-
● మంత్రి పదవికి రాజీనామా చేసిరా.. ఎవరికి ప్రజాదరణ ఉందో తేల్చుకుందాం ● బండి సంజయ్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ లీడర్లు
కరీంనగర్టౌన్: గత కొద్ది రోజులుగా బీజేపీ, బండి సంజయ్పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకు లు తీవ్రంగా స్పందించారు. ఇకనైనా పిచ్చివాగుడు మానుకోవాలని హెచ్చరించారు. పొన్నంకు దమ్ముంటే నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ తరఫున పార్టీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ డి.శంకర్, కార్పొరేటర్ రమణారెడ్డి తదితరులు శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ కల్టెకరేట్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని పొన్నం మరిచిపోయారని అన్నారు. చివరకు న్యాయస్థానాలపై కూడా ఆరోపణలు చేస్తూ లిక్కర్స్కాం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్ట్రోబాండ్స్ ఇయ్యగానే... కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు అని, బెయిల్కు, బాండ్స్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సుప్రీంకోర్టు పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలని కోరారు. ఏ సర్వే చూసినా బండి సంజయ్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నరని తేలడంతో పొన్నంకు ఫ్రస్టేషన్ ఎక్కువైందని, అందుకే కరీంనగర్ నుంచి అభ్యర్థి ఎవరో కూడా తేల్చలేకపోతున్నరని విమర్శించారు. ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోతే మంత్రి పదవికే ఎసరొస్తుందనే భయం పొన్నంకు పట్టుకుందన్నారు. మంత్రిని అని మరిచిపోయి పొన్నం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ సభ్యసమాజం అసహ్యించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ ఇకనైనా బండి సంజయ్పై అవాకులు చవాకులు మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. -
ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సరెండర్!
హుజూరాబాద్: స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో విధులు నిర్వహించే ఆరుగురు ఉద్యోగులను ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో వారు శుక్రవారం ఆర్ఎం ఆఫీస్లో రిపోర్టు చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ ఆర్టీసీ డ్రైవర్ వద్ద హుజూరాబాద్ డిపో మేనేజర్ సామల శ్రీకాంత్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. ఈ క్రమంలో డిపోలో విజిలెన్స్ అధికారులు రెండు రోజులపాటు విచారణ చేపట్టారు. ఇందులో డీఎం శ్రీకాంత్ అవినీతి అక్రమాలకు సహకరించినట్లు తేలిన డిపో పరిధిలోని ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. డీఎం శ్రీకాంత్ చిన్న చిన్న కారణాలు చూపుతూ, అనుమతి లేకుండా అత్యవసరంగా సెలవులు తీసుకున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసి, డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వని పక్షంలో పలువురికి చార్జీ మెమోలు ఇచ్చినట్లు తేల్చారని సమాచారం. వాటిని విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి, కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇన్చార్జి డీఎంగా వెంకటేశ్వర్లు.. హుజూరాబాద్ ఇన్చార్జి డీఎంగా హుస్నాబాద్ డీఎం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎం ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ డీఎంకు సహకరించడమే కారణం? -
దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయండి
సిరిసిల్లటౌన్/కరీంనగర్ కార్పొరేషన్: అధికారం నుంచి ప్రజలు తిరస్కరించినా కేసీఆర్, కేటీఆర్లకు అహం పోలేదని, తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటుండ్రని.. దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయండని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులుగా నిలబెట్టిన వారే ఆ పార్టీ అవినీతి, నియంతృత్వంపై ఛీత్కరించుకుంటూ పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అందించే కాంగ్రెస్పైనే ప్రజల ఆశీర్వాదం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలేవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలువనోళ్లు రాజకీయం చేస్తే.. ఇట్లానే ఉంటుందని బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి విమర్శించారు. ఆ పార్టీల నియంతృత్వంపై ప్రజలు విసిగిపోయారని, రాహుల్ నేతృత్వంలో అందించే ప్రజాపాలనకే రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటై సిరిసిల్లకు కేటాయించిన మెగా టెక్స్టైల్ క్లస్టర్ను వరంగల్కు తరలించి ఇక్కడి కార్మికుల ఉసురు పోసుకున్నారని ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచి పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. కూడబల్కొనే బీజేపీ, బీఆర్ఎస్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ కూడబల్కొని చెబుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో మాట్లాడారు. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ అసహనంతో, పిచ్చిపట్టి మాట్లాడుతున్నారన్నారు. రైతుల సమస్యలు, ప్రభుత్వం కూలిపోవడం, రేవంత్రెడ్డి బీజేపీతో కలవడం..ఏ అంశమైనా ఈ రెండు పార్టీలు ఒకే మాట మాట్లాడుతున్నాయని, కుమ్మక్కుకు ఇదే నిదర్శనమన్నారు. ఉత్తర భారత్లో బలంగా ఉన్నామనుకొన్న బీజేపీ కోటలకు బీటలువారుతున్నాయని, అందుకే దక్షిణ భారత్ మీద అమిత్షా దృష్టి పెట్టారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేసి ఇవ్వాల్సిన టోకెన్ బిల్లులు రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను సంతృప్తి పరచడానికి వందల జీవోలు తెచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులే ఆ పార్టీని వీడుతున్నరు.. రాష్ట్ర విభజన హామీలేవీ బీజేపీ నెరవేర్చలేదు.. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ -
ముగ్గురు ‘ఉపాధి’ కూలీలకు గాయాలు
సుల్తానాబాద్రూరల్/సుల్తానాబాద్(పెద్దపల్లి): ఉపాధిహామీ ద్వారా సుద్దాల పెద్దమ్మకుంటలో శుక్రవారం పూడికతీస్తున్న కూలీలపై బండరాయి దొర్లి, మట్టిపెళ్లలు పడ్డాయి. ఈఘటనలో ముగ్గురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఎంపీడీవో దివ్యదర్శన్రావు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దమ్మకుంట పూడికతీత పనుల్లో 163 మంది కూలీలు పనిచేస్తున్నారు. అందులో 20 మంది ఒక బృందంగా ఏర్పడి పూడిక తీస్తుండగా గట్టు కుంగి దానిపై ఉన్న బండరాయి కిందకు జారిపడింది. ఆ క్రమంలోనే మట్టిపెళ్లలు తగిలి అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలు ఆవునూరి తార, కల్వల లింగమ్మ, బుర్ర స్వరూపకు గాయాలయ్యాయి. తోటికూలీలు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచా రం అందుకున్న ఈజీఎస్ ఏపీడీ సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి కూలీలను పరామర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కొత్తపల్లి(కరీంనగర్): బైక్ను మరో బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీ సుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలంలోని చింతకుంట శాంతినగర్కు చెందిన ఠాకు విశాల్ శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై కమాన్పూర్ పెట్రోల్ బంకుకు వెళ్లాడు. పెట్రోల్ కొట్టించుకొని, తిరిగి వస్తూ డివైడర్ దాటుతుండగా భూమి రాకేశ్ బైక్పై వేగంగా వచ్చి, ఢీకొట్టాడు. ఈ ఘటనలో విశాల్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో కరీంనగర్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడి తల్లి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రైతులు నష్టపోకుండా చర్యలు
● జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి కరీంనగర్రూరల్/చొప్పదండి: ధాన్యం తూకంలో కోతలేకుండా రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులపై ఉందని జిల్లా మార్కెటింగ్ అధికారి వి.పద్మావతి అన్నారు. శుక్రవారం కరీంనగర్ మండలం నగునూరు, చొప్పదండి మండలం కొలిమికుంట, గుమ్లాపూర్, భూపాలపట్నం, వెదురుగట్టలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రతీకేంద్రంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ప్యాడీక్లీనర్ల ద్వారా ధాన్యాన్ని శుభ్రపరుచుకోవాలని కోరారు. తూకంలో కోత లేకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని, రైసుమిల్లర్లు ధాన్యం దింపుకోవడంలో ఇబ్బందులకు గురిచేసినట్లయితే సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం డీఎంవో చొప్పదండి మార్కెట్యార్డును సందర్శించారు. మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఏపీఎం నర్మదతోపాటు స్థానిక పీఏసీఎస్, ఐకేపీ అధికారులు ఉన్నారు. -
ఒలింపియాడ్లో ‘పారమిత’ ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): ఇటీవల నిర్వహించిన ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్(ఐటీవో)లో కొత్తపల్లి మండలంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. రాష్ట్రస్థాయిలో గణితంలో వెల్ది హర్షిణి(ఏడోతరగతి) 4వ ర్యాంకు, అర్హాన్ లతీఫ్ (ఎనిమిదో తరగతి) 4వ ర్యాంకు, సామాన్యశాస్త్ర విభాగంలో ఎన్.రుషిక(తొ మ్మిదో తరగతి) 7వ ర్యాంకు సాధించి, పతకాలు, బహుమతులు గెలుపొందారని హెచ్ఎం రితేశ్ మెహతా తెలిపారు. మరో ఐదుగురు విద్యార్థులు స్ఫూర్తి(గణితం), జి.సహస్ర, ఎస్.సిరి(సామాన్యశాస్త్రం), యశ్మిత్ పటేల్, రిధి పబ్బతి(ఆంగ్లం) మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఇ.ప్రసాదరావు శుక్రవారం అభినందించారు. డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, అనూకర్రావు, రాకేశ్, వి.యు.ఎం.ప్రసాద్, వినోద్రావు, ప్రోగ్రాం హెడ్ గోపీకష్ణ, కో–ఆర్డినేటర్ రాము, గైడ్ టీచర్లు ప్రదీప్ కుమార్, చంద్రమౌళి శర్మ, హరీశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కంగ్రాట్స్.. సహన
