-
రాహుల్ అనర్హతపై ట్విస్ట్ ఇచ్చిన సీఎం నితీష్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ అంశంపై తాను మాట్లాడేందుకు సిద్ధంగా లేనంటూ ముక్కుసూటిగా చెప్పేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా నితీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే, నితీష్ కుమార్ పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు చేతులు కలిపారు అని ప్రధాని చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్య ప్రతిపక్షం అవసరమని అన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసి లేనిది ఉన్నట్టుగా చెబుతారు అని ఆరోపణలు చేశారు. అలాగే, ప్రధాని.. అవినీతి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తులతో పొత్తులు పెట్టుకుంటున్నారో వీడియో రికార్డులు చేసుకోవాలని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అనర్హత వేటుపై నితీష్ స్పందిస్తూ.. కోర్డు ఆర్డర్కు సంబంధించిన ఏ విషయంపైనా కూడా నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఈ అంశంపై పార్టీ ఒక క్లారిటీతో ఉంది. దీనిపై మాట్లాడేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఇదే విషయమై సుప్రీంకోర్టులో సవాల్ చేయడంపై మాట్లాడుతూ.. కోర్టును ఆశ్రయించడం ప్రతీ వ్యక్తికి ఉన్న హక్కు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని తాను ఇప్పటికే చెప్పినట్టు స్పష్టం చేశారు. -
జేడీయూ నుంచి వైదొలిగిన ఉపేంద్ర కుష్వాహ
పట్నా: జేడీయూ అసంతృప్త నేత ఉపేంద్ర కుష్వాహ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ జనతా దళ్ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బిహార్ మహాఘఠ్బంధన్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్కు లభిస్తున్న ప్రాముఖ్యంపై అసంతృప్తితో ఉన్న కుష్వాహ గత కొంత కాలంగా జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్కుమార్పై విమర్శలు చేస్తున్నారు. ఆయన రాజీనామాపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ స్పందించారు. ‘జేడీయూ నుంచి వెళ్లిపోయి సొంతంగా రాష్ట్రీయ లోక్సమతా పార్టీ పెట్టుకున్న కుష్వాహను 2021లో తిరిగి పార్టీలోకి కేవలం సీఎం నితీశ్ కుమార్ జోక్యంతోనే తీసుకున్నాం. స్థాయికి మించిన ఆశలు ఆయనకున్నాయి. అందుకే వెళ్లిపోతున్నారు’అని పేర్కొన్నారు. -
చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తా గానీ, మరోసారి బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వాళ్లది బోగస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్పై కేసు పెట్టి కమలం పార్టీ ఏం సాధించిందని నీతిశ్ నిలదీశారు. 'మేం అటల్ బిహారీ వాజ్పేయీ ఫాలోవర్లం. ఆయనతో అంతా బాగుండేది. 2017లో బీజేపీతో జట్టుకట్టాం. తర్వాత విడిపోయాం. నేను సీఎం కావాలనుకోలేదు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి వాళ్లనే సీఎం పదవి చేపట్టమన్నా. కానీ నన్ను బలవంతంగా ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో మేం ఎలా ఓడిపోయామో మా పార్టీ నేతలు వివరించారు. మా ప్రజల ఓట్లతో వాళ్లు గెలిచారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అప్పుడు బీహార్ ప్రజలంటే ఏంటో వాళ్లకు తెలుస్తుంది.' అని నితీశ్ అన్నారు. '2005లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది. 2010లో ఎన్ని గెలిచింది. అప్పుడు ముస్లిం ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వేశారు. 2015లో మాతో విడిపోయాక ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది? ఈసారి మా ఓట్లు వేయించుకుని మమ్మల్నే ఓడించింది.' అని నితీశ్ పేర్కొన్నారు. తమకు అటల్ జీ, అద్వానీ అంటే అభిమానమేనని, కానీ ఇప్పుడున్న బీజేపీ పూర్తిగా వేరు అని నితీశ్ వివరించారు. ఈ నాయకులు వచ్చాక మొత్తం మారిందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారిని మర్చిపోవడం తగునా? అని నితీశ్ వ్యాఖ్యానించారు. 2024లో బిహార్లో 34 ఎంపీ సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నితీశ్ జోస్యం చెప్పారు. మరోవైపు తాము మరోసారి జేడీయూతో పొత్తు పెట్టకోవద్దని బిహార్ బీజేపీ తీర్మానించింది. నితీశ్కు మరోసారి మోసం చేసే అవకాశం ఇవ్వమని చెప్పింది. చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. మంచులోనే రాహుల్ ప్రసంగం -
కుమారస్వామి తనయుడికి జేడీయూ అసెంబ్లీ టికెట్
రామనగర: కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కొడుకు, జేడీయూ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిఖిల్ను దేవెగౌడ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రామనగర స్థానం నుంచి నిలబెట్టనున్నట్లు జేడీయూ అధిష్టానం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు అభ్యరి్థని ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీగా జేడీయూ నిలిచింది. కుమారస్వామి భార్య అనిత ప్రస్తుతం రామనగర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదీ చదవండి: మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ -
బీజేపీతో సంబంధాలపై నితీశ్కు పీకే ఛాలెంజ్
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒకప్పుడు మంచి మిత్రులు. ఇద్దరు జేడీయూలో కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు మాత్రం బద్దశత్రువులుగా మారారు. తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నితీశ్ మహాఘట్బంధన్లో చేరినప్పటికీ ఇంకా బీజేపీతో టచ్లోనే ఉన్నారని పీకే ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే నితీశ్ తనదైన శైలిలో వీటిని తిప్పికొట్టారు. ఆయన పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడరతారని సెటైర్లు వేశారు. తాజాగా నితీశ్కు మరో సవాల్ విసిరారు పీకే. నిజంగా ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి జేడీయూ వైదొలిగినప్పుడు ఆయన మాత్రం ఎందుకు పదవి నుంచి తప్పుకోలేదని ట్వీట్ చేశారు. ఎప్పుడూ రెండు దారులు ఉండవు నితీశ్ జీ అంటూ సెటైర్లు వేశారు. #NitishKumar ji if you have nothing to do with BJP / NDA then ask your MP to quit the post of Deputy Chairman of Rajya Sabha. You can’t have both ways all the time. — Prashant Kishor (@PrashantKishor) October 22, 2022 నితీశ్ కుమార్ మహాఘట్బంధన్లో చేరినప్పటికీ బీజేపీకి తలుపులు తెరిచే ఉంచారని పీకే అన్నారు. రాజ్యడిప్యూటీ ఛైర్మనే అందుకు నిదర్శనమన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తానని నితీశ్ చెబుతున్నపటికీ ఆయనను నమ్మలేమని పేర్కొన్నారు. నితీశ్ 17 ఏళ్లు బిహార్ సీఎంగా ఉంటే.. అందులో 14 ఏళ్లు బీజేపీతోనే ప్రభుత్వాన్నిఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్ -
‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ
పాట్నా: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ఎంపీ లలన్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన తరగతికి(బీసీ) చెందిన వ్యక్తి అని అన్నారు. అయితే గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని ఈబీసీలో విలీనం చేశారని ఆరోపించారు. ఆయన డూప్లికేట్ వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కానీ దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రధాని ఏనాడూ నోరువిప్పలేదని ధ్వజమెత్తారు. అలాగే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని లలన్ సింగ్ ఆరోపించారు. అందుకే కుల ఆధారిత జనగణనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. అలా జరిగితే వాళ్ల నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందని బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. జేడీయూ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు లలన్ సింగ్ మాట్లాడారు. బీజేపీ కౌంటర్ అయితే లలన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడింది. లలన్ సింగ్, నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుని, మోదీ ఫోటోతోనే గెలిచారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ పార్టీ నేత రవి శంకర్ ప్రసాద్ అన్నారు. రాజకీయ ప్రమాణాలు దిగజారవద్దని హితవు పలికారు. చిన్న చితకా నాయకులు ఏం మాట్లాడినా తాము పట్టించుకోమని కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
నితీశ్కు వయసుమీదపడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు
జేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయమని ప్రశాంత్ కిశోర్ గతంలో తనకు సలహా ఇచ్చాడని బిహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నితీశ్కు వయసు మీదపడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి, ఇంకేదో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ఆయన ఇప్పుడు భ్రమలో ఉన్నారని, ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అందుకే రాజకీయంగా ఏకాకి అయ్యాననే బాధతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. 'నితీశ్ మొదట నేను బీజేపీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత జేడీయూను కాంగ్రెస్ను విలీనం చేయమని సలహా ఇచ్చానని అంటున్నారు. ఒకవేళ నేను బీజేపీ కోసం పనిచేస్తే జేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయమని ఎందుకు చెప్తా?. ఆ పార్టీని ఎందుకు బలోపేతం చేస్తా? ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి? నితీశ్ కుమార్ చెప్పిన రెండు విషయాలకు పొంతన లేదు. మీడియాతో ఒకటి చెప్పబోయి ఇంకేదో చెబుతున్నారు. ఆయన చుట్టూ విశ్వాసపాత్రులు ఎవరూ లేరు. అందుకే భ్రమలో ఉన్నారు.' అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. చదవండి: మా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలట -
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసి రాజీనామా చేసిన మంత్రి
పాట్నా: బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయం రంగంలో అవినీతిపై ప్రశ్నించారు. బీజేపీ-జేడీయూ పాలనలో జరిగినట్లే ఇప్పుడూ జరిగితే తాను సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ లక్ష్యాలను దారిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామని సుధాకర్ అన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే రాజీనామా చేశారు. సుధాకర్ సింగ్ రాజీనామాను ఆయన తండ్రి, బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ధ్రువీకరించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వాళ్ల పక్షాన ఒకరు నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. 2006లో ఎన్డీఏ హయాంలో సీఎంగా నితీశ్ కుమార్ ఉన్నప్పుడే ఈ చట్టాన్ని రద్దు చేయడం గమనార్హం. సుధాకర్ సింగ్ తరచూ తన శాఖలో జరుగుతున్న అవినీతిని బహిరంగంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా రైతు సమస్యలను తీర్చలేకపోతే ఈ పదవి ఎందుకని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు. చదవండి: అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా -
నా పర్యటనతో లాలూ, నితీశ్కు కడుపులో నొప్పి.. అమిత్ షా విమర్శలు
పాట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్షా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో ప్రధాని కావాలనే లక్ష్యంతో ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ప్రసాద్ యాదవ్ ఒళ్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. నితీశ్ తెగదెంపులు చేసుకోవడంతో బిహార్లో ఎన్డీఏ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చారు అమిత్ షా. రెండు రోజుల పర్యటనలో భాగంగా సరిహద్దు జిల్లా పూర్ణియాలో ర్యాలీలో ప్రసంగించారు. నితీశ్పై విమర్శలు గుప్పించారు. 'నేను ఈవాళ సరిహద్దు జిల్లాల్లో పర్యటించడం చూసి లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్లకు కడుపునొప్పి వస్తోంది. వాళ్లు అశాంతి కోరుకుంటున్నారు. నేను ఇక్కుడకు వస్తే అశాంతి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు. నితీశ్ కుమార్ లాలూ ఒళ్లో కూర్చుకున్నారు. ప్రజలేం ఆందోళన చెందవద్దు. సరిహద్దు జిల్లాలు భారత్లో భాగమే. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఏదో ఒకరోజు ప్రధాని కావాలనే ఆశతో నితీశ్ లాలూ చెంతకు చేరారు. వాళ్లు బిహార్ ప్రజల తీర్పుకు విరుద్ధంగా ద్రోహం చేశారు. సీమాంతర ప్రజలు నితీశ్కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. కూటములు మార్చి నితీశ్ ప్రధాని కాగలరా?' అని అమిత్ షా ప్రశ్నించారు. నితీశ్కు సీఎం పదవి ఇస్తామని ప్రధాని మోదీ మాటిచ్చినందు వల్లే బీజీపే అందుకు కట్టుబడి ఉండి ఆయనకు బాధ్యతలు అప్పగించిందని అమిత్ షా చెప్పారు. కానీ నితీశ్ మాత్రం ద్రోహం చేసి ప్లేటు పిరాయించారని దుయ్యబట్టారు. ర్యాలీ అనంతరం కిషన్గంజ్కు వెళ్తారు అమిత్ షా. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, పార్టీ కార్యాలయాల బాధ్యులతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారు. చదవండి: అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం! -
