-
ఆన్లైన్లో లీకైన 'అవతార్ 2' సినిమా ట్రైలర్ !..
ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్ 2'. 2009లో హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్ 'అవతార్'. దీనికి సీక్వెల్గా వస్తున్న మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'గా టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీ ట్రైలర్ను 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమా విడదల రోజైన మే 6న థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అయితే 'అవతార్ 2' అభిమానులకు నిరాశ కలిగించే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. థియేటర్లలో ఆస్వాదించాలనుకున్న ఈ మూవీ ట్రైలర్ ఆన్లైన్లో లీకైందని సమాచారం. ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్ లింక్లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే ప్రస్తుతం ఫుటేజ్కు సంబంధించిన లింక్లు, ఫొటోలు ట్విటర్ డిలీట్ చేయడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ లీక్కు సంబంధించిన కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఇది కూడా ఒక ప్రమోషన్ స్టంట్ అని పలువురు నెటిజన్స్ భావిస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ 27న ఈ మూవీ గ్లింప్స్ను 'సినిమా కాన్'లో ప్రీమియర్గా ప్రదర్శించారు. చదవండి: ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా ! #BREAKING ‘Avatar 2’ first teaser trailer has been leaked online. Exclusive stills for Avatar 2. Cinema incoming 🔥#AvatarTheWayOfWater pic.twitter.com/NVi0pglSzs — Adarsh Kumar (@AdarshWords) May 2, 2022 The trailer leaked!!!#AvatarTheWayOfWater pic.twitter.com/VhF0sQCcY8 — Mo☾nknight (@SquaredAnime) May 1, 2022 #AvatarTheWayOfWater leaked video 🥵🥵🔥🔥#Avatar2 — B U N N Y _ H A R I 🦁 (@MRBADBOY0143) May 2, 2022 -
ఆడిషన్స్ ఇచ్చా కానీ.. రెండుసార్లు రెజెక్ట్ చేశారు: ప్రముఖ హీరో
Tiger Shroff Says Hollywood Is His Goal But I Have Failed In Auditions: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా నటించిన చిత్రం 'హీరోపంతి 2'. 2014లో వచ్చిన రొమాంటిక్-యాక్షన్ మూవీ 'హీరోపంతి'కి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్గా యాక్ట్ చేసింది. సాజిద్ నడియద్వాలా నిర్మించగా, ఇందులో లైలా అనే ప్రతినాయకుడి పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనదైన యాక్టింగ్ మార్క్ చూపించనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో 'మీరు హాలీవుడ్కు వెళ్లే సమయం వచ్చిందా' అని అడిగిన ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ ఆసక్తిర విషయాలు తెలిపాడు. 'హాలీవుడ్లో యాక్షన్ హీరోలు ఎవరు లేరు. అందులోనూ నా ఏజ్ గ్రూప్ యాక్షన్ హీరోలు అసలే లేరు. 90వ దశకం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ తప్ప పూర్తి తరహాలో యాక్షన్ చిత్రీకరించే నైపుణ్యం ఉన్న వారిని చూసి చాలా కాలం అయింది. అయితే హాలీవుడ్ నుంచి నాకు రెండు సార్లు ఆఫర్ వచ్చింది. కానీ ఆ రెండు సార్లు ఆడిషన్లో ఫెయిల్ అయ్యాను. అయినా నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాబట్టి చూద్దాం. హాలీవుడ్ సినిమాల్లో నటించడమే నా లక్ష్యం.' అని చెప్పుకొచ్చాడు టైగర్ ష్రాఫ్. కాగా సైబర్ నేరాలను అరికట్టేందుకు లైలాతో బబ్లూ (టైగర్ ష్రాఫ్) అనే వ్యక్తి ఎలా తలపడ్డాడనేదే 'హీరోపంతి 2' కథ అని తెలుస్తోంది. చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్ హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హాలీవుడ్ మూవీలో ధనుష్ ఫస్ట్ లుక్ ఇదే.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే ?
Dhanush The Gray Man Release Date Announced With First Look Poster: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్' సినిమాతో అలరించిన ధనుష్.. తన అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చాడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ధనుష్ హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ పంచుకున్నాడు. ది గ్రే మ్యాన్ మూవీలోని తన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ 'ది గ్రే మ్యాన్.. జూలై 22న నెట్ఫ్లిక్స్లో' అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టర్లో కారు పైకప్పుపై నుదిటిపై రక్తంతో సీరియస్ లుక్లో ఆకట్టుకున్నాడు ధనుష్. బాక్సాఫీసును షేక్ చేసిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్గేమ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ‘ది గ్రే మ్యాన్’కు దర్శకులు. ఇంగ్లీష్ యాక్టర్స్ ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్లతో కలిసి ధనుష్ ఈ చిత్రంలో నటించాడు. యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో ధనుష్ పాత్ర నెగటివ్ షేడ్స్తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. 'ది గ్రే మ్యాన్' మూవీ ఈ ఏడాది ఓటీటీ ప్లాట్ఫామ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో జూలై 22న స్ట్రీమింగ్ కానుంది. కాగా 'ది గ్రే మ్యాన్' సినిమా ధనుష్ రెండో హాలీవుడ్ మూవీ. 2018లో వచ్చిన 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' చిత్రంతో ధనుష్ హాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) చదవండి: అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా భారీ మల్టీస్టారర్..! మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్ ట్వీట్, అంత మాట అనేశాడేంటి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_911254541.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
Keanu Reeves The Matrix Resurrections OTT Release Date Is Here: హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ చిత్రం 'ది మ్యాట్రిక్స్'. స్కై-ఫై, యాక్షన్ తరహాలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 1999లో వచ్చిన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత వచ్చిన చిత్రాలు కూడా అంతే ఆదరణ పొందాయి. ఈ మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. ఇందులో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్తోపాటు గ్లోబల్ స్టార్ ప్రియాకం చోప్రా ప్రధాన పాత్రల్లో అలరించారు. ఈ సినిమా డిసెంబర్ 22, 2021న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6 నుంచి భారతదేశంలో ప్రసారం కానుంది. లానా వాచోస్కీ దర్శకత్వ వహించిన ఈ మూవీ మే 6 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. లానా వాచోస్కీ తన సోదరి లిల్లీ వాచోవస్కీతో కలిసి ఈ ఫ్రాంచైజీలో ఇంతకుముందు వచ్చిన 'ది మ్యాట్రిక్స్' (1999), 'ది మ్యాట్రిక్స్: రీలోడెడ్' (2003), 'ది మ్యాట్రిక్స్: రివల్యూషన్స్' (2003) సినిమాలను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మళ్లీ థియేటర్లలోకి హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ 'ది మ్యాట్రిక్స్'.. కారణం ? choose your pill 💊#TheMatrixResurrectionOnPrime, May 12 in English, Hindi, Tamil, Telugu, Malayalam and Kannada pic.twitter.com/PGQTNRdKVs — amazon prime video IN (@PrimeVideoIN) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫెంటాస్టిక్ బీస్ట్స్ 3 రిలీజ్ ఎప్పుడంటే?
హాలీవుడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం 'ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్ డోర్' చిత్రం ఈ నెల 8వ తేదీ సమ్మర్ స్పెషల్గా తెరపైకి రాబోతోంది. దీన్ని ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనుంది. డేవిడ్ యేట్స్ దర్శకత్వం వహించిన ఇందులో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎడ్డీ రెడ్మైన్, జూడ్ లా, ఎజ్రా మిల్లర్ తదితరులు నటించారు. చదవండి: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నిర్మాత -
వండర్ వుమెన్ కొత్త చిత్రం.. తెర వెనుక చిత్రాలు షేర్
హాలీవుడ్ యాక్షన్ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్గా నటించిన హాలీవుడ్ బ్యూటీ గాల్ గాడోట్ సూపర్ హీరో 'వండర్ వుమెన్' సినిమాతో మోస్ట్ పాపులర్ అయింది. ఇజ్రాయెల్కు చెందిన ఈ భామ 2017లో వచ్చిన 'వండర్ వుమెన్'తో రాత్రికి రాత్రి స్టార్గా మారింది. అపారమైన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్గా 'వండర్ వుమెన్ 1984' చిత్రం విడుదలై ఆడియెన్స్తో నిజంగా 'వండర్' వుమెన్ అని అనిపించుకుంది. ఇటీవల విడుదలైన 'రెడ్ నోటీస్', 'డెత్ ఆన్ ది నీల్' సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చదవండి: మళ్లీ ఆ పాత్ర చేయాలని ఉందన్న పాపులర్ హీరోయిన్.. అదేంటంటే ? తాజాగా ఈ వండర్ వుమెన్ నటిస్తున్న చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్. ఈ సినిమాలో జామీ డోర్నన్తోపాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కూడా నటిస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బ్రిటీష్ డైరెక్టర్ టామ్ హార్పర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది గాల్ గాడోట్. ఈ వీడియోలో 'హార్ట్ ఆఫ్ స్టోన్' తెరవెనుక చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్తో తనకు ఉన్న అనుబంధాన్ని షేర్ చేస్తూ 'రాచెల్ స్టోన్. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. హార్ట్ ఆఫ్ స్టోన్' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Gal Gadot (@gal_gadot) -
రీమేక్గా హాలీవుడ్ క్లాసిక్ చిత్రం.. విడుదల ఎప్పుడంటే ?
The Ten Commandments Movie Released on December 31: ప్రపంచ సినీ చరిత్రలో ది టెన్ కమాండ్మెంట్స్ చిత్రానిది ప్రత్యేక స్థానం (క్లాసిక్ చిత్రం). 1956లో విడుదలై ఈ చిత్రం ఒక విజువల్ వండర్. సెసిల్ బి డెమిల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిడివి 220 నిమిషాలు. ఈ చిత్రం అప్పుడు ఇండియాలోని ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్. బెంగళూరు, చైన్నై వంటి నగరాల్లో 50 వారాలకు పైగా ప్రదర్శితమైంది. సుమారు 65 సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని అదే పేరుతో రీమెక్ చేయనున్నారు. ఈ చిత్రంలో మిషన్ ఇంపాజిబుల్ 2, బాట్ ఉమెన్ సినిమాలతో గుర్తింపు పొందిన డౌగ్రే స్కాట్ ఇందులో మోసెస్ పాత్రలో నటించారు. ఇంకా ఇందులో ఆరోన్గా లినస్ రోచ్, మెనెరిత్గా నవీన్ ఆండ్రూస్, జిప్పోరాగా మియా మాస్ట్రో, రామ్ సెస్గా పాల్ రైస్, ఆనందర్గా రిచర్డ్ ఓబ్రెయిన్ యాక్ట్ చేశారు. రాబర్ట్ డోర్న్ హెల్మ్, జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10' మరింత ఆలస్యం.. వచ్చేది ఇక అప్పుడే
Fast And Furious 10 Movie Release Date Postponed: ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో 'జేమ్స్ బాండ్' సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. తర్వాత అంతటి ప్రేక్షాధరణ పొందిన యాక్షన్ చిత్రం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీ. ఇందులో రేసింగ్, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 9 సినిమాలు వచ్చి యాక్షన్ ప్రేమికులను అలరించాయి. అయితే ఇప్పుడు ఈ యాక్షన్ చిత్రాల్లోని 10వ భాగాన్ని చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ 10వ చిత్రం విడుదలను ముందుకు నెట్టారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 7, 2023కి బదులు మే 19, 2023న విడుదల కానుందని సమాచారం. అయితే ఈ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10' చిత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ 2న రిలీజ్ కావాల్సింది. కరోనా మహమ్మారి కారణంగా 'ఎఫ్9' (ఫ్రాంచైజీలో 9వ చిత్రం) విడుదల ఆలస్యమైంది. అది కాస్త జూన్ 25, 2021న విడుదలైంది. దీంతో ఈ పదో చిత్రం విడుదలకు మరింత ఆలస్యమేర్పడింది. ఈ ఫ్రాంచైజీ చిత్రాల్లో విన్ డీజిల్, టైరీస్ గిబ్సన్, సంగ్ కాంగ్, క్రిస్ బ్రిడ్జెస్, జోర్డానా బ్రూస్టర్, మైఖెల్ రోడ్రిగ్జ్ నటించారు. ఈ ఫ్రాంచైజీకి డ్వేన్ జాన్సన్ ఇప్పటికే వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' చిత్రంలోని జాన్ సెనా పాత్న జాకోబ్ టోరెట్టోగా డ్వేన్ జాన్సన్ మళ్లీ రీఎంట్రీ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీలో చివరి రెండో చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు క్రిస్ మోర్గాన్ కథ అందించగా, జస్టిన్ లిన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరిస్లో 10, 11 చిత్రాల తర్వాత ఈ ఫ్రాంఛైజీకి ముగింపు పలకబోతున్నట్లు హీరో విన్ డీజిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. -
ప్రియాంక అభిమానులకు గుడ్ న్యూస్.. అదేంటో తెలుసా ?
