-
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. మునిసిపల్ అధికారులు.. పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయటం వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో మునిసిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.కాగా, తిరుపతి నగరంలో నాలుగంతస్తుల భవనాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ఒక టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి భవనాన్ని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భవన యజమానిపై దాడికి దిగారు. ఈ వ్యవహారం నగరంలో హాట్టాపిక్గా మారింది.తిరుపతిలో తిరుమల బైపాస్ మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న విరజా మార్గంలోని టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అతడి ఇద్దరు కుమార్తెలు కార్పొరేటర్లుగా ఉన్నారు. దీంతో ఆయన అధికారబలంతో తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి ఇంటి (నాలుగు అంతస్తుల భవనం) పైకి ఆ రోడ్డుని మళ్లించారు. నూతనంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనంపై తన మనుషులతో మంగళవారం 15 అడుగుల పబ్లిక్ రోడ్డు అని రాయించారు.ఈ విషయమై భవన యజమాని మాస్టర్ ప్లాన్ మ్యాప్ని, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన టౌన్ప్లానింగ్ అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగి నోరెత్తడంలేదు. బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య తన మనుషులతో భవనం వద్ద పనులు చేసుకుంటున్న యజమానిపై దాడి చేశారు. ఈ దాడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. -
పెద్ద రెడ్డి కి హైకోర్టులో ఊరట
-
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
సాక్షి, అనంతపురం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్గా మారాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్సీపీ లీగల్ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసులఅరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు. -
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
-
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్ డిస్క్, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. -
వేడెక్కిన రాజకీయం
-
జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్కు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమా?. గత 35 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక అరాచకాలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు. -
ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తోన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
-
జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్దా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
జేసీ ప్రభాకర్ కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్..
-
తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభం
-
జేసీవి దిగజారుడు రాజకీయాలు: కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తనపైన కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను ఏరేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 'జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని జేసీ లేఖ ఇచ్చారు. ఇప్పుడేమో వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించాలని జేసీ ఆందోళన చేయడం హాస్యాస్పదం. జేసీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారు. నోరు జారితే ఊరుకునేది లేదు. జేసీ వర్గీయులు నా ఓర్పును పరీక్షించవద్దు. తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు కుట్రలు చేస్తున్నారు.' అని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: బాబును ప్రజలు ఫుట్బాల్ ఆడుతారు: మంత్రి రోజా -
జేసీ ప్రభాకర్కు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓపెన్ సవాల్..
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తాడిపత్రి అభివృద్ధి కి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. అభివృద్ధిని నిరూపించలేకపోతే నీవు.. నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారు. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీకి రూ.52 కోట్లు రాకుండా అడ్డుకుంటున్నారు. సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిదే. టీడీపీ పాలనలో సాగునీరు అడిగితే రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిదే. సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదం. ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక, టిక్కెట్ల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే తుది నిర్ణయం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నా మద్దతు ఉంటుంది. కుప్పం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా నేను సిద్ధంగా ఉన్నాను’ అని వెల్లడించారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యకాండ
