-
గుర్తుకొస్తున్నాయి...!
⇒ జగనన్న ప్రభుత్వంలో ఏటా ఖరీఫ్ ప్రారంభంలో రైతు భరోసా అందించి ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పింది. ఇంతవరకూ ఆ హామీకి అతీగతీ లేదు. వ్యవసాయానికి ఇదే అదును. ఈ సమయంలో చేతిలో సొమ్ములేక అప్పులు చేయల్సివస్తోంది. మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. – మిడితాన కన్నంనాయుడు, బాసూరు గ్రామం, పాలకొండ మండలం, పార్వతీపురం మన్యం⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారు. రైతు భరోసా పథకం రైతులకు ఎంతో చేదోడుగా నిలిచింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయని రైతు భరోసా పథకాన్ని తెచ్చి అండగా నిలిచారు. పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం డబ్బులు ఎప్పుడిస్తుందో అంతుబట్టడం లేదు. –పోల్నాటి శ్రీనివాసరావు, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా⇒ వైఎస్ జగన్ క్రమం తప్పకుండా సాయం అందించి రైతులను ఆదుకున్నారు. ప్రభుత్వం మారాక ఇంతవరకు రైతు భరోసా పడలేదు. పెట్టుబడుల కోసం ఏం చేయాలో తోచడం లేదు. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, రైతు, పోతేపల్లి గ్రామం, బందరు మండలం, కృష్ణాజిల్లా⇒ గత ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభానికి ముందే మే నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కొత్త ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జూన్ ముగుస్తోంది. తక్షణం సాయం అందిస్తే బాగుంటుంది. –తోక కృష్ణ, రైతు, వెల్దుర్తిపాడు, పెనుగంచిప్రోలు మండలం⇒ ఖరీఫ్ ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి దిగులు లేకుండా సాగు చేసుకున్నాం. ఇప్పుడు సాగు ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పడం లేదు. – సుంకుగారి భాస్కర్రెడ్డి, గోపాయపల్లె గ్రామం, రాజుపాలెం మండలం. వైఎస్సార్జిల్లా.⇒ వర్షాలు కురుస్తున్నాయి. ఆరుద్ర కార్తె కూడా వచ్చింది. పంటల సాగుకు ఇదే మంచి అదును. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఠంఛనుగా అందేది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు దాటినా రైతుభరోసా ఊసే ఎత్తడం లేదు. జగన్ మళ్లీ సీఎం అయి ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కావు. – కృష్ణారెడ్డి, రైతు, హస్తవరం, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా⇒ గత ప్రభుత్వంలో ఏ సీజన్కు ఆ సీజన్లో రైతు భరోసా డబ్బులు మా బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత కేంద్రం నుంచి పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు మాత్రమే జమ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాలేదు. – రంగయ్య, రైతు, కమ్మవారిపల్లె, నంద్యాల జిల్లా ⇒ గత ప్రభుత్వంలో ఈ సమయానికి రైతు భరోసా అందించేవారు. ఆ సొమ్ము వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడింది. టీడీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం రూ.20 వేలుకు పెంచినట్లు చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదు. వ్యవసాయ పనుల సీజన్లో అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – శ్రీకాంత్రెడ్డి, రైతు, పి.జలాలపురం, శింగనమల మండలం, అనంతపురం జిల్లా⇒వరి సాగు చేస్తా. గత ప్రభుత్వం రైతు భరోసాతో ఆదుకోవడంతో పెట్టుబడి కష్టాలు తొలగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సాయం అందలేదు. దీంతో మళ్లీ 2019 మునుపు పరిస్థితులు వస్తాయని భయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు పెట్టుబడి సాయంతో ఆదుకోవాలి. లేదంటే ఈ ఏడాది సాగుకు దూరం కాక తప్పదు.– గుల్లేలు నారాయణరావు, మర్రిపుట్టు గ్రామం, గుల్లేలు పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా⇒ ఏటా మే నెలలో రైతు భరోసా డబ్బులు మా ఖాతాల్లో పడేవి. ఈ ఏడాది జూన్ వెళ్లిపోతున్నా ఇంకా అందలేదు. వర్షాలు పడుతున్నాయి. పెట్టుబడి సాయం ఇంతవరకూ అందలేదు. –పెచ్చెట్టి సుబ్బారావు, కౌలు రైతు, జిన్నూరు, పోడూరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా⇒ ఏటా 5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవాడిని. గత ప్రభుత్వం మే నెలలోనే రైతు భరోసా కింద రూ.5,500 ఖాతాల్లో జమ చేసేది. ఖరీఫ్ పెట్టుబడికి ఆ డబ్బులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఇంతవరకు ఆ ఊసే లేదు. సకాలంలో రైతుకు సాయం అందకపోతే చాలా ఇబ్బందులు పడతారు. – వి. హరినాథరెడ్డి, రైతు, చెరువుమరవపల్లి, తలుపుల మండలం, శ్రీసత్యసాయి జిల్లా⇒ వరి, చెరకు సాగు చేస్తున్నా. జగన్ సీఎంగా ఉన్న కాలంలో సీజన్లో పెట్టుబడులకు సాయం అందించారు. రూ.20 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలి. – కాండ్రేగుల కిరణ్కుమార్, రైతు, చూచుకొండ, మునగపాక, అనకాపల్లి జిల్లా⇒గతంలో రైతు భరోసా క్రమం తప్పకుండా అందింది. ఈ ఏడాది జూలై వస్తున్నా పెట్టుబడి సాయం అందక పోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. – చిన్నభగవంతప్ప, రైతు, ఆరేకల్, ఆదోని మండలం -
ఏథర్ ఎనర్జీ కీలక నిర్ణయం.. 4000 మందికి ఉద్యోగావకాశాలు
బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' మహారాష్ట్రలో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం సంస్థ ఏకంగా రూ. 2000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.బిడ్కిన్, ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (AURIC)లో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త ప్లాంట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా.. బ్యాటరీలను కూడా తయారు చేయనున్నట్లు ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.ఏథర్ ఎనర్జీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ ద్వారా సుమారు 4000 మందికి ఉపాధి లభిస్తుందని, రాష్ట్రంలో ఆటోమోటివ్ రంగంలో ఇదే అతి పెద్ద పెట్టుబడిగా దేవేంద్ర ఫడ్నవీస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏటా 10లక్షల కంటే ఎక్కువ వాహనాలను, బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్లో రెండు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ఇందులో ఒకటి బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది. మరొకటి వాహనాల అసెంబ్లింగ్ కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న కంపెనీ ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 4.3 లక్షల బ్యాటరీ ప్యాక్లు & 4.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు.మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ బ్రాండ్ వాహనాలను విరివిగా ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా వేగంగా డెలివరీ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఏథర్ ఎనర్జీ కో ఫౌండర్ & సిటీఓ స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు.Big investment in Maharashtra in automotive sector!Welcome to Maharashtra, Ather !Just got done with a meeting with the Founder of Ather Energy, Shri Swapnil Jain and I’m glad to share that he informed about their great decision that Ather Energy, the leading electric scooter… pic.twitter.com/Hc8EeaDdM6— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 26, 2024 -
రియల్ ఎస్టేట్లో భారీగా డబ్బులు పెట్టిన సెలబ్రిటీలు వీళ్లే..
