప్రభుత్వ టీచర్ పుల్లయ్య జంక్షన్ నుంచి పరారు కేసు నమోదు -
ఏసీబీ వలలో డెప్యూటీ తహసీల్దార్
చిలకలపూడి(మచిలీపట్నం): అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడిలో జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చెందిన డెప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ ఏఎస్పీ ఎన్.స్నేహిత కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన కామిరెడ్డి వినయ్కుమార్కు స్వగ్రామంలో గోదాము ఉంది. దానిలో బియ్యం నిల్వలు ఉంచి విక్రయాలు జరుపుతారు. గోదాములో బియ్యం నిల్వలు ఉంచుకునేందుకు ప్రతి నెలా తనకు మామూలు ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయ డెప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లంచం కోసం వినయ్ కుమార్ను తరచూ వేధిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లుగా రూ.33 వేలు ఫోన్ పే, ఇతర మార్గాల్లో డీటీ శ్రీనివాస్కు చెల్లించారు. ఈ నెలకు సంబంధించిన మామూలును మచిలీపట్నం హౌసింగ్ బోర్డు సమీపంలోని తన ఇంటి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు తీసుకురావాలని డీటీ చెప్పటంతో వినయ్కుమార్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వినయ్కుమార్, డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్కు పెట్రోలు బంక్ వద్ద రూ.10 వేల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ను విచారించిన అనంతరం కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ ఏఎస్పీ స్నేహిత తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ బంగార్రాజుతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రూ.10వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఏసీబీ ఏఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో అధికారుల దాడులు