-
Ashes: ‘బజ్బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి..
Ashes Series 2023: ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో రెండు మ్యాచ్లలో స్టోక్స్ బృందం చిత్తైన విషయం తెలిసిందే. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్లో 0-2తో వెనుబడింది. బజ్బాల్ అంటూ దూకుడు ప్రదర్శించి స్వదేశంలో తొలి రెండు మ్యాచ్లలో బోల్తా పడిన ఇంగ్లండ్కు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు. ఓలీ పోప్ దీంతో మిగిలిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడు మరెవరో కాదు.. ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్. కుడి భుజం నొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఆసీస్తో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ అతడు మిగిలిన మ్యాచ్లలో అందుబాటులో ఉండడని పేర్కొంది. ఈ మేరకు.. ‘‘లండన్లో స్కానింగ్ చేయించగా.. అతడి గాయం మరింత తీవ్రతరమైందని తేలింది. సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి మిగిలిన మ్యాచ్లకు అతడు దూరం కానున్నాడు’’ అని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఓలీ పోప్ చికిత్స పొందుతాడని వెల్లడించింది. కాగా ఆసీస్తో తొలి రెండు మ్యాచ్లలో ఓలీ పోప్.. ఓ మోస్తరుగా రాణించాడు. మొదటి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో వరుసగా 31, 14 పరుగులు చేసిన వన్డౌన్ బ్యాటర్.. రెండో టెస్టులో 42, 3 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో అవుటైన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రధానులు సైతం పరస్పర విమర్శలతో తమ జట్లకు అండగా నిలవడం విశేషం. చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' -
'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్ జట్టు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీలు సహా చాలా మంది విమర్శలు గుప్పించారు. ''ఆస్ట్రేలియా జట్టుది కపట బుద్ది అని.. గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారంటూ'' ఇంగ్లండ్ అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై 'ద వెస్ట్ ఆస్ట్రేలియన్' అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆసీస్పై మండిపడుతున్నారు. కానీ ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్ కపటత్వం అంటే ఏంటో చూపించిందని కొంతమంది ఆసీస్ అభిమానులు పాత వీడియోలను షేర్ చేశారు. 2022లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చూపిన కపట బుద్ధిని బయటపెట్టింది. క్రీడాస్పూర్తికి ఉప్పుపాతరేశారు. ఒక అభిమాని షేర్ చేసిన వీడియోలో అప్పటి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని హెన్రీ నికోల్స్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్ను తాకి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. చేసేదేం లేక హెన్రీ నికోల్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికి వాళ్లు గెలవడానికే మొగ్గు చూపారు. అభిమాని షేర్ చేసిన వీడియోపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ''క్రీడాస్పూర్తి అనే పదాన్ని భుజాలపై ఎత్తుకొని వాదిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ వీడియోపై స్పందించండి. ఇప్పుడు ఆసీస్ చీటింగ్ చేసిందని అంటున్నారు.. న్యాయంగా మీరు ఆరోజు చేసింది కూడా చీటింగ్ కిందే వస్తుంది. మీ కపటత్వాన్ని చాటిచెప్పే పలు వీడియోలు ఇక్కడ ఉన్నాయి.అందులో ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఇంగ్లీష్ క్రికెట్ కపటత్వం, అర్హత యొక్క భావం నా దృష్టిలో వేరే విషయం.'' అని చెప్పుకొచ్చాడు. Ouch. You can even see the torchbearer of ‘The Spirit of the Game’ shrugging his shoulders instead of initiating the process to withdraw the appeal. After all, you wouldn’t want to be remembered for things like these 🤣🫣🤪 Also, there are multiple videos circulating calling out… https://t.co/yR8Nq2UeVd — Aakash Chopra (@cricketaakash) July 4, 2023 చదవండి: #Chahal: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు -
Ashes 2023: రిషి సునాక్కు స్ట్రాంగ్ కౌంటర్! మాములుగా లేదు..
Bairstow Controversial Dismissal: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లిష్ క్రికెటర్ జానీ బెయిర్స్టో అవుటైన తీరుపై వివాదం కొనసాగుతూనే ఉంది. బంతి వికెట్కీపర్ చేతిలో ఉండగానే.. బెయిర్స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమయస్ఫూర్తితో బెయిర్స్టోను స్టంపౌట్ చేసిన ఆసీస్ వికెట్కీపర్ అలెక్స్ క్యారీ సహా ఇతర ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిన నేపథ్యంలో.. తామైతే ఇలా ఆసీస్ తరహాలో గెలుపొందాలని కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం స్టోక్స్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రిషి సునాక్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇందుకు ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ సైతం రంగంలోకి దిగారు. తమ జట్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. యాషెస్ సిరీస్లో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్పై విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళా, పురుష క్రికెట్ జట్లను చూసి తాను గర్వపడుతున్నానన్నారు. ‘‘అదే ఆసీస్.. పూర్వవైభవాన్ని గుర్తు చేస్తూ.. ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తూనే ఉంటుంది. వాళ్లు విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా.. విజేతలైన మా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని ఆంథనీ అల్బనీస్ పేర్కొన్నారు. పరస్పరం విమర్శలు కాగా యాషెస్ సిరీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా.. ఓవర్ పూర్తైందని భావించిన బెయిర్స్టో క్రీజు దాటి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని వికెట్లకు గిరాటేసి.. రనౌట్కు అప్పీలు చేశాడు. అయితే, బెయిర్స్టో కీపర్ లేదంటే అంపైర్కి సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఇంగ్లండ్ అభిమానులు, మీడియా ప్రత్యర్థి జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసీస్ మీడియా కూడా తగ్గేదేలే అన్నట్లు స్టోక్స్ ఫొటోలతో ఇంగ్లండ్ విమర్శలను తిప్పి కొట్టింది. తాజాగా ఇరు దేశాల ప్రధానులు సైతం తమ తమ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ కౌంటర్ అటాక్ చేసుకోవడం విశేషం. చదవండి: BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్.. నెదర్లాండ్స్ ఆశలు సజీవం BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
