-
లాక్డౌన్ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది
కరోనా కారణంగా దాదాపు ఇళ్లకే పరిమితమైన ప్రజలు బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. వీరిలో ముఖ్యంగా సెలబ్రిటీలు రెండు నెలలుగా ఇంటి నుంచి అడుగు బయట పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ ముగిసిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ ముగిసిందన్న విషయం తెలిసినప్పుడు తన ఆనందం ఎలా ఉంటుందో చెప్పేందుకు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. గతంలో డ్యాన్స్ చేస్తూ దిగిన వీడియోను తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.‘ లాక్డౌన్ ఎత్తివేత’ వార్త విన్నప్పుడు తన ఆనందం ఇలాగే ఉంటుంది. ఇలా డ్యాన్స్ చేస్తా. ఆ వార్త ఎప్పుడు వింటానో.’ అంటూ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. (ఈ రోజే రానా-మిహీక నిశ్చితార్థం) ఖురేషీ పోస్టుపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. అనేక మంది స్మైలీ ఎమోజీలను జతచేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమకు చెందిన హ్యుమా స్నేహితులు చాలా మంది ఆమె పోస్టుపై సరాదాగా కామెంట్ చేస్తున్నారు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ దొరికినప్పుడు ఇలాగే డ్యాన్స్ చేయాలని కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కామెంట్ చేశారు. కాగా ఇంతకముందు పోస్టులో హ్యూమా కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ, తాను ఉదయం నుంచి రాత్రి వరకు పాటించే దినచర్యను షేర్ చేశారు. (హ్యాపీ బర్త్డే జూ. ఎన్టీఆర్: వార్నర్) -
హ్యూమాకి భయమా?
ముంబై వీధుల్లో బైక్పై షికారు చేస్తున్నారు హ్యూమా ఖురేషీ. కానీ ఇది సరదా కోసం చేస్తున్న షికారు కాదు. తన కొత్త సినిమా కోసం హ్యూమా నేర్చుకుంటున్న బైక్ పాఠాలు. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాతగా తమిళంలో ‘వలిమై’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటిస్తున్నారు హ్యూమా ఖురేషీ. రేసింగ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలోని తన క్యారెక్టర్ కోసం హ్యూమా ఖురేషీ బైక్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇందులో హ్యూమా అదిరిపోయే బైక్ స్టంట్స్ కూడా చేస్తారట. బైక్ స్టంట్స్ అంటే చిన్న విషయం కాదు. చాలా ధైర్యం ఉండాలి. ‘హ్యూమాకి భమయా’ అంటూ సరదాగా నవ్వుతూ హ్యూమా బైక్ స్టంట్స్ నేర్చుకుంటున్నారు. ఇందులో అజిత్ పోలీసాఫీసర్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరగాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. -
అజిత్కు జంటగా తలైవా ప్రేయసి
సినిమా: తలైవా ప్రేయసితో ‘తల’కు జత కుదిరింది. తల అజిత్ వరుస విజయాలతో జోరు మీదున్న విషయం తెలిసిందే. విశ్వాసం, నేర్కొండ పార్వై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తరువాత అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం వలిమై. నేర్కొండ పార్వై చిత్ర దర్శకుడు హెచ్.వినోద్నే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఆ చిత్ర దర్శకుడు బోనీకపూర్నే ఈ వలిమై చిత్రాన్ని జీ.స్టూడియోస్తో కలసి నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు ఇప్పుటికే తెలిపారు. కాగా చిత్రం ప్రారంభమై చాలా రోజులే అయ్యింది. హైదరాబాద్లో తొలి షెడ్యూల్ షూటింగ్ను పూర్తి చేసుకున్న వలిమై చిత్రం ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఇప్పటి వరకూ ఇందులో అజిత్కు జంటగా నటించే నాయకి ఎవరన్నది చిత్ర వర్గాలు వెల్లడించలేదు. అయితే ఆ మధ్య న్యూయార్క్లో నటి నయనతారను బోనీకపూర్ కలవడంతో వలిమైలో ఆమె నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే అది వదంతి అని తెలిసింది. ఆ తరువాత బాలీవుడ్ బ్యూటీ యామిని గౌతమ్ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో నటి పేరు వినిపిస్తోంది. ఆమెనే నటి హ్యూమా ఖురోషి. ఈ అమ్మడు తమిళంలో రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో ఆయనకు మాజీ ప్రేయసిగా నటించిందన్నది గమనార్హం. ఆ తరువాత కొలీవుడ్లో కనిపించిన హూమా ఖురోషి పేరు ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. వలిమై