Priyanka Chopra Shares Her First Look Poster Of Matrix Resurrections Movie: బాలీవుడ్, హాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ను తన ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేశారు. 'ది మ్యాట్రిక్స్' సిరీస్లో వస్తోన్న నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్'. సినిమాలో ప్రియాంక పాత్ర ఎలా ఉండనుందో ఈ పోస్టర్లో చూపించారు. ఇందులో ప్రియాంక ఎరుపు రంగు ప్యాంటు, నలుపు బూట్లతో బ్లూ కలర్ టాప్ ధరించి ఉన్నారు. ఆమె హేయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో ఎప్పుడూ కనపడే నెంబర్ కోడ్స్ ఎరుపు, నీలం రంగుతో వేవ్స్ రూపంలో ఉండటం చూడొచ్చు. ఈ పోస్టర్ను ప్రియాంక తన ఇన్స్టా గ్రామ్లో షేర్ చేస్తూ 'ఆమె ఇక్కడ ఉంది. రీ-ఎంటర్' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్ ఈ హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక ఎలా ఉండనుందో అని ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రియాంక షేర్ చేసిన 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' థియేటర్ రిలీజ్ పోస్టర్లో కూడా తాను లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ప్రియాంక మీరెక్కడ' అని కూడా ఓ అభిమాని కామెంట్ చేశాడు. సెప్టెంబర్లో ఈ చిత్రం మొదటి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక కళ్లద్దాలు ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాలుగో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్బీవో (HBO) మ్యాక్స్లో విడుదల కానుంది. నవంబర్ 22న ప్రియాంక తన ఇన్స్టా గ్రామ్ ఫ్రొఫైల్లో పేరు మార్చిన సంగతి తెలిసిందే. చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? -
మళ్లీ థియేటర్లలోకి హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ 'ది మ్యాట్రిక్స్'.. కారణం ?
Hollywood Film The Matrix Re Releasing On December 3: హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ చిత్రం 'ది మ్యాట్రిక్స్'. స్కై-ఫై, యాక్షన్ తరహాలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 1999లో వచ్చిన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందులోని నియో (కీను రీవ్స్), ట్రినిటీ (క్యారీ-అన్నె మోస్), మార్ఫస్ (లారెన్స్ ఫిష్బర్న్) పాత్రలు ఇప్పటికీ గుర్తిండిపోతాయి. అంతలా ఆకట్టుకుంటాయి ఆ పాత్రలు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్. ఈ చిత్రాన్ని మళ్లీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది నిర్మాణ సంస్థ. అయితే మ్యాట్రిక్స్ సిరీస్లోని నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సిరీస్లో కథానాయకుడి గతానికి సంబంధించిన కథతో వస్తోంది 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. మొదటి చిత్రం విడుదలకు నాలుగో సినిమా విడుదలకు మధ్య 12 ఏళ్లు గ్యాప్ ఉంది. అయితే నాలుగో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికే ఈ ఫ్రాంచైజీలోని మొదటి చిత్రమైన 'ది మ్యాట్రిక్స్' రిలీజ్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. మ్యాట్రిక్స్ చిత్రానికి లానా వాచోస్కీ, లిల్లీ వాచోస్కీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ నాలుగో చిత్రానికి మాత్రం లానా వాచోస్కీ ఒక్కరే రచన, దర్శకత్వం వహించారు. 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' చిత్రంలో గ్లొబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్ -
హాలీవుడ్ డెబ్యూలో జాక్వెలిన్..షూటింగ్ ఎక్కడ జరిగిందంటే..
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అంథాలజీ ఉమెన్స్ స్టోరీస్తో ఈ భామ హాలీవుడ్ డెబ్యూ చేస్తున్నట్లు ఈ ఏడాది ప్రకటించింది. మొత్తం ఆరు భాగాలుగా ఈ అంథాలజీ కథను తెరకెక్కించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురు మహిళా దర్శకులు ఈ కథలను రూపొందించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీనటులతో ఈ సినిమా చేయనున్నారు. జాక్వెలిన్ కథకు సంబంధించి ఈ సినిమాలో ఆమె ఓ ట్రాన్స్జెండర్ మోడల్తో నటించింది. గతేడాది అక్టోబర్లోనే దీనికి సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకుంది. చాలా వరకు ముంబైలోనే షూటింగ్ను నిర్వహించారు. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల షూటింగ్ను కంప్లీట్ చేసుకున్న జాక్వెలిన్ జాన్ అబ్రహం,అక్షయ్ కుమార్ల యాక్షన్ సినిమా షూటింగ్ను కూడా పూర్తిచేసింది. లాక్డౌన్ కారణంగా సల్మాన్తో చేస్తున్న కిక్-2 సినిమా ఆగిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి : సీక్రెట్గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె కేంద్రంపై బాలీవుడ్ నటి మీరా చోప్రా విమర్శలు -
‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్ పూర్తయిందోచ్!
బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు వెళ్లి జోరుగా సినిమాలు చేస్తున్నారు ప్రియాంకా చోప్రా. లాక్డౌన్ పూర్తయిన వెంటనే హాలీవుడ్లో చిత్రీకరణలు ప్రారంభించారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారామె. కొన్ని నెలలుగా ‘టెక్ట్స్ ఫర్ యూ’ సినిమా షూటింగ్ నిమిత్తం లండన్లో ఉంటున్నారామె. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. -
శుక్రవారం పండగ
శుక్రవారం సినీప్రియులకు ప్రియమైన రోజు. శుక్రవారమైతే కొత్త సినిమా థియేటర్స్లోకి వస్తుంది. అయితే కొన్ని నెలలుగా శుక్రవారం కిక్ మిస్ అయింది. కోవిడ్ వల్ల థియేటర్స్ మూసేశారు. ఈ శుక్రవారం తెలంగాణలో థియేటర్స్ తెరచుకున్నాయి. హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’ విడుదలైంది. థియేటర్స్కు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంది అన్నాయి ట్రేడ్ వర్గాలు. ఆ విశేషాలు. సినిమాలో ఉన్న మజా తెలిసేది పెద్ద తెర మీదే. సినిమాను పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేయగలిగేది థియేటర్స్లోనే. సినిమాలో ఉన్న ఎనర్జీ తాలూకు రీసౌండ్ వినిపించేదీ థియేటర్స్లోనే. 50 శాతం సీటింగ్ కెపాసిటితో తెలంగాణాలో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. ‘థియేటర్స్కు రండి. భద్రమైన మూవీ ఎక్స్పీరియన్స్ అందిస్తాం’ అంటూ థియేటర్స్ ఓపెన్ చేశారు. అసలు ప్రేక్షకుడు థియేటర్ వైపు చూస్తాడా? ఎన్ని టిక్కెట్లు తెగుతాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ థియేటర్స్కు వచ్చిన ఆడియన్స్ సంఖ్య ఆశాజనకంగా ఉంది అంటున్నారు థియేటర్స్ ఓనర్లు. ‘ఇంత సంఖ్యలో ప్రేక్షకులు రావడం చాలా సంతోషమైన విషయం. ఇది ఇలా కొనసాగితే థియేటర్స్ సిస్టమ్ త్వరగా కోలుకుంటుంది’ అన్నారు కొందరు ఎగ్జిబిటర్స్. ∙ఏయంబీ మల్టీప్లెక్స్లో 22 షోలు వేస్తే, అన్ని షోలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రసాద్స్ ఐమ్యాక్స్లో మొత్తం 650 సీటింగ్ అంటే.. కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో 50 శాతం టిక్కెట్లే అమ్మాలి. అంటే 325 మంది ప్రేక్షకులకు అనుమతి ఉంటుంది. ఆ థియేటర్లో సుమారు 300 టిక్కెట్లు తెగాయని తెలిసింది. అంటే అటూ ఇటూగా స్క్రీన్ నిండినట్లే. ఎల్బీ నగర్లోని విజయలక్ష్మీ థియేటర్లో ఉదయం ఆటకు 117 మంది, మధ్యాహ్నం ఆటకు 63 మంది ప్రేక్షకులు కనిపించారని ఓ ఎగ్జిబిటర్ పేర్కొన్నారు. అలాగే సింగిల్ స్క్రీన్లో దేవి థియేటర్ను రీ ఓపెన్ చేశారు. ఒక ఆటకు 130 మంది వరకూ వచ్చారట. ‘‘ఇది (‘టెనెట్’) హాలీవుడ్ సినిమా కాబట్టి మాస్ ఏరియాల్లో తక్కువ ఆడియన్స్ కనిపించారు. అదే తెలుగు సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాం. ఏది ఏమైనా అసలు ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం మాత్రం తీరిపోయింది. వస్తారని తేలిపోయింది. ఇది శుభపరిణామం. పైగా నాగచైతన్య, సాయిధరమ్ తేజ్ వంటివాళ్లు థియేటర్లకు వెళ్లడం ఆనందించదగ్గ విషయం. సెలబ్రిటీలు కూడా థియేటర్లకి వెళ్లడంతో ప్రేక్షకుల్లో భయం తగ్గుతుంది. ఇక థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు జాగ్రత్తల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భార్యాభర్తలు మాత్రం ఒక సీటు గ్యాప్ తర్వాత కూర్చుని చూడ్డానికి ఇబ్బందిపడ్డట్లు చెప్పారు’’ అన్నారు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్. స్టార్స్ సందడి ‘‘సినిమా ప్రేమికుడికి థియేటర్ను మించిన హ్యాపీ ప్లేస్ ఏంటి? థియేటర్స్కు రండి. సినిమాలను ఎంజాయ్ చేయండి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. శానిటైజర్ను ఎప్పటికప్పుడు వాడండి’’ అని థియేటర్స్కు ప్రేక్షకులను రమ్మంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు సాయిధరమ్ తేజ్. ‘‘9 నెలల తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చాను. థియేటర్స్ సార్... థియేటర్స్ అంతే!’ అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. నాగచైతన్య, నిఖిల్, విశ్వక్ సేన్, మారుతి కూడా థియేటర్స్కు వెళ్లి సినిమాని వీక్షించినవారిలో ఉన్నారు. ధైర్యంగా అనిపించింది సినిమాకు వచ్చే ప్రేక్షకుడికి భద్రతతో పాటు ధైర్యం కూడా కలిగించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. థియేటర్కు వచ్చిన కొందరు ప్రేక్షకుల అనుభవాన్ని పంచుకోమంటే ఇలా అన్నారు. ‘‘శానిటైజేషన్, సీటింగ్లో దూరం పాటించడం, ఎక్కడికక్కడ శానిటైజర్లు ఏర్పాటు చేయడం బావుంది. ధైర్యంగా అనిపించింది’’ అన్నారు కొందరు. ‘‘సీట్కి సీట్కి గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రేమికులకు కాస్త ఇబ్బంది అనిపించే అవకాశం ఉంది’’ అన్నారు కొందరు. -
'మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' తో కొత్త సందేశం
సాక్షి, న్యూఢిల్లీ : మురికి కాల్వల్లో మనం పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర జల మార్గాల్లో కలసి, వాటి నుంచి నదులకు, నదుల నుంచి సముద్రాలకు చేరి వాటిలొని సకల జల చరాలకు ప్రాణాంతకం అవుతున్నాయనే విషయం తెల్సిందే. అయితే ఇలా పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు జల మార్గాల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయో తెలిస్తే అంతులేని ఆశ్చర్యం కలగక మానదు. మానవాళికి పర్యావరణ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ' నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ' తరఫున బ్రిటన్లోని ఎక్సిటర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు భారత్లోని గంగా నదిలో, బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో 500 ఎంఎల్ కలిగిన కొన్నిబాటిళ్లను వదిలి పెట్టారు. వారి గమనాన్ని ఎప్పటికప్పుడు తెలసుకునేందుకు వీలుగా వాటిలో శాటిలైట్, జీపీఎస్ ట్యాగ్లను ఏర్పాటు చేశారు. వాటిలో ఆశ్చర్యంగా గంగా నదిలో వదిలేసిన ఓ ప్లాస్టిక్ బాటిల్ మిగితా రెండు వేర్వేరు సముద్రాల్లో వదిలేసిన బాటిళ్లకన్నా ఎక్కువ దూరం ప్రయాణించింది. 94 రోజుల్లో ఆ బాటిల్ 1768 మైళ్లు, అంటే 2, 845 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ ప్రయోగానికి స్ఫూర్తినిచ్చిందీ ' మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' అనే హాలీవుడ్ సినిమా. 1999లో లూయీ మండోకి దర్శకత్వంలో వెలువడిన ఆ ప్రేమ కథా చిత్రం నాటి కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. అందుకేనేమో అదే చిత్రం స్సూర్తితో ఈ ప్రయోగానికికూడా 'మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' అని పేరు పెట్టారు. ఇలాగే ప్రపంచ మానవాళి నిర్లక్ష్యంగా పడేసే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఏటా సముద్రాలకు 80 లక్షల టన్నులు చేరుకుంటోందని 'ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేషన్' లెక్కలు తెలియజేస్తున్నాయి. సముద్రాలకు చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల్లో 80 శాతం నదుల ద్వారా వస్తున్నవేనని కనుగొన్నారు. డాక్టర్ ఎమిలీ డంకన్ పరిశోధనకు నేతృత్వం వహించారు. పలు కారణాల వల్ల కొన్ని ప్లాస్టిక్ బాటిళ్లు మార్గమధ్యంలో ఆగిపోవచ్చనే ఉద్దేశంతో మొత్తం ప్రయోగానికి 25 బాటిళ్లను ఉపయోగించారు. వాటిలో 22 బాటిళ్లు సరాసరి దూరం 165 మైళ్లు, అంటే దాదాపు 267 కిలోమీటర్లు చేరుకున్నాయని పరిశోధకులు వివరించారు. ఆ తర్వాత వాటిలో 14 బాటిళ్ల ఆచూకీ చిక్క లేదని, వాటిలో కొన్ని ప్రజల చేతికి చిక్కగా మిగతావి శాటిలైట్ యాంటెన్నా పాడై పోవడం వల్ల వాటి గమ్యాన్ని గుర్తించలేక పోయామని పరిశోధకులు తెలిపారు. గంగా నదిలోనే ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కువగా చిక్కుకుపోయే అవకాశం ఉండడంతో ఆ నదిలోనే ఎక్కువ బాటిళ్లను వదిలేసినట్లు వారు చెప్పారు. -
దర్శకుడు మారారు
హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ సూపర్ హిట్ చిత్రం ‘రాంబో’ను కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడంలేదని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు, హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ‘రాంబో’ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం షారుక్తో ఓ సినిమా చేసే ప్లాన్లో ఉన్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. కార్తీక్ ఆర్యన్తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు రోహిత్ ధావన్. ఈ సినిమా తర్వాత ‘రాంబో’ని తెరకెక్కిస్తారు. ఈలోగా ‘హీరో పంతీ 2’ చిత్రాన్ని పూర్తి చేస్తారు టైగర్. 2021 చివర్లో ‘రాంబో’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
దీపిక ది ఇంటర్న్
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా చేసిన ‘చప్పాక్’ తర్వాత దీపికా పదుకోన్ ఏం చేయబోతున్నారు? అనే ఆసక్తి బాలీవుడ్లో ఉంది. ఫ్యాన్స్ ఎదురుచూపులకు సోమవారం ఫుల్స్టాప్ పెట్టారామె. తన తదుపరి చిత్రం ‘ద ఇంటర్న్’ అని ప్రకటించారు. 2015లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ద ఇంటర్న్’కి ఇది హిందీ రీమేక్. హాలీవుడ్ చిత్రంలో రోబర్ట్ డీ నీరో, అన్నే హథవే ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీలో ఈ పాత్రలను రిషీ కపూర్, దీపికా పదుకోన్ చేయనున్నారు. రిషీ కపూర్ కంపెనీలో ఇంటర్న్గా పని చేసే పాత్రలో దీపిక నటిస్తారట. ఈ సినిమాను హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్తో కలిసి దీపికా నిర్మించనుండటం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దర్శకుడు ఎవరనేది తెలియాలి. ‘‘నా తదుపరి చిత్రం ‘ది ఇంటర్న్’ రీమేక్ అని ప్రకటించడానికి థ్రిల్గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు దీపికా. -
అచ్చం ఆ సినిమా తరహాలోనే చనిపోతున్నారు!