Ashes 2023: బెయిర్స్టో స్టంపౌట్ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్స్టో వివాదాస్పద స్టంపౌట్పై క్రికెట్ను ఎంతగానో ఇష్టపడే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్పందించారు. బెయిర్స్టో విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. ఈ వివాదంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందనతో ఏకీభవించారు. ఆస్ట్రేలియా తరహాలో గేమ్ గెలవాలని తాను కోరుకోనని అన్నారు. ఆసీస్ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలను రిషి సునక్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో బెయిర్స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన విషయం తెలిసిందే. బంతి వికెట్కీపర్ చేతిలో ఉండగానే బెయిర్స్టో ఓవర్ పూర్తయ్యిందనుకుని క్రీజ్ దాటి వెళ్లాడు. ఇది గమనించిన వికెట్కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. సుదీర్ఘ పరిశీలన అనంతరం ధర్డ్ అంపైర్ బెయిర్స్టోను స్టంపౌట్గా ప్రకటించాడు. దీంతో వివాదం రాజుకుంది. నిబంధనల ప్రకారం ఇది ఔటే అయినా.. ఆసీస్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీస్ క్రీడాస్పూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ అయితే తాము ఆసీస్ తరహాలో మ్యాచ్ గెలవాలని ఎప్పటికీ కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని తాజాగా బ్రిటన్ ప్రధాని కూడా వెల్లబుచ్చారు. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్లో బెయిర్స్టో కీలక సమయంలో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది. -
బెయిర్స్టో స్టంపౌట్ వివాదం.. వాళ్లు మనుషులైతే బహిరంగా క్షమాపణ చెప్పాలి..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్స్టో వివాదాస్పద స్టంపౌట్పై ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు సర్ జెఫ్రీ బాయ్కాట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ ఆటగాళ్లు నిజంగా మనుషులైతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసీస్, ఇంగ్లండ్ జట్లు అద్భుతమైన క్రికెట్ ఆడాయి.. ఇలాంటి ఘటనలు ఆట స్ఫూర్తికి మంచిది కాదని అన్నారు. అందరం తప్పులు చేస్తాం.. బెయిర్స్టో విషయంలో ఆసీస్ కూడా తప్పు చేసింది.. ఈ విషయంలో వారు తమ తప్పును అంగీకరించాలని కోరారు. ఏ పద్దతిలోనైనా గెలవాలనుకునే వారికి క్రికెట్ సరైన ఆట కాదని, ఇలాంటి (బెయిర్స్టో వివాదాస్పద స్టంపౌట్) ఘటనలు జెంటిల్మెన్ గేమ్ ప్రతిష్టను మసకబారుస్తాయని తెలిపాడు. గెలవడం కోసం కష్టపడటం మంచిదే, కానీ క్రీడా స్పూర్తిని మరిచి గెలవాలనుకోవడం మాత్రం సరైంది కాదని హితవు పలికాడు. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానికి క్రికెట్ చట్టాలను ఆపాదించడం కరెక్ట్ కాదని, ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్ధి జట్లు ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా, రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో బెయిర్స్టో చేసిన అనాలోచిత పని (బంతి వికెట్ కీపర్ చేతిలో ఉండగానే క్రీజ్ వదిలి బయటికి రావడం) ఇంత వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బెయిర్స్టో నిర్లక్ష్యం కారణంగా ఇంగ్లండ్ మ్యాచ్ను కోల్పోవడంతో పాటు ఈ విషయాన్ని పెద్దది చేసినందుకు నవ్వులపాలైంది. బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఫలితంగా ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు
యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదంతో 'క్రీడాస్పూర్తి' అనే పదం మరోసారి తెరపైకి వచ్చింది. క్రీడాస్పూర్తి ప్రకారం చూస్తే అలెక్స్ క్యారీ చేసింది తప్పని చెప్పొచ్చు.. కానీ న్యాయంగా చూస్తే బెయిర్ స్టో అవుట్ కిందే లెక్క. బంతి ఇంకా డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ అతన్ని రనౌట్ చేశాడు. రూల్స్ ప్రకారం ఒక బంతి డెడ్ కావడానికి ముందే బ్యాటర్ క్రీజు దాటిన సమయంలో కీపర్ వికెట్లను గిరాటేస్తే అది ఔట్ కిందే లెక్కిస్తారు. అయితే అప్పీల్ను వెనక్కి తీసుకునే అవకాశం కెప్టెన్కు ఉంటుంది. కానీ పాట్ కమిన్స్ అందుకు సిద్ధపడలేదు. జట్టు గెలుపు దిశలో ఉన్నప్పుడు క్రీడాస్పూర్తి ప్రదర్శించడానికి కమిన్స్ వెనకాడాడు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం క్రీడాస్పూర్తికి విలువనిచ్చాడు. 2011లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో ఔటైన ఇయాన్ బెల్ను మళ్లీ వెనక్కి పిలిచి ధోని క్రీడాస్పూర్తి చాటుకున్నాడు. ఆ మ్యాచ్లో టీమిండియా 319 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓడినా ధోని మాత్రం తన చర్యతో ఇంగ్లండ్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. క్రీడాస్పూర్తి అనే అంశం మరోసారి తెరమీదకు రావడంతో ధోని ప్రదర్శించిన క్రీడాస్పూర్తిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. 2011లో టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించింది. నాటింగ్హమ్ వేదికగా ఇరుజట్లు టెస్టు మ్యాచ్ ఆడాయి. టీ విరామానికి ముందు ఇషాంత్ శర్మ ఆఖరి ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఇషాంత్ వేసిన ఒక బంతిని ఇయాన్ మోర్గాన్ లెగ్సైడ్ దిశగా ఆడాడు. నేరుగా బౌండరీ లైన్ వద్ద ఉన్న ప్రవీణ్ కుమార్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ అయి బౌండరీ పక్కన పడింది. అయితే అది బౌండరీనా కాదా అని సందేహం ఉన్న సమయంలోనే ప్రవీణ్కుమార్ బంతిని తీసుకొని ధోనికి అందించాడు. ధోని కూడా కామన్గా బంతి అందుకొని బెయిల్స్ను ఎగురగొట్టాడు. కానీ ఇయాన్ బెల్ అప్పటికే క్రీజు బయట ఉన్నాడు. ఇది గమనించిన అంపైర్ బంతి ఇంకా డెడ్ కాలేదని.. థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి ఇంకా డెడ్ కాకముందే ఇయాన్ బెల్ క్రీజు బయటకు వెళ్లడంతో రనౌట్ అని బిగ్స్క్రీన్పై వచ్చింది. అప్పటికే పెవిలియన్ దగ్గర వేచి ఉన్న ఇయాన్ మోర్గాన్, ఇయాన్ బెల్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా బాల్కనీ నుంచి అసలేం ఏం జరుగుతుందో అర్థంకాక నిలబడిపోయారు. అంతలో టీ విరామం రావడంతో మైదానంలోని ప్రేక్షకులు ధోని చేసిన