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యకాండకు దిగారు. నాడు నేడు పనులను అడ్డుకున్న ఆయన.. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంజీవనగర్ హైస్కూల్ లో నాడు - నేడు పనులకు అధికారులు ఉపక్రమించారు. అయితే.. ఆ ఎదురుగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంది. కొంతకాలంగా ఆ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లోనే జేసీ తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అయితే.. అధికారులు హైస్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మిస్తే తన పార్టీ కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతాయని జేసీ అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలు పూడ్చివేయడంతో పాటు అధికారులు, పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. దుర్మార్గం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నాడు నేడు పనుల్ని అడ్డుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలో నాడు -నేడు పనులను జేసీ అడ్డుకోవడం దుర్మార్గం, తాడిపత్రి అభివృద్ధి కి జేసీ అడ్డుపడుతున్నారని మండిపడ్డారాయన. -
జేసీ ప్రభాకర్రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనంతపురం(ఏపీ) టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను.. BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకుగానూ ఈ పరిణామం చోటు చేసుకుంది. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆయన్ని నోటీసుల్లో హైకోర్టు ఆదేశించింది. దివాకర్ ట్రావెల్స్ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసి.. కర్ణాటక, ఏపీలోని పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. జేసీ ట్రావెల్స్ వ్యవహారాలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి విచారణకు అప్పగించాలని పిటిషన్ వేశారు. 2020, అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని తన పిటిషన్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ.. జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. -
పరిటాల రవి హత్యకు ఆయుధాలు సరఫరా చేసింది జేసీ బ్రదర్సే
-
లోకేష్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం
సాక్షి, అనంతపురం: నారా లోకేష్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం జారీచేశారు. తనపై లోకేష్ లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే నేరుగా తేల్చుకుంటానని పేర్కొన్నారు.. జేసీ ప్రభాకర్రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేసీ బ్రదర్స్ అరాచకాలపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయిని, తాడిపత్రి టీడీపీ కార్యకర్తలను చంపింది జేసీ బ్రదర్స్ కాదా అని ప్రశ్నించారు ‘టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీకి లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించింది. ప్రబోధానందస్వామి ఆశ్రమంపై జేసీ దివాకర్ రెడ్డి దాడి చేయించారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై టీడీపీ నేతలు పోరాడిన సంగతి గుర్తు లేదా’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని పేర్కొన్నారు. చదవండి: టీడీపీ సీనియర్ నేతకు షాక్.. బాబు వద్దకు పంచాయితీ! -
వంద ఎల్లో చానళ్లు వచ్చినా ఆ కుటుంబంతో బంధాన్ని విడదీయలేవు
సాక్షి, యల్లనూరు: ‘పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట! అలా ఉంది ఏబీఎన్ చానల్ తీరు. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మోసాల గురించి నేను మాట్లాడిన మాటలను సీఎం జగన్ మోహన్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్లు ఆపాదించడం ఎంత వరకు సమంజసం’ అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. సోమవారం ఏబీఎస్ చానల్లో ప్రసారమైన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం తాడిపత్రి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆసరా సంబరాల్లో డ్వాక్రా మహిళలకు జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించానన్నారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్రెడ్డి ప్రజలకు చేసిన మోసాల గురించి కూడా చెప్పానన్నారు. అయితే.. జేసీ ప్రభాకర్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను సీఎం గురించి మాట్లాడినట్లు ఆపాదించి.. తల, తోక లేని వీడియో క్లిప్పింగులను జత చేసి ఏబీఎన్ చానల్లో ప్రసారం చేయడం శోచనీయమన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోను ప్రసారం చేయాలని, అందులో తమ నాయకుడు వైఎస్ జగన్ పై తాను విమర్శలు చేసినట్లు ఉంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, లేకపోతే ఏబీఎన్ చానల్ను మూసేసుకోవడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఏబీఎన్లో ప్రసారమైన అసత్య కథనంపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. చదవండి: (పోలీసులపై నక్కా ఆనందబాబు జులం) వంద చానళ్లు వచ్చినా వేరు చేయలేవు.. ‘వైఎస్ కుటుంబం పట్ల కేతిరెడ్డి కుటుంబాలు ఏళ్లుగా విధేయత చూపుతున్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో నా ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోయినా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నాపై అంతటి నమ్మకం పెట్టుకున్న వ్యక్తిపై నేను విమర్శలు చేసినట్లు అసత్య కథనాన్ని ప్రసారం చేయడం చాలా బాధ కలిగించింది. ఏబీఎన్ లాంటి వంద ఎల్లో చానళ్లు కలసి కట్టుగా పని చేసినా మా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని వేరు చేయలేవు’ అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచం రామ్మోహన్ రెడ్డి, నాయకులు శివారెడ్డి, ఆర్సీ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. -