● సివిల్స్ ర్యాంకర్కు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ‘మారం’ అభినందన కరీంనగర్ అర్బన్: సివిల్స్లో ర్యాంకు సాధించిన కొలనుపాక సహనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో భవనంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సివిల్స్లో కరీంనగర్ యువత సత్తా చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు. సహన సివిల్స్లో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సహన మంచి అధికారిగా సేవలందించి కరీంనగర్ పేరును చిరస్థాయిగా నిలపాలని ఆకాంక్షించారు. టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి, మహిళా జేఏసీ చైర్పర్సన్ ఇరుమల్ల శారద, సబిత, సునీత, శైలజ, సుస్మిత, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో గొర్రెల కాపరి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అప్పుల బాధతో ఓ గొర్రెల కాపరి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తుల వివరాల ప్రకారం.. రాగట్లపల్లికి చెందిన నెత్తెట్ల చిన్న మల్లయ్య(48) ఇల్లు నిర్మించుకునేందుకు, భూమిని అభివృద్ధి చేయడం కోసం సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుండటంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య సత్తవ్వ, కుమారుడు అజయ్, కూతురు అమ్ములు ఉన్నారు. మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ దాసరి సుజాత, గ్రామస్తులు కోరారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఎప్సెట్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
● స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బట్టు మల్లయ్యకరీంనగర్: నగరంలోని సప్తగిరికాలనీ కేజీబీ వీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ ప్రత్యేక శిక్షణ తరగతులను స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బట్టు మల్లయ్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్జెక్టులకు సంబంధించిన అనుమానాలను శిక్షకులను అడిగి, నివృత్తి చేసుకుంటూ, కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించాలన్నారు. కేజీవీబీల్లో చదివేవారు చాలా పేదరికం నుంచి వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా మన సొంత పిల్లల్లా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్రావు, జిల్లా జెండర్ అండ్ ఈక్విటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ డెబోరా కృపారాణి, కేజీబీవీ ప్రత్యేక అధికారి పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ట్రాక్టర్ను ఢీకొన్న లారీ సుల్తానాబాద్రూరల్: కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై ధాన్యం లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గర్రెపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్తో ట్రాక్టర్ సుల్తానాబాద్కు వస్తోంది. ఈక్రమంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడగా డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, అందులో ధాన్యం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. దాదాపు గంటకుపైగానే వాహనాలు నిలిచి ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వేంకటేశ్వరస్వామి ఫొటోలు ధ్వంసం● జగదేవుపేట ఆలయంలో దుండగుల దుశ్చర్యవెల్గటూర్(ధర్మపురి): మండలంలోని జగదేవుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దుండగులు ప్రవేశించి, స్వామివారి ఫొటోలు, పూజా సామగ్రి ధ్వంసం చేశారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి వెళ్లి, స్వామివారి ఫొటోలు, కలశం, ఆలయ ప్రాంగణంలోని తులసి గద్దెను పక్కనున్న కాలువలో, పంట పొలాల్లో పడేశారు. ఈ ఘటనపై ఆలయ కమిటీవారు, దీక్షాస్వాములు శుక్రవారం ఉదయం వెల్గటూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఉమాసాగర్ ఆలయాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. గ్రామానికి చెందిన కొందరు అన్యమతస్తులే ఇలా చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రతీ పోలింగ్ బూత్లో మెజార్టీ రావాలి
కరీంనగర్ కార్పొరేషన్: ప్రతీ పోలింగ్ బూత్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావాలని, ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లోకసభ ఎన్నికల సమాయత్తంలో భాగంగా గురువారం తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని ఏఎంఆర్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడారు. మానకొండూరు నియోజకవర్గంలోని 316 పోలింగ్ బూత్లన్నింటిలోనూ మెజార్టీ రావాలన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కొన్ని బూత్ల్లో తక్కువ ఓట్లు వచ్చాయని, వాటిని సరిచేసుకోవాలని తెలిపారు. జిల్లా, రాష్ట్ర లీడర్లు అంటూ ఎవరూ లేరని, ఎవరెక్కువ ఓట్లు తీసుకువస్తే వాళ్లే లీడర్లని తెలిపారు. బూత్ల్లో 70 శాతం ఓట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు అడగాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లపై క్షేత్రస్థాయిలో చర్చ పెట్టాలని, రాష్ట్రానికి ఏం చేశారో ఎండగట్టాలన్నారు. ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిందేమిలేదని, కనీసం గ్రామాల్లోకి కూడా రాలేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతీ గ్రామానికి వెళ్లానన్నారు. పోలంపల్లి లాంటి పెద్ద ఊరికి, మండల కేంద్రాలకు కూడా ఎంపీ పోలేదన్నారు. ఈ జి ల్లా కాని వినోద్కుమార్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. పార్లమెంట్లో గొంతు కావా లంటున్నారని, పార్లమెంట్లో ఎవరేం మాట్లాడామో చర్చకు రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం,రూ.500 గ్యాస్, 200 యూనిట్లు విద్యుత్ ఉచితం వంటి పథకాలు అమలు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామన్నారు. వరికి మద్దతు,బోనస్ కూడా ఇస్తామని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తాము నలుగురం ఎమ్మెల్యలం కలిసికట్టుగా ఉన్నామని, ఏ సమస్య ఉన్నా తమవద్దకు రావొచ్చన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీ వొడితెల ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. వేదికపై వెలిచాల కరీంనగర్ లోకసభ అభ్యర్థిత్వం ఖరారైందనే ప్రచారం నేపథ్యంలో వెలిచాల రాజేందర్రావు ఈ వేదికపై కనిపించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, తన పేరును పరిశీలిస్తున్నారన్నారు. ప్రవీణ్రెడ్డి తనకు మంచి మిత్రుడని, తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డ అని, వీరిరువురు కూడా టికెట్కు అర్హులేనన్నారు. పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ నాయకుడిని తోసేసిన ‘కవ్వంపల్లి’ సమావేశంలో ఓ నాయకుడిని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తోసివేయడం వివాదంగా మారింది. లక్ష్మీపూర్కు సంబంధించి ఎల్వోసీ జారీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు చెప్పుకునేందుకు పార్టీ నాయకుడు ఎడ్ల భద్రయ్య వేదిక వద్దకు వచ్చారు. అతడితో మాట్లాడుతూనే అసహనానికి గురైన కవ్వంపల్లి వేదిక మీది ను ంచి దిగి భద్రయ్యను తోసివేశారు. దీంతో భద్రయ్యతో పాటు, వెంట వచ్చిన కార్యకర్తలు కవ్వంపల్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పొన్నం సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. బీజేపీ, బీఆర్ఎస్లను ఎండగట్టండి మంత్రి పొన్నం ప్రభాకర్ -
కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలి
కరీంనగర్రూరల్: ఉపాధిహామీ కూలీలకు సరైన నీడ సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని డీఆర్డీవో శ్రీధర్ ఆదేశించారు. గురువారం కరీంనగర్ మండలం చామనపల్లి, బహుదూర్ఖాన్పేట గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించారు. ఆయా నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ నీళ్లు పట్టాలని సూచించారు. అనంతరం ఉపాధికూలీలు పనిచేస్తున్న ప్రాంతాన్ని తనిఖీ చేశారు. కూలీలకు నీడ కోసం ఏర్పాటు చేసిన షెడ్నెట్ను పరిశీలించారు. షెడ్నెట్ చిన్నదిగా ఉందని, కూలీలందరికీ సరిపడే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. వేసవిలో కూలీలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీవో వెంట ఈజీఎస్ ఏపీవో శోభారాణి, పంచాయతీ కార్యదర్శులు ప్రభాకర్, లావణ్యలున్నారు. -
‘మృతదేహం ప్రకాశం జిల్లా వాసిది’
మానకొండూర్: మండలంలోని ఈదులగట్టెపల్లి ఎస్సారెస్పీ కాకతీయ కాలువ సమీపంలో బుధవా రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం విధితమే. అయితే, అది ప్రకాశం జిల్లా దొనకొండ మండలం భూమనపల్లికి చెందిన మురి కిపూడి చిన్న చెన్నయ్య(36)దిగా గుర్తించామని మానకొండూర్ సీఐ రాజ్కుమార్ గురువారం తెలిపారు. అతను కరీంనగర్లో ఉంటున్న ప్రకాశం జిల్లాకే చెందిన తన్నీరు శ్రీనివాస్ వద్దకు 10 రోజుల క్రితం మేసీ్త్ర పని కోసం వచ్చాడన్నారు. కానీ, తాగుడుకు బానిసై, పనికి వెళ్లకుండా తిరుగుతున్నాడని తెలిపారు. ఇదే విషయాన్ని శ్రీనివాస్ చిన్న చెన్నయ్య తల్లిదండ్రులకు చెప్పాడన్నారు. ఎండదెబ్బ తగిలి చనిపోయి ఉంటాడని మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వాహనాల నిలిపివేతపై నాయకుల నిరసన
కరీంనగర్: పార్కింగ్ స్థలం లేక వాహనాలను రహదారిపైనే నిలుపుతూ కిసాన్నగర్ ప్రజ లను ఇబ్బందికి గురిచేస్తున్న మైత్రి కన్వెన్షన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నగరంలోని కిసాన్నగర్ రహదారి వద్ద అంబేడ్కర్ యూత్ నాయకులు, నగరవాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ సభ్యులు పులిపాక సాయికుమార్ మాట్లాడుతూ కిసాన్నగర్లోని మైత్రి కన్వెన్షన్లో జరుగుతున్న శుభకార్యాలకు వచ్చిన వారు తమ వాహనాలను రహదారిపై, కిసాన్నగర్ గల్లీ ల్లో, ఇళ్ల ఎదుట నిలుపుతుండటంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలపడం వల్ల ప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా మా రిందని తెలిపారు. తక్షణమే మున్సిపల్ కమి షనర్ ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యూత్ సభ్యులు గసికంటీ దీపక్, కనకాల మహేష్, ఆసంపెళ్లి వినయ్ సాగర్, కిసాన్నగర్ వాసులు పాల్గొన్నారు -
ఎమ్మెల్సీ నామినేటెడ్ అవకాశం కల్పించాలి
సప్తగిరికాలనీ(కరీంనగర్): గద్దర్ కూతురు వెన్నెలకు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం అవకాశం కల్పించాలని ప్రజా సంఘాల జెఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ కుసాల సంపత్ అన్నారు. గురువారం కరీంనగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గద్దర్ మరణం అనంతరం ఆయన పేరిట కళాకారులకు గద్దర్ అవార్డును ఇస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయమని, రాజకీయంగా ఆయన బిడ్డ వెన్నెలను గుర్తించి గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్టు కేటాయించినా ఆమె ఓటమిపాలైనప్పటికీ ప్రధానంగా పార్టీలో కేడర్లో గుర్తింపుని ఇవ్వడంలో జాప్యం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు చేసిన గద్దర్ కుటుంబంకు గుర్తింపును ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రాపాల శంకర్, కాల్వ మల్లేశం, జంగాలపల్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ ర్యాంప్ తొలగింపు