పనికి చివాట్లు, శాపనార్థాలు పెట్టారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని.. ధోని లాంటి కెప్టెన్ ఇలా చేస్తాడా అంటూ సూటిపోటి మాటలు అన్నారు. కానీ టీ విరామం అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఇయాన్ మోర్గాన్తో పాటు ఇయాన్ బెల్ కూడా వచ్చాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు ఒక్కసారిగా మాట మార్చారు. ధోని నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీమిండియాను చప్పట్లతో అభినందించారు. అయితే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాకా అప్పటి కోచ్ గ్యారీ కిర్స్టెన్తో ధోని సంప్రదింపులు జరిపి అప్పీల్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్కు చెప్పగానే అతను కృతజ్ఞతగా ధోనిని హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. అనంతరం మైదానంలో కూల్గా కనిపించిన ధోనిని చూస్తూ అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ వీడియోనూ ఇంగ్లండ్ అభిమానులు రీట్వీట్ చేస్తూ ''కమిన్స్.. క్రీడాస్పూర్తి అంటే ఏంటో తెలియకపోతే ధోనిని చూసి నేర్చుకో.. ఇలా చీటింగ్ చేసి గెలవడం కరెక్ట్ కాదు'' అంటూ హితబోద చేశారు. Jonny Bairstow Runout reminds me of "When MS Dhoni called back Ian Bell after Run out even though he was out" (Full Story in Thread) pic.twitter.com/TQuHne7HD4 — 🏆×3 (@thegoat_msd_) July 2, 2023 BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 చదవండి: బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా! Ashes Series 2023: గెలుపు జోష్లో ఉన్న ఆసీస్కు భారీ షాక్.. ఇకపై కష్టమే..! -
బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా!
లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారింది. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేసిన పని క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఐదోరోజు ఆటలో లంచ్ విరామానికి ముందు గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్ను తాకింది. ఆ సమయంలో బెయిర్స్టో క్రీజ్కు చాలా దూరం ఉండడంతో థర్డ్ అంపైర్ బెయిర్స్టోన్ను అవుట్గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఆసీస్ తమ అప్పీల్ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్స్టో మైదానం వీడాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు చీటర్స్ అంటూ దూషణల పర్వం మొదలుపెట్టారు. అయితే బెయిర్ స్టో ఇదే లార్డ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మార్నస్ లబుషేన్ను ఇలాగే ఔట్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. బంతి మిస్సయ్యి కీపర్ బెయిర్ స్టో చేతుల్లోకి వెళ్లినా లబుషేన్ క్రీజులోనే ఉన్నాడు. త్రో వేయాలన్న ఉద్దేశంతో బెయిర్ స్టో నేరుగా వికెట్ల వైపు విసిరాడు. అయితే లబుషేన్ క్రీజులోనే ఉండడంతో అది ఔట్గా పరిగణించలేదు. ఒకవేళ లబుషేన్ క్రీజు దాటి బయట ఉంటే అప్పుడు బెయిర్ స్టో అప్పీల్కు వెళ్లేవాడా లేక క్రీడాస్పూర్తి ప్రదర్శించేవాడా అంటే చెప్పలేని పరిస్థితి. అంటే ఈ లెక్కన చూస్తే ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టోనే తొలుత ఇది మొదలుపెట్టాడనిపిస్తుంది. ఆ సమయంలో అలెక్స్ క్యారీ గమనించాడేమో తెలియదు కానీ.. తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం క్రీడాస్పూర్తిని పక్కకుబెట్టి బెయిర్ స్టోను ఔట్ చేశాడు. గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ఏ జట్టైనా అలాగే చేస్తుందని.. ఆసీస్ను చీటర్స్ అని పిలుస్తున్నారు కానీ అదే స్థానంలో ఇంగ్లండ్ ఉండుంటే కూడా బహుశా అదే జరిగేదేమో అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. England’s hypocrisy exposed as Bairstow tries to stump Labuschagne on Day 3… but of course Stokes would’ve called Marnus back (coughs… BS) #Ashes #ashes2023 #ashes23 pic.twitter.com/MwF0T42dWX — Paul Kneeshaw (@Stick_Beetle) July 3, 2023 చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే బెయిర్స్టో వివాదాస్పద స్టంపౌట్పై బెన్ స్టోక్స్.. అలాంటి గెలుపు మాకొద్దు..! -
బెయిర్స్టో వివాదాస్పద స్టంపౌట్పై బెన్ స్టోక్స్.. అలాంటి గెలుపు మాకొద్దు..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ వికెట్కీపర్/బ్యాటర్ జానీ బెయిర్స్టో స్టంపౌట్ అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆసీస్ ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించి బెయిర్స్టోను ఔట్ చేశారని కొందరంటుంటే.. రూల్స్ ప్రకారం అది కచ్చితంగా ఔటేనని మరికొందరు వాదిస్తున్నారు. మ్యాచ్ అనంతరం ఇదే అంశంపై ఇరు జట్ల కెప్టెన్లు కూడా స్పందించారు. BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 బెయిర్స్టో స్టంపౌట్ను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సమర్ధించుకుంటుంటే.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం ఆసీస్ ఆటగాళ్ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓ పక్క రూల్స్ ప్రకారం బెయిర్స్టో ఔటేనని చెప్పుకొచ్చిన స్టోక్స్.. ఓ ఆటగాడిని ఆ పద్దతిలో ఔట్ చేసి వచ్చే గెలుపు తమకొద్దని వ్యాఖ్యానించాడు. ఒకవేళ కీలక సమయంలో ఓ ఆటగాడిని అలా ఔట్ చేసే అవకాశం తమకు వచ్చినా తాము వదిలేస్తామని, ఆ పద్ధతిలో గేమ్ గెలవడం తమకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సందర్భంలో తాము అప్పీల్ చేసినా వెనక్కు తీసుకునే వాళ్లమని తెలిపాడు. ఆసీస్కు అది మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ కాబట్టి అలా చేశారని అన్నాడు. కాగా, ఆఖరి రోజు ఆటలో బెయిర్స్టో ఔట్ కావడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. స్టోక్స్ వీరోచిత పోరాటం (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలవలేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో స్టోక్స్కు సహకరించే వారు లేకపోవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఒకవేళ బెయిర్స్టో విషయంలో ఆసీస్ తమ అప్పీల్ను వెనక్కు తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొంది, 5 మ్యాచ్ సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
బెయిర్స్టో స్టంపౌట్ వివాదం.. ఆసీస్ ఆటగాడిపై దూషణ పర్వం.. తప్పేమీ లేదన్న అశ్విన్