న్యూఢిల్లీ : 2011లో వార్నర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో విడుదలైన హాలివుడ్ చిత్రం ‘కంటేజియన్’ ఇప్పుడు మళ్లీ మన కళ్ల ముందు కదలాడుతోంది. మట్ డామన్, కేట్ విన్స్లెట్ నటించిన ఆ చిత్రానికి ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో చైనాలోని ఓ గబ్బిలం నుంచి విస్తరించిన కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోతారు. దాన్ని అరికట్టేందుకు ప్రపంచంలోని రోగ నియంత్రణ, నిరోధక కేంద్రాలు తీవ్రంగా కృషి చేస్తాయి. చివరకు అందులో ‘పేషంట్ జీరో’గా పిలిచే ఓ చెఫ్కు ఈ వినూత్న వైరస్ సోకుతుంది. ఆ వైరస్తో పోరాడి బతికి బట్టకట్టడం ద్వారా పేషంట్ జీరో హీరో అవుతారు. ఆ పాత్రను నిర్మాతల్లో ఒకరైన మట్ డామన్ పోషించారు. అచ్చం అందులో లాగానే చైనాలోని వుహాన్ పట్టణం నుంచి విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల చైనాలో 26 మంది మరణించగా 800 మంది అస్వస్థులయ్యారు. అమెరికాలో ఆరుగురికి ఈ వైరస్ సోకింది. భారత్లోని కేరళకు చెందిన ఓ నర్సుకు కూడా ఈ వ్యాధి సోకినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో ఆ వైరస్ లక్షణాలు కనిపించలేదని డాక్టర్లు ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. చైనాలో ఈ వైరస్ సోకిన వారు ఎక్కడి వారక్కడ ఉన్న ఫళంగా రోడ్ల మీద, బస్టాపుల్లో పడిపోతున్నారు. దాంతో భయకంపితులవుతున్న చైనీయులు తండోపతండాలుగా ఆస్పత్రులకు వెళుతున్నారు. వారి తాకిడిని తట్టుకోవడం వైద్యాధికారులకు తలకు మించిన భారమైంది. సినిమాలోలాగా కరోనా వైరస్ చైనాలోని గబ్బిలం నుంచే వెలువడి ఉంటుందని, ఆ దిశగా పరిశోధనలు జరపాలని నాటి ‘కంటేజియన్’ అభిమానులు చైనా వైద్యులకు సలహా ఇస్తున్నారు. ఆ సినిమాలోని పేరును చూసే ఇప్పటి వైరస్కు కూడా ‘కరోనా’ అని పేరు పెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. ‘కంటేజియన్’ సినిమా అత్యంత భయానకమైనదని గత కొన్నేళ్లుగా తాను చెబుతున్నానని, ఇప్పుడదే నిజమైందని నటుడు, దర్శకుడు స్టీఫోన్ పోర్డ్ ట్వీట్ చేశారు. ‘నాకు కంటేజియన్ సినిమా గుర్తొస్తోంది. అచ్చం సినిమాలోలాగానే ఇప్పుడు చైనాలో వైరస్కు రోగులు చనిపోతున్నారు. చైనా గబ్బిలాల విసర్జితాలను ఎరువులుగా వాడుతుండడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందివుండొచ్చు’ అని మరొకరు ట్వీట్ చేశారు. గబ్బిలం జిగురు నుంచి తయారు చేస్తున్న సబ్బుల వల్ల కూడా ఈ వైరస్ సోకవచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు. 2003లో హాంకాంగ్లో ‘సార్స్’ వైరస్తో అనేక మంది మరణించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే 2011లో కంటేజియన్ చిత్రం తీసి ఉంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకనే ఆ సినిమాలో వైరస్ చైనా నుంచి విస్తరించిందని చూపించారు. కల్పితం అయినప్పటికీ సినిమాలో సైన్స్ను సైన్స్లా చూపించారని ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ‘స్లీవెన్ సోడర్బెర్గ్’ను నాటి సైన్స్ కమ్యూనిటీ ప్రశంసించింది. చదవండి: భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..! -
‘జోకర్’కు చైనా ఫ్యాన్స్ ఫిదా.. సరికొత్త రికార్డులు
జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ 'జోకర్' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను స్థిరంగా కొనసాగిస్తుంది. అక్టోబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'జోకర్' సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉందని కొందరు విమర్శకులు పెదవి విరిచినా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు దాటిన తొలి ఆర్-రేటెడ్ సినిమా(హింసాత్మకంగా భావించినప్పటికీ)గా నిలిచింది. ఆర్- రేటడ్ జాబితాలో ఇంతకుముందు 2018లో వచ్చిన ర్యాన్ రేనాల్డ్స్ నటించిన కామెడి థ్రిల్లర్ 'డెడ్పూల్ 2' సినిమా (78.3), 'డెడ్పూల్'(75.4) మిలియన్ డాలర్లు వసూలు చేయగా, తాజాగా జోకర్ ఆ సినిమాల రికార్డును అధిగమించింది. అంతేగాక చైనాలో ఆర్-రేటడ్ సినిమాలను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ జోకర్ సినిమాను మాత్రం చైనా ప్రేక్షకులు హిట్ సినిమాగా నిలిపారు. జోకర్గా నటించిన జోక్విన్ ఫీనిక్స్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 62.3 మిలియన్ డాలర్ల బడ్జెట్తో వార్నర్ బ్రదర్స్, డీసీ ఫిలిమ్స్ సంస్థ జోకర్ సినిమాను తెరకెక్కించగా టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు. డీసీ ఫిలిమ్స్ సంస్థ రూపొందించిన ఆక్వామెన్, ది డార్క్ నైట్ రైజస్, ది డార్క్ నైట్ సినిమాలు 1బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా, తాజాగా ఆ జాబితాలో జోకర్ నాలుగో స్థానాన్ని సంపాందించింది. ది డార్క్ నైట్ సినిమాలో జోకర్ పాత్రలో హెత్ లెడ్జర్ బ్యాట్మెన్ సిరీస్ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ది డార్క్నైట్ సినిమాలో జోకర్ పాత్ర విలన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భయంకరమైన జోకర్గా నటించిన హెత్ లెడ్జర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ముఖ్యంగా ఇంటరాగేషన్ సీన్లో జోకర్ పాత్రలో హెత్ లెడ్జర్ వెకిలి నవ్వులు ఎవరు అంత తొందరగా మరిచిపోలేరు. దాని నుంచి ప్రేరణగా తీసుకొని ఒక సీరియల్ కిల్లర్ గా జోకర్ ఎందుకు మారాడనే బ్యాక్డ్రాఫ్లో జోకర్ చిత్రం తెరకెక్కింది. జోకర్ పాత్రకు ప్రాణం పోసిన హెత్ లెడ్జర్ 2008 లో డ్రగ్స్కు బానిసై చనిపోవడంతో ఈ సినిమాలో జోక్విన్ ఫీనిక్స్ జోకర్ పాత్రను ధరించారు. -