సినిమాలలో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలు భారీ మొత్తంలో సంపాదిస్తారు. వీరిలో చాలా మంది మంచి వ్యాపారవేత్తలు కూడా. తమ నట జీవితంతో పాటు సమాంతర వ్యాపారాలను ప్రారంభించడం మనం చూశాం. కొందరు రెస్టారెంట్లు, ఫ్యాషన్ బ్రాండ్లు లేదా విలాసవంతమైన పబ్బులు, క్లబ్బులు నడుపుతుండగా మరికొందరు రియల్ ఎస్టేట్లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ఇలా ఇటీవల రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన కొందరు సెలబ్రిటీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అమితాబ్ బచ్చన్బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ముంబైలోని వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్ లో మూడు ఆఫీస్ స్పేస్ లను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సైట్ FloorTap.com కు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం.. ఈ కార్యాలయ స్థలాలు ముంబైలోని అంధేరి వెస్ట్ పరిసరాల్లో, వీర దేశాయ్ రోడ్ సమీపంలో ఉన్నాయి.మొత్తం 8,429 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కార్యాలయ భవనాలను రూ.59.58 కోట్లకు బిగ్ బీ కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లావాదేవీకి అమితాబ్ బచ్చన్ రూ.3.57 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడంతో 2024 జూన్ 20న సేల్ డీడ్ ఖరారైంది. వ్యాపార ప్రాంగణం మూడు పార్కింగ్ స్థలాలతో వచ్చినట్లు డాక్యుమెంట్లు సూచిస్తున్నాయి. వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకందారుగా గుర్తించారు.గత ఏడాది ఆగస్టులో అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భవనంలో ఇప్పటికే నాలుగు ఆఫీస్ సూట్లు ఉన్నాయి. 2023 డిసెంబర్లో ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు వాణిజ్య స్థలాలను రూ.2.07 కోట్లకు లీజుకు తీసుకుని రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేశారు.ఇతర సెలబ్రిటీలు కూడా ఇదే భవనంలో పెట్టుబడులు పెట్టారు. తాజా అప్డేట్ ప్రకారం.. బిగ్ బీకి ఇప్పుడు సిగ్నేచర్ బిల్డింగ్ 7 ఆఫీస్ స్పేస్లు ఉన్నాయి. ఆయన ఒక్కరే కాదు, సిగ్నేచర్ బిల్డింగ్ ఇతర సెలబ్రిటీలకు కూడా హాట్ స్పాట్. సీనియర్ బచ్చన్ తో పాటు మనోజ్ బాజ్పాయ్, కాజోల్, అజయ్ దేవగణ్, కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి సెలబ్రిటీలకు కూడా ఈ భవనంలో కమర్షియల్ యూనిట్లు ఉన్నాయి.అజయ్ దేవగణ్, కాజోల్ఈ భవనంలో 194 చదరపు మీటర్ల కమర్షియల్ యూనిట్ను కాజోల్ గత ఏడాది ఆగస్టులో రూ .7.64 కోట్లకు కొనుగోలు చేశారు. సిగ్నేచర్ బిల్డింగ్ లోని 16, 17 అంతస్తుల్లో ఉన్న ఐదు కమర్షియల్ ప్రాపర్టీలను అజయ్ దేవగణ్ రూ.45.9 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆయన రూ.2.70 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.అభిషేక్ బచ్చన్కొన్ని వారాల క్రితం అభిషేక్ బచ్చన్ బోరివాలిలో ఉన్న ఒబెరాయ్ రియల్టీ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఒబెరాయ్ స్కై సిటీలో ఆరు కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. 57వ అంతస్తులో మొత్తం 4,894 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లను రూ.15.42 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది.మనోజ్ బాజ్పాయ్మనోజ్ బాజ్పాయ్, ఆయన భార్య షబానా రజా గత ఏడాది అక్టోబర్లో సిగ్నేచర్ బిల్డింగ్లోని నాలుగు యూనిట్లలో రూ.31 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.7.77 కోట్లు కాగా, యూనిట్ కు రూ.46.62 లక్షల స్టాంప్ డ్యూటీ ఉంది.కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్లు సిగ్నేచర్ బిల్డింగ్లో 2,099 చదరపు అడుగుల యూనిట్ను కలిగి ఉన్నారు. సారా అలీఖాన్, అమృతా సింగ్ 2023 జూలైలో రూ.9 కోట్లకు ఫ్లాట్ను కొనుగోలు చేయగా, కార్తీక్ ఆర్యన్ 2023 సెప్టెంబర్లో రూ.10 కోట్లకు అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు ప్రాపర్టీల అమ్మకానికి వెసులుబాటు కల్పించింది. -
‘పెట్టుబడి’ గండం! సర్కారు సాయం కోసం రైతన్న ఎదురు చూపులు
సాక్షి, అమరావతి: జోరందుకున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనుల కోసం రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు చాలా కీలకం. సకాలంలో సాయం చేతికందితే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే దృక్పథంతో గత ఐదేళ్లూ మే/జూన్లో తొలి విడత పెట్టుబడి సాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందచేస్తామని సూపర్ సిక్స్లో హామీ ఇచి్చన సీఎం చంద్రబాబు ఆ ఊసే పట్టన్నట్లు వ్యవహరించడంపై అన్నదాతల్లో ఆందోళన రేగుతోంది.కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చడం మినహా డబ్బులు విడుదల చేయలేదు. ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో పెట్టుబడి సాయం పెంపు ఉంటుందని ఆశించిన రైతన్నలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కేబినెట్ భేటీలో అయినా చర్చిస్తారనుకున్నారు. చివరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం జరిపిన తొలి సమీక్షలో మాట వరసకైనా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో ఏటా సీజన్కు ముందుగానే చేతికి అందే తొలి విడత పెట్టుబడి సాయం డబ్బులు ఎప్పుడిస్తారో అంతుబట్టక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ కంటే మిన్నగా.. ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి z ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలిచింది. ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్తో కలిపి ఏటా మే/ జూన్లో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి తోడుగా నిలిచారు. పీఎం కిసాన్ పరిధిలోకి రాని నాన్ వెబ్ల్యాండ్ భూ యజమానులతో పాటు వారసత్వంగా భూములు పొందినవారు, ఎక్వైర్డ్ ల్యాండ్ సాగుదారులతో సహా అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఈ ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది. మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ.. ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి నేతలు సూపర్సిక్స్లో హామీ ఇచ్చారు. పీఎం కిసాన్తో కలిసి రైతు భరోసా సాయాన్ని అందించినప్పుడు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తామిచ్చిన హామీ మేరకు రూ.20 వేలు సొంతంగా ఇస్తారా? లేక పీఎం కిసాన్తో కలిపి ఇస్తారా? అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులవుతోంది.గతంలో సీజన్కు ముందుగానే తొలివిడత సాయం రైతులకు చేతికొచ్చేది. ఈ సొమ్ములు ఖరీఫ్లో విత్తనాల కొనుగోలు, దుక్కులు, నారుమడులు, నాట్లు వేసుకునేందుకు ఉపయోగపడేవి. ఈసారి మాత్రం తొలి విడత పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి వస్తుంది? ఎంత వస్తుంది? అనే సంగతి తేలకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదునులో పెట్టుబడి సాయం చేతికి రాకపోవడంతో రైతులు మళ్లీ అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారీల చుట్టూ ప్రదక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ తొలి సంతకం పీఎం కిసాన్పైనే.. కేంద్రంలో మూడోసారి పగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పీఎం కిసాన్ సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. 2018–19 నుంచి ఏటా మూడు విడతల్లో కేంద్రం ఈ సాయం అందిస్తోంది. ఇప్పటివరకు 16 విడతల్లో రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రూ.14,717 కోట్లు జమ చేసింది. ఈ నెల 18న ఉత్తరప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ బటన్ నొక్కి పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని జమ చేశారు. 2024–25 సీజన్లో రాష్ట్రంలో తొలి విడత సాయం కోసం 40.91 లక్షల మంది అర్హత పొందగా వీరికి రూ.824.61 కోట్లు పెట్టుబడి సాయం జమ చేశారు.అన్నదాతా అంటూ నాడు మోసంతాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు హడావుడిగా ఓ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఆగమేఘాల మీద జీవో 28 జారీ చేశారు.ఆ జీవో ప్రకారం 2 హెక్టార్లలోపు సన్న, చిన్నకారు రైతులకు ఏటా రూ.15 వేలు, రెండు హెక్టార్లకు పైబడిన వారికి రూ.10 వేలు, కౌలురైతులు, అటవీ, దేవదాయ భూసాగుదారులకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన రూ.9,225 కోట్లు జమ చేయాల్సి ఉండగా.. రెండు విడతల్లో 43.26 లక్షల మందికి రూ.4 వేల చొప్పున రూ.2,440.29 కోట్లు మాత్రమే జమ చేశారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్ కింద కేంద్రం అందించింది రూ.675 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1,765.29 కోట్లు జమ చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.అప్పులు చేయక తప్పదు గత ఐదేళ్లుగా ఖరీఫ్ సీజన్కు ముందే మే నెలలోనే పెట్టుబడి సాయం అందేది. దీంతో అప్పుల కోసం వ్యాపారులపై ఆధారపడాల్సిన అగత్యం ఉండేది కాదు. ఈ సొమ్ములు దుక్కి దున్నుకోవడం, నారు మళ్లు పోసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడేవి. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది. రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఎప్పుడు జమ చేస్తారో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈసారి పెట్టుబడుల కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. –కె.ధనుంజయరావు, సింగుపాలెం, బాపట్ల జిల్లావెంటనే జమ చేయాలి ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామని సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారు. అదును దాటి పోకుండా జమ చేస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో ఐదేళ్లు సీజన్కు ముందుగానే సాయం అందించారు. కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో వెంటనే పెట్టుబడి సాయం జమ చేయాలి. –కె.ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపెట్టుబడి కోసం ఇబ్బందులుపదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 6 ఎకరాల్లో చీని, 4 ఎకరాల్లో టమోటా, 3 ఎకరాల్లో ఆముదం, కంది, 5 ఎకరాల్లో అరటి, 6 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయం అందింది. ఈసారి ప్రభుత్వం పెట్టుబడి సాయం సకాలంలో ఇవ్వకపోవడంతో పంట సాగుకు ఇబ్బందిపడుతున్నా. –హనుమంతరాయుడు, కదిరిదేవరపల్లి, అనంతపురం జిల్లా ప్రతి కౌలు రైతుకూ ఇవ్వాలి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల పెట్టుబడి సాయం అందించాలి. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతుకూ సాయం జమ చేయాలి. భూ యజమానులకు రుణాలిస్తారు. కౌలు రైతులకు రుణాలు దక్కడం లేదు. వారికి ఎలాంటి సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం పెట్టుబడి సాయమైనా జమ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. –పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