లార్డ్స్ టెస్టు చివరి రోజు ఆటలో బెయిర్స్టోను స్టంపౌట్ చేసిన తీరు వివాదాన్ని రేపి తీవ్ర చర్చకు దారి తీసింది. లంచ్ ముందు ఈ ఘటన జరిగింది. గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్ను తాకింది. BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 ఆ సమయంలో బెయిర్స్టో క్రీజ్కు చాలా దూరం ఉండటంతో థర్డ్ అంపైర్ బెయిర్స్టోన్ను అవుట్గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఆసీస్ తమ అప్పీల్ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్స్టో మైదానం వీడాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ‘పాత ఆ్రస్టేలియా...ఎప్పటిలాగే మోసగాళ్లు’ అంటూ ప్రేక్షకులంతా గేలి చేశారు. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 లంచ్ సమయంలో పరిస్థితి మరింత ముదిరింది. లార్డ్స్ మైదానంలో ప్రతిష్టాత్మక లాంగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు నడుస్తుండగా కొందరు మాటలతో ఖ్వాజాను దూషించారు. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీనిపై ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఎంసీసీకి ఫిర్యాదు చేయగా...వారు చివరకు ఘటనపై క్షమాపణ చెప్పారు. నిబంధనల ప్రకారం చూస్తే బెయిర్స్టో అవుట్లో తప్పు లేదు. బంతి ఇంకా ‘డెడ్’ కాకముందే అతను క్రీజ్ వీడాడు. బయటకు వెళ్లే ముందు అతను తన కాలితో క్రీజ్ లోపల నేలను గీకడం కూడా కనిపించినా బంతి కీపర్ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉన్న క్యారీ స్టంప్ చేశాడు. దాంతో మరోసారి క్రీడా స్ఫూర్తి చర్చ ముందుకు వచ్చింది. కామెంటేటర్లంతా వాదనకు చెరో వైపు నిలిచారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో స్పష్టంగా ఉండే భారత స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఇందులో తప్పేమి లేదని, అది అవుట్ అని స్పష్టం చేశాడు. ‘ఒకటి మాత్రం నిజం. వెనక అంత దూరం నిలబడిన కీపర్ స్టంప్స్పైకి బంతి విసిరాడంటే అప్పటికే బెయిర్స్టో ఇలాంటి ప్రయత్నం చేసి ఉండటం అతను చూసి ఉంటాడు’ అని అశ్విన్ విశ్లేషించాడు. -
బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం.. ప్రత్యర్ధి సైతం దాసోహం..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేశాడు. భారీ శతకంతో చెలరేగాడు. పట్టుసడలని పోరాటంతో ప్రత్యర్ధిని గడగడలాడించాడు. అదే ప్రత్యర్ధి చేతనే శభాష్ అనిపించుకున్నాడు. 2019లో హెడింగ్లీ మైదానంలో జరిగిన మ్యాచ్ తరహాలో ఒంటి చేత్తో జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే గెలుపుకు మరో 70 పరుగులు చేయాల్సిన తరుణంలో హాజిల్వుడ్ బౌలింగ్లో ఔటై, నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఆతర్వాత ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో మిగిలిన 3 వికెట్లు కోల్పోవడంతో ఓటమిపాలైంది. స్టోక్స్ వీరోచిత పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఏ స్థితిలోనైనా ‘బజ్బాల్’ను కొనసాగిస్తానంటూ పట్టుదలగా నిలిచి సిక్సర్లతో చెలరేగిన స్టోక్స్, చివరకు జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా ఆసీస్ లార్డ్స్లో గెలుపు జెండా ఎగరేసి 5 టెస్ట్ల సిరీస్లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లండన్: ఆ్రస్టేలియా జట్టు యాషెస్ సిరీస్పై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. లార్డ్స్ మైదానంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. 371 పరుగులను ఛేదించే ప్రయత్నంలో ఓవర్నైట్ స్కోరు 114/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్లు) చెలరేగగా... బెన్ డకెట్ (112 బంతుల్లో 83; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. గాయంతో ఉన్న స్పిన్నర్ లయన్ బౌలింగ్ చేయకుండానే ఆసీస్ ఈ విజయాన్ని అందుకోగలిగింది. స్టీవ్ స్మిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, మూడో టెస్టు గురువారంనుంచి లీడ్స్లో జరుగుతుంది. విజయం కోసం చివరి రోజు చేతిలో 6 వికెట్లతో 257 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. డకెట్, స్టోక్స్ భారీ భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరు ఐదో వికెట్కు 132 పరుగులు జోడించారు. డకెట్తో పాటు బెయిర్స్టో (10) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. విజయం కోసం మరో 178 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో స్టోక్స్ బాధ్యత తీసుకొని భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గ్రీన్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను...గ్రీన్ తర్వాతి ఓవర్లో ఒక ఫోర్ కొట్టి 82 పరుగులకు చేరుకున్నాడు. అదే ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 6 బాది అతను సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. హాజల్వుడ్ ఓవర్లోనూ మరో 2 సిక్సర్లు బాదిన స్టోక్స్... స్టార్క్ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్స్లు కొట్టి 150కు చేరుకున్నాడు. ఏడో వికెట్కు బ్రాడ్ (11)తో కలిసి స్టోక్స్ 20.2 ఓవర్లలోనే 108 పరుగులు జోడించాడు. ఆసీస్ మూడు క్యాచ్లు వదిలేయడం కూడా స్టోక్స్కు కలిసొచ్చింది. ఇంగ్లండ్ గెలుపు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయితే హాజల్వుడ్ బౌలింగ్లో స్టోక్స్ మరో భారీ షాట్కు ప్రయత్నించాడు. అంచనా తప్పడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్ వరకు పరుగెత్తుతూ వెళ్లి కీపర్ క్యారీ అందుకోవడంతో అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఆసీస్కు ఎక్కువ సమయం పట్టలేదు. -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే
లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ పోరాడతోంది. 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 128 పరుగులు కావాలి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(108) పరుగులతో అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఏం జరిగిదంటే? ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 52 ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ బౌలింగ్లో ఆఖరి బంతిని బెయిర్ స్టో వెనుక్కి విడిచిపెట్టాడు. ఈ క్రమంలో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఓవర్ ముగిసిందని భావించిన జానీ బెయిర్స్టో.. క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని స్టంప్స్కు త్రో చేసి రనౌట్కి అప్పీల్ చేశాడు. అయితే బెయిర్స్టో కనీసం కీపర్కి కానీ, అంపైర్కీ కానీ సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ రనౌట్గా ప్రకటించాడు. సాధారణంగా ఒక ఆటగాడు ఓవర్ పూర్తి అయిన వెంటనే క్రీజు నుండి బయటకు వచ్చే ముందు కీపర్ లేదా అంపైర్కు సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే డెడ్బాల్(ఓవర్ పూర్తి అయినట్లు)గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో బెయిర్స్టో అలా చేయనందున అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని చూసిన బెయిర్ స్టో ఆశ్యర్యపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన బెయిర్స్టో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇక బెయిర్స్టో రనౌట్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ఆసీస్ ఛీటర్స్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్, జానీ బెయిర్స్టో రనౌట్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా అభివర్ణిస్తున్నారు. ఆస్ట్రేలియా రనౌట్ అప్పీల్ను ఉపసంహరించుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఓవర్ అయిపోయిందనే ఉద్దేశంతో క్రీజు దాటిన వ్యక్తిని రనౌట్ చేయడం సరికాదని ఆసీస్ జట్టుపై విమర్శల గుప్పిస్తున్నారు. మరి కొంత మంది ఆసీస్కు ఇది అలవాటే అని, ఛీటర్స్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఛీటర్స్ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. చదవండి: Ind vs WI: వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ఫోటో వైరల్ BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న (జూన్ 28) మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సాధించింది ప్రధానమైనది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగుల మైలురాయిని దాటాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 41 మంది మాత్రమే ఈ మైల్స్టోన్ను చేరుకున్నారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (53.44) ఒక్కడే స్మిత్ (49.67) కంటే మెరుగైన యావరేజ్ కలిగి ఉన్నాడు. ఇదే మ్యాచ్లో స్మిత్ టెస్ట్ల్లో 9000 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఈ ఫీట్ను సాధించాడు. 2000 పరుగులు, 20 వికెట్లు.. ఇక ఈ మ్యాచ్లో మరో రెండు సాధారణమైన రికార్డులు కూడా నమోదయ్యాయి. తొలి రోజు 2 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. యాషెస్ సిరీస్లో 2000 పరుగులు, 20 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు వార్విక్ ఆర్మ్స్ట్రాంగ్ (2172, 74), వాలీ హామ్మండ్ (2852, 36) ఈ ఘనత సాధించారు. ఆరో ఇంగ్లండ్ వికెట్కీపర్.. తొలి రోజు ఆటలో ట్రవిస్ హెడ్ను స్టంపౌట్ చేయడం ద్వారా జానీ బెయిర్స్టో ఓ రికార్డు నెలకొల్పాడు. యాషెస్ సిరీస్లో 50 డిస్మిసల్స్ చేసిన ఆరో ఇంగ్లండ్ వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. బెయిర్స్టోకు (50) ముందు అలెన్ నాట్ (101), డిక్ లిల్లీ (84), అలెక్ స్టివర్ట్ (78), గార్ఫ్రే ఈవాన్స్ (76), మ్యాట్ ప్రయర్ (63) ఈ ఘనత సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్తో పాటు అలెక్స్ క్యారీ (11) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ బజ్బాల్ దూకుడుకు ముకుతాడు వేస్తూ ఆసీస్ అద్బుత విజయాన్ని మూటగట్టుకుంది. అయితే కేవలం ఒక్క టెస్టు ఓడినంత మాత్రానా బజ్బాల్ ఆటను ఆపే ప్రసక్తే లేదని స్టోక్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ మీదకు దూసుకొచ్చిన ఆందోళనకారులు కాగా మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆందోళనకారులు స్టేడియంలోని పిచ్పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్టేడియం నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకురావడంతో ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇంతలో గ్రౌండ్స్టాఫ్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్ ఎండ్లో ఇద్దరు ఆందోళనకారులు సిబ్బందిని అడ్డుకుంటూ కిందపడేశారు. కాగా ఈ ఆందోళనకారులు ఎవరంటే.. 'జస్ట్ స్టాప్ ఆయిల్' అనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలీ కాలంలో ఎక్కడ మ్యాచ్లు జరిగినా ఈ ఆందోళనకారులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్లో ఆయిల్ టర్మినెల్స్ను కాపాడాలంటూ జస్ట్ స్టాప్ ఆయిల్ పేరుతో ఒక సోషల్ యాక్టివిస్ట్ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమం కొనసాగిస్తుంది. ఏమిటీ ‘జస్ట్ స్టాప్ ఆయిల్’? పర్యావరణానికి హాని కలిగించే చమురు ఉత్పాదన కోసం కొత్త లైసెన్సులను నిలిపివేయాలని కొందరు నిరసనకారులు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ పేరిట ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది బ్రిటన్లో పలు క్రీడల ఈవెంట్లను ఈ పర్యావరణ కార్యకర్తలు ఆటంకపరుస్తూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ క్రికెట్ మ్యాచ్, ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్లకు, ప్రీమియర్షిప్ రగ్బీ ఫైనల్కు, ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లలోనూ తమ నిరసన గళం వినిపించారు. ఆశ్చర్యపరిచిన బెయిర్ స్టో చర్య.. ఇదంతా సీరియస్గా జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేసిన పని అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమ వైపుగా దూసుకొచ్చిన ఒక ఆందోళనకారుడిని బెయిర్ స్టో తన చేతుల్లోకి ఎత్తుకొని బౌండరీ లైన్ వద్ద ఎత్తిపడేశాడు. ''మీరు ఉద్యమం చేయడం తప్పు కాదు.. కానీ ఇలా మ్యాచ్కు ఆటంకం కలిగించడం మంచి పద్దతి కాదు'' అంటూ బెయిర్ స్టో అతనికి సర్ది చెప్పాడు. కాగా బెయిర్ స్టో చర్యకు అభిమానులు షాక్ తిన్నప్పటికి.. అతను చేసింది సరైన చర్యే అవడంతో చప్పట్లతో అభినందించారు. ఇక బెయిర్ స్టో తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టేటప్పుడు ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టోకు అభినందనలు తెలపడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 Good start to the 2nd test. Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023 చదవండి: విండీస్కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! ‘పాకిస్తాన్ జట్టు భద్రతకై ప్రత్యేక ఏర్పాట్లు.. వాళ్లకు భయం వద్దు! నాకు నమ్మకం ఉంది’ -
ఐర్లాండ్తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే! స్టార్ క్రికెటర్ వచ్చేశాడు