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని సిటిజన్ కాలనీలో సెట్బ్యాక్ లేకుండా అక్రమంగా నిర్మించిన ర్యాంప్ను గురువారం పంచాయతీ కార్యదర్శి హిదైతుల్లా ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు. సెట్బ్యాక్ లేకుండా ర్యాంప్ నిర్మించారనే స్థానికుల సమాచారంతో కార్యదర్శి హిదైతుల్లా పరిశీలించి కూల్చివేయించారు. టీఎస్ బీపాస్ నుంచి గృహనిర్మాణానికి అనుమతి తీసుకోవాలని, సెట్బ్యాక్ చేసుకుని నిర్మాణాలు చేపట్టాలని కోరారు. సెట్బ్యాక్ లేకుండా నిర్మిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేస్తామని హెచ్చరించారు. నేటి నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లోని చెన్నకేశవ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలను శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం భూనీల చెన్నకేశవస్వామి కల్యాణం, 22న బండ్ల జాతర, 23న రథోత్సవం, 24న నాగవెల్లి కార్యక్రమాలు జరుపనున్నట్లు వివరించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి విద్యానగర్(కరీంనగర్): కొత్తపల్లి (హెచ్)లో రెండు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొత్తపల్లి మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ బండ కిషన్రెడ్డి, కో కన్వీనర్ చిట్కూరి శ్రీనివాస్, డైరెక్టర్లు ఉమ్మంతుల లక్ష్మారెడ్డి, మ్యాకల పోచమల్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గురువారం కరీంనగర్ ప్రెస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తపల్లిలోని సర్వేనం.127,128లో ఒక కేంద్రాన్ని, సర్వే నం.529, 530లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్కు, జిల్లా వ్యవసాయాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. నియామకం సప్తగిరికాలనీ: ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సాంబారి కొమురయ్యను నియమించినట్లు జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం కొమురయ్యకు నియామక ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా కొమురయ్య మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
లారీలో ఉన్నవి పీడీఎస్ బియ్యమే
హుజూరాబాద్: పట్టణంలోని పరకాల క్రాస్ రోడ్ వద్ద ఈ నెల 10వ తేదీన పోలీసులు పట్టుకున్న బియ్యం పీడీఎస్ రైస్గా నిర్ధారణ అయ్యాయని సివిల్ సప్లయ్ డీటీ వసంతరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. పరకాలలోని ఓ మిల్లు నుంచి పీడీఎస్ బియ్యాన్ని జైశ్రీరామ్ పేరుతో ఉన్న సంచుల్లో నింపి, హుజూరాబాద్ మీదుగా గుజరాత్కు లారీలో తరలిస్తుండగా పోలీసులు అనుమానించి పట్టుకున్నారని పేర్కొన్నారు. 11న తమకు అప్పగించగా బియ్యం శాంపిల్స్ను హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించామన్నారు. రిపోర్టులో 6 నెలల కిందటి పీడీఎస్ రైస్గా తేలాయన్నారు. దీంతో గురువారం రైస్మిలు యజమాని, లారీ డ్రైవర్, క్లీనర్లపై లే కేసు నమోదు చేశామని తెలిపారు. లారీలోని 350 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి, హుజూరాబాద్ పట్టణంలోని సివిల్ సప్లయ్ గోదాంకు తరలించి, భద్రపరిచినట్లు పేర్కొన్నారు. అయితే, బియ్యాన్ని గుజరాత్ తరలించేందుకు ప్రయత్నించారన్న అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. ల్యాబ్ పరీక్షలో నిర్ధారణ 350 క్వింటాళ్ల బియ్యం సీజ్, ముగ్గురిపై 6ఏ కేసు -
నిందితులను కఠినంగా శిక్షించాలి
కరీంనగర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై దాడులను నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంకమ్మతోటలోని సంఘ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో విద్యార్థులపై ఏబీవీపీ నాయకులు దాడి చేశారన్నారు. రెండు రోజుల క్రితం పీడబ్ల్యూడీ విద్యార్థిపై ఏబీవీపీ నా యకులు చేసిన దాడిని ఎస్ఎఫ్ఐ సాక్ష్యాలతో సహా నిరూపించిందన్నారు. నిత్యం భారతమాత జై అంటున్న ఏబీవీపీ మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రోహిత్, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్కటూరి ఇషాక్, నాయకులు రాకేశ్, సద్నిత్ కుమార్ , రాక్షక్, శివ, గిరిచారన్, సతీశ్, రాజు, శ్రీకాంత్, ఆదర్శ్, నరేశ్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడిగా హైమద్ అలీ
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడిగా మహ్మద్ హైమద్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లో పనిచేసిన హైమద్ అలీ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగారని, అందుకే మైనార్టీ సెల్ నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు కవ్వంపల్లి తెలిపారు. కాగా తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర నాయకులకు హైమద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. -
నీతిమంతమవుతుందా?