ఆ సీన్ లీక్: సైకో మెంటాలిటీయే కారణం
ప్రముఖ నటి రాధికా ఆప్తే, దేవ్ పటేల్ జంటగా నటించిన తాజా హాలీవుడ్ చిత్రం ‘ద వెడ్డింగ్ గెస్ట్’ . త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలోని హాట్ రొమాంటిక్ సీన్ ఒకటి లీకై.. ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. రాధికా ఆప్తే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న ఈ సీన్ లీక్ కావడంపై నటి రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సమాజంలో సైకో మెంటాలిటీకి ఈ సీన్ లీకే నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ఈ సీన్ మేల్ యాక్టర్ దేవ్ పటేల్ పేరిట స్ప్రెడ్ చేయకుండా.. తన ఒక్కరి పేరు మీదనే ఎందుకు వ్యాప్తి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ‘బాలీవుడ్ లైఫ్’ వెబ్సైట్తో ముచ్చటించిన రాధిక.. ‘ఈ సినిమాలో ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ శృంగారానికి సంబంధించిన సీన్ను మాత్రమే లీక్ చేశారు. దీనికి కారణం మన సమాజం సైకోటిక్ మెంటాలిటీనే’ అని అన్నారు. ‘లీకైన ఆ సీన్లో రాధికా ఆప్తే, దేవ్ పటేల్ ఇద్దరూ ఉన్నారు. కానీ, నా పేరు మీదనే ఆ సీన్లను స్ప్రెడ్ చేస్తున్నారు. మేల్ నటుడు దేవ్ పటేల్ పేరు మీద వాటిని స్ప్రెడ్ చేయవచ్చు కదా’ అని ఆమె ప్రశ్నించారు. సినిమాల్లో నగ్న, శృంగార సన్నివేశాల్లో నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో రాధికా ఆప్తే పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘బోల్డ్ సీన్లలో నటించే విషయంలో నాకెలాంటి భయాలు లేవు. నేను చిన్నప్పటి నుంచి ప్రపంచ సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్నో ప్రదేశాలు తిరిగాను. నా పట్ల నేను కంఫర్టబుల్గానే ఉన్నాను. భారత్లో, విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం నేను చూశాను. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి? ఒక అభినేత్రిగా నా శరీరం కూడా ఒక సాధనమే నాకు. బోల్డ్ సీన్లలో నటించే విషయంలో నాకు ఎలాంటి భయాలు లేవు’ అని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్తే పేర్కొన్నారు. -
చలో లాస్ ఏంజిల్స్
పాస్పోర్ట్, నిత్యం అవసరమయే వస్తువులను జాగ్రత్తగా సూట్కేస్లో ప్యాక్ చేసుకుంటున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషి. త్వరలో ఆమె లాస్ ఏంజిల్స్కు పయనం కానున్నారు. దాదాపు రెండు నెలలు అక్కడే ఉంటారట.. ‘డ్వాన్ ఆఫ్ ది డెడ్, 300, జస్టిస్ లీగ్’ వంటి ఇంగ్లీష్ చిత్రాలను తెరకెక్కించిన జాక్ స్నైడర్ దర్శకత్వంలో ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ అనే హాలీవుడ్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డావే బౌటిస్టా, థియో రోసి, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు చేయనున్నారు. కిరాయి సైనికుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో లాస్ ఏంజిల్స్ను ప్రారంభం కానుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లనున్నారు హ్యూమా. -
ఏజెంట్ నూర్
ఫ్రాన్స్లో గూఢచర్యం చేశారు రాధికాఆప్టే. మరి.. ఆమె సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాగిందో వెండితెరపై చూడాల్సిందే. ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ లిడియా డీన్ పిల్చర్ దర్శకత్వంలో ‘లిబర్టే: ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ మూవీ తెరకెక్కింది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సారా మేఘన్ థామస్, స్టానా కాటిక్, రాధికా ఆప్టే, లైనస్ రోచె, రోసిఫ్ సదర్లాండ్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ఇండియన్ ముస్లిమ్ స్పై ఏజెంట్ నూర్ ఇనాయత్ ఖాన్ పాత్రలో రాధికా ఆప్టే నటించారు. ఇటీవల యూకేలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమా టీమ్ కలుసుకున్నారు. ఈ సమయంలో ఈ సినిమాలోని తన లుక్ను రాధికా ఆప్టే షేర్ చేశారు. ఇక.. బాలీవుడ్లో ‘రాత్ అఖేలి హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరో. -
హాలీవుడ్ మళ్లీ పిలిచింది
హాలీవుడ్ సినిమాల్లో మన ఇండియన్ తారలు అప్పుడప్పుడు మెరుస్తూనేఉన్నారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ ఇలా హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూనే వచ్చారు. ప్రియాంక అయితే ఏకంగా హాలీవుడ్కే మకాం మార్చేశారు. తాజాగా సీనియర్ నటి డింపుల్ కపాడియా ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. హాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో డింపుల్ నటించనున్నారు. ఇంగ్లీష్ సినిమాలో నటించడం ఆమెకు ఇది మొదటిసారేం కాదు, ‘లీలా’ (2002) అనే ఆంగ్ల చిత్రంలో ఆల్రెడీ నటించారామె. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కే తాజా చిత్రంలో ఆస్కార్ విజేత డేవిడ్ వాషింగ్టన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘టెనిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుమారు ఏడు దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నారట. వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. -
పండగ ఎవరికి?