బీజేపీ అడ్డాలో పోటీకి నితీశ్ సై.. అఖిలేశ్ యాదవ్ మద్దతు!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్. అయితే ఆ పార్టీ వర్గాల్లో మాత్రం ఓ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో నితీశ్ కుమార్ స్వయంగా ఉత్తర్ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఫూల్పుర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.. నితీశ్ కుమార్కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూపీలో ఎక్కడి నుంచి పోటీ చేసినా నితీశ్కు సమాజ్వాదీ పార్టీ మద్దతునిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. నితీశ్ ఫూల్పుర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగాలని జేడీయూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ కూడా ఈ విషయంపై ఇప్పటికే హింట్ ఇచ్చారు. నితీశ్ కుమార్ 2024 లోకసభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయవచ్చన్నారు. ఫూల్పుర్తో పాటు అంబేడ్కర్ నగర్, మిర్జాపూర్ లోక్సభ స్థానాల నుంచి కూడా ఆయనకు ఆఫర్ ఉన్నట్లు చెప్పారు. అయితే నితీశ్ పోటీ చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. 80 స్థానాలు.. ఉత్తర్ప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాలున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రాష్ట్రమే ఎంతో కీలకం. యూపీలో ప్రస్తుతం బీజేపీకి 65 మంది ఎంపీలున్నారు. అందుకే ఇక్కడ ఆ పార్టీని దెబ్బతీసేందుకు నితీశ్ వ్యూహా రచన చేస్తున్నట్లు సమాచారం. అఖిలేశ్ యాదవ్తో పాటు ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తే బీజేపీకి 15-20 స్థానాలకే పరిమితం చేయవచ్చని లలన్ సింగ్ చెబుతున్నారు. అలబాహాద్లోని ఫూల్పుర్ నియోజకవర్గం ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. మోదీని ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్న నితీశ్.. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. లేకపోతే మోదీని సవాల్ చేయడం అంత సులభం కాదని అంటున్నారు. చదవండి: బీజేపీ హర్ట్ అయింది -
నితీశ్ కుమార్తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహీర్ సీఎం నితీశ్ కుమార్తో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్. ఆయనతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ ఒక్క షరతు విధించారు. నితీశ్ సర్కార్ బిహార్లో ఒక్క ఏడాదిలో 10 లక్షల ముందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అలా అయితేనే మహాఘట్బంధన్లో తాను కూడా చేరతానని చెప్పారు. అంతేకాదు రెండో రోజుల క్రితం నితీశ్తో తాను భేటీ అయినట్లు ప్రశాంత్ కిశోర్ ధ్రువీకరించారు. ప్రశాంత్ కిశోర్తో భేటీ అయినట్లు నితీశ్ బుధవారమే వెల్లడించారు. అయితే ఏ విషయాలపై మాట్లాడారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగానే సమావేశమైనట్లు పేర్కొన్నారు. వీరిద్దరి భేటీని జేడీయూ మాజీ నేత పవన్ వర్మ ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రశాంత్ కిశోర్తో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని, పాత స్నేహితుడే అని నితీశ్ వ్యాఖ్యానించడం మళ్లీ వీరిద్దరూ జతకడతారా? అనే ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పుడు పీకే రియాక్షన్ చూస్తుంటే ఇది వాస్తవరూపం దాల్చే సూచనలే కన్పిస్తున్నాయి. నెల రోజుల క్రితం ఏన్డీఏతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో బిహార్లో మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటను వెళ్లి కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడే పీకేతో భేటీ కావడం చూస్తుంటే.. నితీశ్ పెద్ద ప్లాన్తోనే ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. చదవండి: ఆ వీడియో నిజమైతే నన్ను అరెస్టు చేయండి.. బీజేపీకి సిసోడియా సవాల్ -
థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో సోమవారం నుంచి ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు బిహార్ సీఏం నితీశ్ కమార్. ఇందులో భాగంగనే బుధవారం ఎన్సీపీ అధినేత శరద్పవార్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాని, ప్రధాని అభ్యర్థి కావాలనే ఆలోచన లేదని నితీశ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. అందుకే అన్ని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మెయిన్ ఫ్రంట్.. తాము థర్డ్ ఫ్రంట్ కోసం కాదు మెయిన్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు నితీశ్ వ్యాఖ్యానించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో తాను జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలు 2024లో భిన్నంగా ఉంటాయన్నారు. ప్రధాని మోదీకి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారని మీడియా ప్రశ్నించగా.. నితీశ్ స్పందించారు. ప్రకటనలు, పేర్లు మార్చడం తప్ప బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నితీశ్ సన్నిహిత వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి విపక్షాలను ఏకం చేయడంపైనే ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీకి కలిసొచ్చిందని ఆయన భావిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారనే విషయంపై ఇప్పటివరకైతే పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్లను పరిశీలించే అవకాశాలు కన్పిస్తున్నాయి. నితీశ్ కుమార్ పేరును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. చదవండి: భారత్ జోడో యాత్ర షురూ -