చిత్రంలో అజిత్కు జంటగా నటించనుందనేది తాజా ప్రచారం. అయితే ఆమె వలిమై చిత్రంలో నటించడం ఖాయం అయ్యిందని, అంతే కాదు ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొంటోందని తెలిసింది. ఇక్కడ ఈ అమ్మడి సెకెండ్ చిత్రం వలిమై అవుతుంది. కాగా నటుడు రజనీకాంత్ బాణీలోనే అజిత్ కూడా యువ హీరోయిన్లతో జత కట్టడానికి ఇష్టపడడం లేదు. అంతే కాదు తన చిత్రాల్లో కథా పాత్రలను తన వయసుకు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కాగా వలిమై చిత్రంలో నటి హూమా ఖురేషి పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతాన్ని యువన్ శంకర్రాజా, ఛాయాగ్రహణం నీరవ్షాఅందిస్తున్నారు. వలిమై చిత్రాన్ని దీపావళి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
చలో లాస్ ఏంజిల్స్
పాస్పోర్ట్, నిత్యం అవసరమయే వస్తువులను జాగ్రత్తగా సూట్కేస్లో ప్యాక్ చేసుకుంటున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషి. త్వరలో ఆమె లాస్ ఏంజిల్స్కు పయనం కానున్నారు. దాదాపు రెండు నెలలు అక్కడే ఉంటారట.. ‘డ్వాన్ ఆఫ్ ది డెడ్, 300, జస్టిస్ లీగ్’ వంటి ఇంగ్లీష్ చిత్రాలను తెరకెక్కించిన జాక్ స్నైడర్ దర్శకత్వంలో ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ అనే హాలీవుడ్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డావే బౌటిస్టా, థియో రోసి, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు చేయనున్నారు. కిరాయి సైనికుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో లాస్ ఏంజిల్స్ను ప్రారంభం కానుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లనున్నారు హ్యూమా. -
రావమ్మా హ్యూమా
బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీకి ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయి. ‘హ్యూమా.. రామ్మా’ అంటూ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఆమెను ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల క్రితం ‘వైస్రాయ్ హౌస్’ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటించిన హ్యూమా తాజాగా ‘ఆర్మీ ఆఫ్ డెడ్’ అనే మరో ఇంగ్లీష్ ప్రాజెక్ట్లో ముఖ్య తారగా చేసే చాన్స్ కొట్టేశారు. డ్వాన్ ఆఫ్ ద డెడ్ (2004), 300 (2006), 300: రైజ్ ఆన్ఎంపైర్ (2014) వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జాక్ స్నైడర్ ఈ చిత్రానికి దర్శకుడు. 2007లో తెరకెక్కించిన ‘జస్టిస్ లీగ్’ తర్వాత జాక్ మళ్లీ మెగాఫోన్ పట్టడం ఇదే. ఇంగ్లీష్ నటులు ఎలా పర్నెల్, అనా దే లా రెగెరా, థియో రోసి ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ‘‘దర్శకుడు జాక్గారికి నేను పెద్ద అభిమానిని. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా? అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు హ్యూమా ఖురేషి. ఇక డిజిటల్ ఫ్లాట్ఫామ్లో హ్యూమా నటించిన ‘లీలా’ అనే వెబ్సీరిస్ ఈ నెలలో విడుదల కానుంది. -
3ఎస్
హుమా ఖురేషీ అంటే? మూడు ముక్కల్లో చెప్పాలంటే... స్పాంటేనిటీ, స్టైల్, స్టేట్మెంట్స్. గుంపులో ఒకరిగా కాకుండా తనదైన ప్రత్యేకతను బాలీవుడ్లో నిలుపుకుంటూ వస్తున్న ఖురేషీ ‘కాలా’ సినిమాతో ‘జరీనా’గా దక్షిణాది సినిమాకు పరిచయమైంది. ‘ఉన్నదున్నట్లే మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో కష్టం’ అంటూనే నిర్మొహమాటంగా మాట్లాడే హుమా ఖురేషీ అంతరంగ తరంగాలు... అభిమానం వరకే... చిన్నప్పుడు సినిమాలు తెగ చూసేదాన్ని. అద్దం ముందు నిల్చొని డ్యాన్స్లు చేయడం, డైలాగులు చెప్పడం సరేసరి. మధుబాల, మాధురి దీక్షిత్, శ్రీదేవి...నా అభిమాన తారలు. అంతమాత్రాన...నేను ఎప్పుడూ వారిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. నాదైన ముద్ర కోసం ప్రయత్నం చేశాను. నా అదృష్టం! సవాలు విసరని ఇండస్ట్రీ అంటూ ఏదీ ఉండదు. కాబట్టి సవాళ్లను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉంటాను. ఇండస్ట్రీలో నేను ప్రముఖుడి కూతురు, బంధువై ఉంటే ‘ఎక్స్పెక్టేషన్స్’ ఎక్కడో ఉండేవి. అవేమీ లేకపోవడం, ఇతరులతో పోలిక తేకపోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. శిక్షణ మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండాలంటే థియేటర్ ట్రైనింగ్ తప్పనిసరి. ఇది సినిమాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మలయాళ సినిమా ‘వైట్’ కోసం డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను థియేటర్లో నేర్చుకున్న ‘జిబ్బరీష్ టెక్నిక్’ను వాడుకున్నాను. ఒక్కటైనా చాలు... సంవత్సరానికి పది సినిమాలు చేయాలనే ఆరాటం నాలో లేదు.