-
శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
టీమిండియా తరఫున ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి, భారత్ తరఫున సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ప్రసిద్ధి చెంది, ఆతర్వాత మరో 4 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడి కనుమరుగైపోయిన కరుణ్ నాయర్.. ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో ఇరగదీస్తున్నాడు. భారత దేశవాలీ క్రికెట్లో సొంత జట్టు కర్ణాటక కాదనుకుంటే విదర్భకు వలస వెళ్లి, అక్కడ కెరీర్ పునఃప్రారంభించిన నాయర్.. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని తనను కాదనుకున్న వారికి బ్యాట్తో సమాధానం చెప్పాడు. HUNDRED FOR KARUN NAIR....!!! Northamptonshire under big trouble with 151 for 6, against an attack led by Roach - Karun smashed a brilliant hundred in his 2nd match of the season. pic.twitter.com/JcJKDxu9bb — Johns. (@CricCrazyJohns) September 20, 2023 ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్షిప్లో నార్తంప్టన్షైర్కు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న నాయర్.. తానాడిన తొలి మ్యాచ్లో (వార్విక్షైర్) అర్ధసెంచరీ (78), రెండో మ్యాచ్లో ఏకంగా అజేయ సెంచరీ (144 నాటౌట్; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ ప్రదర్శనతో అయినా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న నాయర్.. తన మనసులోని మాటను ఇటీవలే ట్విటర్ వేదికగా బహిర్గతం చేశాడు. డియర్ క్రికెట్.. నాకు మరో ఛాన్స్ ఇవ్వు అంటూ నాయర్ తనలోని అంతర్మథనానికి వెల్లగక్కాడు. ప్రస్తుత కౌంటీ సీజన్లో నార్తంప్టన్షైర్ తరఫున కేవలం మూడు మ్యాచ్లకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్న నాయర్.. తాజాగా ప్రదర్శనతో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. A fantastic century by Karun Nair in the County Championship. pic.twitter.com/JwtbAkSOHX — Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 టెస్ట్ల్లో టీమిండియాను మిడిలార్డర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు నాయర్ ప్రదర్శనను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి. నాయర్.. సుదీర్ఘ ఫార్మాట్తో పాటు పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన కర్ణాటక టీ20 టోర్నీలో (మహారాజా ట్రోఫీ) అతను 12 మ్యాచ్ల్లో 162.69 స్ట్రయిక్రేట్తో ఏకంగా 532 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. గుల్భర్గా మిస్టిక్స్తో జరిగిన మ్యాచ్లో 40 బంతుల్లో అతను చేసిన సెంచరీ టోర్నీ మొత్తానికే హైలైట్గా నిలిచింది. భారత్ తరఫున 6 టెస్ట్లు, 2 వన్డేలు ఆడిన నాయర్.. మొత్తంగా 420 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. 31 ఏళ్ల నాయర్ తన అంతర్జాతీయ కెరీర్లో చేసిన ఏకైక సెంచరీ ట్రిపుల్ సెంచరీ (303 నాటౌట్) కావడం విశేషం. -
భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి కీలక నిర్ణయం.. ఇకపై ఇంగ్లండ్లో
టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తాంప్టన్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్ల్లో నార్తాంప్టన్షైర్కు కరుణ్ నాయర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ వైట్మన్ స్థానంలో కరుణ్ నాయర్ నార్తాంప్టన్షైర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే సెప్టెంబర్ 8న నార్తాంప్టన్షైర్ జట్టుతో నాయర్ చేరాడు. ఆదివారం వార్విక్షైర్తో జరిగే మ్యాచ్తో నాయర్ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి.. 2016లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన నాయర్.. అరంగేట్ర సిరీస్లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టులో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. నాయర్ 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు -
విజృంభించిన మనీశ్ పాండే.. రాణించిన కరుణ్ నాయర్
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహారాజా టీ20 ట్రోఫీ-2023ని హుబ్లీ టైగర్స్ గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్స్లో టైగర్స్ టీమ్.. మైసూర్ వారియర్స్ను 8 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్.. మొహమ్మద్ తాహా (40 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (23 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్లో తాహా, మనీశ్లతో పాటు కృష్ణణ్ శ్రీజిత్ (31 బంతుల్లో 38; 5 ఫోర్లు), మాన్వంత్ కుమార్ (5 బంతుల్లో 14; 2 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మైసూర్ వారియర్స్ బౌలర్లలో కార్తీక్ 2, మోనిస్ రెడ్డి, సుచిత్, కుషాల్ వధ్వాని తలో వికెట్ పడగొట్టారు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మైసూర్ వారియర్స్.. ఇన్నింగ్స్ ఆరంభంలో రవికుమార్ సమర్థ్ (35 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (20 బంతుల్లో 37; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు. అయితే ఆఖర్లో హుబ్లీ టైగర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మైసూర్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 195 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. హుబ్లీ బౌలర్లలో మాన్వంత్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప 2, మిత్రకాంత్, కరియప్ప చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
40 బంతుల్లో శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్న నాయర్.. గుల్భర్గా మిస్టిక్స్తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 40 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. నాయర్కు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim — CricTracker (@Cricketracker) August 28, 2023 నాయర్ విధ్వంసం ధాటికి గుల్భర్గా బౌలర్లు అభిలాష్ షెట్టి (4-0-63-1), విజయ్కుమార్ వైశాక్ (4-0-45-0), అవినాశ్ (3.4-0-44-1), నొరోన్హా (2-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 249 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుల్భర్గా.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గుల్భర్గా ఇన్నింగ్స్లో చేతన్ 28, ఆనీశ్ 23, నొరోన్హా 39 నాటౌట్, స్మరణ్ 0, అమిత్ వర్మ 11, హసన్ ఖలీద్ 4 నాటౌట్ పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి, గౌతమ్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, టెస్ట్ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్పై తన తొలి ట్రిపుల్ సెంచరీని (309) (భారత్ తరఫున మొట్టమొదటిది), 2008లో సౌతాఫ్రికాపై తన రెండో ట్రిపుల్ హండ్రెడ్ను (319) బాదాడు. ఆ తర్వాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. -
భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై!