తాడిపత్రి ఎమ్మెల్యేపై కేసు నమోదు, ట్విస్టు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు ఆదివారం అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దాంతోపాటు ఆయన కుమారులు హర్షవర్ధన్, సాయిప్రతాప్పైనా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా మొత్తం 15 మందిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జేసీ తరపు లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తనయులు, అనుచరులపై కేసు నమోదు చేసినట్టు తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాకు తెలిపారు. ఇక తాడిపత్రి అల్లర్లకు కారణమైన మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి సహా 27 మందిపై పోలీసులు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశారు. ఇరువర్గాలపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ట్విస్టు ఇచ్చిన జేసీ తరపు లాయర్ అయితే, ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు విషయంలో ట్విస్టు నెలకొంది. జేసీ లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తుండగా ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఓ అర్జీ, సీసీ ఫుటేజీ, పెన్ డ్రైవ్ మాత్రమే పోలీసులకు ఇచ్చానని శ్రీనివాస్ తెలిపారు. తనను ఫిర్యాదుదారుడిగా పరిగణించొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు లాయర్ శ్రీనివాస్ మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. అయితే, ఇదంతా జేసీ ఆడుతున్న డ్రామాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం విమర్శలు గుప్పించింది.(చదవండి: తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్టు) శాంతి నెలకొల్పేందుకే జేసీ ఇంటికి: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాష్ట్రంలో తాడిపత్రిపై నెలకొన్న దురభిప్రాయాన్ని పారదోలి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే సదుద్దేశంతో చర్చించేందుకు జేసీ ప్రభాకరరెడ్డి ఇంటికి వెళ్లినట్లు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫాక్షన్ గొడవలు సృష్టించడం, దాడులు చేయించి, ఆస్తులు నాశనం చేసే సంస్కృతి తమకు లేదన్నారు. పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి, చిన్నవడుగూరు, పెద్దవడుగూరు గ్రామాల్లో ల బ్ధిదారులకు శనివారం ఆయన ఇంటి పట్టాలు పంపిణీ చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధ్యతగా గుర్తించా గ్రామాల్లో సమస్యలు తలెత్తితే వాటికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉందన్నారు. తమ కుటుంబ సభ్యులపై జేసీ సోదరులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు సాగిస్తున్నారని, ఇది మితిమీరిపోవడంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డిని నేరుగా కలిసి చర్చించేందుకే వారి ఇంటికి వెళ్లానన్నారు. ఫ్యాక్షన్ గొడవలు సృష్టించడం, దాడులు చేయించి ఆస్తులను నాశనం చేయడం తనకు తెలియదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు ఈ సమస్యను మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు ఏనాడూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అపోహలతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దంటూ హితవు పలికారు. టీడీపీ వారి దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారని, వీరి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వారిలో ఎవరికైనా దెబ్బలు తగిలి ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీసులు విచక్షణతో వ్యవహరిస్తున్నారు జేసీ ఇంటిపై తామేదో దాడి చేసినట్లుగా అపోహలు సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్యే సూచించారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడులు చేశారంటూ, దీనిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు విచక్షణతోనే వ్యవహరిస్తున్నారని, వారికి అన్ని విషయాలు తెలుసునన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ పంతం నెగ్గించుకునేందుకు పోలీస్ స్టేషన్ల ఎదుట జేసీ సోదరులు ధర్నా చేసినప్పుడు ఈ సుమోటో నినాదం ఏమైందని ప్రశ్నించారు. ప్రభోదానంద ఆశ్రమం వద్ద గొడవలు తలెత్తితే నివారించేందుకు ప్రయత్నించకుండా పోలీసులతో నేరుగా ఘర్షణ పడి ‘మీ చేతుల్లో లాఠీలు ఉంటే.. మా చేతుల్లో కర్రలు ఉన్నాయి’ అంటూ జేసీ సోదరులు బెదిరింపులకు దిగినప్పుడు సుమోటో నినాదం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. గతంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజలు మౌనంగా భరిస్తూ వచ్చారని, ఇప్పుడు నిర్భయంగా సామాన్యులు సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారన్నారు. -
‘జేసీ భూములు ఇప్పిస్తామనడం హాస్యాస్పదం’
సాక్షి, తాడిపత్రి: మండలంలోని వంగనూరు, బొందలదిన్నె గ్రామంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా విక్రయించారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం రైతులు తమ భూములు కొనుగోలు చేయవచ్చన్నారు. అయితే ఆ భూములను రైతులకు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దొంగ లారీలు, దొంగ భూములు కొనుగోలు చేయడం కేవలం జేసీ సోదరులకు మాత్రమే చెందుతుందని విమర్శించారు. కర్ణాటక రవాణాశాఖ అధికారులు స్పందించకుండా ఉంటేనే లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం దివాకర్ ట్రావెల్స్ వారికే సాధ్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. -
జేసీ దివాకర్ రెడ్డి అవినీతి అనకొండ: పెద్దారెడ్డి
-
జేసీ సోదరులు.. తోడుదొంగలు..