అవినీతి సొమ్ము పార్టీలకిస్తే కరీంనగర్ కార్పొరేషన్: అవినీతి డబ్బులను పార్టీ లకు విరాళాలుగా ఇస్తే ఆ సొమ్ము నీతిమంతమవుతుందా అని బీసీ సంక్షేమ,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ఎలక్ట్రో బాండ్లను బీజేపీ సమర్థించుకోవడం సరికాదని, భవిష్యత్లో ఇది ఇబ్బందికరంగా మా రుతుందని హెచ్చరించారు. గురువారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రో బాండ్ల ద్వారా బీజేపీ క్విడ్ప్రోకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎలక్ట్రోబాండ్ల ద్వారా అవినీతి సొమ్మును తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించినట్లే అన్నారు. లిక్కర్స్కాంలో నింది తుడు శరత్ చంద్రకు బెయిల్ రావడానికి, రూ.500 కోట్ల బాండ్లు బీజేపీకి ఇచ్చారని తెలిపారు. ఇదే క్విడ్ప్రోకు ఉదాహరణ అని తెలిపారు. సీఎం బీజేపీలో కలుస్తారని, ఆర్ ట్యాక్స్ అంటూ పనికిరాని మాట లు మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వం మాత్రం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజలు కాంగ్రెస్తో కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంత్రికి న్యాయవాదుల ఆత్మీయ సన్మానంకరీంనగర్క్రైం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, న్యాయవాది పొన్నం ప్రభాకర్ గౌడ్ను గురువారం కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గం, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా న్యాయవాదుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల స్థలాల కోసం 20 ఎకరాలు, న్యాయవా దుల కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణానికి 5 ఎకరాలు, హెల్త్కార్డుల పరిమితి రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, కొత్తగా వచ్చిన న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాలని కోరగా పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షు డు రఘువీర్, కార్యదర్శి బీమాసాహెబ్, కోశాధికారి రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రోబాండ్ల పేరుతో అవినీతికి మోడీ ప్రోత్సాహం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
● హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ కూడా.. జగిత్యాలక్రైం/సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్స్టేషన్లో పోలీసులు పట్టుకున్న 70 కిలోల గంజాయి మాయమైన కేసులో బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల్లో అలసత్వం వహించిన వారిపై ఎస్పీ సన్ప్రీత్సింగ్ మల్టీజోన్–1 ఐజీ ఏవీ రంగనాథ్కు నివేదిక అందజేశారు. దీంతో సారంగాపూర్ పోలీస్స్టేషన్లో గతంలో పని చేసిన ఎస్సై మనోహర్రావు, ప్రస్తుత ఎస్సై తిరుపతి, హెడ్కానిస్టేబుల్ రవీందర్రెడ్డి, కానిస్టేబుల్ నరేందర్లను సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్స్టేషన్కు చేరిన ‘కోడి పంచాయితీ’● రూ.30వేల విలువైన భీమవరం జాతి కోడి చోరీజగిత్యాలక్రైం: తాము పెంచుకున్న భీమవరం జాతి కోడిని దొంగిలించారని సదరు కోడి యజమాని, జగిత్యాల జిల్లాకేంద్రంలోని శ్రీనగర్కాలనీకి చెందిన కర్కు శివనాగరాజు గురువారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాని విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నాగేంద్రనగర్కాలనీకి చెందిన నాగరాజు వద్ద కోడి ఉన్నట్లు గుర్తించి పోలీస్స్టేషన్కు పిలిపించారు. నాగరాజు పోచమ్మవాడకు చెందిన ఎల్లేశ్ అనే వ్యక్తి నుంచి రూ.3 వేలకు కొనుగోలు చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నాగరాజు కోడిని తెచ్చి శివనాగరాజుకు అప్పగించాలని పోలీసులు సూచించగా.. నాగరాజు కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రౌడీ షీటర్ల బైండోవర్కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రేకుర్తి గ్రామానికి చెందిన ఐదుగురు రౌడీషీటర్లను గురువారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. -
అమ్మ ఆదర్శ పాఠశాలలకు నిధులు
కరీంనగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం లేక పడరానీపాట్లు పడుతున్నారు. మన ఊరు–మన బడి కార్యక్రమంలో ఎంపికై న పాఠశాలల్లో కొంతమేరకు మౌలిక వసతులు కల్పించినప్పటికీ మిగితా పాఠశాలల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఈక్రమంలోనే కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కనీస వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అభివృద్ధి పనుల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించారు. 222 పాఠశాలలు ఎంపిక కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం 133 పాఠశాలలుండగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు సంబంధించి 79 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలను తెరిపించారు. యూడైస్ వివరాలను ప్రామాణికంగా తీసుకుని ఇంజినీరింగ్ అధికారులు మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. రూ.275.81 లక్షలను ప్రతిపాదించగా మొదటి విడతగా 25 శా తం నిధులు రూ.8,443. 12 లక్షలు మంజూరయ్యా యి. ఈ నిధులతో ప్రధానంగా బాలుర, బాలికలకు వేర్వేరుగా మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మిస్తారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. రూ.275లక్షలతో మౌలిక వసతులకు ప్రతిపాదన మొదటి విడతలో రూ.8,443 లక్షలు మంజూరు కమిటీల ఆధ్వర్యంలో మరమ్మతుపాఠశాలలకు మంజూరైన నిధుల వివరాలు ప్రాంతం ఎంపికై న అంచనా వ్యయం మంజూరు పాఠశాలలు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) కరీంనగర్అర్బన్ 39 122.85 30.71 కరీంనగర్రూరల్ 19 84.74 21.19 కొత్తపల్లి 18 64.87 16.22 కొత్తపల్లి మున్సిపాలిటీ 1 3.35 రూ.83.75 వేలు త్వరలో పనులు ప్రారంభం కరీంనగర్ నియోజకవర్గంలో ఎంపికై న అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలను తీశాం. కమిటీల ఆధ్వర్యంలో త్వరలో పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. పాఠశాలలు పున:ప్రారంభించే జూన్ 10వరకు పనులు పూర్తి చేస్తాం. – ఎం.మధుసూదనాచారి, ఎంఈవో, కరీంనగర్ -
కీలక అవయవం.. కాలేయం
కరీంనగర్టౌన్: శరీరంలో జరిగే జీవ, జీర్ణక్రియల్లో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిరంతరం ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా శరీరంలో పని చేస్తుంది. విషపదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలకం. శరీరంలోని అతి పెద్ద గ్రంథి కాలేయం. మెదడు తర్వాత అతి ముఖ్యమైన అవయవం. రక్తంలో ఉండే బ్యాక్టీరియా, హానికర హార్మోన్లను తొలగిస్తుంది. అలాగే, జీవితాంతం పెరిగే ఒకే ఒక్క అవయవం కూడా ఇదే. రోగనిరోధక శక్తికి దోహదం చేస్తుంది. దీన్ని కాపాడుకుంటే ఆయుష్షు పెరుగుతుంది. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఏప్రిల్ 19ని ప్రపంచ కాలేయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా కథనం. రక్తాన్ని వడిపోయడం.. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని వడపోయడం, ఆహారం ద్వారా వచ్చే రసాయనాలు, వాటిలోని విషపదార్థాలను నిర్మూలించడం, ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను లివర్ నియంత్రిస్తుంది. ఏది తిన్నా, తాగినా కాలేయం ద్వారానే వెళ్తాయి. కొన్ని ఆహారాలు లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తే.. మరికొన్ని దెబ్బ తీస్తాయి. అందుకే తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హాని కలిగించే ఆహారాలు.. వైట్ రైస్, తెల్ల రొట్టె, చక్కెర, ఉప్పు వంటివి కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉప్పు, మైదాతో (రిఫైన్డ్ ఫ్లోర్) తయారు చేసిన పాస్తా, పిజ్జా, బిస్కెట్లు, వైట్ బ్రెడ్ లాంటి ఆహార పదార్థాలు, మీగడ పాలు, ఐస్క్రీమ్, చీజ్ వంటి అధిక కొవ్వుతో ఉన్న పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది. విటమిన్–సి చాలా అవసరం ఆకు కూరలు, వెల్లుల్లి, బంగాళదుంప, బీట్ రూట్, క్యారెట్ లాంటి దుంపకూరలు కాలేయంలోని కణా ల పునరుత్పత్తికి బాగా సహాయపడతాయి. లివర్ ను రక్షించుకునేందుకు విటమిన్–సి అధికంగా లభించే ద్రాక్ష, ఆపిల్, నిమ్మరసం చాలా అవసరం. వీటితోపాటు వ్యాయామం చేయాలి. జీవ, జీర్ణక్రియల్లో తోడ్పాటు జీవితాంతం పెరిగే ఒకే ఒక్క అవయవం కాపాడుకుంటే ఆయుష్షు పెరిగినట్టే.. నేడు ప్రపంచ కాలేయ దినోత్సవంకూరగాయలు, పండ్లు తీసుకోవాలి గతంతో పోలిస్తే కాలేయ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. లివర్ దెబ్బతింటే హైపటైటిస్ ఇన్ఫెక్షన్లతోపాటు పుట్టుకతో సంక్రమిస్తున్న, జన్యుపరమైన వ్యాధులు, ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. కాలేయాన్ని కాపాడుకోవాలంటే కూరగాయలు, పండ్లు, ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. మద్యం మానేయడం, మసాలాలు, చల్లటి వస్తువులు, వేపుళ్లు తినకుండా ఉండటం, పులుపు పదార్థాలు తగ్గించి, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటివి చేయాలి. – డాక్టర్ దిలీప్రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో, మెడికవర్ ఆసుపత్రి -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