లార్డ్స్ వేదికగా జూన్1నుంచి ఐర్లాండ్తో జరగనున్న ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. ఈ టెస్టుకు ఆ జట్టు స్టార్ పేసర్లు క్రిస్వోక్స్,, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ ఫిట్నెస్ కారణంగా దూరమయారు. ఈ క్రమంలో పేసర్ జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున టెస్టు అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఈ టెస్టుకు తొలుత 15 మంది సభ్యులతో కూడిన ప్రకటించిన జట్టులో జోష్ టంగ్ చోటుదక్కలేదు. కానీ ఈ నలుగురు పేసర్లు ఈ టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో.. ఆఖరి నిమిషంలో జోష్ టంగ్కు చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 82 ఇన్నింగ్స్లలో 162 వికెట్లు పడగొట్టాడు ఈ వోర్సెస్టర్షైర్ పేసర్. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో పనరాగమనం చేయనున్నాడు. కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బెయిర్స్టో జట్టుకు దూరంగా ఉన్నసంగతి తెలిసిందే. ఐర్లాండ్తో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, జాక్ లీచ్ చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్న్యూస్! -
'కెరీర్ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
ఐర్లాండ్తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
ఐర్లాండ్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1న లండన్ వేదికగా ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అదే విధంగా కౌంటీ చాంపియన్షిప్లో ఆడుతూ గాయపడ్డ ఆ జట్టు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఫూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడికి ఐర్లాండ్తో టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో కూడా ఈ టెస్టుతో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టెస్టుల్లో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్గా ఆలీ పోప్ను సెలక్షన్ కమిటీ నియమించింది. ఐర్లాండ్తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ జట్టు బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, ఆలీ రాబిన్సన్, జో రూట్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్తాన్ 40 పరుగులకే ఆలౌటయ్యేది: కోహ్లి -
సూర్య, హర్మన్ల ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా టి20 స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రతిష్టాత్మక విజ్డెన్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నారు. గతేడాది టి20 క్రికెట్లో సూపర్ ప్రదర్శనతో అదగొట్టినందుకు గాను సూర్యకుమార్ విజ్డన్ అల్మానిక్ లీడింగ్ టి20 క్రికెటర్ ఇన్ వరల్డ్ అవార్డు గెలుచుకోగా.. హర్మన్ప్రీత్ కౌర్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. తద్వారా విజ్డన్ అవార్డు గెలిచిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టి20 క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. 2022 ఏడాదిలో 187.43 స్ట్రైక్రేట్తో సూర్య 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉండగా.. 68 సిక్సర్లు బాదాడు. సూర్య బ్యాటింగ్ మాయాజాలంతో టీమిండియా 40 మ్యాచ్ల్లో 28 మ్యాచ్లు గెలవడం విశేషం. ఇక నాటింగ్హమ్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్యకు టి20ల్లో తొలి శతకం. ఇక హర్మన్ప్రీత్ గతేడాది కెప్టెన్గానే గాక బ్యాటర్గానూ అదరగొట్టింది. వన్డేల్లో 754 పరుగులు, టి20ల్లో 524 పరుగులు సాధించింది. ఇంగ్లండ్పై వన్డే మ్యాచ్లో 143 పరుగులు నాటౌట్ సుడిగాలి ఇన్నింగ్స్తో కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక కెప్టెన్గా కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఇక మరిన్ని అవార్డుల విషయానికి వస్తే.. గతేడాది టెస్టుల్లో టాప్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఔట్స్టాండింగ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోగా.. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వరుసగా మూడోసారి లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. గతేడాది బెన్ స్టోక్స్ నాయకత్వంలో 10 టెస్టుల్లో తొమ్మిదింటిలో గెలవడం విశేషం. అలాగే 2022 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్పై కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ వరల్డ్ టాప్ వుమెన్స్ క్రికెటర్ అవార్డును రెండోసారి కొల్లగొట్టింది. -
Punjab Kings: బెయిర్స్టో స్థానాన్ని భర్తీ చేయనున్న ఆసీస్ విధ్వంసకర బ్యాటర్
పంజాబ్ కింగ్స్.. గాయపడిన తమ డాషింగ్ ఆటగాడు జానీ బెయిర్స్టో స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్తో భర్తీ చేసింది. గత బిగ్బాష్ లీగ్ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెలుచుకున్న అడిలైడ్ స్ట్రయికర్స్ ఆల్రౌండర్ మాథ్యూ షార్ట్ను పంజాబ్ కింగ్స్ బెయిర్స్టో రీప్లేస్మెంట్గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఇవాళ (మార్చి 25) అధికారికంగా వెల్లడించింది. గోల్ఫ్ ఆడుతూ కిందపడిన బెయిర్స్టో.. పాత గాయం తిరగబెట్టడంతో కొద్ది రోజులుగా రిహాబ్లో ఉన్నాడు. గాయం ఎంతకీ మానకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్ అతన్ని తప్పించి షార్ట్ను ఎంపిక చేసింది. పంజాబ్ కింగ్స్.. 2022 మెగా వేలంలో బెయిర్స్టోను రూ. 9.75 భారీ ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తనకు చెల్లించిన డబ్బుకు న్యాయం చేస్తూ.. బెయిర్స్టో గత సీజన్లో మెరుగ్గా రాణించాడు. Matthew Short 👀pic.twitter.com/Bh7hOtNivO — CricTracker (@Cricketracker) March 25, 2023 2022 ఐపీఎల్లో 11 ఇన్నింగ్స్లు ఆడిన బెయిర్స్టో 144.57 స్ట్రయిక్ రేట్తో 253 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక, మాథ్యూ షార్ట్ విషయానికొస్తే.. ఈ అడిలైడ్ బ్యాటర్ గత బీబీఎల్ సీజన్లో 14 ఇన్నింగ్స్ల్లో 144 స్ట్రయిక్ రేట్తో 458 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. 𝐓𝐫𝐢𝐩𝐥𝐞 the swag, 𝐓𝐫𝐢𝐩𝐥𝐞 the Jazba! 🤩 The King of Kings, D𝐇𝐇𝐇awan has arrived! 𝐀𝐫𝐞 𝐲𝐨𝐮 𝐫𝐞𝐚𝐝𝐲 to 𝐛𝐫𝐞𝐚𝐤 𝐢𝐭 𝐝𝐨𝐰𝐧? 👑#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings @SDhawan25 pic.twitter.com/A36DgrmhFY — Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2023 -
ఐపీఎల్-2023కు దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు వీరే..!