టీమిడియా వెటరన్ ఆటగాడు, కర్ణాటక స్టార్ కరుణ్ నాయర్ క్రికెటర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు నాయర్ గుడ్ బై చెప్పాడు. ఇకపై విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడాలని కరుణ్ నాయర్ నిర్ణయించుకున్నాడు. ఈ మెరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కి వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. "కర్ణాటక క్రికెట్ అసోసియేషన్తో గత రెండు దశాబ్దాలగా ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన కేఎస్సీఈకు ధన్యవాదాలు. అదే విధంగా నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన కోచింగ్ స్టాప్, కెప్టెన్లకు, సహచర ఆటగాళ్లకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎక్స్(ట్విటర్)లో నాయర్ పేర్కొన్నాడు. కాగా 2013లో కర్ణాటక తరపున కరుణ్ నాయర్ ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. కర్ణాటక క్రికెట్తో దాదాపు రెండు దశాబ్దాల పాటు నాయర్ ప్రయాణం సాగింది. ఇప్పటివరకు కర్ణాటక తరపున 85 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన నాయర్.. 48.94 సగటుతో 5922 పరుగులు సాధించాడు. అందులో 15 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తమిళనాడుతో జరిగిన 2014-15 రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం అతడికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. 2016లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్ర టెస్టు సిరీస్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వీవీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత అంతగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్కు ఆఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు -
అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ఖతం!
After Virender Sehwag Only Other Indian To Score Triple Century: అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో శతక్కొట్టిన బ్యాటర్లు కోకొల్లలు. అదే ట్రిపుల్ సెంచరీ సాధించిన వాళ్లు మాత్రం అరుదు. ఆ జాబితాలో ఉన్న వాళ్లెవరనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఈ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ 2004లో తొలిసారి ఈ ఫీట్ అందుకున్నాడు. అది కూడా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ గడ్డపై 309 పరుగులు సాధించి ముల్తాన్ కింగ్గా నీరజనాలు అందుకున్నాడు. 2008లో స్వదేశంలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో చెన్నైలో 319 పరుగులతో మెరిశాడు. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి మరి వీరూతో పాటుగా ఈ త్రిశతక లిస్టులో ఉన్న మరో భారత క్రికెటర్ గురించి తెలుసా? దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించే రాజస్తాన్ బ్యాటర్ కరుణ్ నాయర్. 2013-14 సీజన్లో రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఫైనల్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 328 పరుగులతో రాణించి కర్ణాటకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి రంజీ సీజన్లో రెండు శతకాలు బాదడంతో పాటుగా మరో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇలా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 4 పరుగుల వద్ద రనౌట్.. తర్వాత ఎల్బీగా.. జింబాబ్వేతో వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతడు.. అదే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొహాలీలో మూడో టెస్టు సందర్భంగా తన తొలి మ్యాచ్ ఆడిన కరుణ్ నాయర్.. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాట్ ఝులిపించి.. ట్రిపుల్ సెంచరీ బాది తదుపరి ముంబై మ్యాచ్లోనూ 13 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న కరుణ్.. ఐదో టెస్టులో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. తొలి ఇన్నింగ్స్లో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే ఏకంగా త్రిశతకం బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా ఇన్నింగ్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలవగా.. కరుణ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెహ్వాగ్ తర్వాత రెండో భారత క్రికెటర్గా.. అలా ప్రపంచంలో నంబర్ 1 ఇక ఈ మ్యాచ్ సందర్భంగా.. ట్రిపుల్ సెంచరీతో మెరిసి ప్రపంచంలో ఈ ఘనత సాధించి మూడో క్రికెటర్గా కరుణ్ నాయర్ రికార్డులకెక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. ఏడాదిలోనే ముగిసిన కెరీర్ అదే విధంగా.. తక్కువ మ్యాచ్లు ఆడి టెస్టుల్లో త్రిశతకం నమోదు చేసిన ఏకైక బ్యాటర్గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత మెరుగ్గా రాణించలేకపోయిన కరుణ్ నాయర్ కెరీర్ మరుసటి ఏడాదే ముగిసింది. 