వచ్చే ఏడాది క్రిస్మస్కు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్ఖాన్, హృతిక్ రోషన్. గత ఏడాది డిసెంబర్లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో తర్వాతి సినిమాకు కాస్త టైమ్ తీసుకున్న ఆమిర్ ఖాన్ ఆస్కార్ అవార్డ్ సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్సింగ్ చద్దా’లో నటించనున్నట్లు ఇటీవల తన పుట్టినరోజు నాడు వెల్లడించాడు. ‘సీక్రెట్ సూపర్స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిందని బాలీవుడ్ సమాచారం. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో రానున్న ‘క్రిష్ 4’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కే విడుదల చేయనున్నట్లు హృతిక్ రోషన్ తెలిపారు. సో.. ఇలా వచ్చే ఏడాది క్రిస్మస్కు ఇద్దరు టాప్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద ఎవరి పంట పండుతుందో, సినిమా విజయంతో ఎవరు పండగ చేసుకుంటారో చూడాలి. అయితే ఇంకా ‘క్రిష్ 4’ సెట్స్ పైకి వెళ్లలేదు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కేన్సర్ బారిన పడి, చికిత్స తీసుకుని ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. -
అవెంజర్స్తో ఆటలు ; చితకొట్టిన అభిమానులు..!
హాంకాంగ్ : అభిమానులందు అవెంజర్స్ అభిమానులు వేరయా అన్నట్టు ప్రవర్తించారు చైనాలో. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హీరో సీరిస్లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్ ; ఎండ్గేమ్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సూపర్ హీరో సీరిస్ను ఎలా ముగించారో అని సినీ ప్రియులు.. ముఖ్యంగా అవెంజర్స్ అభిమానులు ఉత్సాహంగా సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు. అదేసందర్భంలో ఈ సినిమా కథ గురించి ముందే చెప్పి తమ ఎగ్జయిటింగ్కు గండికొట్టద్దని వేడుకుంటున్నారు. మాట వినకపోతే తాట తీస్తున్నారు. సినిమా దర్శకులు రూసో బ్రదర్స్ సైతం ‘అవెంజర్స్ ; ఎండ్గేమ్ కథను ఎక్కడా రివీల్ చేయకండి. థియేటర్లలో గొప్ప అనుభూతి’ పొందండి అని ట్విటర్లో సూచించారు కూడా. అయితే, ఈ సినిమా విశేషాలు చెప్తానంటూ సినిమా థియేటర్ దగ్గర రచ్చ చేసిన ఓ ఆకతాయిని అభిమానులు చితకొట్టారు. ఈ ఘటన చైనాలోని కాజ్వే బేలో బుధవారం జరిగింది. మరి కష్టపడి, క్యూలైన్లలో గంటల కొద్దీ నిలబడి టికెట్లు సంపాదించుకున్న అభిమానులు తమ ఆనందాన్ని ఆవిరి చేస్తామంటే ఊరుకుంటారా ఏంటి..! చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లో బుధవారం విడుదలైన అవెంజర్స్ ; ఎండ్గేమ్.. భారత్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే తొలి వారాంతానికి రూ.6000 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గత చిత్రాల రికార్డులన్ని చేరిపేసి 20 వేల కోట్ల వసూళ్లతో ఆల్టైం రికార్డ్ సెట్ చేయటం ఖాయం అంటున్నారు. -
వెబ్సైట్లో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇంతకాలం భారతీయ చిత్రాలకే పరిమితమైన తమిళ పైరసీ రాకర్స్ హాలీవుడ్పైనా పంజా విసిరారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ హాలీవుడ్ చిత్రాన్ని గురువారం వెబ్సైట్లో పెట్టేశారు. భారీ బడ్జెట్తో నిర్మితమయ్యే తమిళ చిత్రాలను అత్యంత సులువుగా పైరసీ ద్వారా విడుదల చేస్తూ తమిళ సినీ నిర్మాతలకు తమిళ రాకర్స్ ఇప్పటి దాకా గుబులు పుట్టించారు. తాజాగా, వేలాది కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొంది, ఈ నెల 26న విడుదల కావాల్సిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ను సైతం తమిళ రాకర్స్ వదిలిపెట్టలేదు.