రామడుగు(చొప్పదండి): సివిల్స్ 27వ ర్యాంకర్, రామడుగు మండలంలోని వెలిచాలకు చెందిన నందాల సాయికిరణ్ గురువారం స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి నిత్య కల్యాణోత్సవానికి హాజరై, పూజలు చేశారు. మాజీ సర్పంచ్ వీర్ల సరోజన ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. అలాగే, సాయికిరణ్ ఐదోతరగతి వరకు చదివిన వెలిచాల సరస్వతి పాఠశాలలో స్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్, కో–కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, తేజ స్కూల్ కరస్పాండెంట్ దేవేందర్రావు, సామాజిక కర్త కల్లేపల్లి పర్శారాం, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, నాయకులు సత్కరించారు. సీపీఆర్పై విద్యుత్ సిబ్బందికి అవగాహనకొత్తపల్లి(కరీంనగర్): టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యుత్ సిబ్బందికి గుండెపోటు నుంచి ప్రాథమికంగా ప్రాణాలు రక్షించుకునే సీపీఆర్ విధానంపై డాక్టర్ ప్రణవ్ గురువారం అవగాహన కల్పించారు. ఎస్ఈ గంగాధర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, విద్యుత్ కోతలు లేకుండా చూడాలన్నారు. గుండె నొప్పి వస్తే వైద్యులు సూచించినట్లు ప్రథమ చికిత్స చేయాలని సూచించారు. డీఈలు విజయేందర్ రెడ్డి, రాజం, తిరుపతి, ఏడీఈలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, కిరణ్కుమార్, మల్లేశం, పురుషోత్తం, పీవో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నగదు పట్టివేతజగిత్యాల క్రైం: జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో గురువారం ఉదయం జగిత్యాల పట్టణ ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అరుణ్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.7.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తహసీల్ చౌరస్తాలో.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో పట్టణ ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. మల్యాల మండలంలోని గొర్రెగుండంకు చెందిన బైరవేని రాజు వద్ద రూ.99,500, పురాణిపేటకు చెందిన ఆవారి సందీప్ వద్ద రూ.1.16 లక్షలు పట్టుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. యువకుడిని కాపాడిన లేక్ పోలీసులు కరీంనగర్ క్రైం: మానేరు డ్యాంలో దూకేందుకు వెళ్తున్న ఓ యువకుడిని కరీంనగర్ లేక్ పోలీసులు కాపాడారు. వారి వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలానికి చెందిన ఎం.శ్రీనివాస్ కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఆత్మహత్య చేసుకునేందుకు కరీంనగర్ వచ్చాడు. మానేరు డ్యాంలో దిగుతుండగా లేక్ పోలీసులు గుర్తించి, బయటకు తీసుకువచ్చారు. అతని కుటుంబసభ్యులను పిలిపించి, కౌన్సెలింగ్ చేసి, పంపించారు. -
వ్యవసాయ బావిలో పడి బాలిక మృతి
వీణవంక(హుజూరాబాద్): వ్యవసాయ బావిలో పడి, ఓ బాలిక మృతిచెందింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన దేవరకొండ శ్రీనివాస్ భార్య, కూతురితో కలిసి వీణవంక మండలంలోని గంగారం గ్రామానికి వచ్చాడు. వీరు స్థానికంగా బాతులను మేపుతున్నారు. ఈ క్రమంలో గురువారం శ్రీనివాస్ కూతురు పార్వతి(13) ఎండవేడికి తట్టుకోలేక మంచినీళ్ల కోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. నీరు తాగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి, మునిగిపోయింది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు గమనించి, పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చి, మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి స్వస్థలం నెల్లూరు జిల్లా కందుకూరు