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తంగా టీమిండియా తరఫున 6 టెస్టులు, రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ వరుసగా ఆయా ఫార్మాట్లలో మొత్తంగా 374, 39 పరుగులు చేయగలిగాడు. ఇక 2013 నుంచే ఐపీఎల్ ఆడుతున్న కరుణ్ ఆర్సీబీతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎక్కడ? డానియల్ వెటోరీ, విరాట్ కోహ్లి సారథ్యంలో బెంగళూరు జట్టుకు ఆడిన అతడు.. తర్వాత కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు కూడా ప్రాతినిథ్య వహించాడు. ఇక 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానాన్ని 31 ఏళ్ల కరుణ్ నాయర్తో భర్తీ చేసింది మేనేజ్మెంట్. ఇక కరుణ్ సనయ తంకరివాలాను వివాహమాడగా.. వారికి కుమారుడు జన్మించాడు. చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్కు కూడా..! ఏదో క్లబ్గేమ్ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్ అన్నట్లు! తిలక్ అలా.. -
IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్
IPL 2023- LSG- KL Rahul: భారత క్రికెటర్, ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయం కారణంగా రాబోయే కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023తో పాటు వచ్చే నెలలో లండన్లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నుంచి కూడా రాహుల్ తప్పుకున్నాడు. దేశం తరఫున ఆడటమే నా మొదటి ప్రాధాన్యత ఈ విషయాన్ని స్వయంగా అతనే నిర్ధారించాడు. సోమవారం లక్నోలో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. ‘భారత జట్టుకు అందుబాటులో లేకపోవడం చాలా నిరాశగా ఉంది. దేశం తరఫున ఆడటమే నా మొదటి ప్రాధాన్యత. నా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. 2021లో కేకేఆర్కు ఆడిన కరుణ్ నాయర్ (PC: IPL) రీప్లేస్మెంట్ అతడే వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తా. బాధగా ఉన్నా ఆటకు దూరం కావడం తప్పడం లేదు’ అని రాహుల్ పేర్కొన్నాడు. ఐపీఎల్కు దూరమైన రాహుల్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కర్నాటక బ్యాటర్ కరుణ్ నాయర్ను జట్టులోకి తీసుకుంది. రూ. 50 లక్షల ధరకు అతడిని తీసుకుంది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్... రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆయా జట్ల తరఫున మొత్తంగా 76 మ్యాచ్లు ఆడిన నాయర్ 1496 పరుగులు చేశాడు. చదవండి: ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ అట..! క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను.. హీరోయిన్ను పెళ్లాడతాను..! -
'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. భారత క్రికెటర్ భావోద్వేగం
కరుణ్ నాయర్.. ఈ పేరు చాలా మందికి గుర్తుండకపోవచ్చు. అతడు మన భారత క్రికెటరే. సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత టెస్టు క్రికెట్లో ఒక యువ సంచలనం. తన అరంగేట్ర టెస్టు సిరీస్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. అయితే అరంగేట్రం చేసిన ఐదు నెలలకే బీసీసీఐ అతడిని పక్కన పెట్టింది. కరుణ్ నాయర్ అనే క్రికెటర్ ఉన్నాడన్న విషయాన్నే భారత సెలక్టర్లు మార్చిపోయారు. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. భారత జట్టు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు. కానీ మళ్లీ భారత జెర్సీ ధరించేందుకు కరుణ్ నాయర్ మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా..త్వరలో జరగనున్న రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్కు చోటు దక్కలేదు. తొలి రెండు మ్యాచ్లకు జట్టును ప్రకటించిన కర్ణాటక క్రికెట్ బోర్డు.. అతడికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ చేసిన ఓ పోస్టు అభిమానుల హృదయాలను తాకుతుంది. "డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు అంటూ" ట్విటర్ వేదికగా భావోద్వోగానికి లోనయ్యాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. "నీ లాంటి టాలెంట్ ఉన్న ఎంతో మంది ఆటగాళ్లను తొక్కేసారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ భారత జట్టులో తిరిగి నిన్ను చూడాలి అనుకుంటున్నాము భయ్యా అంటా పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ కరుణ్ నాయర్ 2016 నవంబర్లో ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. Dear cricket, give me one more chance.🤞🏽 — Karun Nair (@karun126) December 10, 2022 Revisit Karun Nair triple century scoring moment.pic.twitter.com/MV1ERnUwFY — Cricket Master (@Master__Cricket) December 10, 2022 చదవండి: FIFA WC: పోర్చుగల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన రోనాల్డో! వీడియో వైరల్ -
ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురి బర్త్డే కూడా ఈరోజే.. ఈ విశేషాలు తెలుసా?
