-
అతి తక్కువ ఖర్చుతో మంచినీటిని అందిస్తున్నాం
-
తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: ఎన్నికల వేళ తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిపై చికెన్ వ్యాపారులు తిరుగుబావుట ఎగరవేశారు. జేసీ వేధింపులకు నిరసనగా చికెన్ వ్యాపారులు బంద్ చేపట్టారు. జేసీ వర్గీయులకు నెలనెల రౌడీ మాముళ్లు ఇవ్వలేమని ఆందోళన చేపట్టారు. చికెన్ వ్యాపారులు నిరసనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అండగా నిలిచారు. తాడిపత్రిలోని చికెన్ వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేయడం దుర్మార్గం అని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేయాల్సిన ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఇలాంటి పనులు చేయటం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో జేసీ కుటుంబ సభ్యులను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
అనంతపురం ,ముదిగుబ్బ : గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు,కోర్ కమిటీ సభ్యులు ఎవరైనా బెదిరింపులకు దిగితే ఎదిరించాలని వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దు..అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శుక్రవారం సంకేపల్లిలో రచ్చబండ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముందుగా తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి సోదరుడు వెంకట కృష్ణారెడ్డి, కేతిరెడ్డి సాయి ప్రతాప్రెడ్డికి స్వాగతం పలికారు. -
జేసీకి పెద్దారెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం : జేసీ బ్రదర్స్ ఒత్తిడితోనే తన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారని తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రైతుల కోసం పాదయాత్ర చేస్తే జేసీ బ్రదర్స్కి ఎందుకింత ఉలికిపాటు అని విమర్శించారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలకు ఓటమి భయం పట్టుకుందని పెద్దారెడ్డి అన్నారు. జేసీ దివాకర్ రెడ్డికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. పోలీసులు జేపీ బ్రదర్స్ తొత్తులుగా మారారని పెద్దారెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి పోలీసులకి ఎస్పీ ఆదేశాలకన్నా జేసీ బద్రర్స్ ఆశీస్సులే ముఖ్యమని విమర్శించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమంపై జేసీ దివాకర్ రెడ్డి దగ్గరుండి మరీ దాడులు చేయించారని ఆరోపించారు. జేసీ దివాకర్పై కేసు నమోదు చేయాలంటే పోలీసులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ముచ్చుకోట రిజర్వాయర్కు నీటిని విడుదల చేయడంలో టీడీపీ విఫలమయిందని దుయ్యబట్టారు. జేసీ బ్రదర్స్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దారెడ్డి పాదయాత్ర.. తాడిపత్రిలో ఉద్రిక్తత -
తాడిపత్రిలో పోలీసుల అత్సుత్సాహం
-
పెద్దారెడ్డి పాదయాత్ర.. తాడిపత్రిలో ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సంఘీభావంగా, ముచ్చుకోట రిజర్వాయర్కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్ర పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించి, ఆయనను అరెస్ట్ చేశారు. పెద్దారెడ్డి పాదయాత్రను భగ్నం చేయడానికి ఈ తెల్లవారుజాము నుంచే ముచ్చుకోట గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మొహరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు రమేష్ రెడ్డి, పైలానరసింహయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు దాకా పాదయాత్ర చేసేందుకు వచ్చిన పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ సర్కారు చర్యలను పెద్దారెడ్డి తీవ్రంగా నిరసించారు. శాంతియుతంగా పాదయాత్ర చేసేందుకు వచ్చిన తనను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ముచ్చుకోట సమీపంలో పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు -
జేసీపై పెద్దారెడ్డి ఫైర్