18న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసే పీఎం కిసాన్ పథకం నిధులు ఈ నెల 18న విడుదల కానున్నాయి.ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఆన్లైన్లో నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.26 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ శనివారం ఈ విషయం వెల్లడించారు. -
భారత్లో టెస్లా పెట్టుబడులు.. మస్క్ యూటర్న్
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మస్క్ ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. మా సంస్థ త్వరలో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.భారత్కు ఆహ్వానంఆ ట్వీట్కు మోదీ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయ యువత, జనాభా, ఊహాజనిత విధానాలు, స్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలతో మా భాగస్వాములందరికీ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు అనువైన వాతావరణాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని మస్క్ ట్వీట్కు రిప్లయి ఇచ్చారు. మస్క్ యూటర్న్.. అంతలోనే భారత్లో టెస్లా పెట్టుబడులు నిమిత్తం ఆ సంస్థ సీఈవో ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ 21,22 తేదీలలో ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత టెస్లాకు భారీ బాధ్యతలు ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయడం..అనూహ్యంగా చైనాలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మస్క్ భారత్లో పెట్టుబడుల అంశం వెనక్కి తగ్గింది. తాజాగా, మరోమారు పెట్టుబడులు పెట్టడంపై మస్క్ ట్వీట్ చేయడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
ఈ-కామర్స్ రంగంపై గూగుల్ కన్ను.. ఫ్లిప్కార్ట్లో భారీ పెట్టుబడులు
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారత్ ఈ-కామర్స్ రంగంపై కన్నేసింది. దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో 350 మిలియన్ డాలర్ల విలువైన మైనారిటీ వాటాను కొనుగోలు చేయనుందని సమాచారం. ఫ్లిప్కార్ట్ విలువ 37 బిలియన్ డాలర్లు.అయితే ఈ కొనుగోలుపై గూగుల్,ఫ్లిప్కార్ట్ స్పందించలేదు. కానీ వాటా కొనుగోలుపై రెగ్యులరేటరీ నుంచి ఆ రెండు సంస్థలు అనుమతులు తీసుకున్నాయంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.గూగుల్ తన పెట్టుబడితో ఫ్లిప్కార్ట్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు, దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించేందుకు, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో సహాయపడతాయి అని ఫ్లిప్కార్ట్ తెలిపింది.రీసెర్చ్ సంస్థ రెడ్ సీర్ అంచనాల ప్రకారం.. భారతదేశ ఈ-కామర్స్ మార్కెట్ 2023లో 60-65 బిలియన్ల నుండి 2030 నాటికి 200-230 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఈ తరుణంలో బడాబడా కంపెనీలు భారత్ ఈ-కామర్స్ రంగంపై దృష్టి సారించాయి. తమ సేవల్ని విస్తరించనున్నాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు, తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభ్యంతో ఈకామర్స్ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగా 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులతో ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు, బ్లింకిట్, మీషో, నైకా వంటి ఇతర సెగ్మెంట్లోని ఈ-కామర్స్ సంస్థల వ్యాపారం జోరుగా సాగుతోంది. -
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
టీమిండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్ నటి అనుష్క శర్మలకు షేర్ మార్కెట్లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు. -
రూ.12000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన మహీంద్రా: ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ విభాగంలో భారీ పెట్టుబడులను పెట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ తరుణంలో దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఏకంగా రూ. 12000 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పెట్టుబడిన పెట్టింది. 2027 నాటికి మహీంద్రా ఆరు బ్యాటరీతో నడిచే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్దికి వేలకోట్ల పెట్టుబడి పెట్టడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ భారీగా పెరిగాయి.UK ఆధారిత కంపెనీ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (BII) 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, Temasek మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL) లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అంగీకరించిన కాలక్రమం ప్రకారం మిగిలిన రూ.900 కోట్లను టెమాసెక్ పెట్టుబడి పెడుతుందని కంపెనీ తెలిపింది. -
అక్కడ రాహుల్ గాంధీ ఇన్వెస్టింగ్.. వంద నుంచి వెయ్యి రెట్ల లాభాలు!
కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. ఈయన దగ్గర ఉన్న మొత్తం విలువ రూ. 20.4 కోట్లుగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు.. జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు ఉన్నట్లు ఉన్నట్లు తెలిపారు. ఈయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు గత పదేళ్లలో మంచి వృద్ధిని పొందాయి. రాహుల్ గాంధీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు & పదేళ్లలో ఆ సంస్థల వృద్ధి ఆల్కైల్ అమీన్స్ కెమికల్స్ లిమిటెడ్: +3625.00 శాతం ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్: +467.38 శాతం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్: +4028.06 శాతం దీపక్ నైట్రేట్ లిమిటెడ్: +3510.21 శాతం దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: +443.78 శాతం డా. లాల్ పాత్లాబ్స్ లిమిటెడ్: +215.04 శాతం ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: 434.64 శాతం గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్: +3454.00 శాతం జీఎంఎం Pfaudler లిమిటెడ్: +469.09 శాతం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్: +291.49 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్: +363.68 శాతం ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్: +868.50 శాతం ఇన్ఫోసిస్ లిమిటెడ్: +275.39 శాతం ఐటీసీ లిమిటెడ్: +78.80 శాతం ఎల్టీఐ మైండ్ట్రీ లిమిటెడ్: +636.42 శాతం మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్: +595.35 శాతం నెస్లే ఇండియా లిమిటెడ్: +434.42 శాతం పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: +816.51 శాతం సుప్రజిత్ ఇంజినీరింగ్ లిమిటెడ్: +475.14 శాతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్: +263.04 శాతం టైటాన్ కంపెనీ లిమిటెడ్: +1123.42 శాతం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్: +1226.25 శాతం వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్: +1276.81 శాతం వినైల్ కెమికల్స్ (ఇండియా) లిమిటెడ్: +2101.45 శాతం బ్రిటానియా ఇండస్ట్రీస్: +1007.61 శాతం -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
‘రియల్’ మోసాలు రూ.10 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువ అయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. కస్టమర్ల సొమ్మే యజమానికి.. నగరానికి నలువైపులా దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేని ప్రాంతాల్లో రియల్ ప్రాజెక్టుల పేరిట ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నారు. భూమి యజమానులతో ఒప్పందం చేసుకొని, ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, ప్రీలాంచ్లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ డబ్బే భూమి యజమానికి కట్టి, ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా, భూ యజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్ట్ ఆగిపోయి ప్రీలాంచ్లో బుక్ చేసుకున్నవారు రోడ్డున పడుతున్నారు. మోసాల విలువ రూ.10 వేల కోట్లు.. సాహితీ, భువనతేజ, జేజే ఇన్ఫ్రా, జేవీ బిల్డర్స్, జయ గ్రూప్ వంటి చిన్నా, పెద్ద కంపెనీలు ప్రీలాంచ్ ప్రాజెక్ట్లు చేపడుతున్నాయి. కోకాపేట, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్పేట, ఆదిబట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు కనీసం వంద వరకు ఉంటాయని, నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రియల్ఎస్టేట్ మోసాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ (టీపీడీఎఫ్ఈఏ) చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సంబంధిత బిల్డర్, కంపెనీ పూర్వాపరాలు పరిశీలించాలి. ప్రాజెక్ట్ను పూర్తి చేసే ఆర్ధిక స్తోమత ఆ సంస్థకు ఉందా? లేదా? అని ఆరా తీయాలి. దీనికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగాల నుంచి అనుమతులు ఉన్నాయా..లేదా, రెరాలో నమోదైందా లేదా తనిఖీ చేయాలి. ఏజెంట్ చెప్పినవన్నీ నమ్మకుండా, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలి. నగదు రూపంలో కాకుండా చెక్ రూపంలో లావాదేవీలు జరిపితేనే ఉత్తమం. – నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ ఎండీ -
ఈఎఫ్టీఏతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
న్యూఢిల్లీ: యూరప్లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, దశల వారీగా పలు ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, కొన్నింటిపై మినహాయింపు నిబంధనల కారణంగా స్విస్ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్ కొంత చౌకగా లభించగలవు. లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈఎఫ్టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ల్యాండ్, లీచ్టెన్స్టెయిన్ దేశాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం చాలా మటుకు భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు. పలు ప్రాసెస్డ్ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి. ప్రతిగా దాదాపు 82.7 శాతం ఈఎఫ్టీఏ ఉత్పత్తుల కేటగిరీలపై భారత్ సుంకాలపరమైన ప్రయోజనాలు కలి్పంచనుంది. అలాగే, ఇరు పక్షాల సరీ్వసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి. ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఈఎఫ్టీఏ మధ్య 18.65 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. -
డిస్నీ, రిలయన్స్ ఒప్పందం?
న్యూఢిల్లీ: వాల్ట్ డిస్నీ భారత వ్యాపార విభాగ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగం కార్యకలాపాలను విలీనం చేసేందుకు ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన మీడియా విభాగం, ఇతర అనుబంధ సంస్థలకు 61 శాతం వాటా ఉంటుందని, మిగతా వాటాలు డిస్నీకి ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ వారం వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టాటా ప్లే సంస్థలో డిస్నీకి ఉన్న మైనారిటీ వాటాలను కూడా రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని వివరించాయి. సంక్లిష్టంగా మారిన తమ భారత విభాగాన్ని వీలైతే పూర్తిగా విక్రయించేందుకు లేదా ఇతర సంస్థలతో జట్టు కట్టి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు గతేడాది నుంచి డిస్నీ కసరత్తు చేస్తోంది. డిస్నీ, రిలయన్స్ ఒప్పందం? -
ఇందులో పెట్టుబడులు పెడితే..‘గుండె మీద చెయ్యేసుకుని బతకొచ్చు’!