December 6- Top 6 Cricketers Birthday: టీమిండియా స్టార్స్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్.. ఈ ముగ్గురూ ఒకేరోజు జన్మించారు తెలుసా! వీళ్ల ముగ్గురి బర్త్డే డిసెంబరు 6నే! భారత ఆల్రౌండర్ జడ్డూ 1988లో జన్మించగా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1993లో, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 1994లో జన్మించారు. ఇక వీరితో పాటు మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఇదే రోజు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. భారత మాజీ లెఫ్టార్మ్ మీడియం పేసర్ రుద్రప్రతాప్ సింగ్, కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా డిసెంబరు 6నే పుట్టారు. వీళ్లందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరుగురి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు 1.జస్ప్రీత్ బుమ్రా- గుజరాత్ ►అహ్మదాబాద్లో జననం ►ప్రస్తుత టీమిండియా ప్రధాన పేసర్. ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం. ►టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్ల జాబితాలో చోటు ►కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 162 అంతర్జాతీయ మ్యాచ్లు ►పడగొట్టిన వికెట్లు: 319. 2. రవీంద్ర జడేజా- గుజరాత్ ►నవగామ్లో జననం ►స్పిన్ ఆల్రౌండర్ ►టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ప్రఖ్యాతి ►ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్లలో పరుగులు: 5427 ►పడగొట్టిన వికెట్లు: 482 ►ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. శ్రేయస్ అయ్యర్- మహారాష్ట్ర ►ముంబైలో జననం ►ఐపీఎల్లో ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా ఉన్నాడు. ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్లు టెస్టులు 5, వన్డేలు 37, టీ20లు 49. ►పరిమిత ఓవర్ల క్రికెట్లో స్టార్ బ్యాటర్గా గుర్తింపు ఆర్పీ సింగ్- ఉత్తరప్రదేశ్ ►1985లో రాయ్ బరేలీలో జననం ►లెఫ్టార్మ్ మీడియం పేసర్ ►అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఆడిన ఆర్పీ సింగ్ ►అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. ►2018లో అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటన కరుణ్ నాయర్ ►1991లో జననం ►దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాటర్ ►టీమిండియా తరఫున ఇప్పటి వరకు 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ►లంకషైర్లో 1977లో జననం ►1998లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం ►ఇంగ్లండ్ కెప్టెన్గా పనిచేసిన ఆల్రౌండర్ ►ఫాస్ట్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్గా సేవలు ►2010లో ఆటకు వీడ్కోలు.. ప్రస్తుతం కామెంటేటర్గా ఉన్న ఫ్లింటాఫ్. చదవండి: Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
IPL 2022: కరుణ్ అవుట్.. యశస్వి ఇన్: సంజూ శాంసన్
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్- 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక శనివారం(మే 7) నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు మేం టాస్ ఓడిపోయాం. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. అయినా మాది సమతుల్యమైన జట్టు. డే మ్యాచ్ కాబట్టి స్పిన్నర్లకు అనుకూలించవచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇక కరుణ్ నాయర్ స్థానంలో యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. కాగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా పంజాబ్, రాజస్తాన్ తలపడుతున్నాయి. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్లలో ఆరు గెలిచిన సంజూ శాంసన్ బృందం 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. పదింట 5 విజయాలతో మయాంక్ బృందం 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవ్దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, యజువేంద్ర చహల్, కుల్దీప్ సేన్. పంజాబ్ కింగ్స్ జానీ బెయిర్స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భనుక రాజపక్స, లియామ్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష్దీప్ సింగ్, సందీప్ శర్మ. చదవండి👉🏾Kieron Pollard: పొలార్డ్పై వేటు తప్పదు.. ఇకపై అతడికి అవకాశం ఉండదు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నాయర్ నుంచి సారధ్య బాధ్యతలు చేజిక్కించుకున్న సమర్ధ్
సాక్షి, బెంగళూరు: త్వరలో ప్రారంభం కాబోయే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక కెప్టెన్గా ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆర్ సమర్ధ్ వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల సమర్ధ్.. ఫామ్ లేమితో బాధపడుతున్న కరుణ్ నాయర్ నుంచి సారధ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఫజల్ ఖలీల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం సమావేశమై 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా, తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సమర్ధ్కు జట్టులో స్ధానం దక్కకపోవడం విశేషం. ఈ టోర్నీలో కర్ణాటక జట్టు క్వార్టర్స్లోనే నిష్క్రమించింది. తాజాగా ప్రకటించిన కర్ణాటక జట్టులో ఇటీవలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాణించిన దేవ్దత్ పడిక్కల్ కీలక సభ్యుడిగా ఉండగా, గాయం కారణంగా సీనియర్ ఆటగాడు మనీష్ పాండే టోర్నీకి దూరమయ్యాడు. -
ధోనికి నెగెటివ్
రాంచీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చేసిన కోవిడ్–19 పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఐపీఎల్ తాజా నిబంధనల్లో భాగంగా అతనికి పరీక్ష చేశారు. ఇక్కడి గురునానక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు నగర శివార్లలో ఉన్న ధోని ఫామ్హౌస్కు వెళ్లి అతని శాంపిల్స్ సేకరించారు. గురువారం రాత్రికి ఫలితాలు వచ్చాయి. ధోనితో పాటే చెన్నై జట్టులోని సభ్యుడైన మోనూ కుమార్ కూడా కరోనా పరీక్షకు హాజరయ్యాడు. ఫలితాల్లో నెగెటివ్గా రావడంతో ధోని నేడు చెన్నైకి వెళ్లి శిక్షణా శిబిరంలో పాల్గొంటాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్ వస్తేనే యూఏఈ విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు. కుటుంబ సభ్యులు లేకుండా... ఈ నెల 22న సూపర్ కింగ్స్ టీమ్ యూఏఈకి బయల్దేరనుంది. అయితే ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులెవరినీ తీసుకు వెళ్లరాదని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ‘ప్రస్తుతం టీమ్ సభ్యులు, సహాయక సిబ్బంది మినహా ఎవరూ రారు. లీగ్ సాగుతున్న కొద్దీ మున్ముందు ఏదైనా దశలో దీనిపై పునరాలోచిస్తాం. అవకాశాన్ని బట్టి అప్పుడు కుటుంబ సభ్యులను అనుమతించే విషయం పరిశీలిస్తాం’ అని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. నాయర్ కోలుకున్నాడు కర్ణాటక బ్యాట్స్మన్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరుణ్ నాయర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. గత నెలలో కోవిడ్–19 బారిన పడిన అతను 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందాడు. చికిత్స అనంతరం ఈ నెల 8న అతనికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా ‘నెగెటివ్’గా తేలాడు. దాంతో నాయర్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే ఈ ఫలితంతో అతను యూఏఈ వెళ్లేందుకు అవకాశం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోని ఇతర ఆటగాళ్లలాగే కరుణ్ కూడా మళ్లీ మూడు సార్లు కరోనా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందిన కరుణ్ నాయర్... మూడేళ్ల క్రితం చివరి సారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
‘ట్రిపుల్ సెంచరీ’ హీరోకు కరోనా!