తాడిపత్రి: ‘‘జేసీ సోదరులు తోడు దొంగలు. త్రిశూల్ ఓ బినామీ కంపెనీ. మాజీ ఎంపీ జేసీ తన ఇంట్లోని వంట మనిషి, డ్రైవర్, చికెన్ షాపు యజమానుల పేర్లతో ఈ కంపెనీని సృష్టించి రూ.300కోట్లకు పైగా విలువ చేసే ఖనిజాన్ని అక్రమంగా దోచుకున్నాడు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరించడమే కాకుండా లీజులను పొడిగిస్తూ పరోక్షంగా మద్దతు పలికారు.’’ అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి త్రిశూల్ కంపెనీ అక్రమ మైనింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఓ పరిశ్రమ నెలకొల్పితే కానీ ఖనిజాన్ని తవ్వుకునేందుకు వీలు లేదన్నారు. అలాంటిది సేల్స్ ట్యాక్స్ నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది టన్నుల ఖనిజాన్ని కొల్లగొట్టారన్నారు. కంపెనీలో బినామీలుగా ఉన్న వ్యక్తులకు 5శాతం వాటా కల్పించి, జేసీ సోదరులు తమ వద్ద 95 శాతం వాటా ఉంచుకుని ఈ బాగోతాన్ని నడిపించారన్నారు. మాజీ ఎంపీ జేసీ వియ్యంకుడు వేణుగోపాల్రెడ్డి తనకు త్రిశూల్తో ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు అఫిడవిట్ సమర్పించడమే లీజు రద్దుకు కారణమన్నారు. అయితే ఇప్పటికీ కోర్టుకు వెళ్తానని జేసీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమాజానికి ఆయన ఓ వైరస్ అని, ఈ సోదరుల వద్ద జిల్లాలో వీరి వెంట నడుస్తున్న నేతలందరికీ అది వ్యాప్తి చెందుతోందన్నారు. ఇతరుల కడుపుకొట్టి దోపిడీ చేయడం జేసీ సోదరులకే చెల్లిందన్నారు. వీరి అవినీతి సీరియల్ను తలపిస్తోందన్నారు. ట్రాన్స్పోర్టులో కూడా అనేక కుంభకోణాలు ఉన్నాయన్నారు. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
జేసీ.. మీదీ బతుకేనా?
సాక్షి, తాడిపత్రి: ‘‘జేసీ బ్రదర్స్...మీదీ ఓ బతుకేనా...ఊరుమీద పడి దోచుకోవడం తప్ప... అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ఏనాడైనా పట్టించుకున్నారా..? ఆలయాలను అడ్డుపెట్టుకుని దోచుకున్నారు. ట్రాన్స్పోర్టు వ్యవహారంలో నకిలీ పత్రాలను సృష్టించి డ్రైవర్లకు అందాల్సిన బీమా సొమ్మును కూడా స్వాహా చేస్తున్నారు. చివరకు చికెన్ సెంటర్ల వ్యాపారులతో కూడా కమీషన్లు తీసుకున్న సంస్కృతి మీ చరిత్ర జిల్లా ప్రజలందరికీ తెలుసు...మీరా నాపై ఆరోపణలు చేసేది. నిజంగా దమ్ముంటే జేసీ ప్రభాకర్రెడ్డి నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం...మీరు సిద్ధమా..?’’ అని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ సోదరులకు సవాల్ విసిరారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని...నాడు చేసిన పాపాలే నేడు జేసీ సోదరులను వెంటాడుతున్నాయని, వారికి కేసుల భయం పట్టుకుందన్నారు. జేసీ సోదరుల 40 ఏళ్ల దుర్మార్గపు పాలనకు ప్రజలు ముగింపు పలికారని, అందుకే వారికి మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పినా జేసీ సోదరుల తీరులో ఇంకా మార్పురాలేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. మీ ఆరాచకాలు అప్పుడే మరిచారా..? జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడు పోలీసులను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకున్న విషయాన్ని జిల్లా ప్రజలు ఇంకా మరచిపోలేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షపార్టీ నేతలపై దొమ్మీ కేసులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అయితే అప్పట్లో పోలీసులు వాస్తవాలను తెలుసుకుని అసలైన నిందితులను అరెస్టు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గంలోని తన అనుచరులను వెంటబెట్టుకొని ప్రబోధానంద ఆశ్రమంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దాడి చేశాడని, దాడిలో పాల్గొన్న వారి పేర్లను మాజీ ఎంపీ జేసీనే స్వయంగా పోలీసులకు అందజేసి విచారణకు సహకరిస్తే చార్జీ షీటు వేస్తారన్నారు. అంతేగానీ పోలీసులను బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. ప్రబోధానంద ఆశ్రమం ఘటనలో అరెస్టులు ఆపకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యనించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సామాన్యునికి ఓ న్యాయం... జేసీ కుటుంబానికి మరో న్యాయమా అని పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఉనికి కోల్పోతున్నామనే భయంతోనే ఇలా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఇలాగే పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తే తాను కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటి వద్ద నిరాహార దీక్షకు పూనుకుంటానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి హెచ్చరించారు. బహిరంగ చర్చకు సిద్ధమా..? తనపై జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే జేసీ నివాసం వద్దకే చర్చకు వస్తానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో పోటీ చేసిన తమ కుమారులను ఎక్కడో ఉంచి ఇక్కడ అమాయకపు ప్రజలతో జేసీ సోదరులు చెలగాటమాడుతున్నారన్నారు. వారి కుమారులైతే క్షేమంగా ఉండాలి గానీ... నియోజకవర్గ ప్రజలు మాత్రం కక్షలు కార్పణ్యాలతో కొట్టుకు చావాలా..? అని ప్రశ్నించారు. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా నిద్రపోతున్నారన్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లోని ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించేందుకు జేసీ సోదరులు కుట్రపన్నుతున్నారని, ఎవరూ కుట్రలకు బలికావద్దని పిలుపునిచ్చారు. -
జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్
సాక్షి, తాడిపత్రి : గడిచిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూసిన మాజీ ఎంపీ జేసి దివాకర్రెడి మతిస్థిమితం కోల్పోయి పోలీసు వ్యవస్థ, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. గన్నెవారిపల్లెకాలనీలో ఆదివారం వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ అనంతపురం రూరల్ స్టేషన్లో కొన్ని గంటల పాటు వేచి ఉన్నందుకే పోలీసులు, ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలు చేసి నియోజకవర్గ ప్రజలు, రైతు కుటుంబాలకు చెందిన పలువురిని అదే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని స్టేషన్లు, జైలుకు పంపి కక్ష తీర్చుకున్న గత చరిత్రను మరచిపోయావా జేసి అని ప్రశ్నించారు. చదవండి: బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ పోలీసు వ్యవస్థను అతి నీచంగా మాట్లాడి, తప్పు చేసిన నీపై కేసు నమోదు చేయడం అందుకు సంబంధించి విధులు నిర్వర్తించటం పోలీసుల బాధ్యతని తెలియకపోవడం విచారకరమన్నారు. చట్టం అందరికీ సమానమేనని, తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప, అందులో ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావుండదన్నారు. మీ హయాంలో పోలీసులు మీకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఇప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అలానే వ్యవహరిస్తారనుకుంటున్నారని, అలాంటి ఆటలు ఇక సాగవన్నారు. వైఎస్సార్సీపీలోకి తనను ఆహ్వానిస్తున్నారు. అని జేసీ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, నీలాంటి నీచ రాజకీయ నాయకులకు ఎన్నటికీ తమ పార్టీలో చోటు దక్కదన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి నిత్యం పాటు పడుతున్నాడని, అందులో భాగంగానే నాయకులదరం ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిపారు. కక్ష సాధింపెలా అవుతుంది? అక్రమంగా బస్సులను తిప్పుతున్న నీ ట్రావెల్స్పై ట్రాన్స్ పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అని ఏ విధంగా చెప్పగలగుతావు. అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉంటే అధికారులు బస్సులపై ఎందుకు చర్యలు తీసుకుంటారు. అక్రమంగా బస్సులను తిప్పుతున్నావు కనుకే బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారన్నారు. బస్సులకు ఇన్సూరెన్సు సైతం చెల్లించకుండా ఉన్నది వాస్తవం కాదా అన్నది బహిర్గతం చేయాలన్నారు. ఈ విషయమై తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ఎమ్మెల్యే మాజీ ఎంపీ జేసీకి సవాల్ విసిరారు. పోలీసులు ఆలోచించాలి ప్రబోధానంద ఆశ్రమం పైదాడి చేసేందుకు దాదాపు 500 మంది కార్యకర్తలను వెంటబెట్టుకొని వెళ్లి అల్లర్లు సృష్టించిన కేసులో ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో పోలీసులు ఆలోచించాలన్నారు. పట్టణ పోలీస్స్టేషన్ గేటుకు తాళాలు వేసి ఓ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని దూషించిన ఈ విషయమై జేసీపై పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. -
ఆదర్శ మున్సిపాలిటీలో అక్రమాలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్..!