మార్చి 31 నుంచి 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ను ఫోర్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో రాత్రి 7:30 గంటకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా, ప్రతి సీజన్లో దేశ, విదేశీ స్టార్లతో కలకలలాడే క్రికెట్ పండుగ ఈసారి కాస్త కలావిహానంగా మారనుంది. గాయాల కారణంగా చాలామంది స్టార్లు సీజన్ మొత్తానికే దూరం కానున్నారు. కొందరేమో లీగ్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. గాయాల కారణంగా ఐపీఎల్ 16వ ఎడిషన్ మొత్తానికే దూరం కానున్న స్టార్ ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది... జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్) కైల్ జేమీసన్ (చెన్నై సూపర్ కింగ్స్) విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జై రిచర్డ్సన్ (ముంబై ఇండియన్స్) అన్రిచ్ నోర్జే (ఢిల్లీ క్యాపిటల్స్) ప్రిసిద్ధ్ కృష్ణ (రాజస్తాన్ రాయల్స్) జానీ బెయిర్స్టో (పంజాబ్ కింగ్స్) సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ముకేశ్ చౌదరీ (చెన్నై సూపర్ కింగ్స్), మొహిసిన్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్), జోష్ హాజిల్వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఐపీఎల్-2023లో పాల్గొనేది లేనిది తెలియాల్సి ఉంది. -
పంజాబ్ కింగ్స్కు ఏకకాలంలో గుడ్న్యూస్.. బ్యాడ్న్యూస్
మరో వారం రోజుల్లో(మార్చి 31న) ఐపీఎల్ 16వ సీజన్కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్కు ఏకకాలంలో గుడ్న్యూస్.. బ్యాడ్న్యూస్ వచ్చాయి. గుడ్న్యూస్ ఏంటంటే విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చింది. అదే సమయంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోకు మాత్రం ఇంకా ఎన్వోసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో బెయిర్ స్టో ఐపీఎల్ 16వ సీజన్ ఆడేది అనుమానమే. ఇంగ్లండ్కే చెందిన మరో స్టార్ క్రికెటర్ సామ్ కరన్ మాత్రం పంజాబ్ కింగ్స్కు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కిన సామ్ కరన్ను పంజాబ్ కింగ్స్ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అక్టోబర్లో మ్యాచ్ సందర్భంగా కాలు విరగడంతో బెయిర్ స్టో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఈసీబీ పర్యవేక్షణలో ఉన్న బెయిర్ స్టో ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్కు ఎన్వోసీ ఇవ్వడానికి ఈసీబీ నిరాకరించింది. దీంతో అతను ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్ సిరీస్ వరకు బెయిర్ స్టో అందుబాటులోకి వస్తాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక డిసెంబర్ 2022లో జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది పాకిస్తాన్తో రావల్పిండి టెస్టు అనంతరం మోకాలి గాయంతో ఆటకు దూరమైన లియామ్ లివింగ్స్టోన్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇతన్ని రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత లంకాషైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు. ఈసీబీ ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి లివింగ్స్టోన్ ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు సామ్ కరన్ మాత్రం ఐపీఎల్ 2023 సీజన్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్), బెన్ స్టోక్స్(సీఎస్కే), మార్క్వుడ్(లక్నో సూపర్ జెయింట్స్) తదితరులు ఐపీఎల్ 16వ సీజన్లో పాల్గొననున్నారు. IPL 2023లో ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్ (సన్రైజర్స్ హైదరాబాద్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఆదిల్ రషీద్ (సన్రైజర్స్ హైదరాబాద్), జో రూట్ (రాజస్థాన్ రాయల్స్) , లియామ్ లివింగ్స్టోన్ (పంజాబ్ కింగ్స్), జానీ బెయిర్స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ విల్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మరియు మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్) View this post on Instagram A post shared by S A M C U R R A N (@samcurran58) #SherSquad, we need your undying love and support this year more than ever. We are in this together! ♥️#SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/CnS9DNlcqJ — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2023 చదవండి: క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
పంజాబ్ కింగ్స్కు ఊహించని షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!