నంబర్లతో నటనను అంచనా వేయలేం. సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా ఫరవాలేదుగానీ... నలుగురు మెచ్చే పాత్ర చేయాలనేది నా కోరిక.‘బాగా డబ్బులు సంపాదించాలి’ అనే కోరిక మనల్ని ఎప్పుడూ సృజనాత్మకత అనే గమ్యానికి చేర్చదు. అలాగే ‘భారీ తారగణం’ ‘భారీ బడ్జెట్’....ఈ రెండు ‘భారీ’లు మాత్రమే ఒక సినిమాను విజయవంతం చేయలేవు. అద్భుతం! ఒకప్పుడు మన సినిమాలు అంటే ఇతర దేశాల్లో ‘సింగింగ్ అండ్ డ్యాన్సింగ్’ సినిమా అనే పేరు ఉండేది. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. మన సినిమాలపై ఆసక్తి పెరిగిపోయింది. మన దగ్గర అద్భుతమైన దర్శకులు, రచయితలు ఉన్నారు. అందరూ కలిసి నిర్మాణాత్మకంగా కృషి చేస్తే మరిన్ని సృజనాత్మక అద్భుతాలు సృష్టించడం కష్టమేమీ కాదు. -
అమ్మ ఆశీర్వాదం
రజనీకాంత్ ‘కాలా’ సినిమాలో జరీనా పాత్రలో కనిపించారు హ్యూమా ఖురేషీ. ఈ సినిమాలో హ్యూమాని రజనీకాంత్ చిట్టెమ్మా అని పిలిచిన సీన్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడీ చిట్టెమ్మ లీలాగా మారారు. కానీ సినిమా కోసం కాదు. ఓ వెబ్ సిరీస్ కోసం. దీపా మెహ్తా దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫస్ట్ వెబ్ సిరీస్ ‘లీలా’లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను ఈ సెట్కి స్వయంగా మా అమ్మ (అమీనా ఖురేషీ) డ్రాప్ చేశారు. ఈ సిరీస్ సక్సెస్ కావాలని ప్రార్థనలు చేసి, నన్ను ఆశీర్వదించారు’’ అని పేర్కొన్నారు హ్యూమా ఖురేషి. ఈ సిరీస్ కోసం శంకర్ రామన్, పవన్ కుమార్లు కూడా వర్క్ చేస్తారని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ సిరీస్లో నటుడు సిద్ధార్థ్ ఓ లీడ్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. వెబ్ సిరీస్లతో పాటు వెండితెరపై రాణించేందుకు కూడా కథలు వింటున్నారట హ్యూమా ఖురేషి. -
‘వెంకీమామ’పై పుకార్లకు ఫుల్స్టాప్!
వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీమామ’ అనే టైటిల్ను అనుకుంటున్నారు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లదనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ‘‘వెంకీమామ’ చిత్రం సెట్స్పైకి వెళ్లదనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా ప్రమోషన్స్, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే వెంకటేశ్ ‘ఎఫ్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ‘వెంకీమామ’ సినిమా చిత్రీకరణ వచ్చే నెల సెకండ్ వీక్లో స్టార్ట్ కానుందట. ‘‘ఈ సినిమా పనులతో బాబీ బిజీగా ఉన్నాడు. వచ్చే నెల షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వచ్చే ఏడాది ఓ మంచి ఎంటర్టైనర్ని ఇవ్వబోతున్నామనే నమ్మకంతో అందరం పని చేస్తున్నాం’’ అన్నారు కోన వెంకట్. -
వెబ్సిరీస్ కోసం..
బాలీవుడ్ బ్యూటీ హ్యూమాఖురేషీ, సిద్ధార్థ్ (బొమ్మరిల్లు ఫేమ్)లకు జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’ సినిమాతో హ్యూమా తెలుగువారికీ సుపరిచితమే. ఈ ఢిల్లీ భామ తాజాగా సిద్ధార్థ్తో నటించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. అయితే.. ఇది సినిమా కాదు. ఓ వెబ్ సిరీస్. బాలీవుడ్ దర్శకురాలు దీపా మెహతా హిందీలో రూపొందిస్తున్న ఈ సిరీస్లో వీరు నటించనున్నారని టాక్. దీపా మెహతా దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ అనే చిత్రంలో సిద్ధార్థ్ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తెరకెక్కించనున్న వెబ్ సిరీస్లో నటించేందుకు ఇటు సిద్ధార్థ్, అటు హ్యూమా పచ్చజెండా ఊపారట. సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని తమిళ సినిమాలకూ కమిట్ అయ్యారాయన. హ్యూమా కూడా కథలు వింటున్నారట. -
సిద్ధార్థ్కు జతగా హ్యూమా ఖురేషి