మిడ్క్యాప్, స్మాల్క్యాప్లో రిస్క్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులు కూడా మెరుగ్గా ఉంటాయి. అస్థిరతలు చూసి చలించకుండా, సహనంతో ఉండే వారికి స్మాల్క్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. లార్జ్క్యాప్తో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక ప్రతిఫలాన్ని మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలు అందిస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక పిల్లల వివాహం, ఉన్నత విద్య, రిటైర్మెంట్ తదితర దీర్ఘకాల లక్ష్యాల కోసం స్మాల్క్యాప్ ఫండ్స్కు తమ పోర్ట్ఫోలియోలో తప్పకుండా చోటు కల్పించుకోవడం ఎంతైనా అవసరం. ఈ విభాగంలో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం దీర్ఘకాలంలో మంచి పనితీరుతో ఆకట్టుకుంటోంది. రాబడులు ఏడాది, మూడేళ్ల కాలంలో సూచీలతో పోలిస్తే రాబడుల విషయంలో ఎస్బీఐ స్మాల్క్యాప్ ఫండ్ వెనుక బడింది. కానీ, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సూచీలకు మించి అధిక రాబడిని ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం ఇన్వెస్టర్లకు 37 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 25 శాతం చొప్పున ఉంది. ఐదేళ్లలో 26 శాతం, ఏడేళ్లలో 21 శాతం, పదేళ్ల కాలంలో 27 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో కనిపిస్తుంది. దీర్ఘకాలంలో స్మాల్క్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే ఎక్కువగా ఉంది. పెట్టుబడుల విధానం 2011, 2013, 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం నష్టాలను తగ్గించింది. 2014, 2017, 2020–21 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. పెట్టుబడుల్లో 65 శాతం వరకు స్మాల్క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంటుంది. అయితే, అన్ని సమయాల్లోనూ స్మాల్క్యాప్ కంపెనీలకు ఇదే స్థాయిలో కేటాయింపులు చేయదు. ఒకవేళ స్మాల్క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు మరీ ఖరీదుగా మారాయని భావించినప్పుడు, మిడ్క్యాప్, లార్జ్క్యాప్నకు కేటాయింపులు పెంచుతుంది. అలాగే, డెట్కు కూడా కొంత కేటాయిస్తుంటుంది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.24,862 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో జనవరి చివరికి 93.13 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 6.87 శాతం నగదు, నగదు సమానాల్లో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించినట్టయితే, 59.23 శాతం మిడ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. స్మాల్క్యాప్ కంపెనీల్లో 40.77 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్క్యాప్ ఫండ్ అయినప్పటికీ, ప్రస్తుతం అధిక భాగం పెట్టుబడులు మిడ్క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆయా స్మాల్క్యాప్ కంపెనీలు మంచి పనితీరుతో మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎక్కువ పెట్టుబడులు మిడ్క్యాప్లో కనిపిస్తున్నాయి. పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం 55 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనూ పెట్టుబడులు 28 శాతం మించలేదు. అంటే ఈ పథకంలో ఎక్కువ వైవిధ్యం కనిపిస్తోంది. సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, 18 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీలకు 12 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 12 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు 9.49 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
డైరెక్ట్ ప్లాన్లలో ఎస్డబ్ల్యూపీ, ఎస్టీపీ ఎలా..?
డైరెక్ట్ ప్లాన్లలో నేను ఇన్వెస్ట్ చేస్తే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసుకునే సేవలను ఫండ్ సంస్థ అందిస్తుందా? – విజయ్ కుమామ్ డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు స్వయంగా నిర్వహించుకునేవి. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ఇన్వెస్టర్ రెండు మూడు మార్గాల్లో నిర్వహించుకోవచ్చు. సిప్ లేదా ఎస్డబ్ల్యూపీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా బ్రిక్స్ అండ్ మోర్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి చేసుకోవాలి. అంటే ఫండ్ హౌస్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అయిన కేఫిన్టెక్, క్యామ్స్ ద్వారా ఈ లావాదేవీలు చేసుకోవచ్చు. సమీపంలోని ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్కు స్వయంగా వెళ్లి సిప్ లేదా ఎస్డబ్ల్యూపీ లేదా ఎస్టీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ హౌస్ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు సైతం డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సదుపాయాల ద్వారా ఇన్వెస్టర్లు సొంతంగా ఈ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండ్ హౌస్ సంస్థ నేరుగా సాయం అందించదు. నేను కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్ అనే ప్లాట్ఫామ్ను ఇందుకోసం వినియోగిస్తున్నాను. ఇది ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్స్లో లావాదేవీలను ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ తెలిసిన అందరికీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణ సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే మొదట కేవైసీ, ఇతర అవసరాలను ఇచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. వీటిని సైతం ఇంటి నుంచే చేసుకునే సౌలభ్యం ఉంది. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి సేవలను ఇన్వెస్టర్లు సులభంగా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. నేను ఎన్పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్ గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో అస్థిరతలు.. షార్ట్ డ్యూరేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్తో పోలిస్తే సహజంగా ఎక్కువే. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో యాక్టివ్గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. కనుక మీ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించుకోవచ్చు. -
రూ.వేలల్లో ఇచ్చి రూ.కోట్లల్లో కొట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ‘పిగ్ బుచ్చరింగ్’... తరహాకు చెందిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోయాయని నగర సంయుక్త పోలీసు కమిషనర్ (నేరాలు) ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ స్కామ్స్లో మోసపోతున్న వారిలో చార్టెడ్ అకౌంటెంట్లు, ఏళ్లుగా ట్రేడింగ్ చేస్తున్న నిపుణులతో పాటు విద్యాధికులు ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ప్రతి రోజూ కనిష్టంగా నాలుగు కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ జరుగుతున్న విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే పంథా ఇక్కడ అమలు... మాంసం వ్యాపారులు పంది బక్కపలుచగా ఉన్నప్పుడు దాన్ని వధించరు. కొన్నాళ్లపాటు దానిని మేపడం ద్వారా బలిష్టంగా చేసి ఆపై మాంసంగా మారుస్తారు. పిగ్ బుచ్చరింగ్గా పిలిచే ఈ విధానాన్నే ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ చేసే నేరగాళ్లు అనుసరిస్తున్నారు. ట్రేడింగ్ పేరుతో వివిధ రకాలైన సోషల్మీడియా ప్లాట్ఫామ్స్పై ప్రకటనలు గుప్పిస్తున్న నేరగాళ్లు పలువురిని ఆకర్షిస్తున్నారు. ఇలా తమ వల్లోపడిన వారికి పూర్తి నమ్మకం కలగడం కోసం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. వీటి ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ తదితర గ్రూపుల్లో వారికి సభ్యులుగా చేస్తున్నారు. ఆపై ప్రత్యేక లింకుల ద్వారా తమ యాప్స్ టార్గెట్ చేసిన వారి ఫోన్లలో డౌన్లోడ్ చేయిస్తున్నారు. దీని డ్యాష్బోర్డ్లో సదరు వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత లాభం వచి్చంది? మొత్తం ఎంతకు పెరిగింది? తదితరాలు కనిపిస్తూ ఉంటాయి. తొలినాళ్లల్లో వాళ్లు పెట్టిన పెట్టుబడికి రూ.వేలల్లో లాభాలు ఇచ్చి పూర్తిగా నమ్మిస్తారు. ఆపై పెట్టుబడి మొత్తాన్ని రూ.లక్షలు, రూ.కోట్లకు పెంచేలా చేస్తారు. ఆ గ్రూపుల నిండా ‘లాభాలే’... ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్కు సంబంధించిన యాప్ల్లో కొన్ని ప్రముఖ సంస్థల పేర్లతో, వాటి లోగోలతో ఉంటుండటంతో బాధితులు తేలిగ్గా మోసపోతున్నారు. వీరు సభ్యులుగా ఉండే గ్రూపులకు ప్రీమియం, వీఐపీ లాంటి పేర్లు పెడతారు. వీటిలో అత్యధికులు సైబర్ నేరగాళ్ల అనుచరులే సభ్యులుగా ఉంటారు. వారు ప్రతి రోజూ తనకు ఇంత మొత్తం లాభం వచి్చంది, అంత మొత్తం లాభం వచి్చంది అంటూ కామెంట్స్ పోస్టు చేస్తారు. దీంతో పాటు తమ యాప్స్కు సంబంధించి డ్యాష్బోర్డులు, నగదు తమ ఖాతాల్లో మళ్లినట్లు చూపించే కలి్పత సందేశాలను ఈ గ్రూపుల్లో పొందుపరుస్తారు. ఇవి చూసిన బాధితులు పూర్తిగా నమ్మేస్తారు. అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు వీళ్లు పెట్టే పెట్టుబడులను తమ సొంత ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తారు. ప్రతి దశలోనూ భారీ లాభాలు వచ్చాయంటూ సందేశాలు పంపడంతో పాటు యాప్ల డ్యాష్ బోర్డుల్లోనూ ఆ మొత్తాన్ని చూపిస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత వాటిలోని విత్డ్రా ఆప్షన్ డిజేబుల్ చేసేసి బాధితులు తమ నగదు వెనక్కు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తారు. అప్పటికే వీరి నుంచి భారీ మొత్తం పెట్టుబడిగా తీసేసుకుని ఉంటారు. దీంతో ఈ మొత్తం అది నష్టపోతామనే ఉద్దేశంతో బాధితులు నేరగాళ్లు చెప్పినట్లు చేయడానికి సిద్ధమవుతారు. అసలు కథ మొదలెట్టి వీలైనంత... దీనిని క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు డ్యాష్బోర్డులో కనిపిస్తున్న వర్చువల్ ఖాతాల్లో నగదు డ్రా చేసుకోవాలంటే నిరీ్ణత మొత్తం పెట్టుబడి పెట్టాలని మరికొంత డిపాజిట్ చేయించుకుంటారు. చివరకు ఆదాయపు పన్ను, జీఎస్టీ తదతర చెల్లింపుల పేరుతో మిగిలిన మొత్తం కాజేసి... ఆ యాప్, గ్రూపులు పని చేయకుండా చేస్తారు. ఇలా భారీ మొత్తాలు స్వాహా చేస్తున్న ఈ యాప్స్ వెనుక చైనీయులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తరహా కేసుల్లో బాధితుల నుంచి కాజేసిన మొత్తం క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దేశం దాటిపోతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ మోసాల నేపథ్యంలో కేవలం సెబీ అనుమతి ఉన్న సంస్థలు, యాప్ల ద్వారానే ట్రేడింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. డీమ్యాట్ ఖాతాల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని, బ్రోకర్ల సహా ఎవరి వ్యక్తిగత ఖాతాల్లోని నగదు బదిలీ చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. అపరిచిత గ్రూపుల్లోని పోస్టులు నమ్మడం, లింకుల ద్వారా వచ్చే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడదని ఆయన పేర్కొన్నారు. -
వృద్ధికి కార్పొరేట్ పెట్టుబడుల దన్ను
ముంబై: కార్పొరేట్ రంగం తాజా మూలధన వ్యయాలు తదుపరి దశ వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన రూపొందించిన తాజా బులెటిన్ పేర్కొంది. స్థిరంగా, 4 శాతం వద్ద తక్కువ ద్రవ్యోల్బణం జీడీపీ పురోగమనానికి కీలక అంశంగా ఉంటుందని వివరించింది. 2024లో గ్లోబల్ ఎకానమీ ఊహించిన దానికంటే బలమైన వృద్ధిని ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొంది. సవాళ్లు ఉన్నప్పటికీ, సానుకూలతలో వాటిని సమతౌల్యం చేస్తున్నట్లు వివరించింది. భారత ఆరి్థక వ్యవస్థ 2023–24 ప్రథమార్థంలో మంచి పురోగతి సాధించిందని, ఇదే ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తోందని పేర్కొంది. మొత్తంమీద, ప్రైవేట్ కార్పొరేట్ రంగం పెట్టుబడి ధోరణులు ఈ సంవత్సరం ఇప్పటివరకు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. 2023 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ప్రధాన బ్యాంకులు, ఆరి్థక సంస్థలు (ఎఫ్ఐ) రుణాలు మంజూరు చేసిన ప్రాజెక్ట్ల మొత్తం వ్యయం రూ. 2.4 లక్షల కోట్లని పేర్కొంటూ, ఇది వార్షికంగా 23 శాతంకంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో మూలదన పెట్టుబడులు, పబ్లిక్ ఆఫర్లు, వాణిజ్య రుణ సేకరణలు.. ఎకానమీ సానుకూలతలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటును 4.5 శాతంగా పేర్కొంది. బులెటిన్ కథనంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు సంబంధిత రచయితలవితప్ప భారతీయ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా భావించరాదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్ను రూపొందించింది. భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై ఐఎంఎఫ్ వాదనలు సరికాదు... ఇదిలావుండగా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన మరో ఆరి్టకల్ భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయాలను త్రోసిపుచి్చంది. రుణ–జీడీపీ నిష్పత్తి అంచనా వేసిన దానికంటే గణనీయంగా తక్కువగా ఉండవచ్చని ఉద్ఘాటించింది. ‘‘ఈ సందర్భంలో తీవ్ర పరిస్థితులు ఏదైనా సంభవిస్తే... భారతదేశ సాధారణ ప్రభుత్వ రుణం జీడీపీలో మధ్య కాలికంగా 100 శాతం మించిపోతుందన్న ఐఎంఎఫ్ వాదనను మేము తిరస్కరిస్తున్నాము’’ అని ఆర్టికర్ పేర్కొంది. 2030–31 నాటికి ప్రభుత్వ సాధారణ రుణ–జీడీపీ నిష్పత్తి 78.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనావేయగా, ఐదు శాతం తక్కువగా 73.4 శాతానికి పరిమితం అవుతుందని ఆర్టికల్ పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ పటిష్ట రీతిలో కట్టడి చేయగలుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2024–25లో వృద్ధి 7 శాతం: ఆరి్థకశాఖ కాగా, భారత ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్ ప్రకాశవంతంగా’ కనిపిస్తుందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆరి్థక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఆరి్థకశాఖ నెలవారీ ఆరి్థక సమీక్షా నివేదిక పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు– అంతర్జాతీయ ఆరి్థక మార్కెట్లలో అస్థిరత నుండి ప్రతికూలతలపై దేశం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నివేదిక ఉద్ఘాటించింది. గృహ వినియోగం మెరుగుపడుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రైవేటు రంగంలో తిరిగి పెరుగుతున్న పెట్టుబడులు, మెరుగైన వ్యాపార సెంటిమెంట్లు, బ్యాంకులు– కార్పొరేట్ల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లు, మూలధన వ్యయం పెంపునకు ప్రభుత్వ నిరంతర ప్రయత్నం ఎకానమీని సుస్థిరంగా నడుపుతోందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం మెరుగుపడ్డం, సరఫరాల చైన్ స్థిరీకరణ అంతర్జాతీయ డిమాండ్ పురోగమనానికి దారితీసే అంశాలని వివరించింది. -
రెన్యూ సిస్ పెట్టుబడులు రూ. 6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్/మహేశ్వరం: సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్, ఫొటో వోల్టాయిక్ సెల్స్ తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థ ‘రెన్యూసిస్’తెలంగాణలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో రెన్యూసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో రెన్యూసిస్తో జరిగిన ఒప్పందంపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో తయారీ యూనిట్లు కలిగిన రెన్యూసిస్ తమ అతిపెద్ద తయారీ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పేందుకు ముందుకు రావడంపై మంత్రి శ్రీధర్బాబు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందజేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్గా మారుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ పరికరాల ఉత్పత్తి రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని, అందుకు అనువుగా ఉండే సమగ్ర ఇంధన విధానాన్ని రూపొందిస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహం : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని హార్డ్వేర్ పార్కు–2లో అపోలో మైక్రో సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ ఎల్రక్టానిక్ పరికరాల కంపెనీ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణకు అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్షరింగ్ హబ్గా మారిందన్నారు. ఏరోస్పేస్ పరికరాల తయారీలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ ఎండీ బద్దం కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్టార్టప్ల్లో రూ. 200 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ (ఐపీవీ) అంకుర సంస్థల్లో ఈ ఏడాది సుమారు రూ. 150–200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో వినయ్ బన్సల్ తెలిపారు. డ్రోన్, స్పోర్ట్స్, హెల్త్, ఫిన్టెక్ సంస్థల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. తమ దగ్గర రూ. 1,200 కోట్ల నిధులు ఉండగా ఇప్పటివరకు రూ. 750 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. 2023లో 56 పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. వీటిల్లో 46 కొత్తగా ఇన్వెస్ట్ చేసినవి కాగా మిగతావి ఫాలో–ఆన్ పెట్టుబడులని బన్సల్ పేర్కొన్నారు. గతేడాది సగటున 61 శాతం మేర రాబడులతో 14 సంస్థల నుంచి వైదొలిగినట్లు చెప్పారు. 2023లో ఒక మీడియా స్టార్టప్, కూవర్స్, స్పోర్టిడో మొదలైన వాటి నుంచి ఐపీవీ పూర్తిగా నిష్క్రమించింది. మీడియా వెంచర్లో పెట్టుబడులపై దాదాపు 200 శాతం రాబడి అందుకున్నట్లు బన్సల్ వివరించారు. -
ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం..!
-
బంగారం ఇలా కొంటే రూ.16 వేలు ఆదా..!
-
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న ఆసియా మార్కెట్లు
-
తాడేపల్లి: సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం
-
సీఎం జగన్ ఎస్ఐపీబీ మీటింగ్ విజువల్స్