‘ప్రధాని’ ఆసక్తి లేదు: నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్కుమార్ మంగళవారం ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాంలతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం దేశ రాజధానికి చేరుకోవడం తెలిసిందే. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వారితో సమావేశమైనట్టు అనంతరం నితీశ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై విపక్షాల సమష్టి శక్తిని చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతరం సమాజ్వాదీ నేత ములాయంసింగ్ యాదవ్, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా తదితరులను కూడా నితీశ్ కలిశారు. తనకు ప్రధాని కావాలని ఉందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆ పదవికి నేను పోటీదారు కాను. దానిపై నాకు ఆసక్తీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ తొలి అజెండా తప్ప ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదని ఏచూరి చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుందన్నారు. బీజేపీపై పోరులో నితీశ్ కలిసి రావడం దేశ రాజకీయాలకు గొప్ప శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. నితీశ్, కేజ్రీవాల్ భేటీ గంటన్నర పాటు సాగింది. విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు ఆపరేషన్ లోటస్, విపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు తదితరాలపై చర్చించినట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం బీజేపీపై పోరాటానికి వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని రాజా అన్నారు. సోమవారం రాహుల్గాంధీతోనూ నితీశ్ భేటీ కావడం తెలిసిందే. 25న ‘బల ప్రదర్శన’ ర్యాలీ నితీశ్, కేసీఆర్, మమత హాజరు! సెప్టెంబర్ 25న హరియాణాలో ఐఎన్ఎల్డీ తలపెట్టిన ర్యాలీని విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మార్చాలని నితీశ్ భావిస్తున్నారు. దానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్సింగ్ బాదల్ తదితరులను ఐఎన్ఎల్డీ ఆహ్వానించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులకు కూడా ఆహ్వానాలు పంపుతామని పేర్కొంది. ఈ ర్యాలీలో విపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పలు అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పుకొచ్చింది. బీజేపీతో జనం విసిగిపోయారని చౌతాలా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కన్పిస్తోందని చెప్పారు. -
‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’
పాట్నా: బిహార్లో ఎన్డీయే కూటమికి టాటా చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతా దళ్ యునైటెడ్(జేడీయూ). రెండు రోజుల్లోనే నితీశ్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్). బిహార్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకేనన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో బిహార్లోని మొత్తం 40 పార్లమెంటరీ స్థానాల్లో జేడీయూ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. బీజేపీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని, భవిష్యత్తులో తిరిగి మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు. మరోవైపు.. బీజేపీకి 2024 ఎన్నికల్లో 50 సీట్లు మాత్రమే వస్తాయని శనివారం ఓ సమావేశం వేదికగా అంచనా వేశారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం మరోమారు విపక్షాల ఐక్యతపై మాట్లాడారు నితీశ్ కుమార్. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే విజయం తథ్యమన్నారు. కానీ, తాము ఎన్ని సీట్లు సాధిస్తామనేదానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదీ చదవండి: రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ఫైర్ -
‘అదే జరిగితే 2024లో పిక్చర్ వేరేలా ఉంటుంది’
పాట్నా: మణిపూర్లో జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఈ క్రమంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ప్రతిపక్షాలు ఏకమైతే 2024లో పరిస్థితులు మరోస్థాయిలో ఉంటాయన్నారు. శనివారం సాయంత్రం తలపెట్టిన జేడీయూ రాష్ట్ర ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యేందుకు మణిపుర్ జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని, అయితే, ఆకస్మికంగా ఆ మరుసటి రోజునే బీజేపీలో చేరటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ‘ఇది రాజ్యాంగబద్ధమేనా? కొద్ది నెలల క్రితం వారంతా బిహార్కు వచ్చారు. బీజేపీ ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. వారు అనుసరించిన తీరు ఎలాంటిది? దానర్థం ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటున్నారు. ’ అని ఆరోపించారు. మరోవైపు.. జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్ సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్వభావం మరోమారు బయపడిందన్నారు. ‘వారితో మేము కలిసి ఉన్నప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లోనూ ఇదే చేశారు. ఇప్పుడు మేము కూటమి నుంచి బయటకి వచ్చేశాం. మరోమారు అలాగే చేశారు. 2024లోనే వారికి సరైన గుణపాఠం లభిస్తుంది. 2024 ఎన్నికలపై భయంతోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు. కానీ, ప్రజలు వారిని గమనిస్తూనే ఉన్నారు. బిహార్లోనూ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: నితీశ్కు ఊహించని షాక్.. బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు.. -
నితీశ్కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు
ఇంఫాల్: మణిపూర్లో మొత్తం ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. స్పీకర్ ఆమోదంతో శుక్రవారం అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తయింది. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న వారాల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడం బిహార్ సీఎం నితీశ్ కుమార్కు షాకే అని చెప్పాలి. ఎమ్మెల్యేల చేరిక అనంతరం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ.. నితీశ్పై విమర్శలు గుప్పించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లు జేడీయూ ముక్త్ రాష్ట్రాలుగా అవతరించాయని పేర్కొన్నారు. బిహార్ రాజధాని పాట్నాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం గమనార్హం. నితీశ్ కుమార్కు బీజేపీకి షాక్ ఇవ్వడం తొమ్మిదో రోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్లోని ఏకైక జేడీయూ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి కమలం గూటికి వెళ్లారు. జేపీ నడ్డా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రాష్ట్రాల్లో జేడీయూకు ఉనికి కోల్పేయే పరిస్థితి రావడం నిజంగా నితీశ్కు దెబ్బెే అని విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూ 7 స్థానాల్లో గెలిచింది. అయితే ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లారు. మిగిలిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆగస్టు 25న బీజేపీ గూటికి చేరారు. దీంతో రాష్ట్రంలో జేడీయూ ఖాళీ అయింది. చదవండి: ఆప్కు అధికారమిస్తే.. గుజరాతీలకు బంపరాఫర్ -