తాడిపత్రి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..చిన్నపొలమడ ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన అల్లర్లకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే కారణమని ఆరోపించారు. తాడిపత్రి పోలీసులు ఆశ్రమం వారిపైనే కేసులు నమోదు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాడిపత్రి పోలీసులకు అధికారుల మాటల కంటే జేసీ సోదరుల మాటలే వేదవాక్కుల్లాగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్కు తాళం వేసి, ధర్నా చేసినా కూడా జేసీపై చర్యలు తీసుకోవాలంటే పోలీసులు భయపడటమే దీనికి నిదర్శనమన్నారు. డీఎస్పీ విజయ్కుమార్పై జేసీ అసభ్య పదజాలంతో అనుచితంగా మాట్లాడినా కూడా చర్యలు తీసుకోలేదంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనుమానం కలుగుతోందన్నారు. వచ్చే నెల 15 లోపు జేసీ దివాకర్ రెడ్డిపై సుమోటో కింద కేసు నమోదు చేయకుంటే ఎస్పీ ఆఫీసు వద్ద కానీ, తాడిపత్రి డీఎస్పీ ఆఫీసు వద్ద కానీ పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని పెద్దారెడ్డి హెచ్చరించారు. -
వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి అరెస్ట్
-
పెద్దారెడ్డిపై అక్రమ కేసు.. అరెస్టు
అధికార పార్టీ చెప్పుచేతల్లో పోలీసు శాఖ పరువు దిగజారుతోంది. పచ్చని గ్రామాల్లో పోలీసుల చర్యలు వర్గపోరుకు ఆజ్యం పోçస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించడం.. టీడీపీ నేతల మెప్పు పొందేందుకు అరెస్టులకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై జేసీ వర్గీయులు దాడి చేశారు. ఈ కేసులో చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. జేసీ ఒత్తిడితో ఆయన వర్గీయులు నమోదు చేసిన అక్రమ కేసులో ఏకంగా పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తను అరెస్టు చేయడం దిగజారిన రాజకీయాలకు నిదర్శనం. అనంతపురం, యల్లనూరు : అధికారంలో ఉన్నాం..మాకెవరు అడ్డు అన్న రీతిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న అధికార దురహంకారం, పోలీసుల దౌర్జన్యమే ఇందుకు నిదర్శనం. వివరాలు..యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త బాషాపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, జేసీ అనుచరులు మోహన్రెడ్డి, మహేశ్వరరెడ్డి, వెంకటరెడ్డి, పెద్దారెడ్డి, రమణారెడ్డి మూకుమ్మడిగా బుధవారం దాడి చేశారు. విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి తిమ్మంపల్లి గ్రామానికి గురువారం చేరుకొని బాధితుడిని పరామర్శించారు. అనంతరం బస్టాండు వద్ద కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి గొడవలూ ఘర్షణలకు పోకండి అని కార్యకర్తలకు సూచించారు.అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించి, కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని సర్దుకుపోవా లని తెలిపారు. ఇదే సందర్భంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్త బాషాపై దాడిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీశారు. దీంతో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్రెడ్డి ద్వారా కేసులు నమోదు చేయించారు. పోలీసులను అడ్డుకున్న ప్రజలు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని యల్లనూరు మండల వ్యాప్తంగా ప్రజలు తప్పుపట్టారు. గురువారం సాయంత్రం పెద్దారెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు బలగాలను అడ్డుకున్నారు. ఏతప్పూ చేయకున్నా కేసులు ఎలా బనాయిస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారని తిమ్మంపల్లి గ్రామస్తులు పోలీసులను నిలదీశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్దారెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఓ వైపు మహిళలను, గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నా.. మరోవైపు వర్షం పడుతున్నా వెనక్కి తగ్గకుండా పోలీసులను నిలవరించి, పెద్దారెడ్డిని అరెస్ట్ చేయకుండా దాదాపు 3 గంటలపాటు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసులు నమోదు – అరెస్ట్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు టీడీపీ వారు రెచ్చగొట్టిన విధానాన్ని తప్పుబడుతూ నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నేరుగా వారి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో సంప్రదించి, కేతిరెడ్డి పెద్దారెడ్డితోపాటు మరికొందరు వైఎస్సార్ సీపీ నాయకులపై 147, 148, 307, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయించారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోలీస్ బలగాలు గ్రామస్తులు, మహిళలను చెదరగొట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి, పామిడి స్టేషన్కు తరలించారు. -
‘జేసీ బ్రదర్స్ అరాచకాలు తీవ్రమయ్యాయి..’