సాక్షి, తాడిపత్రి: ‘పేరుకే తాడిపత్రి ఆదర్శ మున్సిపాలిటీ. జరిగేదంతా దోపిడీ, అక్రమాలే. షాపింగ్ కాంప్లెక్స్ లీజు, అద్దె బకాయిలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు స్వాహా చేయడమేంటి?’ అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ అధికారుల తీరుపైనా అసహనం ప్రదర్శించారు. షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు, లీజుదారులతో శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించారు. మున్సిపాలిటీకి గుడ్విల్, అద్దెల రూపంలో చెల్లించిన లక్షలాది రూపాయల్లో సగానికే రసీదులు ఇచ్చి.. మిగతా సొమ్మును సంస్థకు జమ చేయకుండా స్వాహా చేశారని తేలింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనాకు అద్దె మొత్తాలు ఇస్తే తమకు రసీదులు కూడా ఇవ్వలేదని పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ► షాప్ అద్దెకు సంబంధించి రూ.13 లక్షలను క్యాషియర్ రాజేష్కు చెల్లిస్తే రూ.8.50 లక్షలకు మాత్రమే రసీదు ఇచ్చాడని జి.రవీంద్రారెడ్డి తెలిపాడు. ► గుడ్విల్ కింద తనవద్ద నుంచి రూ.11లక్షలు అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనా తీసుకుని, రూ.8.50 లక్షలకు మాత్రమే రసీదు ఇచ్చాడని, మిగతా మొత్తం గురించి అడిగితే పెన్నానది ఒడ్డున ఏర్పాటు చేసే పార్కు అభివృద్ధి కోసం వినియోగించుకుంటామని చెప్పాడని రంగస్వామి చెప్పాడు. ► పార్కు నిర్మిస్తున్నామంటే మున్సిపాలిటీకి రూ.11లక్షలు చెల్లించానని, అయితే తనకు రూ.8.50 లక్షలు మాత్రమే షాపు అద్దె చెల్లించినట్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగి రసీదు ఇచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే అన్న(మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్)ను వచ్చి అడగాలని చెప్పడంతో చేసేదిలేక మిన్నకుండిపోయామని ఖాజామొహిద్దీన్ ఆరోపించాడు. మున్సిపాలిటికీ చెల్లించాల్సిన అద్దె, లీజు, గుడ్విల్ మొత్తాన్ని నవంబర్ మొదటి వారం లోపు చెల్లించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చెల్లించలేని పక్షంలో వెంటనే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వేలం డబ్బు చెల్లించకనే షాపులు ఎలా కేటాయిస్తారు? వేలంలో షాపులు దక్కించుకున్న వారి నుంచి డబ్బు వసూలు చేయకుండానే షాపులు కేటాయించడమేంటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీ రోడ్డులో జేసీఎన్ఆర్ఎం కాంప్లెక్స్లో జేసీ దివాకర్ పేరుతో ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. వేలం పాటలో షాపు దక్కించుకున్నారు. వేలం మొత్తాన్ని చెల్లించకుండా అధికార బలంతో షాపును స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. ఇప్పటి వరకు ఆ షాప్కు సంబంధించి రూ.లక్షకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంది. వెంటనే నోటీసులు జారీ చేసి అద్దె డబ్బు వసూలు చేయాలని, లేనిపక్షంలో దివాకర్ ట్రావెల్స్ను సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. పార్కు ఏర్పాటు పేరుతో మున్సిపల్ కాంప్లెక్స్లో ఉంటున్న దుకాణాల యజమానుల నుంచి భారీగా రూ.లక్షల్లో వసూలు చేసి కొంత మాత్రమే మున్సిపాలిటీకి చెల్లించారని, మిగిలిన మొత్తాన్ని జేసి సోదరులు స్వాహా చేశారని మండిపడ్డారు. జేసీ సోదరులు మున్సిపాలిటీని అడ్డుపెట్టుకొని దోచుకున్నదంతా నయా పైసాతో సహా వసూలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్వాహా చేసిన వారిపై ఫిర్యాదు షాపుల అద్దెల మొత్తాన్ని మున్సిపాలిటీకి చెల్లించకుండా స్వాహా చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనా, క్యాషియర్ రాజేష్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె డబ్బు స్వాహాలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాలని కోరారు.