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు వారాల క్రితం కరుణ్ నాయర్.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్ నాయర్ సెల్ఫ్ హెమ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు ఐసోలేషన్లో ఉన్న నాయర్కు నాలుగు రోజుల క్రితం జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో కోలుకున్నట్లు సమాచారం. గత నెల్లో చేతన్ చౌహాన్ కరోనా బారిన పడగా, ఆపై కరోనా వైరస్ సోకిన క్రికెటర్ కరుణ్ నాయర్ కావడం గమనార్హం.(ఒకటో నంబర్ హెచ్చరిక...) ఐపీఎల్-13వ సీజన్లో భాగంగా కరుణ్ నాయర్ కింగ్స్ ఎలెవన్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మళ్లీ భారత జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నాయర్.. ఐపీఎల్ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. వచ్చే నెల 19వ తేదీ నుంచి జరుగనున్న ఐపీఎల్ జరగడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ రాగా, ఈ నెల 20వ తేదీ తర్వాత అన్ని ఫ్రాంచైజీలు యూఏఈకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో కరోనా కేసులు వెలుగు చూడటం సవాల్ మారింది. మొత్తం బయో సెక్యూర్ పద్ధతిలో జరిగే ఐపీఎల్-2020.. ముందుగా క్రికెటర్లకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ధోని కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్లు వచ్చిన తర్వాత యూఏఈకి బయల్దేరనున్నాడు. కాగా, కరుణ్ నాయర్కి ముందుగా కరోనా వచ్చి తగ్గిపోవడం కాస్త ఊరట కల్గించే అంశమే. కరుణ్ నాయర్కు కరోనా సోకిన విషయాన్ని గోప్యంగా ఉంచడంతో అది వెలుగులోకి రాలేదు. కాగా, 2016లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తర్వాత భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నాయర్ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్గా కరుణ్ తన మూడో టెస్టులోనే రికార్డు నెలకొల్పడం విశేషం. అదే సమయంలో తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చిన ఏకైక భారత ఆటగాడిగా గుర్తింపు పొందడం విశేషం.(ఈసారి హెలికాప్టర్ షాట్లతో పాపులర్..!) -
ప్రేయసిని వివాహమాడిన టీమిండియా క్రికెటర్
జైపూర్ : టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి సనయ టాంకరివాలాతో కరుణ్ వివాహం ఉదయ్పూర్లో ఘనంగా జరిగింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం రాత్రి వివాహబంధంతో ఒకటైయ్యారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను కరుణ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ నూతన జంటకు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యార్, అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ ఆరోన్ వీరి విహహానికి హాజరయ్యాడు. కాగా కెరీర్లో కేవలం ఆరు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం వచ్చిన కరుణ్.. ట్రిపుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఫాం కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా తన ప్రేయసిని వివాహం చేసుకుని రెండో ఇన్సింగ్స్ను ప్రారంభించాడు. -
శుబ్మన్ మళ్లీ శతకం మిస్
మైసూర్: యువ బ్యాట్స్మన్ శుబ్మన్ గిల్ (137 బంతుల్లో 92; 12 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో అతడు శతకానికి 8 పరుగుల దూరంలో ఔటయ్యాడు. తొలి మ్యాచ్లో శుబ్మన్ 90 పరుగులు చేశాడు. ప్రస్తుత మ్యాచ్లో అతడికి తోడు మిడిలార్డర్ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) రాణించడంతో భారత్ ‘ఎ’ తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (5), ప్రియాంక్ పాంచల్ (6) త్వరగానే వెనుదిరిగినా... శుబ్మన్, నాయర్ మూడో వికెట్కు 135 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సభ్యులైన పేసర్లు ఫిలాండర్, ఇన్గిడి, స్పిన్నర్ ముతుస్వామిలను దీటుగా ఎదుర్కొన్నారు. సిపామ్లా బౌలింగ్లో గిల్ పెవిలియన్ చేరాక... కరుణ్కు కెపె్టన్ వృద్ధిమాన్ సాహా (86 బంతుల్లో 36; 5 ఫోర్లు) సహకారం అందించాడు. అబేధ్యమైన నాలుగో వికెట్కు వీరు 67 పరుగులు జోడించారు. వెలుతురు సరిగా లేని కారణంగా మంగళవారం 74 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. -
కరుణ్తో నేను స్వయంగా మాట్లాడా!