అందుకే సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి: నితీశ్ కుమార్
పాట్నా: బిహార్లో బీజేపీకి టాటా చెప్పి తన పాత స్నేహితులతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నితీశ్ కుమార్ అసలు సీఎం పదవికి తగిన వ్యక్తి కాదంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 2020లో బీజేపీతో పోలిస్తే తనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వెనుకున్న కారణాలను బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ వేదికగా వెల్లడించారు నితీశ్ కుమార్. విపక్ష నేతలతో చేతులు కలిపి నితీశ్ ద్రోహం చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ‘ 2020 ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే తక్కువ సీట్లు వచ్చినా.. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాను. కానీ, సీఎం పదవిలో కొనసాగేందుకు నాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. నేనే ముఖ్యమంత్రినని వారు చెప్పారు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పాను. మీరు ఎక్కువ సీట్లు గెలిచారు.. మీ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉండాలని సూచించాను. చివరకు అంగీకరించాను. కానీ, ఆ పదవిని ఒత్తిడిలో చేపట్టాను. నంద్ కిషోర్ యాదవ్ను స్పీకర్గా చేస్తారని నాకు చెప్పారు. పాత మిత్రుడని.. బావుంటుందని చెప్పాను. కానీ, అతను కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఓ వ్యక్తిని కింది స్థాయి నుంచి తీసుకొచ్చి కేంద్రంలోకి పంపిస్తే నాకే ద్రోహం చేశాడు.’ అని పేర్కొన్నారు నితీశ్. ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీజేపీ నేతలు సుశీల్ కుమార్ మోదీ, ప్రేమ్ కుమార్ పేర్లను సైతం వెల్లడించారు. ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు నితీశ్ కుమార్. 2017లో ఆర్జేడీని వీడి బీజేపీతో చేతులు కలిపిన అంశాన్ని లేవనెత్తుతూ విమర్శలు చేయటంపై స్పష్టత ఇచ్చారు. ‘2017లో వారి నుంచి విడిపోయాను. మీరు చాలా ఆరోపణలు చేశారు. కానీ ఐదేళ్ల గడిచినా వారికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు.’ అని స్పష్టం చేశారు నితీశ్. ఇదీ చదవండి: Bihar Floor Test: బల పరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్ -
బిహార్ సీఎం పై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ పై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీగా పదివి చేపట్టక మునుపు తాను బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిస్తున్న సమయంలో జేడీయు నాయకులు తన వద్దకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారని అన్నారు. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లితే మీరు ముఖ్యమంత్రి అవుతారంటూ అదే జేడీయే నాయకులు ఒక పథకంతో తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే నితీష్ కుమార్ తనకు ఆ ఉద్దేశం లేదని కొట్టిపారేశారు. కేవలం తాను బీజేపీ వ్యూహం నుంచి తన పార్టీని రక్షించుకునే నిమిత్తం ఇలా చేశానని చెప్పుకొచ్చారు. పైగా తాను గత నెలన్నర కాలం నుంచి మీడియాకి దూరంగా ఉన్నానని అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ నితీష్ ఈ రోజు బీజేపీ ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. బిహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని చూసి నమ్మి ఓటు వేస్తే ఇలా వెన్నుపోటు పొడిచే రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. తాను ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్తో ఉన్న కొత్త బిహార్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తానంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లోపే ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. అయినా నితీష్ కుమార్ మహారాష్ట్రలా బిహార్ అవుతుందని భయపడ్డానని చెబుతున్నారు. కానీ బీజేపీ ఏమీ శివసేనను విభజించడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అంతేకాదు లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని ఆర్జేడియూని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఐతే ఈ విషయమే జేడీయూ లేదా ఆర్జేడియూ ఇంకా స్పందించలేదు. (చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి) -
బీజేపీకి బైబై.. ఆర్జేడీతో నితీశ్ దోస్తీ..
పట్నా: హై వోల్టేజీ రాజకీయ డ్రామాకు బిహార్ వేదికగా మారింది. ఊహించినట్టుగానే జనతాదళ్(యునైటెడ్) చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ (71) బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమితో ఐదేళ్ల సంకీర్ణ బంధానికి గుడ్బై చెప్పారు. మహారాష్ట్ర మార్కు వ్యూహంతో తన సీఎం పీఠానికి బీజేపీ ఎసరు పెడుతోందన్న అనుమానంతో తానే ముందుగా చకచకా పావులు కదిపారు. సీఎం పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలో రెండేళ్ల బీజేపీ–జేడీ(యూ) సంకీర్ణ పాలనకు తెర దించడమే గాక వెనువెంటనే ఆర్జేడీ నేతృత్వంలోని మహా ఘట్బంధన్లో చేరి మళ్లీ సీఎం పీఠమెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు! బుధవారం మధ్యాహ్నం రెండింటికి రాజ్భవన్లో సాదాసీదాగా జరిగే కార్యక్రమంలో సీఎంగా నితీశ్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. కొత్త మంత్రివర్గంలో జేడీ(యూ), ఆర్జేడీతో పాటు కాంగ్రెస్కు కూడా స్థానం దక్కుతుందని చెబుతున్నారు. వామపక్షాలు బయటినుంచి మద్దతిస్తాయని తెలుస్తోంది. బిహార్ సీఎం పదవి చేపట్టనుండటం నితీశ్కు ఇది ఏకంగా ఎనిమిదోసారి కావడం విశేషం! కాగా బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం గత తొమ్మిదేళ్లలో ఇది రెండోసారి. ఈ పరిణామాలపై బీజేపీ మండిపడగా కాంగ్రెస్ తదితర విపక్షాలు హర్షం వెలిబుచ్చాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ ప్రజలిచ్చిన తీర్పును నితీశ్ అపహాస్యం చేశారంటూ బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ దుయ్యబట్టారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నారు. తాను పల్టూ రామ్ (పార్టీలు మార్చే వ్యక్తి)నని నితీశ్ మరోసారి రుజువు చేసుకున్నారని కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే విమర్శించారు. ఆయన అహంకారంతో మిడిసిపడుతున్నారన్నారు. జేడీ(యూ)కు బిహార్లో బీజేపీ కంటే తక్కువ సీట్లున్నా సంకీర్ణ ధర్మాన్ని గౌరవిస్తూ నితీశ్ను సీఎంను చేశామని గుర్తు చేశారు. లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకే బిహార్లో నితీశ్కు మద్దతిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో మెజారిటీకి 122 స్థానాలు అవసరం. జేడీ(యూ)కు 45, ఆర్జేడీకి 79 మంది, కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 77 మంది ఉన్నారు. బిహార్లో మంగళవారం రోజంతా ఏం జరిగిందంటే... ఉదయం 11 : నితీశ్ నివాసంలో జేడీ(యూ) ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ. మధ్యాహ్నం 1 : మహా ఘట్బంధన్ నేతల భేటీ. నితీశ్కు మద్దతు లేఖపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ తదితర పార్టీల ఎమ్మెల్యేల సంతకం. మధ్యాహ్నం 2 : మళ్లీ జేడీ(యూ) భేటీ. కొత్త సంకీర్ణానికి ఎమ్మెల్యేల మద్దతు. సాయంత్రం 4 : ‘ఎన్డీఏ’ సీఎం పదవికి రాజీనామా లేఖ గవర్నర్కు అందజేత 4.45 : రబ్రీ నివాసంలో తేజస్వి, ఇతర నేతలతో నితీశ్ మంతనాలు. 5.20 : నేతలందరితో కలిసి రాజ్భవన్ బయల్దేరిన నితీశ్. 6:00 : 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ గవర్నర్కు సమర్పణ. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి. రోజంతా రాజకీయ వేడి బిహార్లో జేడీ(యూ), బీజేపీ సంబంధాలు చాలాకాలంగా క్షీణిస్తూ వస్తున్నాయి. బీజేపీ ఆధిపత్య ధోరణిపై నితీశ్ చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. దాంతో ఎన్డీఏతో ఆయన మరోసారి తెగదెంపులు చేసుకోవడం ఖాయమంటూ కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం జేడీ(యూ) సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తదితరులతో నితీశ్ భేటీ అయ్యారు. సంకీర్ణ ధర్మానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. తమకు వెన్నుపోటు పొడవాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు. జేడీ(యూ) సీనియర్ నేత ఆర్సీపీ సింగ్ ద్వారా పార్టీలో తిరుగుబాటుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. భేటీ నుంచి నితీశ్ నేరుగా రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్ ఫగు చౌహాన్ను కలిసి సీఎం పదవికి రాజీనామా లేఖ ఇచ్చారు. ‘‘ఎన్డీఏ సంకీర్ణాన్ని వీడాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ‘ఎన్డీఏ’సీఎం పదవికి రాజీనామా చేశా’నని మీడియాకు చెప్పి వెనుదిరిగారు. అనంతరం శరవేగంగా పావులు కదిపారు. తేజస్వీ తల్లి, మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ తేజస్వీ యాదవ్తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, హిందూస్తానీ అవామ్ మోర్చా నాయకుడు జితన్రాం మాంఝీ తదితర మహా ఘట్బంధన్ నేతలతో అరగంట పాటు మంతనాలు జరిపారు. వారందరితో కలిసి గంటసేపటికే మరోసారి గవర్నర్ను కలిశారు. ఏడు పార్టీలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కూడిన మహా ఘట్బంధన్ తమ నేతగా తనను ఎన్నుకుందని వివరించారు. కనుక ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త సంకీర్ణానికి అవకాశమివ్వాల్సిందిగా కోరారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను అందజేసినట్టు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నితీశ్ చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ముఖ్య నేత రాహుల్గాంధీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. తనకు మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోకెల్లా అత్యంత అనుభవజ్ఞుడైన సీఎంగా నితీశ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ తేజస్వీ కొనియాడారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలే నితీశ్ తాజా నిర్ణయానికి ప్రధాన కారణమని సీపీఎంఎల్ఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అంతకుముందు తేజస్వి తదితరులతో రబ్రీ నివాసంలో నితీశ్ మంతనాలు జరుపుతుండగానే ‘మహా ఘట్బంధన్ సీఎంగా నితీశ్కు శుభాకాంక్షలు’అంటూ జేడీ(యూ) సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహా ట్వీట్ చేశారు! చదవండి: మాది సంకీర్ణ ధర్మం- నితీశ్దేమో..: బీజేపీ -
కలహాల కాపురానికి ఫుల్స్టాప్: నితీశ్ చాణక్యం
జేడీ(యూ) నేత నితీశ్కుమార్ (71) దేశ రాజకీయాల్లో మరోసారి కలకలం సృష్టించారు. ఎన్డీఏతో కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టడమే గాక బిహార్లో రెండేళ్ల క్రితం బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలువునా కూల్చేసి ఆ పార్టీకి గట్టి షాకే ఇచ్చారు. అదే వేగంతో ఆర్జేడీ సారథ్యంలోని మహా ఘట్బంధన్ కూటమిలో చేరి సీఎం పీఠాన్ని కాపాడుకున్నారు. రాజకీయ భాగస్వాములను, తద్వారా ప్రభుత్వాలను మంచినీళ్లప్రాయంగా మార్చడంలో తనకు తానే సాటి అని మరోసారి రుజువు చేసుకున్నారు. ఒకవైపు ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను బీజేపీ పథకం ప్రకారం వరుసబెట్టి కూలుస్తూ వస్తుంటే, బిహార్లో ఆ పార్టీనే అధికారానికి దూరం చేసి ఔరా అన్పించారు. అంతటితో ఆగలేదు. మహారాష్ట్రలో మాదిరిగా జేడీ(యూ) అసమ్మతి నేత ఆర్సీపీ సింగ్ సాయంతో పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని గట్టి ఆరోపణలు చేసి కాషాయ పార్టీని ఒకవిధంగా ఆత్మరక్షణలో పడేశారు. అందుకే ఎన్డీఏను వీడాల్సి వచ్చిందంటూ తన చర్యను సమర్థించుకున్నారు. నిజానికి బిహార్లో బీజేపీ ఇలాంటి ప్రయత్నం చేస్తోందని కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది కూడా. దాంతో రంగంలోకి దిగిన నితీశ్ బీజేపీ కంటే ముందు తనే పావులు కదిపి అధికార పీఠాన్ని కాపాడుకున్నారు. తద్వారా ఒక సిద్ధాంతమంటూ లేని రాజకీయ అవకాశవాదిగా ఆయనపై ఉన్న ముద్రకు మరింత బలం చేకూరింన్నది పరిశీలకుల అభిప్రాయం. కాకపోతే నానా రకాలుగా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల ఉసురు తీస్తూ వస్తున్న బీజేపీనే దెబ్బ కొట్టిన హీరోగా కూడా నిలిచారని వారంటున్నారు. వెన్నతో పెట్టిన విద్యే పార్టీలను, కూటములను మార్చడం నితీశ్కు కొత్తేమీ కాదు. గత తొమ్మిదేళ్లలో ఆయన ఎన్డీఏకు దూరమవడం ఇది రెండోసారి. బీజేపీ–జేడీ(యూ) 2005లోనే బిహార్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. 2010లో బంపర్ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. కానీ నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి 2013లో నితీశ్ తొలిసారి వైదొలిగారు. తర్వాత 2014లో లోక్సభ ఎన్నికల పరాజయానికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహా ఘట్బంధన్తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అవినీతిని, అధికార లాలసను భరించలేనంటూ 2017లో ఘట్బంధన్కు గుడ్బై చెప్పి మళ్లీ ఎన్డీఏతో జట్టు కట్టి సీఎంగా కొనసాగారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేశారు. రాష్ట్రంలో 40 లోక్సభ సీట్లకు గాను ఎన్డీఏ ఏకంగా 39 సీట్లు కొల్లగొట్టింది. బీజేపీకి 17, జేడీ(యూ)కు 16, మరో భాగస్వామి ఎల్జేపీకి 6 సీట్లొచ్చాయి. కానీ ఎక్కువ ఎమ్మెల్యేల బలంతో ఎన్డీఏ సంకీర్ణంలో ఎప్పుడూ పెద్దన్నగానే ఉన్న జేడీ(యూ) గత పదేళ్లుగా క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు రాగా జేడీ(యూ) 43 స్థానాలకు పరిమితమైంది. అయినా ముందే ప్రకటించినట్టుగా నితీశ్నే సీఎంగా బీజేపీ కొనసాగించింది. కానీ పాలనలో పదేపదే వేలు పెడుతూ తనను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నితీశ్ అసంతృప్తికి లోనయ్యారు. దీనికితోడు జేడీ(యూ) ఉనికినే దెబ్బ తీసేందుకు కాషాయ పెద్దలు పథక రచన చేస్తున్నారన్న వార్తలు ఆయన్ను మరింతగా చికాకు పరిచాయి. మహారాష్ట్రలో శివసేన అసంతృప్త నేత ఏక్నాథ్ షిండే సాయంతో ఆ పార్టీ పుట్టి ముంచిన వ్యూహాన్నే తమపైనా బీజేపీ ప్రయోగించనుందని నితీశ్ అనుమానించారు. అందులో భాగంగా జేడీ(యూ) అసంతృప్త నేత ఆర్సీపీ సింగ్ పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆయన్ను కలవరపరిచాయి. నిజానికి ఆర్సీపీ సింగ్తో నితీశ్కు చాలాకాలంగా ఉప్పూనిప్పుగానే ఉంది. నితీశ్ అంగీకారం లేకుండానే సింగ్కు బీజేపీ కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. ఆ కారణంగానే ఇటీవల సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పుడు నితీశ్ మళ్లీ అవకాశమివ్వలేదు. దాంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆపై తన మద్దతుదారులతో కలిసి తిరుగుబాటు ప్రయత్నాలను సింగ్ వేగవంతం చేశారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ మరోసారి బీజేపీకి చెయ్యిచ్చి మహా ఘట్బంధన్ గూటికి చేరారు. ఒక్క దెబ్బతో ఇటు తిరుగుబాటు వార్తలకు చెక్ పెట్టడమే గాక బీజేపీకి కూడా షాకిచ్చారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుమానిస్తున్నంతా అయింది. కొద్ది నెలలుగా బీజేపీ పెద్దలతో ఎడముఖం, పెడముఖంగా ఉన్న జనతాదళ్ – యునైటెడ్ (జేడీ–యూ) అధినేత నితీశ్ కుమార్ కాషాయపార్టీతో తెగతెంపులు చేసుకొని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి మంగళవారం బయటకు వచ్చేశారు. బీహార్ సీఎం పదవికి రాజీనామా ఇచ్చారు. బీజేపీ వినా రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ సహా 7 పార్టీల ‘మహా గఠ్బంధన్ 2.0’తో కొత్త సర్కారు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2010 నవంబర్ నుంచి ఇప్పటికి 22 ఏళ్ళలో రకరకాల పొత్తులతో, ఏకంగా 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతూ, కొత్త రికార్డు సృష్టించారు. రాజకీయ వ్యూహాలు, అధికార ఆకాంక్షల నడుమ విలువలకై వెతుకులాడితే వృథాప్రయాసని సామాన్య ఓటర్లకు చెప్పకనే చెప్పారు. పార్టీల తేడా లేకుండా బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ... ఇలా అన్నీ నితీశ్ను ఏదో ఒక సందర్భంలో దుయ్యబట్టినవే. పదేపదే అదే బీహారీ బాబుతో చేయి కలిపి, చంకనెక్కించుకున్నవే. ఇన్నిసార్లు దోస్తీలు మార్చి, రాజకీయ ఊసరవెల్లిగా అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవడం నితీశ్ చేసిన విచిత్ర విన్యాసం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులంటూ ఎవరూ ఉండరనే సూత్రాన్ని నితీశ్ ఆపోశన పట్టారు. అసలు సోషలిస్టు సిద్ధాంత నేపథ్యం నుంచి పైకొచ్చిన నితీశ్ ఏ సైద్ధాంతికతతో ఒకప్పుడు బీజేపీకి దగ్గరయ్యారన్నది ఆశ్చర్యమే. ఆ పైన 2013లోనే మోదీ మతతత్వాన్ని వ్యతిరేకించి, 17 ఏళ్ళ బంధాన్ని తెంపుకొని ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన ఆయన తర్వాత మళ్ళీ ఏ విలువల కోసం అదే నాయకుడితో అంటకాగారో అర్థం కాదు. తీరా ఇప్పుడు బలహీనపడుతున్న తన సొంత పార్టీ పునాదులు, లోలోపలి జాతీయ రాజకీయ ఆకాంక్షలతో ఆయన బీజేపీతో దోస్తీకి రామ్ రామ్ చెప్పడమూ భవిష్యత్ అవసరాల కోసం చేసిన రాజకీయమే. బీహార్ రాజకీయాల్లో ‘పల్టీ మాస్టర్’గా పేరు పడ్డ నితీశ్ వేసిన రాజకీయ పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు. 1994లో లూలూ ప్రసాద్తో విభేదించి, జనతాదళ్ నుంచి బయటకొచ్చి, సమతా పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎన్డీఏతో దోస్తీ కట్టారు. 2013లో మోదీ మతతత్త్వ రాజకీయాల్ని నిరసిస్తూ మహా గఠ్బంధన్తో కలిశారు. 2017లో ఆర్జేడీ అవినీతిమయమైందంటూ గఠ్బంధన్ను వదిలి మళ్ళీ ఎన్డీఏ పంచన చేరారు. ఇప్పుడేమో మళ్ళీ ‘మహా గఠ్బంధన్ 2.0’తో పాతవాళ్ళనే అక్కున చేర్చుకున్నారు. పాట్నాలో ఒకరికొకరు కూతవేటు దూరంలో నివసించే నితీశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పుడు మరింత సన్నిహితం కానున్నారు. పరస్పరం అనుమానించుకుంటూ, తీవ్రంగా దూషించుకొన్న జేడీ(యూ), ఆర్జేడీలు ‘గతం గతః’ అనుకుంటూ, గాఢాలింగనం చేసుకోవడం రాజకీయ వైచిత్రి. ఎనభై ఏళ్ళ క్రితం సరిగ్గా ‘క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజునే తీసుకున్న ఈ మహత్తర నిర్ణయం దేశానికి నూతన ఉషోదయమ’ని తేజస్వి ఉవాచ. దేశం మాటేమో కానీ, అధికారం కోసం ముఖం వాచి, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా, హోం మంత్రిగా బాధ్యత, సోదరుడికి మరో మంత్రి పదవి... ఇన్నీ ఆశిస్తున్న తేజస్వి అండ్ పార్టీకి ఈ పొత్తుపొడుపు కొత్త పొద్దుపొడుపే. పెద్దన్న లాంటి లాలూతో కలసి నడిచిన నితీశ్... ఇది లాలూ వారసులకిస్తున్న రాజకీయ కానుక. గతంలో నితీశ్ తమను వదిలి బీజేపీ చేయందుకున్నప్పుడు ఆర్జేడీ ఆయనను నిందించింది. ఇప్పుడు అచ్చంగా అవే విమర్శలు బీజేపీ నోట వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కలసి పోటీ చేసి, అధికారంలోకి వచ్చాక పొత్తుధర్మాన్ని విస్మరించి అర్ధంతరంగా వదిలేసిన నితీశ్ వల్ల బాధితులమనీ, రాజకీయ అమరులమనీ రాబోయే ఎన్నికల్లో చెప్పుకోవాలనీ బీజేపీ భావిస్తోంది. కలసి గెలిచినప్పటికీ కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి పదవితో సరిపెట్టి అవమానించడమే కాక, తమను బలహీనపరిచేందుకు కాషాయపార్టీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నందుకే బయటకు రావాల్సి వచ్చిందని జేడీ (యూ) వాదిస్తోంది. పంజాబ్, మహారాష్ట్ర మొదలు ఇప్పుడు బీహార్ దాకా కూటమి మిత్రులను బీజేపీ ఎప్పుడూ బలహీనపరుస్తూనే వస్తోందని జేడీ–యూ పాత కథల పట్టిక చూపిస్తోంది. నిజానికి, నితిన్ గతంలో ఇవే తన ఆఖరి ఎన్నికలన్నారు. తీరా ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారు. ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆశలను నెరవేర్చుకోవడానికి ఇదే మంచి సమయమని అనుకుంటున్నారు. లెక్కప్రకారం జాతీయ ఎన్నికలు 2024లో, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరగాలి. ఇప్పటి దాకా తన కైవసం చేసుకోలేకపోయిన బీహార్ విషయంలో బీజేపీకి రాబోయేది పెద్ద పరీక్ష. ‘మండల్ వర్సెస్ కమండల్’ పోరాటానికి బహుశా రానున్న బీహార్ ఎన్నికలే రణక్షేత్రం కావచ్చు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 4 శాతం ఉన్న దళిత పాశ్వాన్లు, వారి నేతగా రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడైన చిరాగ్ కీలకం కానున్నారు. వారిని బీజేపీ చేరదీస్తుందని ఓ అంచనా. మరి ఏ ఎన్నికలకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడైన నితీశ్ ఎలాంటి వ్యూహం వేస్తారో చూడాలి. ఇప్పటికైతే బీజేపీని ఎదురుదెబ్బ తీసి, నితీశ్ తమ వైపు రావడం ప్రతిపక్షాలకు ఒకింత ఉత్సాహజనకమే. కానీ, దానివల్ల కలిసొచ్చేది ఎంత? ఇప్పటికే ఉన్న సోనియా పరివారం, మమత, కేజ్రీవాల్ల సరసన పీఎం పదవికి నితిన్ రేసులో నిలుస్తారు. ఏక కేంద్రక బీజేపీకి దాని వల్ల మరింత లాభం. ఏమైనా, రెండేళ్ళలో రానున్న జాతీయ ఎన్నికల ఆట రంజుగా మారింది. కానీ, రాజకీయాలంటే వట్టి అంకగణితమే కాదు... పొత్తులోని పార్టీల మధ్య కెమిస్ట్రీ, ప్రజల్లో ఆ పార్టీల విశ్వసనీయత. క్రమంగా విశ్వసనీయత క్షీణిస్తూ, ఢిల్లీ వైపు చూస్తున్న నితీశ్జీకి ఆ సంగతి తెలీదంటారా? -
సీఎంగా మరోసారి నితీష్ కుమార్.. ప్రమాణానికి ముహుర్తం ఫిక్స్!
బీహార్లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను గవర్నర్కు అందజేసిన అనంతరం.. లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్జేడీ-కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాఘట్బంధన్ కూటమి నేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో కూటమి నేతలంతా మరోసారి సీఎంగా నితీశ్ కుమార్ను ఎన్నుకున్నారు. మహాఘట్బంధన్ సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యేలు నితీశ్కు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకాలు చేశారు. Nitish Kumar To Take Oath As Bihar Chief Minister At 4 Pm Tomorrow, Tejashwi Yadav To Be Deputy https://t.co/dqwLAK2uRe — joinnoukri (@joinnoukri) August 9, 2022 అనంతరం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి నితీష్ కుమార్ రాజ్భవన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 160 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు నితీశ్కుమార్ అందజేశారు. దీంతో, ఆయన బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. దీనికి గాను బుధవారం సాయంత్రం 4 గంటలకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నితీష్ రాజీనామా.. ‘బీజేపీ భగావ్’ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్ -
సీఎం పదవికి నితీష్ రాజీనామా.. తేజస్వీ యాదవ్కు బంపర్ ఆఫర్!
Nitish Kumar.. బీహార్ పాలిటిక్స్లో సంచలనం చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ బీహార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఫగూ చౌహాన్ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్త ప్రభుత్వంలో కూడా సీఎంగా నితీష్ కుమారే ఉండనున్నట్టు సమాచారం. ఆర్జేడీ మద్దతు ఇస్తున్న కారణంగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్కు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు సరిగా లేని కారణంగా.. ఆ కూటమికి ఇవాళ గుడ్బై చెప్పేశారు నితీశ్. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్లో ముగిసిపోయింది. #WATCH | Nitish Kumar confirms that he has resigned as Bihar CM pic.twitter.com/Av04rUXojx — ANI (@ANI) August 9, 2022 రాజీనామా అనంతరం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవికి రాజీనామా చేశాను. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాము. జేడీయూను విడదీసేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్జేడీ, కాంగ్రెస్తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు ఇచ్చిన లేఖలో తెలిపారు. ఇక.. నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం.. పాట్నాలోని రాబ్రీ దేవి ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. Bihar | After tendering his resignation, Nitish Kumar arrives at the residence of Rabri Devi in Patna pic.twitter.com/lwAGHSrupv — ANI (@ANI) August 9, 2022 ఇది కూడా చదవండి: లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం' -
సీఎం పదవికి నితిశ్ కుమార్ రాజీనామా..!?
-
జేడీయూ నేతలతో సమావేశమైన సీఎం నితీశ్