సినిమా: రజనీకాంత్ హీరోయిన్ ఇప్పుడు సిద్ధార్థ్తో జత కట్టడానికి సిద్ధం అవుతోంది. రజనీకాంత్కు జంటగా కాలా చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అయిన బాలీవుడ్ నటి హ్యూమాఖురేషీ. ఆ చిత్రంతో కోలీవుడ్లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించిన ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. కాలా చిత్రం తరువాత తమిళంలో హ్యూమా ఖురేషీని పట్టించుకున్నవారే లేరు. ఇక ఆ మధ్య విజయాల పరంగా కాస్త వెనుక పడ్డ నటుడు సిద్ధార్థ్ అవళ్ చిత్రంతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. ప్రస్తుతం మలయాళంలో కమ్మర శపథం చిత్రంలో నటిస్తున్న ఈయన తమిళంలో కార్తీక్ జీ.క్రిస్ దర్శకత్వంలో సైతాన్ కే బచ్చా చిత్రంతో పాటు సాయిశేఖర్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దర్శకుడు శశి నూతన చిత్రంలో కూడా సిద్ధార్థ్ హీరోగా నటించడానికి కమిట్ అయ్యారు. మొత్తం మీద తమిళం, మలయాళం భాషా చిత్రాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్ తాజాగా బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది సినిమా కాదు. ఒక వెబ్ సీరియల్. బాలీవుడ్ దర్శకుడు దీపా మెహతా హిందీలో రూపొందిస్తున్న ఇందులో సిద్ధార్థ్, హ్యూమాఖరేషీ జంటగా నటించనున్నారని సమాచారం. సిద్ధార్థ్ ఇంతకు ముందే దీపా మెహతా దర్శకత్వంలో మిడ్నైట్స్ సిల్రన్ అనే హిందీ చిత్రంలో నటించారన్నది గమనార్హం. దీంతో సిద్ధార్థ్, హ్యూమాఖురేషీలతో తెరకెక్కించనున్న వెబ్ సీరియల్పై అంచనాలు పెరుగుతున్నాయట. -
వెంకీ మామా ఎప్పుడొస్తావ్?
మామా అల్లుళ్లు కలిస్తే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోతుంది. అలా నవ్వులు పూయించడానికి అక్టోబర్ నుంచి అల్లుడు నాగచైతన్యతో కలిసి రెడీ అవనున్నారు మామ వెంకటేశ్. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ను అనుకుంటున్నారు. సినిమాలోనూ మామా అల్లుడిగా కనిపిస్తారు వెంకీ, చైతన్య. ఈ సినిమాలో వెంకటేశ్కి జోడీగా హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్ప్రీత్సింగ్ నటించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్కి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. -
మామా అల్లుళ్ల అల్లరి
అల్లుడుకి తోడుగా మామ ఎంట్రీ కూడా ఉంటుందా? లేక మామ, అల్లుడు వేరు వేరుగా ఎంట్రీ ఇస్తారా? అసలు సెట్స్లోకి ముందు ఎవరు కాలుపెడతారు? ఈ డౌట్ ఆగస్టు సెకండ్ వీక్లో క్లియర్ అవుతుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన కార్పొరేషన్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. రియల్ లైఫ్ మాదిరిగానే రీల్ లైఫ్లోనూ వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 8న మొదలవుతుందని సమాచారం. మామా అల్లుళ్లు కలిసి వెండితెరపై చేయబోయే అల్లరి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా రకుల్ప్రీత్ సింగ్ నటిస్తారు. ఇక వెంకీ సరసన కథానాయికలుగా హ్యూమా ఖురేషీ, శ్రియ పేర్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం అందించేందుకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను సంప్రదిస్తున్నారట. -
మామా మేనల్లుడి కథ
వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో ఒక కథానాయికగా రకుల్ ప్రీత్సింగ్ నటిస్తున్నారు. మరొక కథానాయికగా హ్యూమా ఖురేషీ పేరును పరిశీలిస్తున్నారు. ‘‘నేను దర్శకత్వం వహించనున్న నెక్ట్స్ చిత్రంలో వెంకటేశ్గారు, నాగచైతన్య నటిస్తున్నారు. అవును.. మామా, మేనల్లుడి బ్యాక్డ్రాప్లోనే ఈ సినిమా కథ సాగుతుంది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని పేర్కొన్నారు బాబీ. ‘‘మా బ్యానర్లో నెక్ట్స్ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ మొదలైందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది’’ అని సురేశ్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా జర్నీలో భాగమైనందుకు హ్యాపీ’’ అని రకుల్ పేర్కొన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఈ కార్యక్రమంలో నటుడు రానా, నిర్మాతలు డి. సురేశ్బాబు, కోన వెంకట్, టీజీ. విశ్వప్రసాద్, కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ల తదితరులు పాల్గొన్నారు. -
కాలా నష్టం కాలా!