ముంబై: వరుసగా ఆరు టెస్టుల్లో భారత జట్టుతో పాటు ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకుండానే వేటు పడిన బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ ఎంపికపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇంగ్లండ్తో తనను ఎందుకు ఆడించలేదనే విషయం తనకు తెలీదని, ఈ విషయంపై సెలక్టర్లు తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని కరుణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెస్కే స్పందించారు. ‘వెస్టిండీస్తో సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన తర్వాత నేనే స్వయంగా కరుణ్తో మాట్లాడాను. జట్టులోకి ఎలా అతను తిరిగి రావచ్చో కూడా చెప్పాను. ఆటగాళ్లతో మాట్లాడే విషయంలో సెలక్షన్ కమిటీకి చాలా స్పష్టత ఉంది. క్రికెటర్లకు సమాచారం అందించడం గురించి మా కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఆటగాళ్లు మాతో విభేదించినా సరే అతడిని తప్పించేందుకు సరైన కారణం చెప్పగలగాలి. రంజీ ట్రోఫీలో, భారత్ ‘ఎ’ తరఫున కరుణ్ మరిన్ని పరుగులు సాధించాలి. టెస్టుల్లో అతని పేరు పరిశీలనలోనే ఉంది. అందుకే దేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు చేయమని నేను సలహా ఇచ్చా’ అని ప్రసాద్ వివరించారు. మరో వైపు ఇంగ్లండ్లో కూడా తుది జట్టులో స్థానం దక్కకపోవడంపై నాయర్తో తన సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ మాట్లాడారని కూడా ఎమ్మెస్కే చెప్పారు. ‘ఇంగ్లండ్ పర్యటనలో కూడా నాయర్లో స్ఫూర్తి నింపేందుకు దేవాంగ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో సుదీర్ఘంగా అతనితో మాట్లాడారు. త్వరలోనే అవకాశం దక్కుతుందని, దాని కోసం వేచి చూడాలని చెప్పారు’ అని చీఫ్ సెలక్టర్ వెల్లడించారు. వెస్టిండీస్తో సిరీస్ కోసం జట్టును ప్రకటించడానికి ముందు నాయర్ తాజా వ్యాఖ్యలు చేశాడు. -
బ్యాట్తోనే సమాధానం చెబుతా: కరుణ్ నాయర్
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్లో చోటు కోల్పోయిన కరుణ్ నాయర్ జాతీయ జట్టులో పునరాగమనంపై దీటుగా స్పందించాడు. ‘జట్టుకు దూరమవడం అనేది సహజంగా ఎవరికైనా బాధ కల్గిస్తుంది. దీన్ని అధిగమించడం కష్టం కావచ్చు. ఇక్కడ నన్ను పక్కకు పెట్టడానికి సెలక్టర్లు, మిగతా వారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి. ఓ క్రికెటర్గా వారి నిర్ణయానికి తలొగ్గడం తప్పా..ఏమి చేయలేని పరిస్థితి. రానున్న రోజుల్లో బ్యాట్తోనే సమాధానం చెబుతా’అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు. త్వరలో టీమిండియా జట్టులో చోటు దక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు కరుణ్ నాయర్. మరొకసారి భారీ స్కోరు సాధించి తన సత్తా చూపించాలనుకుంటున్నానని తెలిపాడు. ఇందుకోసం చాలా ఆతృతగా ఉన్నానని, భారత్ తరపున ట్రిపుల్ సెంచరీలు చేసిన ఇద్దరు ఆటగాళ్లలో తాను ఒకడిని కావడం గర్వంగా ఉందన్నాడు. ఇక్కడ తాను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదనే అభిప్రాయాన్ని నాయర్ వ్యక్తం చేశాడు. తాను మాట్లాడటానికి ఏమీ లేదన్న నాయర్.. ఇందుకు తన బ్యాటే సమాధానం చెబుతుందన్నాడు. అదే సమయంలో ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ బసుతో అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ సార్తో పాటు బ్యాటింగ్ కోచ్ బంగర్తో చాలా సమయం గడిపేవాడిని. నెట్ ప్రాక్టీస్లో త్రోడౌన్స్ ఆడేవాన్ని. కానీ ఎక్కువలో ఎక్కువగా బసుతో ఉండేవాడిని. ప్రస్తుత భారత జట్టులో నువ్వో అత్యుత్తమ ఫిట్నెస్ కల్గిన ఆటగాడివని సర్ అంటుండేవాడు. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. భవిష్యత్తులో ఇంతే ఫిట్గా ఉండాలనుకుంటున్నాను' అని కరుణ్ అన్నాడు. -
నేనిప్పుడు బాగా మెరుగయ్యా: నాయర్
బెంగళూరు: రెండేళ్లక్రితం ఉన్నట్లు ఇప్పుడు లేనని, ఫిట్నెస్ పరంగా, ఆటపరంగా చాలా మెరుగయ్యానని భారత క్రికెటర్ కరుణ్ నాయర్ చెప్పాడు. అఫ్గానిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్టులో పాల్గొనే భారత జట్టులో సభ్యుడిగా ఉన్న కరుణ్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడాడు. ‘గత ఏడాదిన్నర కాలంగా జట్టుకు దూరమయ్యాను. దీంతో ఆటలో నైపుణ్యం, ఫిట్నెస్ పెంచుకునే పనిలో నిమగ్నమయ్యా. దేశవాళీ క్రికెట్లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేశాను. గతంలోకంటే ఇప్పుడు చాలా పరిణతి సాధించానని నాకు అనిపిస్తుంది’ అని నాయర్ చెప్పాడు. చివరిసారిగా గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టు ఆడిన కరుణ్... ఇప్పుడు అఫ్గానిస్తాన్తో జరగనున్న చారిత్రక టెస్టు కోసం తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అలాగే ఇంగ్లండ్లో పర్యటించే భారత ‘ఎ’ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తన దృష్టి మాత్రం ప్రస్తుత టెస్టుపైనే ఉందన్నాడు. స్పిన్ ట్రాక్ భారత్ కంటే తమకే అనుకూలమన్న అఫ్గాన్ కెప్టెన్ అస్గర్ స్తానిక్జాయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘అది ఏమాత్రం తగని వ్యాఖ్య. ఎందుకంటే ఇంకా ఒక్క టెస్టు కూడా ఆడని జట్టు కెప్టెన్ అలా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. టెస్టుల్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అఫ్గాన్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ జద్రాన్ ప్రతిభావంతులే అయినప్పటికీ రెడ్ బాల్ (టెస్టులాడే బంతి)తో ఆడటం ఇదే తొలిసారి. పరిమిత ఓవర్ల ఆట వేరు. సంప్రదాయక టెస్టులు వేరన్న సంగతి గుర్తుంచుకోవాలి. టెస్టులు ఐపీఎల్ ఆడినంత ఈజీ కాదు. చాలా భిన్నమైనవి’ అని కరుణ్ నాయర్ అన్నాడు. ఇంగ్లండ్పై అరంగేట్రం చేసిన సిరీస్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించినప్పటికీ జట్టులో స్థానం కోల్పోవడంపై మాట్లాడుతూ ‘అది రెండేళ్లక్రితం సంగతి. ఇప్పుడు మళ్లీ చేస్తే తప్పకుండా విషయం అవుతుంది. అయితే డబుల్, ట్రిపుల్ కంటే జట్టు గెలవడమే ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. -
కరుణ్ నాయర్కు మళ్లీ అవకాశం
బెంగళూరు: ఊహించినట్లుగానే అఫ్గానిస్తాన్తో భారత్ ఆడాల్సిన ఏకైక టెస్టుకు బీసీసీఐ దృష్టిలో తగిన ప్రాధాన్యత లభించలేదు. పూర్తిగా ద్వితీయ శ్రేణి జట్టు కాకపోయినా... నలుగురు ప్రధాన ఆటగాళ్లను పక్కన పెట్టి ఈ మ్యాచ్ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించారు. కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపించిన విరాట్ కోహ్లి ఈ టెస్టుకు దూరం కావడం ముందే ఖరారైంది. అతనితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు బోర్డు విశ్రాంతినిచ్చింది. బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్లలో ‘ఎ’ ప్లస్ కేటగిరీలో ఉన్న ఈ నలుగురికి కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరామం కల్పించగా... ఇదే జాబితాలో ఉన్న శిఖర్ ధావన్ మాత్రం టెస్టు ఆడబోతున్నాడు. కోహ్లి గైర్హాజరులో అజింక్య రహానే జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపడతాడు. ఏడాది క్రితం కోహ్లి గాయపడినప్పుడు ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో కూడా రహానే సారథిగా వ్యవహరించాడు. ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ ఈ టెస్టు కోసం తిరిగి రానున్నారు. దక్షిణాఫ్రికాలో గాయంతో రెండు టెస్టులకు దూరమైన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పునరాగమనం చేయగా... అతని స్థానంలో ఆడిన పార్థివ్, ప్రత్యామ్నాయంగా దక్షిణాఫ్రికాకు వెళ్లిన దినేశ్ కార్తీక్లలో ఎవరికీ చోటు దక్కలేదు. కుల్దీప్, శార్దుల్ కూడా... దక్షిణాఫ్రికాతో సిరీస్లో పాల్గొన్న భారత టెస్టు జట్టుతో పోలిస్తే ముగ్గురికి కొత్తగా అవకాశం లభించింది. భారత్ తరఫున ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్మన్ కరుణ్ నాయర్కు మళ్లీ స్థానం లభించింది. అతను ఇప్పటి వరకు భారత్ తరఫున 6 టెస్టులు ఆడాడు. చెన్నైలో ఇంగ్లండ్పై చారిత్రాత్మక (303 నాటౌట్) ఇన్నింగ్స్ తర్వాత కరుణ్ వరుసగా 26, 0, 23, 5 స్కోర్లు చేశాడు. అయితే రంజీ ట్రోఫీలో మెరుగ్గా రాణించడంతో అతనికి మరో అవకాశం దక్కింది. అయితే కేఎల్ రాహుల్ నుంచి నాలుగో స్థానానికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో నాయర్కు తుది జట్టులో చోటు కష్టమే. మరోవైపు పేసర్ శార్దుల్ ఠాకూర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్లను కూడా ఈ టెస్టుకు ఎంపిక చేశారు. కుల్దీప్ 2 టెస్టులు ఆడగా... శార్దుల్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. జూన్ 14 నుంచి 18 వరకు బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ టెస్టు జరుగుతుంది. అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుకు భారత జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పుజారా, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, షమీ, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, శార్దుల్ ఠాకూర్. -
అదిరే ఫీల్డింగ్..కళ్లు చేదిరే క్యాచ్లు
-
అతనో వినూత్నమైన కెప్టెన్: నాయర్
సాక్షి, స్పోర్ట్స్ : ఈ సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్న రవిచంద్రన్ అశ్విన్పై ఆ జట్టు ఆటగాడు కరుణ్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. ‘అశ్విన్ చాలా మంచి వ్యక్తి. వినూత్నమైన విధానాలతో జట్టును ముందుకు నడిపిస్తాడు. అతని నాయకత్వంలో ఆడటానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని’ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఆడటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు దోహదపడుతుందని కరుణ్ నాయర్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెటర్గా ఉన్న తనకు ఐపీఎల్లో ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో కూడా మెరుగ్గా రాణించగలననే నమ్మకం వచ్చిందని పేర్కొన్నాడు. సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన ఈ కర్ణాటక ఆటగాడు ఇప్పుడు అతనితో కలిసి ప్రయాణించబోతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్లో పంజాబ్ జట్టు.. కరుణ్ నాయర్తో పాటు కర్ణాటక యువ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లను కొనుగోలు చేయడం ద్వారా టైటిల్ వేటలో దూసుకుపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్కు ప్రాతినిథ్యం వహించిన కరుణ్ను ఈ సీజన్లోని పంజాబ్ జట్టు యాజమాన్యం రూ. 5.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. -
కరుణ్ నాయర్ మెరుపు సెంచరీ
కోల్కతా: కరుణ్ నాయర్ (52 బంతుల్లో 100; 8 ఫోర్లు, 7 సిక్స్లు) అద్భుత సెంచరీతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సూపర్ లీగ్లో బుధవారం కర్ణాటక 123 పరుగులతో జార్ఖండ్పై గెలుపొందింది. తొలుత కర్ణాటక 201 పరుగులు చేయగా జార్ఖండ్ 78 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్ల్లో తమిళనాడుపై బెంగాల్; ముంబైపై రాజస్తాన్; బరోడాపై యూపీ గెలుపొందాయి. -
48 బంతుల్లో సెంచరీ
విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో కరుణ్ నాయర్ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడిన నాయర్ 48 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో చెలరేగిన నాయర్ 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అంతకముందు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో నాయర్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. 42 బంతుల్లో 77 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఊపును తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో కూడా కొనసాగించిన నాయర్ శతకంతో మెరిశాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన తమిళనాడు 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని మూటగట్టుకుంది. -
నేను చాలా నిరాశ చెందా: కరుణ్ నాయర్
న్యూఢిల్లీ:వచ్చే నెల్లో దక్షిణాఫ్రికాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్కు ఎంపిక కాకపోవడం చాలా నిరాశకు గురిచేసిందని భారత తరపున కొద్ది మ్యాచ్లు మాత్రమే ఆడిన కరుణ్ నాయర్ తెలిపాడు. జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై భారత్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఇప్పటికే జట్లను భారత సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టెస్టు జట్టులో చోటు ఆశించిన కరుణ్ నాయర్కి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. రెండు రోజుల క్రితం ప్రకటించిన వన్డే జట్టులోనూ చోటివ్వలేదు. దీనిలో భాగంగా మాట్లాడిన కరుణ్ నాయర్..'దక్షిణాఫ్రికా పర్యటనకి నన్ను ఎంపిక చేయకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. గత ఏడాది ట్రిఫుల్ సెంచరీ చేశాను. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో కూడా కొన్ని శతకాలు సాధించాను. ఈ బ్యాటింగ్ ప్రదర్శనతో నన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటారని ఆశించాను. కానీ ఎంపిక కాలేదు. ఆ ప్రభావం నా ఆటపై కూడా పడింది. రంజీల్లో ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నన్ను సఫారీ ఎంపిక చేయని ప్రభావం కనబడింది' అని కరుణ్ నాయర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఏడాది ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్ తరపున సెహ్వాగ్ తరువాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నాయర్ నిలిచాడు. -
సెహ్వాగ్ ఒకే.. యువ సంచలనాన్ని ఎలా మరిచారు?
సాక్షి, స్పోర్ట్స్ : భారత్, న్యూజిలాండ్ల మధ్య ఇక్కడ జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్కు టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని రెండో గేట్కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే డీడీసీఏ చేసిన పెద్ద తప్పిదంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో చాలా రికార్డులు సాధించాడంటూ కొన్ని ఘనతలపై ఏర్పాడు చేసిన బోర్డులో డీడీసీఏ పెద్ద తప్పిదం చేసింది. 'భారత్ తరఫున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యామ్స్ మెన్ సెహ్వాగ్' అంటూ రాశారు. కానీ కరుణ్ నాయర్ ను డీడీసీఏ మరిచిపోవడం దుమారం రేపింది. భారత్ నుంచి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించింది ఇద్దరు క్రికెటర్లు కాగా, తొలి ఆటగాడు సెహ్వాగ్, రెండో ఆటగాడు కరుణ్ నాయర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందులోనూ ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కూడా ఐపీఎల్ లో ఢిల్లీ (ఢిల్లీ డేర్ డెవిల్స్) జట్టుకే ప్రాతినిధ్యం వహించినా అతడ్ని డీడీసీఏ ఎలా మరిచిపోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. టెస్టుల్లో రెండు సార్లు సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. యువ సంచలనం కరుణ్ నాయర్ 2016లో చెన్నైలోని చిదంబరం స్డేడియంలో ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టెస్టులో 303 పరుగులు చేసిన విషయాన్ని యావత్ భారత దేశ క్రికెట్ ప్రేమికులు గుర్తించుకోగా.. డీడీసీఏకు మాత్రం ఈ విషయం లెక్కలోకి రాదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చురకలంటించారు. DDCA honours @virendersehwag , forgets @karun126’s triple hundred. On Gate No 2, “ only Indian to score 300 in Tests”. New board maybe pic.twitter.com/jrFlTLguUM — Sahil Malhotra (@Sahil_Malhotra1) 31 October 2017