రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Published Sat, Apr 20 2024 1:45 AM | Last Updated on Sat, Apr 20 2024 1:45 AM

-

కొత్తపల్లి(కరీంనగర్‌): బైక్‌ను మరో బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీ సుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలంలోని చింతకుంట శాంతినగర్‌కు చెందిన ఠాకు విశాల్‌ శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై కమాన్‌పూర్‌ పెట్రోల్‌ బంకుకు వెళ్లాడు. పెట్రోల్‌ కొట్టించుకొని, తిరిగి వస్తూ డివైడర్‌ దాటుతుండగా భూమి రాకేశ్‌ బైక్‌పై వేగంగా వచ్చి, ఢీకొట్టాడు. ఈ ఘటనలో విశాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో కరీంనగర్‌ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడి తల్లి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement