-
IPL 2022: ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణమిదే: కోహ్లి
IPL 2022 Auction- Virat Kohli: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఫ్యాన్ బేస్.. బ్రాండ్ వాల్యూ ఎక్కువే. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. టీమిండియా విజయవంతమైన కెప్టెన్గా పేరున్న విరాట్ కోహ్లి సారథిగా ఉన్నా ఒక్కసారి కప్ సాధించలేకపోయింది. ఇక ఐపీఎల్-2021 సీజన్తో కోహ్లి ఆర్సీబీ సారథ్యానికి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు గల కారణాలను ఆర్సీబీ పాడ్కాస్ట్లో మరోసారి ప్రస్తావించాడు కోహ్లి. ఈ మేరకు అతడు మాట్లాడుతూ... ‘‘నేను చేయగలిగిన దానికంటే ఎక్కువే చేయగలనని తెలిసినా కొన్నిసార్లు నేను బాధ్యతను తలకెత్తుకోను. ఒకవేళ చేయాల్సి వచ్చినా మనస్ఫూర్తిగా చేయలేను. మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నపుడు షాక్కు గురయ్యాం అని అంటూ ఉంటారు కొంతమంది! అయితే, మన స్థానంలో ఉండి ఆలోచించినపుడే వాళ్లకు అసలు విషయం అర్థమవుతుంది. అది తెలుసుకోలేక కొంతమంది.. ‘‘అయ్యో ఇదెలా జరిగింది? మేము ఆశ్చర్యపోయాం’’అని అంటూ ఉంటారు. నిజానికి అందులో షాకవ్వాల్సింది ఏమీ లేదు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. వర్క్లోడ్ తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అదే విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రకటన చేశాను’’ అని పునరుద్ఘాటించాడు. క్వాంటిటీతో పాటు తనకు క్వాలిటీ కూడా ముఖ్యమని స్పష్టం చేశాడు. అందుకే ఏదో ఒక బాధ్యతనైనా సక్రమంగా నెరవేర్చాలనుకుంటున్నానని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా 7 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చదవండి: IPL 2022: ఐపీఎల్కు దూరం కానున్న స్టార్ ఆల్రౌండర్.. రూ. 14 కోట్లు వ్యర్థమేనా! IPL 2022 Auction: డబ్బు లేదు.. విరిగిన బ్యాట్కు టేప్ వేసి ఆడేవాడిని.. అందుకే బోరున ఏడ్చేశారు: తిలక్ వర్మ కాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో గ్లెన్ మాక్స్వెల్, మాజీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ వంటి ఇతర స్టార్లు కూడా మాట్లాడారు. Maxi tells us stories about starting off as a medium pace bowler, the Big Show tag, and many more anecdotes on The #RCBPodcast powered by @KotakBankLtd. Catch the full episodes on @spotifyindia, @gaana, @ApplePodcasts and @AmazonMusicINhttps://t.co/bixXHIUKAq#PlayBold pic.twitter.com/7ppLgTrcpH — Royal Challengers Bangalore (@RCBTweets) February 24, 2022 -
IPL 2022: డబ్బు లేదు.. విరిగిన బ్యాట్కు టేప్ వేసి ఆడేవాడిని.. ఇప్పుడు 1.7 కోట్లు!
IPL 2022 Auction- Tilak Varma: ఐపీఎల్ మెగా వేలం-2022లో ముంబై ఇండియన్స్ జట్టు తనను కొనుగోలు చేసిందని తెలియగానే తన కోచ్ సంతోషంతో ఉప్పొంగిపోయారని హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఆనందం పట్టలేక ఒక్కసారిగా బోరున ఏడ్చేశారని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఇక తన తల్లిదండ్రులైతే ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయారన్నాడు. కాగా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్ వర్మ తండ్రి నాగరాజు, కోచ్ సాలమ్ బయాష్ ప్రోత్సాహంతో క్రికెటర్గా ఎదిగాడు. యువ భారత జట్టులో 19 ఏళ్ల సభ్యుడైన అతడు.. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో 180 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగిన మెగా వేలంలో భాగంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తిలక్ వర్మ కోసం పోటీపడింది. ఆఖరికి కోటీ డెబ్బై లక్షలకు అతడిని కొనుగోలు చేయడంతో తిలక్ వర్మకు జాక్పాట్ దక్కింది. ఇక ఐపీఎల్-2022 సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా తిలక్ వర్మ ఫ్రాంఛైజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘వేలం జరుగుతున్నపుడు నేను మా కోచ్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. నన్ను ముంబై 1.7 కోట్లకు కొనుగోలు చేసిందని తెలియగానే.. మా కోచ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశారు. మేము పడ్డ కష్టం గుర్తుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నేను మా అమ్మానాన్నకు ఫోన్ చేశాను. వాళ్లు ఆనందంతో మాట్లాడలేకపోయారు. వారి కళ్ల వెంట నీళ్లు దుమికాయి. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నిజానికి టెన్నిస్ బాల్తో నా క్రికెట్ ఆట మొదలైంది. ఆ సమయంలో నన్ను చూసిన మా కోచ్.. ఈ పిల్లాడు బంతిని భలే బాదుతున్నాడే అంటూ ముచ్చటపడ్డారు. నాకు కోచ్ అయ్యారు. ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. నాకు శిక్షణనిస్తే మంచి క్రికెటర్గా ఎదుగుతానని ఆయన నమ్మారు. మా తల్లిదండ్రులతో మాట్లాడారు. నన్ను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయమని కోరారు. అందుకు మా అమ్మానాన్న అంగీకరించారు. కానీ ఆర్థిక కష్టాలు వెంటాడాయి. బ్యాట్లు, ప్యాడ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు మా కోచ్ ఆయన స్నేహితుడి సాయంతో బ్యాట్ కొనిచ్చారు. అండర్ 14 క్రికెట్ ఆడుతున్నపుడు ఒకే ఒక్క బ్యాట్ ఉండేది. అది మెల్లగా విరిగిపోవడం మొదలైంది. అప్పుడు టేప్తో అతికించి దానిని వాడుకునేవాడిని. నాకోసం నా కోచ్ ఎంతో చేశారు’’ అంటూ కష్టాల్లో అండగా నిలబడ్డ గురువు పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. "When I was sold to MI, my coach had tears in his eyes!" 🥺 📽️ : The young gun Tilak Varma expresses how emotional his coach and parents were after the Auction! 🙌 Read his exclusive interview 👉 https://t.co/FQ5AfsWdTw #OneFamily #MumbaiIndians pic.twitter.com/hytPLZGKfU — Mumbai Indians (@mipaltan) February 24, 2022 -
Ishan Kishan: అప్పుడు నా గుండె జారినంత పనైంది.. కానీ ఆఖరికి...
IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రిటెన్షన్లో భాగంగా ఇషాన్ను వదిలేసిన ముంబై ఇండియన్స్ వేలంలో మాత్రం ఏకంగా 15.25 కోట్లు ఖర్చు చేసి అతడిని సొంతం చేసుకుంది. మిగతా జట్లతో పోటీ పడి మరీ ఇషాన్ను దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో భారత ఆటగాడియా అతడు రికార్డు నెలకొల్పాడు. ఈ విషయం గురించి ఇషాన్ కిషన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. వేలం జరుగుతున్న వేళ తన మనసులో చెలరేగిన అలజడి గురించి చెప్పుకొచ్చాడు. ‘‘ముంబై కచ్చితంగా నన్ను కొనుగోలు చేస్తుందని తెలుసు. ఆ విషయంలో నాకు అస్సలు సందేహం లేదు. అయితే, ధర పెరుగుతున్న కొద్దీ నాలో ఆందోళన మొదలైంది. మంచి జట్టును తీర్చిదిద్దుకోవాలంటే ముంబై డబ్బు వృథా చేయకుండా ఉండాలి. కానీ నా కోసం ఇతర జట్లు పోటీ పడటంతో ఒక్కసారిగా ధర పెరిగిపోయింది. ఆ సమయంలో నా గుండె జారినంత పనైంది’’ అని పేర్కొన్నాడు. ఇక ముంబై తనను కొనుగోలు చేయడం వెనుక కారణం గురించి చెబుతూ... ‘‘వాళ్లకు నా గురించి, నా ఆట గురించి తెలుసు. నా ఫ్రాంఛైజీ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేనూ ఆ కుటుంబంలో ఓ సభ్యుడినే. నాకు బయటకు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. నాలుగేళ్లుగా ఈ జట్టులోని సభ్యులతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మేము ట్రోఫీలు గెలిచాం. ఒకరికోసం ఒకరం నిలబడ్డాం. అందుకే వేరే జట్టుకు వెళ్లాలంటే నా మనసు అంగీకరించదు. అదృష్టవశాత్తూ నా జట్టులోకి తిరిగి వచ్చేశాను’’ అని ఇషాన్ కిషన్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ జట్టును చూసేద్దాం.. IPL 2022: బీసీసీఐకి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్న సురేశ్ రైనా 𝐓𝐡𝐞 𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐃𝐲𝐧𝐚𝐦𝐨 shares a message for the Paltan after coming ℍ𝕆𝕄𝔼 💙#AalaRe #MumbaiIndians #AalaRe #IPLAuction @ishankishan51 pic.twitter.com/Q9QcTQ34gL — Mumbai Indians (@mipaltan) February 12, 2022 -
IPL 2022: వేలంలో ఎవరూ కొనలేదు.. కనీసం విదేశీ లీగ్లు ఆడే అనుమతైనా ఇవ్వండి..!
Suresh Raina: ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కని భారత ఆటగాళ్లకు ఇతర దేశాల క్రికెట్ లీగ్స్లో ఆడే అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశాడు. Please @ImRo45 consider #SureshRaina for #MumbaiIndians team.🙏🇮🇳💙💙#Boycott_ChennaiSuperKings pic.twitter.com/yiCiZX0gbc — Jyoti Suman (@Jas23478675) February 15, 2022 బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డు కాంట్రాక్టు కలిగిన పురుష క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్(బీబీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) వంటి వీదేశీ లీగ్స్ ఆడేందుకు అనుమతి లేదు. భారత్లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెబితేనే ఇతర దేశాల లీగ్లు ఆడే అనుమతి వారికి లభిస్తుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా.. ఐపీఎల్తో పాటు దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి విదేశీ లీగ్లు ఆడే అవకాశం లేకుండా పోయింది. గతంలోనూ రైనా ఇదే తరహా వాదన వినిపించినప్పటికీ బీసీసీఐ అతని వాదనను కొట్టిపారేసింది. తాజాగా, భారత క్రికెటర్లు విదేశీ లీగ్లు ఆడే అనుమతివ్వాలంటూ రైనా మరోసారి గళం విప్పాడు. రైనా.. విదేశీ లీగ్ల్లో ఆడేందుకు బీసీసీఐని అభ్యర్ధిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇదిలా ఉంటే, రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో నిలిచిన రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో అమ్మడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్లు ఆడి 30కి పైగా సగటుతో 5528 పరుగులు చేశాడు. చదవండి: IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..! -
ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే!
ఐపీఎల్-2022 మెగా వేలం పక్రియ ఇప్పటికే పూర్తి అయింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. మరో వైపు ఈ లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది సీజన్ మరింత రసవత్తరంగా జరగనుంది. ఇక ఐపీఎల్-2022 షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అన్ని ఐపీఎల్ మ్యాచ్లు అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 స్టేడియాల్లో జరిగే అవకాశం ఉంది. మ్యాచ్లు మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియాల్లో జరిగే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియాలను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ సిద్దం చేసినట్లు వినికిడి. అదే విధంగా ఒక వేళ మార్చి 26న టోర్నీ ప్రారంభమైతే.. ప్రసారం చేయడానికి బ్రాడ్కాస్టర్ డిస్నీ స్టార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Yash Dhull: చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు! -
సన్రైజర్స్కు కొత్త కోచ్ వచ్చేశాడు.. ఎవరీ హెల్మోట్!
ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బాధ్యతలనుంచి సైమన్ కటిచ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కటిచ్ స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ హెల్మోట్ను ఆ జట్టు అసిస్టెంట్ కోచ్గా సన్ రైజర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. సైమన్ హెల్మోట్ సన్రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్గా ఎంపిక అయినట్లు సమాచారం. కాగా 2012 నుంచి 2019 వరకు సన్రైజర్స్ కోచింగ్ స్టాప్లో సైమన్ హెల్మోట్ బాగమై ఉన్నాడు. అదే విధంగా బిగ్ బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు కోచ్గా కూడా హెల్మోట్ పనిచేశాడు. ఐపీఎల్-2022లో సన్రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీతో కలిసి హెల్మోట్ పని చేయనున్నాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ జట్టుకు హెడ్కోచ్గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్, స్కౌట్గా హేమంగ్ బదాని వ్యవహరించనున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే సైమన్ కటిచ్ రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఇక భారత జట్టులోకి కష్టమే.. తీరు మారని పుజారా! -
IPL 2022 Auction: వేలంలో 1.5 కోట్లు.. సీఎస్కే యువ ఆటగాడిపై సంచలన ఆరోపణలు
U 19 WC Star CSK Young Player Accused Of Age Fraud: అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాజ్వర్ధన్ హంగర్కర్పై సంచలన ఆరోపణలు వచ్చాయి. వయసును తక్కువగా చూపించి అతడు మోసానికి పాల్పడ్డాంటూ మహారాష్ట్ర క్రీడా, యువజన విభాగం కమిషనర్ ఓం ప్రకాశ్ బకోరియా ఆరోపించారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి లేఖ రాసినట్లు స్థానిక సామ్నా పత్రిక కథనం వెలువరించింది. కాగా ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్కప్ను యశ్ ధుల్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజ్వర్ధన్ హంగర్కర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ప్రపంచకప్ టోర్నీలో మెరుగ్గా రాణించిన నేపథ్యంలో పలువురు అండర్ 19 ఆటగాళ్లు ఐపీఎల్ మెగా వేలం-2022లో మంచి ధర పలికిన సంగతి తెలిసిందే. ఆక్షన్లో భాగంగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై ఫ్రాంఛైజీ 1.5 కోట్లు వెచ్చించి రాజ్వర్ధన్ను కొనుగోలు చేసింది. గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగల ఈ యువ ఫాస్ట్ బౌలర్ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓం ప్రకాశ్ రాజ్వర్ధన్పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ‘‘ధారాశివ్ సీఈఓ రాహుల్ గుప్తా రాజవర్ధన్ హంగర్కర్ పుట్టిన తేదీ వివరాల గురించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ధారాశివ్ పబ్లిక్ స్కూల్లో ఉన్న వివరాల ప్రకారం అతడు 2001 జనవరి 10న జన్మించినట్లు రాశారు. అయితే, అతడు ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు దీనిని 2002 నవంబరు 10గా మార్చినట్లు ఉంది’’ అని ఓం ప్రకాశ్ తన లేఖలో బీసీసీఐకి వివరించారు. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ఇన్సైడ్స్పోర్ట్తో మాట్లాడుతూ... ‘‘అవును... మహారాష్ట్ర నుంచి మాకు లేఖ అందింది. ఆ ఆటగాడిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై మేము దృష్టి సారించాం. అయితే, ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. లోతుగా దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. చదవండి: తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! Some Cricketers are playing Cricket with fabricated Date of Birth Certificate. Cricketers who Indulge in a fraud in DOB not only violate core values of Crocket but also put genuine Cricketers in a disadvantages position. It’s against the integrity of sports.@bcci @SGanguly99 — Om Prakash Bakoria (@ombakoria) February 14, 2022 -
IPL 2022 Auction: అప్పుడు ఆర్యన్తో కలిసి.. ఇప్పుడు ఇలా: జూహీ చావ్లా భావోద్వేగం
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమార్తె జాహ్నవి మెహతా తమ ఫ్రాంఛైజీ వ్యవహారాల్లో మమేకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం-2022 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు ఫ్రాంఛైజీలకు చెందిన కొత్త తరం నాయకులు పాల్గొన్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సీఈఓ కావ్య మారన్ సహా కేకేఆర్ యువ రక్తం జాహ్నవి, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వారసులు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా జాహ్నవి వ్యవహరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జూహీ చావ్లా కూతురును ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన వీడియోను ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఐపీఎల్తో పాటు ఇతర క్రికెట్ ఈవెంట్లు చూడటం కూడా అలవాటుగా మార్చుకుంది. కామెంటేటర్ల వ్యాఖ్యలు శ్రద్ధగా వినేది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడు అనుకుంటా.. మేం సెలవుల కోసం బాలి వెళ్లినపుడు కాఫీ టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరి సైజులో ఓ పుస్తకం... అందులో క్రికెటర్ల జీవిత చరిత్రలు, రికార్డులు, వారు సాధించిన విజయాలు.. ఇలా అన్నీ ఉన్నాయి. ఆ బుక్ చదవడం పూర్తి చేయాలనే పిచ్చి పట్టింది తనకు. స్విమ్మింగ్ విరామ సమయంలో పూల్ ఒడ్డున కూర్చుని ఒక్క పేజీ కూడా వదలకుండా ఆ బుఖ్ చదివింది. ఇది చాలా అసహజమైన విషయం కదా! 12 ఏళ్ల పిల్ల ఇంతలా ఒక విషయం గురించి ఆలోచించడం! వయసు పెరిగే కొద్దీ తనలో క్రికెట్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. క్రికెట్ గురించి మాట్లాడితే తన ముఖం మతాబులా వెలిగిపోతుంది. మూడేళ్ల క్రితం.. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా జాహ్నవి 17 ఏళ్ల వయసులో రికార్డు సాధించింది. ఆర్యన్తో కలిసి జాహ్నవి వేలంలో పాల్గొంది. ఈసారి సుహానా కూడా వాళ్లతో చేరింది. దీనంతటికీ కారణమైన మా సీఈఓ వెంకీ మైసూర్కు ధన్యవాదాలు. జాహ్నవి అభిప్రాయాలకు విలువనిస్తూ... తనను ప్రోత్సహించారు. ఆమె అతడిని ఆప్యాయంగా ‘కోచ్’ అని పిలుస్తుంది. తన మనసంతా ఆట మీదే. ఒక తల్లిగా నా చిట్టితల్లిని చూసి గర్వపడుతున్నా. దేవుడి ఆశీర్వాదాలతో తన భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి’’ అని అంటూ ఉద్వేగభరిత నోట్ రాశారు. చదవండి: IPL 2022- SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్...సైమన్ కటిచ్ రాజీనామా!? ఐపీఎల్ 2022: గతేడాది మిస్ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్ పూర్తి జట్టు ఇదే.. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) -
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో కలకలం..సైమన్ కటిచ్ రాజీనామా!?
-
IPL 2022- SRH: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో!
IPL 2022 SRH- Simon Katich:- సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2021 సీజన్లో దారుణ ప్రదర్శన... 2016లో జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్కు ఉద్వాసన.. తుది జట్టులో కూడా చోటు కల్పించలేదు... మెగా వేలం నేపథ్యంలో వార్నర్ సహా స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ను రిటైన్ చేసుకోలేదు.. ఇక కోచ్ల విషయానికొస్తే... అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్గా పేరున్న ట్రెవర్ బేలిస్... అసిస్టెంట్ కోచ్ పనిచేసిన బ్రాడ్ హాడిన్ సైతం గత సీజన్లో తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. పేలవ ప్రదర్శనకు తోడు వార్నర్, రషీద్ లాంటి స్టార్ ప్లేయర్లను వదులుకున్న క్రమంలో ఐపీఎల్-2022 సీజన్ నేపథ్యంలో సన్రైజర్స్ కొత్త సిబ్బందితో ముందుకు వచ్చింది. టామ్ మూడీ తిరిగి హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు హెడ్ కోచ్గా పనిచేసిన సైమన్ కటిచ్ను అసిస్టెంట్ కోచ్గా నియమించింది. ఇక విండీస్ దిగ్గజం బ్రియన్ లారా, డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, హేమంగ్ బదానీని తమ సిబ్బందిలో చేర్చుకుంది. అయితే, ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా రచించిన ప్రణాళికలను అమలు చేయకుండా భిన్నంగా వ్యవహరించారంటూ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ రాజీనామా చేశారన్న వార్త సంచలనంగా మారింది. సన్రైజర్స్ యాజమాన్యం తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. వేలం నేపథ్యంలో సన్రైజర్స్ విడుదల చేసిన సైమన్ కటిచ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కటిచ్.. దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎయిడెన్ మార్కరమ్, మార్కో జాన్సెన్ను ఎంపిక చేయడం వెనుక కారణాలు వివరించాడు. ‘‘గత సీజన్లో పంజాబ్కు ఆడిన ఎయిడెన్ మార్కరమ్.. రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. అందుకే అతడిని తీసుకున్నాం. తను మంచి ఆల్రౌండ్ ఆప్షన్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అదే విధంగా మార్కో జాన్సెన్.. గతంలో ముంబైకి ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రదర్శన బాగుంది. వీళ్లిద్దరినీ జట్టులోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇలా ఫ్రాంఛైజీని వీడుతున్నట్లు వార్తలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో... ‘‘కొత్త తెలుగు ఆటగాడు కూడా లేడు. పైగా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా నామ్ కే వాస్తే అన్నట్లుగానే ఆడేవాళ్లు... అసలు ఓపెనింగ్ జోడీ ఎలా సెట్ చేస్తారో తెలియదు. బహుశా కావ్య సెలక్షన్ నచ్చలేదేమో! అందుకే కటిచ్ రాజీనామా చేసి ఉంటాడు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన సైమన్ కటిచ్ దేశం తరఫున 56 టెస్టులు, 45 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. It's time for South Africa. 🇿🇦 Listen to Simon Katich speak about what Aiden Markram and Marco Jansen bring to the table. 🗣️#OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/Ob6pEjVvx4 — SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022 ఎస్ఆర్హెచ్- మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) -
IPL 2022- SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్... కోచ్ రాజీనామా!
IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగళూరు వేదికగా సాగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ది ఆస్ట్రేలియన్ కథనం వెలువరించింది. కాగా గత సీజన్లో సన్రైజర్స్ దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 14 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కేవలం మూడింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్గా డేవిడ్ వార్నర్ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటుకల్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ఆరంభానికి ముందు కొత్త సిబ్బందిని నియమించింది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్గా నియమించుకుంది. ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ను అసిస్టెంట్ కోచ్గా ఎంచుకుంది. హెడ్కోచ్గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్, స్కౌట్గా హేమంగ్ బదాని వ్యవహరించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ తీరుపై కూడా అభిమానులు పెదవి విరుస్తున్న క్రమంలో కటిచ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..! IPL 2022: కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ.. -
IPL 2022: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేలం కంటే ముందే ఆటగాళ్ల రిటెన్షన్ లో భాగంగా అట్టిపెట్టుకున్న స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్.. వ్యక్తిగత కారణాల (వివాహం) చేత లీగ్ ప్రారంభ మ్యాచ్లకు దూరమవుతాడని తెలుస్తోంది. మార్చి 27న మ్యాక్స్ వెల్.. తన ప్రేయసి, భారత సంతతికి(తమిళనాడు) చెందిన వినీ రామన్ను మనువాడబోతున్నాడు. వీరిరువురు 9 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి స్వస్తి పలుకుతూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. వీరి వివాహం తమిళ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మెల్బోర్న్లో జరగనుంది. తమిళంలో ముద్రించిన వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే నెట్టింట రచ్చ చేస్తుంది. ఇదిలా ఉంటే, గత సీజన్తోనే ఆర్సీబీలోకి ఎంట్రీ ఇచ్చిన మ్యాక్సీ.. రెండు దశల్లోనూ రాణించి, జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో, ఆర్సీబీ అతన్ని రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అన్నీ కుదిరితే కెప్టెన్సీ కట్టబెట్టేందుకు కూడా ఆర్సీబీ రెడీ అయ్యింది. అయితే, వివాహం కారణం మ్యాక్సీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానుండడంతో ఆర్సీబీ ఈ విషయమై పునరాలోచనలోపడింది. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ ను మార్చి చివరి వారంలో ప్రారంభించేందుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మార్చి 29 నుంచి ఆసీస్.. పాకిస్థాన్లో పర్యటించనున్న విషయం విధితమే. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా.. మూడు టెస్ట్లతో పాటు వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్ లు కూడా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. వివాహం కారణంగా మ్యాక్సీ పాక్ పర్యటనకు దూరంగా ఉంటానని ఇదివరకే ప్రకటించాడు. చదవండి: వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..! -
IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..!
మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనాను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. సీఎస్కే యజమాని శ్రీనివాసన్.. రైనాను పక్కకు పెట్టడానికి గల కారణాలను సైతం వివరించాడు. ఈ క్రమంలో చాలా మంది మాజీ క్రికెటర్లు రైనా అమ్ముడుపోకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్.. రైనాపై ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో వ్యక్తిగత కారణాల చేత కొన్ని మ్యాచ్ లకు, మోకాలికి శస్త్రచికిత్స కారణంగా మరి కొన్ని మ్యాచ్ లకు దూరమైన రైనా.. ఫామ్ లేమి కారణంగా ధోనితో పాటు సీఎస్కే యాజమాన్యం నమ్మకాన్ని కోల్పోయాడని, అందుకే అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోలేదని, ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ యజమానే స్వయంగా వెల్లడించాడని గుర్తు చేశాడు. ఫామ్ లేమి కారణంగా ఓ ఆటగాడిని ఏ జట్టైనా ఇలా పక్కకు పెడితే, ఇతర జట్లు సదరు ఆటగాడిని కొనుగోలు చేసే సాహసం చేయవని ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదే కారణంతోనే రైనాను మెగా వేలంలో సీఎస్కే తో పాటు ఏ ఇతర జట్లు కొనుగోలు చేయలేదని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. కాగా, రెండు సీజన్లు (2006,17) మినహా ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కే కే ప్రాతినిధ్యం వహించిన రైనాకు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. వేలంలోనైనా సీఎస్కే అతన్ని దక్కించుకుంటుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. వయసు మీద పడటం, అంతంత మాత్రంగానే ఉన్న ఫామ్ కారణంగా అతనిపై ఇతర జట్లు కూడా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ వెటరన్ బ్యాటర్ ఈ ఏడాది మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్టులో సభ్యుడైన రైనా.. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 205 మ్యాచ్లు ఆడి 30కి పైగా సగటుతో 5528 పరుగులు చేశాడు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
ఆర్సీబీ కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు!
రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరుకు త్వరలో కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఆర్సీబీ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాప్ డుప్లిసెస్ ఎంపిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. డుప్లిసెస్ను కెప్టెన్గా ఆర్సీబీ యాజమాన్యం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో డుప్లిసెస్ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్తో పోటీ పడి మరి అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. ఇక ఐపీఎల్-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత కెప్టెన్గా ఏబీ డివిలియర్స్ అవుతాడని అంతా భావించారు. ఈ క్రమంలోనే డివిలియర్స్ అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుని అందరని షాక్కు గురి చేశాడు. ఇక మాక్స్వెల్ కూడా కెప్టెన్గా ఒక ఆఫ్షన్గా ఉన్నప్పటికీ ఆర్సీబీ మేనేజ్మెంట్ డుప్లిసెస్ వైపే మెగ్లు చూపినట్లు తెలుస్తోంది. "మా జట్టు కెప్టెన్గా డుప్లిసెస్ సరైనోడు అని భావిస్తున్నాం. అయితే మేము నిర్ణయించుకోవడానికి మాకు సమయం ఉంది. మాక్స్వెల్ అందుబాటుపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాము. అతడు తన వివాహం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో డుప్లిసెస్ సరైన ఎంపికగా కనిపిస్తోంది" అని ఆర్సీబీ ఆధికారి ఒకరు పేర్కొన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు: విరాట్ కోహ్లి: రూ. 15 కోట్లు మ్యాక్స్వెల్: రూ. 11 కోట్లు హర్షల్ పటేల్: రూ. 10 కోట్ల 75 లక్షలు హసరంగ: రూ. 10 కోట్ల 75 లక్షలు హాజెల్వుడ్: రూ. 7 కోట్ల 75 లక్షలు సిరాజ్ :రూ. 7 కోట్లు డు ప్లెసిస్: రూ. 7 కోట్లు దినేశ్ కార్తీక్: రూ. 5 కోట్ల 50 లక్షలు అనూజ్ రావత్: రూ. 3 కోట్ల 40 లక్షలు షాబాజ్ అహ్మద్: రూ. 2 కోట్ల 40 లక్షలు రూథర్ఫొర్డ్: రూ. 1 కోటి మహిపాల్ లామ్రోర్: రూ. 95 లక్షలు ఫిన్ అలెన్: రూ. 80 లక్షలు బెహ్రెండార్ఫ్: రూ.75 లక్షలు కరణ్ శర్మ: రూ. 50 లక్షలు సుయశ్ ప్రభుదేశాయ్: రూ.30 లక్షలు సీవీ మిలింద్: రూ. 25 లక్షలు ఆకాశ్దీప్: రూ. 20 లక్షలు అనీశ్వర్ గౌతమ్ : రూ. 20 లక్షలు చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా! -
Ranji Trophy 2022: వారెవ్వా యశ్ ధుల్.. అరంగేట్రంలోనే సెంచరీ.. మరో కోహ్లి!
అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్కు ప్రపంచకప్ సాధించి పెట్టిన కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. తద్వారా ఆడిన మొదటి రంజీ మ్యాచ్ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న దేశవాళీ రంజీ టోర్నీ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఫిబ్రవరి 17న మొదలైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనింగ్కు దిగిన ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న అతడు 113 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. కాగా యశ్ ధుల్కు ఇదే మొదటి రంజీ మ్యాచ్ కావడం విశేషం. ఇక తమిళనాడు వంటి పటిష్ట జట్టుపై అరంగేట్ర మ్యాచ్లోనే ఇలా అదరగొట్టడంపై అభిమానులు ఫిదా అవుతున్నారు. యశ్ ధుల్ మరో కోహ్లి అవుతాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలాంటి అత్యుత్తమ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ లక్కీగా తక్కువ ధరకే సొంతం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్ ధుల్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma- Ravi Bishnoi: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. అదరగొట్టాడు: రోహిత్ శర్మ ప్రశంసలు FIFTY on First-Class debut! 👏 👏 Yash Dhull - India's #U19CWC-winning captain - begins his #RanjiTrophy journey in style. 👍 👍 @Paytm #DELvTN Follow the match ▶️ https://t.co/ZIohzqOWKi pic.twitter.com/mrbYBHNrBL — BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022 𝙒𝙝𝙖𝙩 𝘼 𝙈𝙤𝙢𝙚𝙣𝙩! 👌 👌 💯 on Ranji Trophy debut! 👏 👏 This has been a fantastic batting performance from Yash Dhull in his maiden First Class game. 👍 👍 @Paytm | #RanjiTrophy | #DELvTN | @YashDhull2002 Follow the match ▶️ https://t.co/ZIohzqOWKi pic.twitter.com/uaukVSHgUq — BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022 -
IPL 2022: రాజస్థాన్ రాయల్స్ వెల్కమ్ వీడియో అదుర్స్.. సంగక్కర ఎంట్రీ చూడాల్సిందే..!
ఐపీఎల్ మెగా వేలం 2022లో ప్రణాళిక ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేసి ఉత్సాహంగా కనిపిస్తున్న రాజస్థాన్ రాయల్స్.. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. ప్రముఖ బాలీవుడ్ చిత్రంలోని ఓ హిట్ పాటను ప్లే చేస్తూ నూతన ఆటగాళ్లను ఆహ్వానించింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలోని టైటిల్ సాంగ్ కు ఫేస్ మార్ఫింగ్ చేసి, తమ కొత్త ఆటగాళ్లతో వీడియోను రిక్రియేట్ చేసింది. ఈ వీడియోలో షారుక్ ప్లేసులో సంజూ శాంసన్ ముఖాన్ని.. మిగతా వారికి నూతన ఆటగాళ్ల ముఖాలను అంటించి అదిరిపోయే రేంజ్ లో మార్ఫింగ్ వీడియోను రూపొందించింది. Wait for Sanga’s entry 😂#RoyalsFamily | #IPL2022 | @yuzi_chahal | @JimmyNeesh | @SHetmyer | @KumarSanga2 | @ashwinravi99 | @IamSanjuSamson pic.twitter.com/PGgSJkmk7R — Rajasthan Royals (@rajasthanroyals) February 15, 2022 ఈ వీడియోలో సంజూ శాంసన్ జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చహల్, జిమ్మీ నీషమ్, షిమ్రోన్ హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ తదితర ఆటగాళ్లను పాట పాడుతూ, నృత్యంతో ఆహ్వానిస్తూ కనిపించాడు. వీడియో చివర్లో జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర ధర్మేంద్రలా వీర లెవెల్లో ఎంట్రీ ఇస్తాడు. వీడియో మొత్తానికి సంగక్కర ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్, రియాన్ పరాగ్, కెసి కరియప్ప, ఒబెద్ సైని, నవ్దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డారిల్ మిచెల్. చదవండి: Virat Kohli: చరిత్ర తిరగరాసేందుకు మరో 73 పరుగుల దూరంలో.. -
IPL 2022: వేలంలో పాక్ బౌలర్ కు 200 కోట్లు.. ఆశకు హద్దు ఉండాలంటున్న నెటిజన్లు
చాలా కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేనందున ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ఎప్పుడో ఐసీసీ టోర్నీల్లో తప్పించి మధ్యలో ఇరు దేశాలు తలపడింది లేదు. భారత్, పాక్ లను కలుపుకుని నాలుగు దేశాల టీ20 టోర్నీ అంటూ పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) హడావుడి చేసినప్పటికీ బీసీసీఐ దాన్ని కొట్టి పారేసింది. If, Shaheen Shah Afridi was in #IPLAuction. He would’ve gone for 200 crores. — Ihtisham Ul Haq (@iihtishamm) February 13, 2022 ఇక క్యాష్ రిచ్ లీగ్ (ఐపీఎల్) విషయానికొస్తే.. పాక్ ఆటగాళ్లను ఎప్పటి నుంచో దూరం పెట్టింది బీసీసీఐ. ఐపీఎల్ లో తమకు ప్రవేశం లేదన్న అక్కసును పాక్ ఆటగాళ్లతో సహా ఆ దేశ మీడియా సైతం చాలా సందర్భాల్లో బాహాటంగానే వెళ్లగక్కింది. తాజాగా ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసిన నేపథ్యంలో ఓ పాక్ జర్నలిస్ట్ తమ దేశ క్రికెటర్ ను ఆకాశానికెత్తుతూ చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. Idiocy has no end. Each franchise can spend only ₹90C & must’ve 18 players. So even if you buy 17 players at ₹20L, you wouldn’t be able to spend more than ₹87C for a single player. This dude perhaps thinks 2-3 franchises can match fix & spend ₹200C collectively to buy Afridi! https://t.co/4X1687deiU — Sreejith Panickar (@PanickarS) February 15, 2022 పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్నట్లయితే 200 కోట్లకు అమ్ముడుపోయేవాడంటూ అత్యుత్సాహంతో ట్వీటాడు పాక్ కు చెందిన ఇతిషమ్ ఉల్ హక్ అనే జర్నలిస్ట్. ఈ ట్వీట్ ను చూసిన భారత క్రికెట్ అభిమానులు సదరు పాక్ విలేకరిని ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. ఐపీఎల్ వేలంలో ఓ జట్టు ఖర్చు చేసేది 90 కోట్లే అయితే.. మీ పాకీ బౌలర్ కి ఎక్కడి నుంచి తెచ్చి 200 కోట్లు ఇచ్చేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆశకు ఓ హద్దుండాలి భయ్యా అంటూ చురకలంటించే కామెంట్లు చేస్తున్నారు. How many zeroes in that number? Any idea? 😂 https://t.co/fBBmmxy4oc pic.twitter.com/VnlQXQ6E6e — PrinceJii (@i_m_princeji) February 16, 2022 మరికొందరైతే.. పాక్ ప్రధాని చైనాకు రుణమాఫీ చేయడానికి షాహిన్ అఫ్రిదిని ఉపయోగిస్తే మంచిదని సూచనలిస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో షాహీన్ అఫ్రిది అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లోనూ రెచ్చిపోయాడు. కొత్త బంతితో అద్బుతంగా స్వింగ్ రాబట్టే ఈ యంగ్ పేసర్ పై పాక్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు 21 టెస్టులు, 28 వన్డేలు, 39 టీ20 మ్యాచ్ లు ఆడిన షాహీన్..184 వికెట్లు పడగొట్టాడు. Here's a look at the Top Buys of what has been an eventful #TATAIPLAuction 2022 😎👌@TataCompanies pic.twitter.com/vnFMj1NKj9 — IndianPremierLeague (@IPL) February 13, 2022 ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్ 2022 మెగావేలంలో చాలా మంది క్రికెటర్లు రాత్రికిరాత్రి కోటీశ్వరులైపోయారు. ఈసారి వేలంలో స్టార్ క్రికెటర్లతో పాటు అనామకులపై కూడా కనక వర్షం కురిసింది. వేలంలో మొత్తం 204 మందిపై 10 ఫ్రాంచైజీలు ఏకంగా 552 కోట్లు ఖర్చు చేశాయి. టీమిండియా వికెట్ కీపర్/బ్యాటర్ ఇషాన్ కిషన్ వేలంలో జాక్ పాట్ కొట్టేశాడు. అతన్ని ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లకు దక్కించుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతనే. చదవండి: పాత గొడవను గుర్తుచేసి కౌంటర్ ఇద్దామనుకున్నాడు.. బెడిసికొట్టింది -
IPL 2022: కోల్కతా కెప్టెన్ అతడే... కేకేఆర్ అధికారిక ప్రకటన
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్రైడర్స్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు కేకేఆర్ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్.. అమ్మాయిలు.. అబ్బాయిలు... కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు హలో చెప్పండి’’ అంటూ తమ సారథులతో కూడిన ఫొటోను షేర్ చేసింది. ఇందులో సౌరవ్ గంగూలీ, బ్రెండన్ మెకల్లమ్, గౌతమ్ గంభీర్, దినేశ్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్... ప్రస్తుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ను 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు సారథిగా వ్యవహరించి శ్రేయస్కు మంచి రికార్డు ఉంది. అయితే, గాయం కారణంగా ఐపీఎల్-2021 సీజన్ తొలి దశకు అతడు దూరం కాగా.. టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టును విజయాల బాట పట్టించాడు. దీంతో అయ్యర్ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చినప్పటికీ పంత్నే కెప్టెన్గా కొనసాగించారు. అంతేకాదు మెగా వేలం నేపథ్యంలో ఢిల్లీ అయ్యర్ను రిటైన్ చేసుకోలేదు కూడా. దీంతో అతడు ఆక్షన్లోకి రాగా కేకేఆర్ కొనుగోలు చేసింది. కాగా గత సీజన్లో రన్నరప్గా నిలిచిన కోల్కతా ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. కేకేఆర్ జట్టు ఇదే.. రిటైన్డ్ ఆటగాళ్లు: ఆండ్రీ రసెల్ (12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (8 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (8 కోట్లు) సునీల్ నరైన్ (6 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్ (12.25 కోట్లు) నితీశ్ రాణా (8 కోట్లు) పాట్ కమిన్స్ (7.25 కోట్లు) శివమ్ మావి (7.25 కోట్లు) సామ్ బిల్లింగ్స్ (2 కోట్లు) ఉమేశ్ యాదవ్ (2 కోట్లు) అలెక్స్ హేల్స్ (1.5 కోట్లు) అజింక్య రహానే (కోటి) మహ్మద్ నబీ ( కోటి) షెల్డన్ జాక్సన్ (60 లక్షలు) అశోక్ శర్మ (55 లక్షలు) అభిజీత్ తోమర్ (40 లక్షలు) రింకు సింగ్ (20 లక్షలు) అంకుల్ రాయ్ (20 లక్షలు) రసిక్ దార్ (20 లక్షలు) బి ఇంద్రజిత్ (20 లక్షలు) ప్రీతమ్ సింగ్ (20 లక్షలు) రమేశ్ కుమార్ (20 లక్షలు) అమాన్ ఖాన్ (2 లక్షలు) చదవండి: . IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! అప్పుడు అలా చేశాం కాబట్టే ఇలా! IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్రైజర్స్ కోచ్ Ind Vs Wi T20 Series: పంత్కు బంపర్ ఆఫర్.. వైస్ కెప్టెన్గా ఛాన్స్ 🚨 Ladies and gentlemen, boys and girls, say hello 👋 to the NEW SKIPPER of the #GalaxyOfKnights অধিনায়ক #ShreyasIyer @ShreyasIyer15 #IPL2022 #KKR #AmiKKR #Cricket pic.twitter.com/veMfzRoPp2 — KolkataKnightRiders (@KKRiders) February 16, 2022 -
IPL 2022 Auction: వేలంలో ప్రత్యేక ఆకర్షణ.. అందరి కళ్లు తన మీదే.. అసలు ఎవరామె?
IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలం ముగిసినా సోషల్ మీడియాలో ఆ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడు పోయాడు? ఏ ఫ్రాంఛైజీది సరైన ఎంపిక? ఎవరు అనవసరంగా డబ్బు ఖర్చు చేశారు? తదితర అంశాల గురించి ఐపీఎల్ ప్రేమికులు చర్చిస్తూనే ఉన్నారు. ఆటగాళ్ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే... తన ఆకర్షణీయ రూపం, అందమైన నవ్వుకు తోడు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఓ యువతి వేలంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు. ఆమె మరెవరో కాదు... సన్రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్. ఐపీఎల్ ఫాలో అయ్యేవారికి కావ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన హావభావాలతో ఎన్నో సార్లు మ్యాచ్లో హైలెట్గా నిలిచారు ఆమె. 2018 వేలం సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. కావ్య పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలం-2022లో కూడా 30 ఏళ్ల కావ్య మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రెండింగ్లో నిలిచారు. చాలా మంది నెటిజన్లు ఆమె గురించి సెర్చ్ చేశారు. అసలు ఎవరీ కావ్య మారన్? మీడియా మొఘల్గా పేరొందిన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం చానెల్స్ వ్యవహారాలు చూస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి కళానిధి మారన్ బంధువన్న విషయం తెలిసిందే. ఇక ఆయన సోదరుడు దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక సంపన్న కుటుంబానికి చెందిన కావ్య... ఎస్ఆర్హెచ్లో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోవడం విశేషం. ఇక ఎస్ఆర్హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్తో కలిసి ఆమె ఐపీఎల్ మెగా వేలం-2022లో పాల్గొన్నారు. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఆక్షన్లో హైదరాబాద్ అత్యధికంగా 10.75 కోట్లు వెచ్చించి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ను సొంతం చేసుకుంది. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో అందాల భామ.. ఎవరా బ్యూటీ గర్ల్ ? IPL 2022 Mega Auction: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. -
IPL 2022 Auction: 10 కోట్లు .. హోటల్లో పిజ్జా పార్టీ.. పాపం కరెంట్ షాక్ కొట్టడంతో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం... 11 ఇన్నింగ్స్లో మొత్తంగా 85 పరుగులు.. అత్యధిక స్కోరు 32.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2021లో 10 ఇన్నింగ్స్లో 263 పరుగులు... కట్చేస్తే... ఐపీఎల్ మెగా వేలం-2022లో ఏకంగా 10.75 కోట్లు పలికాడు. పంజాబ్తో పోటీ పడి మరీ సన్రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తం అతడి కోసం ఖర్చు చేసింది. అవును మీరు ఊహించింది నిజమే... ఈ ఉపోద్ఘాతం వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ గురించే! పెద్దగా ఫామ్లో లేనప్పటికీ మంచి ధరకు అమ్ముడు పోయాడు. తనదైన రోజున చెలరేగి ఆడే పూరన్ కోసం వేలంలో హైదరాబాద్ తగ్గేదేలే అంటూ పోటీపడి రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఏ ఆటగాడిగైనా ఇంతకంటే సంతోషం ఏముంటుంది! వేలంలో అమ్ముడుపోయానని తెలియగానే.. సహచర ఆటగాళ్లకు అహ్మదాబాద్లో పిజ్జా పార్టీ ఇచ్చాడట పూరన్. కాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో భారత్లో పూరన్ భారత్లోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే, బయో బబుల్లో ఉన్న కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి హోటల్ రూమ్కే పిజ్జాలు తెప్పించి ఆనందం పంచుకున్నాడట. పాపం.. కరెంట్ షాక్ కొట్టింది! ఈ విషయం గురించి హోటల్ మేనేజర్ మాట్లాడుతూ... ‘‘బయో బబుల్ కారణంగా బయటి నుంచి భోజనం తెప్పించే వీలు లేదు. మా చెఫ్తోనే 15 పిజ్జాలు తయారు చేయించాం. శుభ్రంగా ప్యాక్ చేసి, శానిటైజ్ చేసి అందించాం. అయితే దురదృష్టవశాత్తు పూరన్కు చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది. శానిటైజర్లో స్వల్పంగా ఆల్కహాల్ ఉంటుంది కదా! బహుశా శానిటైజ్ చేసినపుడు ఆరకపోవడంతో ప్లగ్ పెట్టగానే షాక్ కొట్టినట్లుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా అహ్మదాబాద్లో వన్డే సిరీస్ ముగించుకున్న విండీస్.. బుధవారం నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ కోసం కోల్కతా చేరుకుంది. చదవండి: IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! అప్పుడు అలా చేశాం కాబట్టే ఇలా! IPL 2022 Mega Auction: 23 మంది ఆటగాళ్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇదే.. We got him in the Nick of time, and we can't wait for him to wear the #OrangeArmour. 🧡#OrangeArmy, @nicholas_47 is #ReadyToRise. 🔥#IPLAuction pic.twitter.com/jWQLZ5efKz — SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022 -
IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా!
IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం-2022 కొందరు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తే మరికొందరికి నిరాశను మిగిల్చింది. బెంగళూరులో రెండు రోజుల పాటు సాగిన ఆక్షన్లో 10 ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్ల కోసం పోటీపడ్డాయి. అయితే, 217 స్థానాలకు క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉన్నా... 204 మందితోనే సరిపెట్టడం గమనార్హం. ఇక సురేశ్ రైనా, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్ తదితర పేరున్న పలువురు ఆటగాళ్లు అన్సోల్డ్గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఏ జట్టు కూడా వీరిని కొనేందుకు ఆసక్తికనబరచలేదు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ కూడా ఉన్నారు. గత సీజన్లో వీరిద్దరు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో.. తామిద్దరం అమ్ముడుపోకుండా మిగిలిపోవడంపై రిచర్డ్సన్ స్పందించాడు. ఈఎస్ఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘నిజంగా ఆడం జంపాను ఎవరూ కొనలేదంటే నేను విస్మయానికి గురయ్యాను. అయితే, నిజాయితీగా మాట్లాడుకుంటే... మేము గత సీజన్ మధ్యలోనే లీగ్ నుంచి వైదొలిగాము. ఈ విషయం గురించి తనతో సంభాషించే క్రమంలో... ‘‘ఇందుకు మనం కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని తనకు చెప్పాను. అయితే, ఆ సమయంలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడమే మాకు అత్యంత ప్రాధాన్యమైనది. అందుకే వెళ్లిపోయాము. వేలం సమయంలో ఫ్రాంఛైజీలు మాపై ఆసక్తి చూపకపోవడానికి, మమ్మల్ని కొనుగోలు చేయకపోవడానికి ఇదొక కారణమని నేను భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల గత రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయానని చెప్పుకొచ్చాడు. మెగా వేలం నేపథ్యంలోనూ తాను ఏ ఫ్రాంఛైజీతోనూ సంప్రదింపులు జరుపలేదని రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్ -2021 కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెకు కొందరు ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక ఆడం జంపా టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్రైజర్స్ కోచ్ -
కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ..
ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులో 'హైదరాబాదీ బకరా' అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ముగిసిన వేలంలో ఎస్ఆర్హెచ్ పెద్దగా పేరున్న ఆటగాళ్లను తీసుకోలేదు. ఫామ్లో లేని పూరన్ కోసం రూ. 10 కోట్లు పెట్టడం అందర్ని ఆశ్చర్యపరిచింది. మరో విండీస్ క్రికెటర్ రొమారియో షెఫర్డ్ కోసం రూ. 7.75 కోట్లు ఖర్చు పెట్టడం ఆసక్తి కలిగించింది. అయితే ఉన్నంతలో రాహుల్ త్రిపాటి, ఎయిడెన్ మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ పిలిప్స్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడం కాస్త ఊరట. అయితే తుది జట్టులో ఎంత మంది ఉంటారో తెలియదు కానీ.. కేన్ విలియమ్సన్కు బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరిని పంపించాలనే దానిపై ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలోనే వసీం జాఫర్ కేన్ విలియమ్సన్ గురించి స్పందించాడు. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్రైజర్స్ కోచ్ ''ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్లో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఎక్కువగా వస్తుంటాడు. తాజాగా ఐపీఎల్ మెగావేలంలో పూరన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను తీసుకోవడం ద్వారా విలియమ్సన్ తన స్థానాన్ని వేరొకరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తనకు అచ్చొచ్చిన మూడో స్థానాన్ని వేరొకరికి త్యాగం చేస్తే అది బకరా కిందే లెక్క. అయితే పవర్ప్లేలో ఎక్కువ పరుగులు రావాలంటే హిట్టర్లకు చాన్స్ ఇవ్వడం మినహాయించి విలియమ్సన్కు మరో అవకాశం లేదు. ఇక ఓపెనర్గా అభిషేక్ శర్మ వస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అభిషేక్ ఓపెనర్గా వస్తే మంచి స్ట్రైకర్గా వ్యవహరిస్తాడు. ఇది ఒక మంచి చాయిస్ అనే చెప్పొచ్చు'' అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 Auction: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్రౌండర్ భార్య -
ఐపీఎల్ మెగావేలానికి వచ్చి పాన్కార్డ్ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ పాన్కార్డును పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం స్టార్స్పోర్ట్ బ్రాడ్కాస్టర్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఐపీఎల్ మెగావేలం కవర్ చేయడానికి భారత్కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఆల్రౌండర్ పాన్కార్డు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. చదవండి: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్రౌండర్ భార్య ''నా పాన్కార్డ్ ఎక్కడో పోయింది. ప్లీజ్ నాకు సాయం చేయండి. కొన్ని కార్యకలాపాల కోసం పాన్కార్డు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అయితే పాన్కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా పీటర్సన్ ట్వీట్కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ''డియర్ కెవిన్ పీటర్సన్.. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర పాన్ వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్సైట్ లింక్ను ఓపెన్ చేసి పాన్కార్డు రీ ప్రింట్కోసం ప్రయత్నించండి. ఒకవేళ పాన్కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్ కోసం తమ శాఖకు దరఖాస్తూ చేసుకోవచ్చు'' అని తెలిపింది. దీంతో తన ట్వీట్కు స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. ⚠️INDIA PLEASE HELP⚠️ I’ve misplaced my PAN card & travelling Mon to India but need the physical card for work. Can some PLEASE PLEASE direct me to someone who I can contact asap to help me? 🙏🏽 — Kevin Pietersen🦏 (@KP24) February 15, 2022 Dear @KP24, We are here to help you. If you have your PAN details with you, please visit these links for the procedure to apply for reprint of physical PAN Card: (1/2)https://t.co/M2RFFlDsCThttps://t.co/fySMs6nm62 — Income Tax India (@IncomeTaxIndia) February 15, 2022 -
Ind Vs Wi: కోట్లలో డబ్బు.. ఐపీఎల్తో సంబంధం లేదు.. జాగ్రత్త.. రోహిత్ వార్నింగ్!
ఇషాన్ కిషన్... రూ. 15 కోట్ల 25 లక్షలు(ముంబై ఇండియన్స్)... శ్రేయస్ అయ్యర్ రూ. 12.25 కోట్లు... ఐపీఎల్ మెగా వేలం-2022లో రికార్డు ధరకు అమ్ముడుపోయారు. వీరితో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు సైతం కోట్లు కొల్లగొట్టారు. మరికొందరికి ఆశించినంత దక్కలేదు. అయితే, ఈ భావోద్వేగాల ప్రభావం జాతీయ జట్టు ప్రయోజనాలపై పడకూడదని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లను హెచ్చరించాడు. అదే విధంగా ఐపీఎల్లో ఏ జట్టుకు ఆడుతున్నారు? ఎన్నో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్నారు? అన్న అంశాలతో తమకు సంబంధం లేదన్న హిట్మ్యాన్.. భారత్ తరఫున ఆడేటపుడు జట్టు అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘వేలం ముగిసింది. భావోద్వేగాలకు గురికావడం సహజం. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు దృష్టి మొత్తం విండీస్తో సిరీస్పైనే ఉండాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో నిన్న మాట్లాడాము. రానున్న రెండు వారాలు ఎంతో ముఖ్యం. బ్లూ జెర్సీలో ఆడుతున్నపుడు ఎలా ఉండాలో మరోసారి గుర్తు చేశాం. నిజానికి వాళ్లంతా ప్రొఫెషనల్స్. అయితే, మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయా ఫ్రాంఛైజీలకు ఆడుతున్నపుడు బాధ్యతలు వేరుగా ఉంటాయి. టీమిండియాకు ఆడేటపుడు అలా ఉండదు. ప్రస్తుతం జాతీయ జట్టు కూర్పుపైనే మా దృష్టి’’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్ గురించి తాను ప్రస్తుతం మాట్లాడదలచుకోలేదన్న రోహిత్ శర్మ... ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నాడు. కాగా ఇప్పటికే స్వదేశంలో విండీస్తో వన్డే సిరీస్ 3-0తో వైట్వాష్ చేసిన రోహిత్ సేన.. ఇప్పుడు టీ20 సిరీస్పై దృష్టి సారించింది. ఇందుకోసం నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. వెస్టిండీస్తో టీ20 సిరీస్: భారత జట్టు ఇదే! రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్. చదవండి: IPL 2022 Auction: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్రౌండర్ భార్య A sneak peek into #TeamIndia's fielding drill at the Eden Gardens. 👀 👌#INDvWI | @Paytm pic.twitter.com/wSFH4keVTx — BCCI (@BCCI) February 15, 2022 -
IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్రైజర్స్ కోచ్
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అనమాక ఆటగాళ్లను కొనుగోలు చేసి విమర్శలపాలవుతున్నసన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వ్యూహ రచన విషయంలో మాత్రం అందరికంటే ముందున్నట్లు కనిపిస్తోంది. జట్టు కూర్పు విషయంలో ఏ ఫ్రాంచైజీ కూడా ప్రకటన చేయకముందే ఎస్ఆర్హెచ్ తమ ఓపెనింగ్ జోడీ ఎవరనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ ఇన్నింగ్స్ను కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు యువ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపాడు. గతంలో మిడిలార్డర్లో ఆడిన లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ అయిన అభిషేక్ శర్మకు ఈసారి ఓపెనర్గా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మురళీధరన్ పేర్కొన్నాడు. మెగా వేలంలో ఈ యువ ఆల్రౌండర్ కోసం ఎస్ఆర్హెచ్ ఏకంగా 6.5 కోట్లు వెచ్చించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభిషేక్ శర్మ కోసం ఆరెంజ్ ఆర్మీ.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్లతో పోటీ పడి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్ల్లో 17.2 సగటుతో 241 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన మెగా వేలంలో సన్రైజర్స్ మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకుముందు రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ఎస్ఆర్హెచ్ సభ్యుల సంఖ్య 23కు చేరింది. రిటైన్డ్ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్(14 కోట్లు), కెప్టెన్ అబ్దుల్ సమద్(4 కోట్లు) ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) చదవండి ఐపీఎల్ 2022: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. ఈసారి దబిడి దిబిడే..!