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అరాచకాలు తీవ్రమయ్యాయని వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పోలీసు స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దారెడ్డి మాట్లాడుతూ.. సాక్షాత్తు పోలీసులనే బెదిరించడం జేసీ బ్రదర్స్ నిజస్వరూపానికి నిదర్శనమన్నారు. పోలీసుల విధులను అడ్డుకున్న జేసీ బ్రదర్స్, అనుచరులపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. రక్షణ కల్పించే వారినే బెదిరించి యుద్ధ వాతావరణం సృష్టించారు. వారి దౌర్జన్యాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ జేసీ దివాకర్రెడ్డిని ఉద్దేశించి అనంతపురం మేయర్ స్వరూప బుధవారం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
‘జేసీ సోదరులవి బ్లాక్మెయిల్ రాజకీయాలు’
తాడిపత్రి : జేసీ సోదరులవి బ్లాక్మెయిల్ రాజకీయాలని, సొంత పార్టీ ముఖ్యమంత్రినే బ్లాక్ మెయిల్ చేసే నీచ స్థాయికి దిగరాజారని వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు. మద్యం షాపుల టెండర్లలో ముడుపులు తీసుకున్నానని నిరూపిస్తే తాడిపత్రి విడిచిపెట్టి పోయేందుకు తాను సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. అలా నిరూపించని పక్షంలో జేసీ సోదరులు రాజకీయ సన్యాసం చేస్తారా? అని ప్రశ్నించారు. జేసీ సోదరులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రజల సమస్యలను అడ్డుపెట్టుకొని రాజీనామా పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునే బ్లాక్మెయిల్ చేసిన ఘనత జేసీ సోదరులదని పెద్దారెడ్డి ఏద్దేవా చేశారు. జేసీ సోదరుల బ్లాక్ మెయిల్, చిల్లర రాజకీయాలు జిల్లా ప్రజలందరికీ తెలుసునని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే అసత్య ఆరోపణలు : బార్ విషయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలకు ఎమ్మెల్యే జేసీ తెరలేపారన్నారు. అధికార బలంలో జేసీ సోదరులు అధికారులను బెదిరించడం పరిపాటిగా మారిందన్నారు. తాడిపత్రి ప్రాంతంలోని పరిశ్రమలను జేసీ సోదరులు దోచుకుంటున్నారన్నారు. ఆయా పరిశ్రమల్లో తమకు కాంట్రాక్టులు, పర్సెంటేజీలు ఇవ్వకపోతే పరిశ్రమల ఎదుట ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తానని బెదిరించడం జేసీ సోదరుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. గ్రానైట్ పరిశ్రమల యజమానుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే వారు ససేమిరా అనడంతో గ్రానైట్ పరిశ్రమల లోడు లారీలను తన అధికార బలంతో అడ్డుకోవడంతో గ్రానైట్ పరిశ్రమల ఉనికికే ప్రమాదకరంగా మారిందని, ఫ్యాక్టరీలు మూతపడే దశలో ఉన్నాయన్నారు. జేసీ సోదరులు తాడిపత్రిని అభివృద్ధి చేయలేదని, తాడిపత్రిని అడ్డుపెట్టుకొని వారు అభివృద్ధి చెందారని విమర్శించారు. -
జేసీ సోదరులకు సిగ్గూశరం ఉందా..?
తాడిపత్రి: ‘అభివృద్ధి అంటే బస్టాపుల్లో బార్లు తెరవడమా, గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించడమా... ఇదేనా..జేసీ..నీవు చేస్తున్న అభివృద్ధి..అసలు నీకు సిగ్గు, శరం ఉన్నాయా’ అని తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడిపత్రి ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అది కేవలం వైఎస్సార్ హయాంలోనేనని, జేసీ సోదరులు చేసింది ఏమీలేదన్నారు. ప్రజాసమస్యలపై నిరసన తెలిపే హక్కు సమాజంలో ప్రతి పౌరుని ఉందని, దాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడం చూస్తే జేసీ సోదరుల అధికార దర్పానికి నిదర్శనమన్నారు. ఈ రోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, జేసీ సోదరులను చూపి భయపడి ప్రజలు సమస్యలపై నిలదీయలేకపోతున్నారన్నారు. ఇక నుంచి సమస్యలపై నిలదీసే వారందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దారెడ్డి హామీ ఇచ్చారు. జేసీ సోదరులు లారీ అసోషియేషన్ ముసుగులో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. అల్ట్రాటెక్, గెర్డావ్ పరిశ్రమల్లో లారీ యజమానులకు లోడింగ్కు అవకాశం లేకుండా తన సొంత లారీలలోనే ముందుగా లోడింగ్ చేయాలని పరిశ్రమల యాజమాన్యాలను కూడా బ్లాక్మెయిల్ చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. నిత్యం ఇతరులకు నీతులు చెప్పే జేసీ సోదరులు... వారు మాత్రం నీతిమాలిన పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ను పెంచి పోషించింది జేసీ సోదరులేనని, తన సోదరున్ని పోగొట్టుకున్నా తాను ఎంతో ఓర్పుతో ఉన్నానని పెద్దారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల్లో చైతన్యం వస్తోందని, జేసీ సోదరులకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సమావేశంలో పెద్దవడుగూరు, యాడికి జెడ్పీటీసీ సభ్యులు చిదంబరరెడ్డి, వెంకట్రామిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గయాజ్, రఘునాథ్రెడ్డి, రంగనాథ్రెడ్డి, సంపత్, బాలరాజు, నాగభూషణం పాల్గొన్నారు. -
జేసీ బ్రదర్స్ అండతోనే..
అనంతపురం: జేసీ బ్రదర్స్ అండతోనే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సీబీఐ దాడులు అనంతరం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారని.. దీపక్రెడ్డి అరెస్టైనా చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. వాకాటికో న్యాయం, దీపక్రెడ్డికి మరో న్యాయమా అని అడిగారు. పెద్దారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ... దీపక్రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేయడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో దీపక్రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు జరిపిన మరుసటి రోజే ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీపక్రెడ్డిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విపక్షాలు పేర్కొంటున్నాయి.