ఐపీఎల్-2023 సీజన్కు ఆరంభానికి ముందు పంజాబ్ కింగ్స్కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్స్టో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా గతడాది అక్టోబరు నుంచి కాలి గాయం కారణంగా బెయిర్స్టో క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అయితే అతడు ప్రస్తుతం పూర్తి స్ధాయి ఫిటెనెస్ సాధించాడు. బెయిర్స్టో ప్రస్తుతం నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ ఈ ఏడాది జరగనున్న యాషెష్ సిరీస్ సమయానికి అతడు మరింత ఫిట్గా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 16వ సీజన్ మొత్తానికి దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. "రాబోయే యాషెస్ కోసం జానీ బెయిర్స్టో యార్క్షైర్లో ప్రాక్టీస్ చేయనున్నాడు. దాంతో జానీ ఐపీఎల్-2023కు దూరం కానున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని పంజాబ్ ప్రాంఛైజీకు అతడు తెలియజేశాడు" అని ది గార్డియన్ తమ నివేదికలో పేర్కొంది. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 39 మ్యాచ్లాడిన జానీ బెయిర్స్టో.. 142.65 స్ట్రైక్రేట్తో 1291 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. పంజాబ్ తన తొలి మ్యాచ్లో ఏప్రిల్ 1న కోల్కతా నైట్రైడర్స్తో పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది. చదవండి: WTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
శతక్కొట్టుడులో బాబర్ ఆజమే టాప్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో రికార్డు సాధించాడు. రావల్పిండి వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో సెంచరీ సాధించిన ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్).. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (7) చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ వికెట్కీపర్ జానీ బెయిర్స్టో (6) అధిగమించిన బాబర్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 259 ఇన్నింగ్స్ల్లో (మూడు ఫార్మాట్లు కలిపి) 27 శతకాలు సాధించిన బాబర్.. ఈ ఒక్క ఏడాదే 7 సెంచరీలు సాధించడం విశేషం. ఇంగ్లండ్పై ఇవాళ (డిసెంబర్ 3) చేసిన సెంచరీ బాబర్ టెస్ట్ కెరీర్లో 8వ శతకం. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆతిధ్య పాక్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో చేసిన భారీ స్కోర్కు ధీటుగా జవాభిస్తుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నలుగురు బ్యాటర్లు సెంచరీలతో (బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్)) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 657 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తామేమీ తక్కువ కాదు అన్నట్లు రెచ్చిపోయి ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా కెప్టెన్ బాబర్ ఆజమ్ శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. అఘా సల్మాన్ (10), జహీద్ మహమూద్ (1) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి పాక్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 158 పరుగులు వెనుకపడి ఉంది. -
జట్టును ప్రకటించి 24 గంటలు కాలేదు.. టి20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ స్టార్ దూరం
అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శుక్రవారం 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. కాగా జట్టును ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇంగ్లండ్కు బిగ్షాక్ తగిలింది. విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో అనూహ్య రీతిలో టి20 ప్రపంచకప్కు దూరమయ్యాడు. ''బెయిర్ స్టో దూరమవడం మా దురదృష్టం. శుక్రవారం లీడ్స్లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది.దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బెయిర్ స్టోను పరిశీలించిన వైద్యులు సర్జరీ అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్తో పాటు టి20 ప్రపంచకప్కు దూరం కానున్నాడు'' అని ఈసీబీ పేర్కొంది. కాగా ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు బెయిర్ స్టో స్థానంలో బెన్ డకెట్ను ఎంపిక చేశారు. అయితే టి20 ప్రపంచకప్కు మాత్రం బెయిర్ స్టో స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. కాగా బెయిర్ స్టో తన గాయంపై స్పందించాడు. ''ఇవాళ ఉదయం గోల్ఫ్ కోర్సులో గేమ్ ఆడుతుండగా జారి పడ్డాను. దీంతో కాలి కింది భాగంలో గాయం కావడంతో వైద్యులు సర్జరీ అవసరమన్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్కు దూరం కావడం బాధిస్తోంది. నేను ఆడకపోయినప్పటికి మా కుర్రాళ్లకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పుకొచ్చాడు. ఇక టి20 ప్రపంచకప్కు ఈసీబీ ప్రకటించిన జట్టులో స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్ రాయ్కు మొండిచేయి ఎదురైంది. తాజాగా గాయంతో బెయిర్ స్టో కూడా దూరమయ్యాడు. కాగా రాయ్ ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్తో మ్యాచ్తో మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2022కు ఈసీబీ ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు : జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' KL Rahul: 'మరో రెండు మ్యాచ్లు చూస్తారు.. తర్వాత తీసేయడమే' -
నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు.. పేక మేడలా కూలిన ఇంగ్లీష్ బ్యాటర్లు
లండన్: దక్షిణాఫ్రికాతో బుధవారం (ఆగస్ట్ 17) మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 32 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. ఒలీ పోప్ (61; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించి ఇంగ్లండ్ పాలిట ఆపద్భాందవుడయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో పోప్తో పాటు కెప్టెన్ స్టోక్స్ (20) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ఆట ముగిసే సమయానికి పోప్కు జతగా బ్రాడ్ (0) క్రీజ్లో ఉన్నాడు. నిప్పులు చెరిగిన పేసర్లు.. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. టాస్ గెలిచాక ఏమాత్రం సంకోచించకుండా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సఫారీ పేసర్లు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. 3వ ఓవర్లోనే ఓపెనర్ అలెక్స్ లీస్ (5)ను, ఆ తర్వాత 9వ ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలే (9) రబాడ పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత మరింత రెచ్చిపోయిన పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్ (8)ను మార్కో జన్సెన్.. బెయిర్స్టో (0), బెన్ ఫోక్స్ (6), స్టోక్స్ (20)లను నోర్జే అద్భుతమైన బంతులతో పెవిలియన్కు సాగనంపారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్లో ఉన్న బెయిర్స్టోను నోర్జే క్లీన్ బౌల్డ్ చేసిన వైనం తొలి రోజు మొత్తానికే హైలైట్గా నిలిచింది. Anrich Arno Nortje -
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక దశలో అనుకూలంగా కనిపించేదంతా రివర్స్ అయిపోతుంటుంది. తాజాగా ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో విషయంలో ఇదే జరిగింది. ఈ మధ్యకాలంలో బెయిర్ స్టో టెస్టులను కూడా టి20 స్టైల్లో ఆడుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్, భారత్లతో జరిగిన టెస్టు సిరీస్ల్లో ఇదే దూకుడు కనబరిచిన బెయిర్ స్టో మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో చెలరేగిపోతున్న బెయిర్ స్టో సెంచరీలతో కథం తొక్కాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని మరోసారి నిరూపితం అయింది. తాజాగా లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బెయిర్ స్టో డకౌట్గా వెనుదిరిగాడు. ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే వేసిన బంతి బెయిర్ స్టోను క్లీన్బౌల్డ్ చేసింది. గుడ్లెంగ్త్తో వచ్చిన బంతి మిడిల్ స్టంప్ను గిరాటేయగా.. వికెట్ మొత్తం బయటటికి వచ్చింది. నోర్ట్జే ఎంత వేగంతో బంతిని వేశాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టును ఇంగ్లండ్ ఫేలవంగా ఆరంభించింది. తొలి సెషన్లోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా అందుకు తగ్గ ఫలితం సాధించింది. పేసర్లు నోర్ట్జే, రబాడలు పిచ్పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకొని వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ను ముప్పతిప్పలు పెట్టారు. వర్షం అంతరాయంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఓలీ పోప్(61 బ్యాటింగ్).. ఒక్కడే ప్రొటిస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా స్టువర్ట్ బ్రాడ్(0) క్రీజులో ఉన్నాడు. Anrich Arno Nortje