‘కాలా’ సినిమా కలెక్షన్స్కి సంబంధించిన పుకార్లకు చిత్రబృందం ఫుల్స్టాప్ పెట్టింది. ‘కాలా’ చిత్రం వల్ల తమకు నష్టాలు రాలేదని సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. ఈశ్వరీ రావు, హ్యూమా ఖురేషి కథానాయికలుగా నటించారు. వండర్బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు, దర్శక–నిర్మాత, నటుడు ధనుష్ నిర్మించిన ఈ సినిమా జూన్ 7న తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవ్వడంవల్ల నిర్మాణ సంస్థకు ఆశించిన ఫలితాలు రాలేదని తమిళ మీడియాలో ఆర్టికల్స్ వచ్చాయట. ఈ విషయంపై యూనిట్ స్పందించింది. ‘‘కాలా’ సినిమాకు సరైన కలెక్షన్స్ రాలేదని మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు అవాస్తవం. మాకు ‘కాలా’ సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. మా బ్యానర్లో సినిమా చేసిన సూపర్స్టార్ రజనీకాంత్కు, అలాగే సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అని వండర్బార్ ఫిల్మ్స్ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. -
ఆన్ ట్రాక్
జస్ట్ మూడు రోజులు.. అంతే. మామా అల్లుళ్లు రంగంలోకి దిగుతారు. ఎందుకు అంటే? సినిమా కోసం. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11న జరుగుతుందని సమాచారం. అంటే ఆ రోజు నుంచీ మామా అల్లుళ్లు ఆన్ ట్రాక్ అన్నమాట. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘వెంకీ మామా’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని టాక్. రియల్ లైఫ్ మాదిరిగానే ఈ సినిమాలో మామా అల్లుళ్ల పాత్రల్లో నటించనున్నారట వెంకీ అండ్ చైతూ. ఆల్రెడీ నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు. మామా అల్లుళ్లు సినిమాలో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్ప్రీత్ సింగ్ నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
స్లో అండ్ స్టడీ
ఉదయాన్నే ఖాళీ ప్లేస్లో రౌండ్స్ కొడుతున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషీ. రన్నింగ్ రౌండ్సా? డ్రైవింగ్ రౌండ్సా? అంటే.. రెండూ కాదు.. గుర్రంపై రౌండ్స్ వేస్తున్నారు. తాజాగా ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ‘‘ఉదయాన్నే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. స్లో అండ్ స్టడీగా నేర్చుకుని ఆ నెక్ట్స్ స్పీడ్ పెంచుతా’’ అని పేర్కొన్నారు హ్యూమా. సడన్గా ఆమె గుర్రపు స్వారీ ఎందుకు నేర్చుకుంటున్నారు? అంటే ‘సైరా’ చిత్రం కోసమనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మిస్తోన్న సినిమా ‘సైరా’. నయనతార కథానాయిక. అమితాబ్, తమన్నా, విజయ్సేతుపతి, సుదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హ్యూమాను సంప్రదించారట. అందుకే క్యారెక్టర్ కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారని టాక్. -
‘సైరా’లో ‘కాలా’ గర్ల్ఫ్రెండ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి.ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దక్షిణాది నటులతో పాటు ఉత్తరాది స్టార్లు కూడా కనిపించనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్కు సంబంధించిన సీన్స్ను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్స్లో యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తారల జాబితాలో మరో బాలీవుడ్ నటి వచ్చి చేరారు. ఇటీవల కాలా సినిమాతో సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బ్యూటీ హుమా ఖురేషీ. ఈ సినిమాలో రజనీ ప్రియురాలిగా నటించిన హుమా, సైరాలో నటించేందుకు అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ ధృవీకరించాల్సి ఉంది. చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. -
అందుకే మీటు సక్సెస్ కాదు
‘మీటు’ ఉద్యమం వెలుగులోకొచ్చాక ఇండస్ట్రీలో చాలా మంది తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడి, ఈ సంస్కృతిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్లో మొదలైన ఈ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీ వరకూ విస్తరించింది. కానీ మీటు ఉద్యమం బాలీవుడ్లో అంతగా విజయవంతం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ భామ ‘హ్యూమా ఖురేషి’. ఈ విషయం గురించి హ్యూమా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్లో ఈ ఉద్యమం అంత గొప్పగా విజయవంతం కావడానికి కారణం ఈ వేధింపుల మీద మాట్లాడిన హీరోయిన్లంతా సీనియర్లు, చాలా రెస్పెక్ట్ ఉన్నవారు. బాలీవుడ్లో కూడా ఇలా టాప్ హీరోయిన్స్ మాట్లాడగలిగినప్పుడే ఈ ఉద్యమం ఇంకా సక్సెస్ అవుతుంది. ఇలాంటి ఉద్యమాలకు పెద్ద గొంతులే కీలకం. చిన్న చిన్నవాళ్లు నోరు విప్పితే దాని ప్రభావం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే మీటు అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే జరగాలని కాదు. ప్రతి వర్కింగ్ ప్లేస్లో ఇది జరగాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారామె. -
స్త్రీలోక సంచారం
::: అక్రమ చొరబాటుదారులను నిరోధించడం కోసం ‘జీరో టాలరెన్స్’ (ఏమాత్రం సహించేది లేదు) వలస విధానాన్ని అమలు చేస్తున్న అమెరికా, సరిహద్దుల్లోని మెక్సికన్ వలస తల్లిదండ్రుల నుంచి వారి పిల్లల్ని వేరు చేసి వేర్వేరు వసతికేంద్రాల్లో ఉంచడాన్ని అమెరికా దేశపు ప్రస్తుత, పూర్వ ప్రథమ మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వైఖరిని తాను ద్వేషిస్తున్నానని డొనాన్డ్ ట్రంప్ భార్య మెలనియా ప్రకటించగా, ఇంత అమానుషమైన చర్యల్ని ప్రపంచయుద్ధకాలంలో కూడా మనం చూడలేదని లారా బుష్ వ్యాఖ్యానించారు ::: బ్రిటన్ రాణివంశపు కొత్త పెళ్లికూతురు మేఘన్ మార్కల్ తండ్రి థామస్ మార్కల్.. ‘ట్రంప్కి ఒక అవకాశం ఇవ్వండి’ అని తన అల్లుడు ప్రిన్స్హారీతో చెబుతూ, యు.ఎస్. అధ్యక్షుడి విషయంలో విశాల హృదయంతో ఆలోచించాలని సూచించడం మేఘన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చుట్టరికాలతో చొరవ చూపి పాలనా వ్యవహారాలపై సలహాలను ఇవ్వడాన్ని బ్రిటన్ రాజప్రాసాదం ఒక చికాకు వ్యవహారంగా పరిగణిస్తున్నట్లు బ్రిటన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ::: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో సోమవారం మధ్యాహ్నం.. రైల్లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణికి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో రైల్వే అధికారులు 45 నిమిషాల పాటు రైలును ఆపి, రైల్వే వైద్య సిబ్బంది చేత సురక్షితంగా కాన్పు జరిపించారు. రైల్లో జన్మించిన ఆ శిశువుకు 25 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించిన పారిస్ రైల్వేశాఖ.. ఆ తల్లికి శుభాభినందనలు కూడా పంపింది ::: కస్టమర్ కోరికపై ఎయిర్టెల్ డిష్టీవీ నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చేందుకు షోయబ్ అనే ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ను ఇంటికి పంపిస్తున్నట్లు సమాచారం అందుకున్న లక్నో మహిళ పూజాసింగ్.. ట్విట్టర్లో ‘డియర్ షోయబ్, నువ్వు ముస్లిం మతస్తుడివి. నీ పని తీరుపై నాకు నమ్మకం ఉండదు కనుక, వేరెవరైనా హిందూ మతస్తుడిని నీ బదులుకు మా ఇంటికి పంపించే ఏర్పాటు చేయగలవు’ అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై ఎయిర్టెల్ ఆమె కోరిన విధంగానే హిందూ మతస్తుడైన ఆపరేటర్ను పంపుతూ, ‘ఎయిర్టెల్ మత విశ్వాసాలకు అతీతమైన సంస్థ. మీరు కూడా మాలాగే ఉండాలని ఆశిస్తున్నాం’ అని ప్రతిస్పందించింది ::: వరల్డ్ నెంబర్12 చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికకు బిజినెస్మేన్ కార్తీక్ చంద్రతో సోమవారం హైదరాబాద్లో నిశ్చితార్థం అయింది. గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించి, 2011లో గ్రాండ్మాస్టర్ టైటిల్ గెలుపొంది, 2012, 2015, 2017 ‘ఉమెన్స్ వరల్డ్ చెస్ చాంపియన్’లలో కాంస్య పతకాలు పొంది, 2007లో అర్జున అవార్డు సాధించిన 27 ఏళ్ల హారికకు చెస్లో వ్లాదిమర్ క్రామ్నిక్, జూడిత్ పోల్గార్, విశ్వనాథన్ ఆనంద్.. అభిమాన చెస్ ప్లేయర్లు ::: హాలీవుడ్లో సీనియర్ నటీమణులు బయటికి వచ్చి తమపై జరిగిన లైంగిక వేధింపులను, లైంగిక దాడులను, లైంగిక అకృత్యాలను బయటì పెట్టిన విధంగానే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కూడా ధైర్యంగా బయటికొచ్చి, ‘క్యాస్టింగ్ కౌచ్’కు తాము ఏ విధంగా బలయిందీ చెబితే తప్ప మన దగ్గర ఏనాటికీ ‘మీటూ’ ఉద్యమం మొదలు కాదని బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశారు. ఇలాంటి విషయాలలో ఒక మహిళ చేసిన ధైర్యం ఎందరో మహిళలను ముందుకు నడిపిస్తుందని ఆమె అన్నారు ::: తెలంగాణలోని మొత్తం 21 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లను (డి.సి.పి.యు) నెలకొల్పేందుకు రాష్ట్ర స్త్రీ,శిశు అభివృద్ధి శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు, బాలలపై హింసను నిరోధించడానికి ఈ యూనిట్లు పనిచేస్తాయి ::: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ‘శారదా’ చిట్ఫండ్ కుంభకోణంలో కీలక నిందితుని తరఫున వాదిస్తున్న నళినీ చిదంబరం ఈ నెల 20న (నేడు) కోల్కతాలోని ప్రత్యేక విచారణ కార్యాలయానికి హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. నళిని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం సతీమణి ::: -
కాలాకు ముందే టచ్లో ఉన్నాం
తమిళసినిమా: కాలా చిత్ర ప్రారంభానికి ముందే తామిద్దరం టచ్లో ఉన్నాం అని చెప్పింది నటి హ్యూమఖురేషీ. ఈ సుందరి కోలీవుడ్ ఎంట్రీనే సంచలన చిత్రంతో కావడం అదృష్టమే. రజనీకాంత్తో ఒక్క సన్నివేశంలో నటించినా చాలని ఎందరో కోలీవుడ్ ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటే అలాంటి అవకాశాన్ని హ్యూమఖురేషీని చాలా సులభంగా వరించిందనే చెప్పాలి. కాలా చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్కు ప్రేయసిగా నటించే లక్కీచాన్స్ను దక్కించుకుని ఆ పాత్రతో మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్ బ్యూటీ హ్యూమఖురేషీ. ఇంతకీ కాలా చిత్రానికి ముందు మేము టచ్లో ఉన్నాం అని ఈ అమ్మడు ఎవరి గురించి అంటుందనేగా మీ ఉత్సుకత. ఆ కథేంటో ఈ జాణ మాటల్లోనే చూద్దాం. నేను నటించిన హిందీ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ చూశారట. అందులో నా నటన ఆయనకు బాగా నచ్చేసింది. ఆయన నా గురించి చాలా మందికి చెప్పారట. అయితే నాకు నటుడు ధనుష్ నుంచే ఫోన్కాల్ వచ్చింది. నేను ధనుష్ చాలా కాలంగానే టచ్లో ఉన్నాం. ఆయన ప్రతిభావంతుడైన నటుడు. ఇద్దరం కలిసి చిత్రం చేయాలనుకున్నాం. ఒక చిత్రంలో నటించాలనుకున్నా, పలు కారణాల వల్ల అది జరగలేదు. అలాంటిది ఒక సారి ధనుష్ నుంచి ఫోన్ వచ్చింది. అది చిత్రం గురించి మాట్లాడడానికేనని భావించాను. అయితే నేను నిర్మించనున్న చిత్రంలో నటించాలి. హీరో రజనీకాంత్ అని ఆయన చెప్పగానే నేను వింటోంది నిజమేనా అన్న సందేహం కూడా కలిగింది. ధనుష్ నిజమేనని నిర్ధారణ చేయడంతో ఆనందంతో ఎగిరి గంతేశాను. ఆ తరువాత దర్శకుడు పా.రంజిత్ను కలిశాను. ఆయన చెప్పిన కథ బాగా నచ్చేసింది. కాలా చిత్రంలో నటించాలని వెంటనే నిర్ణయించుకున్నాను. ఈ చిత్రంలో కష్టమైన విషయం ఏమిటంటే నేను రజనీకాంత్ను తిట్టడమే. ఆ సన్నివేశంలో నటించడానికి చాలా కష్టపడ్డాను. అయితే ఆ సన్నివేశానికి మంచి పేరు వచ్చింది. రజనీకాంత్తో నటించడం మధురమైన అనుభవం. -
ఇంట్రెస్టింగ్ టైటిల్తో వెంకీ-చైతూ
వరుసగా రెండు మల్టీస్టారర్ చిత్రాలకు సిద్ధమై టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు అగ్ర హీరో వెంకటేశ్ దగ్గుబాటి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 2 చిత్రంలో వరుణ్తేజ్తో, మరోవైపు పవర్ ఫేమ్ బాబీ(కె.యస్. రవీంద్ర) డైరెక్షన్లో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో ప్రాజెక్టులో నటించబోతున్నాడు. చైతూ చేయబోతున్న చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ను మేకర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగా నటిస్తుండటంతో ‘వెంకీ మామ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారంట. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం ఉండబోతుందని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బాబీ రూపొందించబోతున్నాడంట. అందుకే టైటిల్ అదే అయితే బాగుంటుందన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్బ్యూటీ హుమా ఖురేషీ, చైతూకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు వెంకీ-వరుణ్ తేజ్ల ఎఫ్ 2 ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. -
రామ్మా.. హ్యూమా
‘కాలా’ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఒప్పుకున్నారో కానీ తమిళంలో కాలు పెట్టాక తెలుగులో కాలు పెట్టే అవకాశం వచ్చింది హ్యూమా ఖురేషీకి. మరి... రజనీకాంత్ ‘కాలా’ విడుదలయ్యాక ఈ బ్యూటీ సౌత్లో ఫుల్ బిజీ అవుతారేమో కాలమే చెప్పాలి. ఈ 7న విడుదల కానున్న ‘కాలా’ కోసం హ్యూమా వెయిటింగ్ అట. ప్రస్తుతం తెలుగులో ఆమెను వరించిన ఆçఫర్ విషయానికొస్తే... విక్టరీ వెంకటేశ్తో హ్యూమా జోడీ కట్టనున్నారని ఫిల్మ్నగర్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వెంకీ ‘గురు’ సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. ఏడాది గ్యాప్ తీసుకోవడం వల్లనో ఏమో ఆయన స్పీడ్ పెంచారు. ప్రస్తుతం వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలోబాబీ దర్శక త్వంలో చేయనున్న సినిమా ఒకటి. ఇందులో వెంకీ– నాగచైతన్య మామా అల్లుళ్లగా కనిపించ నున్నారు. వెంకీ సరసన బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీని నాయికగా తీసుకోవా లనుకున్నా రట. హ్యూమాతో చర్చించా రని సమాచారం. ఇది కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రం చేయనున్నారు వెంకటేశ్. మల్టీస్టారర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరో. వెంకీకి జోడీగా తమన్నా కనిపించనున్నారు. -
వెంకీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ
గురు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు వెంకీ. ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ తేజ్తో కలిసి నటించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ సినిమాతో మరో క్రేజీ మల్టీస్టారర్కు ఓకె చెప్పారు వెంకీ. జై లవ కుశ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ(కె.యస్. రవీంద్ర) దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మల్టీ స్టారర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్బ్యూటీ నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. కాలా సినిమాలో రజనీకాంత్ ప్రేయసిగా నటించిన హుమా ఖురేషీ, వెంకీకి జోడిగా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
పది కాలాల పాటు చెప్పుకునేలా..
తమిళసినిమా: దక్షిణాది ప్రేక్షకులు ఏ పాటి అభిమానం కురిపిస్తారోనన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరాది బ్యూటీ హ్యూమాఖురేషి. ఐశ్వర్యారాయ్, దీపికాపదుకొనే, సోనాక్షిసిన్హా వంటి బాలీవుడ్ బ్యూటీల తరువాత సూపర్స్టార్ రజనీకాంత్తో జతకట్టే అవకాశాన్ని అందుకున్న నటి హ్యూమాఖురేషీ. రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో నటి ఈశ్వరిరావు ఆయన భార్యగా నటించగా, నటి హ్యూమాఖురేషి ఆయన ప్రియురాలిగా నటించిందని సమాచారం. హిందీ నటుడు నానాపటేకర్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించారు. నటుడు ధనుష్ తన వండర్బార్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించిన కాలా చిత్రానికి పా.రంజిత్ దర్శకుడన్నది తెలిసిందే. కబాలి తరువాత వెంటనే రజనీకాంత్ను డైరెక్ట్ చేసిన అరుదైన దర్శకుల్లో ఆయన చేరతారు. కాలా చిత్ర విడుదలపై పలు ఊహాగానాలు ప్రచారం అయిన నేపథ్యంలో ఎట్టకేలకు అలాంటి ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టే విధంగా నిర్మాత ధనుష్ జూన్ 7న కాలా చిత్రం విడుదలను ఖరారు చేశారు. ఆ విధంగా తెరపైకి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో నటించిన హ్యూమాఖురేషీ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇందులో తన 1980 కాలం నాటి రజనీకాంత్ ప్రియురాలిగా 45 ఏళ్ల ప్రౌడగా నటించినట్లు సమాచారం. హ్యూమాఖరేషి తన ట్విట్టర్లో పేర్కొంటూ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు, పది కాలాల పాటు గుర్తుండిపోయే మంచి పాత్రలో నటింపజేసినందుకు దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని పేర్కొంది. ముంబయిలోని ధారవి నేపథ్యంలో సాగే కాలా చిత్రంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించారన్నది తెలిసిన విషయమే. ఇందులో 8 పాటలు చోటుచేసుకుంటాయట. కొన్ని సన్నివేశాలను ముంబయిలోని ధారవి ప్రాంతంలో చిత్రీకరించినా, అధిక భాగాన్ని చెన్నైలోనే ధారవిసెట్ను వేసి చిత్రీకరించారు. రజనీకాంత్ తన తాజా చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం జూన్ రెండవ వారంలో సెట్పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. -
జరీనా ఆగయా
ప్రశాంతంగా కనిపిస్తోన్న జరీనా కళ్లలో మాత్రం ఏదో కథ ఉంది. మరి ఆమె గురించి పూర్తీగా తెలియాలంటే మాత్రం ‘కాలా’ సినిమా చూడాల్సిందే. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో దర్శక–నటుడు, నిర్మాత ధనుష్ నిర్మించిన సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలిపాటిల్ కథానాయికలు. నానా పటేకర్, ఈశ్వరీ రావ్, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాలో 45ఏళ్ల జరీనా పాత్ర చేశారు హ్యూమా ఖురేషి. ఆమె లుక్ను చిత్రబృందం రిలీజ్ చేసింది.‘‘రజనీకాంత్గారి ‘కాలా’ సినిమాలో జరీనా క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’అన్నారు హ్యూమా. ‘‘జరీనా పాత్రకోసం చాలా మంది కథానాయికలను పరిశీలించాం. కానీ ‘గ్యాంగ్ ఆఫ్ వస్పేయపూర్’లో హ్యూమాను చూసినప్పుడు జరీనా క్యారెక్టర్కు ఆమె కరెక్ట్ అనిపించింది. రజనీ, ధనుష్లు కూడా హ్యూమాను ఓకే చేశారు’’ అన్నారు రంజిత్. ‘కాలా’ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది.