-
గాయాలు తప్పవు
‘‘వృత్తిపరమైన గాయాలను తప్పించుకోలేం. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు గాయాలు తప్పవు’’ అంటున్నారు ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’లో నటిస్తున్నారు. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ మూవీ షూటింగ్ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆరంభమైంది.ఈ చిత్రం కోసం ప్రియాంకా చోప్రా పాల్గొనగా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆమె పెదవి, ముక్కు, మెడకు గాయాలు అయ్యాయి. ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, ప్రోఫెషనల్ లైఫ్లో జరిగే ప్రమాదాలు’ అంటూ వీడియో పోస్ట్ చేశారు ప్రియాంక. ఇక గాయాలు కాగానే షూటింగ్ ఆపేసి, ఆమెను సిడ్నీలోని ఆస్పత్రికి తీసుకెళ్లిందట యూనిట్. అక్కడ చికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకుంటున్నారట ప్రియాంకా చోప్రా. -
Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి
ఓటీటీ వేదికలు సినిమా అభిమానులకు బాగా దగ్గరయ్యాయి. సినిమా బాగుంది అంటే చాలు కొత్త, పాత అనే తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అంటే చాలు.. ఎన్ని పనులున్నా తప్పకుండా చూస్తున్నారు. చరిత్రలో జరిగిన భయంకరమైన సంఘటనను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకుల కోసం కొందరు మేకర్స్ విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన హాలీవుడ్ చిత్రమే 'సొసైటీ ఆఫ్ ది స్నో'. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. J. A. బయోనా దర్శకత్వం వహించారు. 96వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్లో ఉత్తమ విదేశీ (స్పెయిన్) చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది.కథేంటంటే..ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాన్ని ఊహించలేం. వాతావరణంలోని మార్పుల వల్ల 1972లో ఫ్లైట్-571 ఆండిస్ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. అందులో ఉరుగ్వేకు చెందిన 45 మంది సభ్యులతో కూడిన యువ రగ్బీ టీమ్ ఉంది. వారందరూ ఉరుగ్వే నుంచి టోర్నమెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందితే.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. కానీ, కొందరు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతుంటారు. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు ఉండటం వల్ల మైనస్ 20 డిగ్రీలకు పైగా చలి ఉంటుంది. వారికి తినడానికి తిండి కూడా దొరకదు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో వారు ఎలా బయటపడ్డారు..? 45 మందిలో చివరకు ఎంత మంది ప్రాణాలతో తిరిగొచ్చారు..? మనుసులే జీవించలేని ఆ మంచుకొండల్లో 72రోజుల పాటు వారు తీసుకున్న ఆహారం ఎంటి..? వారిని ఏవియేషన్ సిబ్బంది ఎలా కనిపెట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించే ఈ నిజజీవిత కథను మీరూ చూసేయండి.ఎలా ఉందంటే..సర్వైవల్ థ్రిల్లర్స్ కాన్సెప్ట్తో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోతాయి. రీసెంట్గా వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 'సొసైటీ ఆఫ్ ది స్నో' చిత్రంలో కూడా 45 మంది ప్లేయర్స్ రెండు నెలల పాటు మంచు కొండల్లో చిక్కుకుని తీవ్రమైన చలిలో ఎలా బతికారనే కాన్సెప్ట్ను చాలా భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు J. A. బయోనా విజయం సాధించాడు. మనిషి బ్రతకడానికి అవకాశమే లేని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు విజయం సాధించవచ్చు అనే స్ఫూర్తిని సినిమాలో ఆవిష్కరించారు. వారిలో ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఈ కథలో అద్భుతంగా తెరకెక్కించాడు. రగ్బీ ఆడుతున్న యువకులతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్తాడు. ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నా ఒక్కసారి వారందరూ విమానం ఎక్కగానే అసలు కథ మొదలౌతుంది. వెండితెరపై కనిపించిన విమాన ప్రమాదం తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చావుబతుకుల మధ్య వారందరూ పోరాడుతుంటే ప్రేక్షకుల్లో కన్నీరు తెప్పిస్తుంది. ప్రాణాలను నిలుపుకోవడానికి మరణించిన తమ స్నేహితుల శవాలను తినాల్సిందేనని వారు చర్చించుకునే తీరు, వారిలో కనిపించే తీవ్రమైన భావోద్వేగంతో కన్నీటిసుడులు తిరుగుతాయి. స్నేహితుల ఆహారం కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా వెనకడుగు వేయరు. అలా 72 రోజుల తర్వాత సైన్యం వారిని కనిపెట్టినప్పుడు వారిలో కనిపించే సంతోషాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా చలించిపోతాడు. ఆ సమయంలో వారి శరీరం కేవలం ఎముకల గూడుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటేసొసైటీ ఆఫ్ స్నో మూవీలో నటించిన వారందరూ కూడా హాలీవుడ్ వారే కావడంతో మనకు పెద్దగా వారి పరిచయాలు ఉండవ్. కానీ ఈ ఒక్క సినిమా వారిని మనకు దగ్గర చేస్తుంది. ఈ చిత్రంలో చాలా వరకు నూమా అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అతనే హీరో అని చెప్పవచ్చు. ఆయన పాత్ర కూడా చాలా విషాదాంతంగానే ముగిసిపోతుంది. డైరెక్టర్ జె.ఎ. బయోనా ఈ చిత్రంలోని మంచు పర్వతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సర్వైవల్ థ్రిల్లర్గానే కాకుండా భావోద్వేగాలతో గుండెలను బరువెక్కేలా నిర్మించడంలో విజయం సాధించాడు. కథ నెమ్మదిగా సాగుతుంది. కాస్త ఓపికగా చూస్తే మిమ్మల్ని కూడా తప్పకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. నెట్ఫ్లిక్స్ నందు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. -
ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. రీసెంట్గా ట్రైలర్ రిలీజైంది. విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ లెవల్లో ఉన్నాయి. హిట్ అయితే గనుక టాలీవుడ్లో వండర్స్ క్రియేట్ అవుతాయి. అలానే ట్రైలర్ బట్టి చూసినా సరే కథ చూచాయిగా అర్థమవుతోంది గానీ పూర్తిస్థాయిలో ఇది స్టోరీ అని చెప్పలేకపోతున్నాం. మరోవైపు 'కల్కి' ట్రైలర్ రిలీజైందో లేదో అప్పుడెప్పుడో వచ్చిన ఓ హాలీవుడ్ మూవీతో పోల్చి చూస్తున్నారు. కొన్ని సీన్లు ఒకేలా అనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?(ఇదీ చదవండి: చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!)'కల్కి' ట్రైలర్ బట్టి చూస్తే.. కొన్నేళ్ల తర్వాత భూమిపై పరిస్థితులు మారిపోతాయి. మనిషి మనుగడే కష్టమైపోతుంది. భూమికి చాలా ఎత్తులో కాంప్లెక్స్ అనే నిర్మాణం ఉంటుంది. అందులో ఉండే సుప్రీం యాష్కిన్ అనే పెద్ద మనిషి ఉంటాడు. అతడు హీరోయిన్ని పట్టుకోమని హీరో అయిన భైరవకి పని అప్పజెబుతాడు. హీరోయిన్ని ఆశ్వథ్ధామ అనే మరో వ్యక్తి కాపాడుతాడు. మరి చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇక 'కల్కి' ట్రైలర్లో ప్రభాస్.. కాంప్లెక్స్లోకి వెళ్లాలని అంటుంటాడు. మరోవైపు దీనికి పోలిక అని చెబుతున్న సినిమా పేరు 'ఎలీసియమ్'. ఇందులో హీరో భూమిపై ఉంటాడు. 2154 సంవత్సరం. పేదలందరూ బాగా నాశనమైన భూమిపై ఉంటారు. డబ్బునోళ్లు అందరూ భూమికి దూరంగా అంతరిక్షంలో ఎలీసియమ్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు. ఇలా 'కల్కి'లో కాంప్లెక్స్.. హాలీవుడ్ మూవీలో ఎలీసియమ్ అనేది ఒకేలా అనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు.. భూమిపై దారుణమైన పరిస్థితుల్లో బతకడానికి ఇష్టపడరు. అక్కడెక్కడో ఆకాశంలో ఉంటున్న చోటుకి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరకు ఏమైందనేదే రెండు మూవీల్లోని స్టోరీ. హాలీవుడ్ మూవీ అయితే పూర్తిగా సీరియస్ టోన్లో ఉంటుంది. 'కల్కి' మాత్రం ఎంటర్టైన్మెంట్, యాక్షన్, డ్రామా, పురాణాల రిఫరెన్సులు బాగానే ఉన్నాయి.ఓవరాల్గా చూసుకుంటే స్టోరీ ప్లాట్ పరంగా పైపైన ఒకేలా అనిపిస్తున్నాయేమో అనిపిస్తుంది. 'కల్కి' మూవీ రిలీజైతే ఇది అది ఒకటేనా కాదా అని తెలుస్తుంది. ఇంతకీ 'కల్కి'తో పోలిక అనిపిస్తున్న హాలీవుడ్ మూవీ ఏ ఓటీటీలో ఉందో చెప్పలేదు కదూ! ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాత సినిమానే అయినప్పటికీ ఎందుకో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.(ఇదీ చదవండి: 'కన్నప్ప'లో ప్రభాస్ సీన్స్ గురించి మంచు విష్ణు కామెంట్స్) -
కల్కి: ఆ విజువల్ నా వీడియోలో నుంచే కాపీ కొట్టారు.. ఇది న్యాయమేనా?
కల్కి సినిమాకు కౌంట్డౌన్ మొదలైంది. మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది.కల్కి ట్రైలర్.. కాపీ కొట్టారా?అదే సమయంలో కల్కి సినిమాలో తన ఆర్ట్ను కాపీ కొట్టారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్పై విమర్శలు గుప్పిస్తున్నాడు. సౌత్ కొరియాకు చెందిన సంగ్ చై.. కాన్సెప్ట్ డిజైనర్గా హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలకు పని చేశాడు. తాజాగా అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా కల్కి యూనిట్ తన ఆర్ట్ను కాపీ కొట్టిందని పేర్కొంటూ అందుకు తగ్గ సాక్ష్యాన్ని సైతం పొందుపరిచాడు. పదేళ్ల క్రితమే ఆ డిజైన్పదేళ్ల క్రితం తను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన విజువల్ ఫోటోను.. కల్కి ట్రైలర్ ప్రారంభంలోని ఓ విజువల్ స్క్రీన్షాట్ను అప్లోడ్ చేశాడు. ఒకరు కష్టపడి తయారు చేసిన ఆర్ట్ను దొంగిలించడం అనైతికం అని క్యాప్షన్ జోడించాడు. తర్వాత కాసేపటికి ఆ క్యాప్షన్ తొలగించి కల్కి సినిమా, వైజయంతి మూవీస్ అన్న హ్యాష్ట్యాగ్లను జోడించాడు. ఆ రెండు ఫోటోలు చూసిన నెటిజన్లు ఇలా కాపీ కొట్టారేంటని ఆశ్చర్యపోతున్నారు. నీ వర్క్ దొంగిలించారని ఇట్టే తెలిసిపోతుంది. ఆ నిర్మాతలు ప్రభాస్ లుక్ లీక్ చేసినందుకే వీఎఫ్ఎక్స్ కంపెనీపై దావా వేశారు. నువ్వు కూడా నీ ఆర్ట్ కాపీ కొట్టారని కోర్టుకు వెళ్లు అని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు.కల్కి యూనిట్పై విమర్శలు'ట్రైలర్లోని ఫస్ట్ విజువలే కాపీ కొట్టింది వేశారంటే వాళ్లను ఏమని అనాలో అర్థం కావడం లేదు.. ఇంకా ఇలా ఎన్ని కాపీ కొట్టారో..', 'ఇది నిజంగా బాధాకరం, కనీసం ఒరిజినల్ ఆర్టిస్టులకు క్రెడిట్ ఇచ్చినా బాగుండేది', 'ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలి' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి నిర్మాత ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి! The ride to spread the light across the nation kicks off! #Kalki2898AD pic.twitter.com/GiwETEuNFY— Kalki 2898 AD (@Kalki2898AD) June 13, 2024 View this post on Instagram A post shared by Sung Choi (@sungchoiart) చదవండి: స్టార్ హీరో కుమారుడి సినిమాను బ్యాన్ చేయాలంటూ ట్విటర్ వార్ -
ఇండియన్ సినిమాలో సెటిలైన విదేశీ యాక్టర్!
భారతీయ సినిమా ఇప్పుడు ఖండాలు దాటి పరుగులు తీస్తోంది. భాషా భేదం లేదు.. ప్రతిభే ప్రామాణికం. అందుకే విదేశీ నటీనటులు కూడా భారతీయ చిత్రాల్లో నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ కోవకు చెందిన నటుడే జేసన్ షా. విదేశం (ఐర్ల్యాండ్)లో పుట్టి పెరిగిన ఈయన ఇండియాలో నటుడిగా రాణిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఫిలిం అకాడమిలో నటనలో శిక్షణ పొందిన జేసన్షా భారతీయ సినిమాల్లో నటించడం విశేషం. మొదట్లో ఇక్కడ టీవీ సీరియళ్లలో ప్రతినాయకుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత సినీ రంగప్రవేశం చేసి హిందీ, తమిళ భాషల్లో నటించి పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో 1947 ఆగస్టు 16, కన్జూరింగ్ కన్నప్పన్, మిషన్ చాప్టర్ 1 వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి వెబ్ సిరీస్లో ముఖ్య భూమికను పోషించి ప్రశంసలు అందుకున్నారు. సలార్ సినిమాలోనూ మెప్పించాడు. తాజాగా నటి అలియా భట్ కథానాయకిగా నటించిన జిగ్రా చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇలా విదేశీ నటుడైన జేసన్షా భారతీయ చిత్రాల్లో నటుడిగా రాణించడం విశేషమనే చెప్పుకోవాలి.చదవండి: నటి హేమకు బెయిలు మంజూరు చేసిన కోర్టు -
అక్టోబరులో అకాడమీ వేడుక
లాస్ ఏంజిల్స్లో ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న నాలుగో అకాడమీ మ్యూజియమ్ గాలా వేడుకలో దర్శకుడు క్వెంటిన్ టరంటినో, నటుడు పాల్ మెస్కల్, నటి రీటా మోరెనో అవార్డులు అందుకోనున్నారు. వాంటేజ్ అవార్డుకు మెస్కల్, ఐకాన్ అవార్డు కోసం మోరెనో, ల్యూమినరీ అవార్డుకు క్వెంటిన్ను ఎంపిక చేశారు. ‘‘తరాలుగా ప్రపంచవ్యాప్త సినిమాకు సేవలందిస్తూ, ఆర్టిస్టులకు, ఫిల్మ్ మేకర్స్కు ప్రేరణగా నిలుస్తున్న ఈ ముగ్గురినీ ఈ ఏడాది సత్కరించనున్నాం. అక్టోబరు 19న ఈ వేడుక జరుగుతుంది’’ అని అకాడమీ మ్యూజియమ్ గాలా అధ్యక్షురాలు అమీ హోమ్మా పేర్కొన్నారు. కాగా ఈ అకాడమీ మ్యూజియమ్ గాలా అవార్డులను విరాళాల సేకరణ కోసం ఆరంభించారు. 2021లో ఈ మ్యూజియమ్ ఆరంభమైంది. గడచిన మూడేళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ వేడుక నుంచి లభించిన నగదును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తారు. ఇక లాస్ ఏంజిల్స్లో ఉన్న ఈ మ్యూజియమ్లో సినిమాల కోసం ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ వాడిన ప్రత్యేకమైన దుస్తులు, ఆయుధాలు, ఇతర వస్తువులను సందర్శనకు ఉంచారు. -
ఇండియన్ లేడీ సినిమాటోగ్రాఫర్.. ఆస్కార్ రేంజ్ వరకు
గత కొన్నేళ్లుగా ఆస్కార్కి ఇండియన్ సినిమాలు ఆమడ దూరంలో ఉండేవి. కానీ 'ఆర్ఆర్ఆర్' మూవీ దీన్ని బ్రేక్ చేసింది. నాటు నాటు పాటతో అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అనంతరం పలు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లొస్తున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే బెంగళూరుకు చెందిన లేడీ సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్కి ఎంపికైంది.(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?)బెంగళూరుకి చెందిన నేత్ర గురురాజ్.. ప్రస్తుతం లాజ్ ఏంజెల్స్లో ఉంటోంది. స్వతహాగా రైటర్, డ్యాన్సింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా చాలా విభాగాల్లో ప్రావీణ్యురాలైన నేత్ర.. కొన్నాళ్ల ముందు సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేసేందుకు లాస్ ఏంజెల్స్ వెళ్లింది. రీసెంట్గా ఈమె తీసిన 'జాస్మిన్ ఫ్లవర్స్' షార్ట్ ఫిల్మ్.. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డులు గెలుచుకుంది.ఈ క్రమంలోనే నేత్ర.. ఇప్పుడు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్కి ఎంపికైంది. ప్రపంచం నలుమూల నుంచి ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన యువ సినిమాటోగ్రాఫర్స్.. రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి మెలకువలు నేర్చుకుంటారు. ఇలాంటి దాని కోసం మన దేశానికి చెందిన అమ్మాయి ఎంపిక కావడం విశేషం.(ఇదీ చదవండి: డైరెక్టర్తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) -
ప్రముఖ సింగర్పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు హాలీవుడ్లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్ తీసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.కాగా.. ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. ఈ బంధానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
హాలీవుడ్ దర్శకరచయిత ఫిలిప్ నోయిస్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ఫాస్ట్ చార్లీ. ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడిది ఇండియాలోనూ రిలీజ్ కావడంతో ఇక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూలిస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'ఇండియన్ సినిమాకు నేను పెద్ద అభిమానిని. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ మూవీ చూశాను. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప విజయం సాధించింది. అలాగే దేవ్ పటేల్ దర్శకత్వం వహించడంతో పాటు యాక్ట్ చేసిన మంకీ మాన్ కూడా బాగా నచ్చింది.ఆల్టైం ఫేవరెట్..ఈ ఏడాది ఇదే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మంకీమాన్ చిత్రంలో కథ చెప్పే విధానం కాస్త ఆర్ఆర్ఆర్ మాదిరిగా ఉంటుంది. సత్యజిత్ రే తీసిన పాతర్ పాంచాలి నా ఆల్టైమ్ ఫేవరెట్ మూవీ. బాల్యంలో ఉన్నప్పుడు ఆ సినిమా నన్ను ఎంతగానో కదిలించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో గొప్ప ఇండియన్ సినిమాలున్నాయి. ఓటీటీల పుణ్యమాని వాటిని ఎంచక్కా డిజిటల్ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. నేను ఇండియాలో సినిమా తీయాల్సి వస్తే దాన్ని గౌరవంగా భావిస్తాను. హీరో షారుక్ ఖాన్తో పని చేయాలని ఉంది. వారి బ్లడ్లోనే ఉందిఇక్కడ తీసే అద్భుతమైన సినిమాలు కొన్ని బయట దేశాల్లో విడుదల కావడం లేదు. ప్రపంచ ప్రేక్షకుల్ని మీ వైపు తిప్పుకోవాలంటే ఇంకాస్త కష్టపడాల్సి ఉంది. ఇండియన్ ప్రేక్షకులు ఎమోషన్స్ను బయటకు చూపిస్తారు. సినిమాలో లీనమైపోతారు. వారి రక్తంలోనే సినిమా అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిలిప్ నోయిస్ .. న్యూస్ఫ్రంట్, హీట్వేవ్, డెడ్ కామ్, ద క్వైట్ అమెరికన్, రాబిట్ ప్రూఫ్ ఫెన్స్, ద గీవర్, ద డెస్పరేట్ అవర్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.చదవండి: నా బయోపిక్లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా.. -
ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నా!: మైఖేల్ బి జోర్డాన్
విల్ స్మిత్ నటించిన హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘ఐయామ్ లెజెండ్’. ఫ్రాన్సిన్స్ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ఐ యామ్ లెజెండ్ 2’ని దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించారు. విల్ స్మిత్తో పాటు మైఖేల్ బి జోర్డాన్ కూడా ఈ సీక్వెల్లో నటించనున్నారు. ఈ విషయం గురించి జోర్డాన్ మాట్లాడుతూ– ‘‘ఇంకా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుంది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను. అయితే విల్ స్మిత్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ఆనందంగా ఉంది. విల్తో కెమెరా ముందు నటించే క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ‘ఐ యామ్ లెజెండ్ 2’కి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఇండియాలో ముందుగానే రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ!
విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై. ప్రముఖ ఫ్రాంచైజీలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఒక రోజు ముందుగానే భారతదేశం అంతటా భారీ స్థాయిలో జూన్ 6న విడుదలవుతోంది. ఈ యాక్షన్-అడ్వెంచర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.అత్యంత జనాదరణ పొందిన యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన బ్యాడ్ బాయ్స్ నాల్గొ విడత గురువారం రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
టైటిల్: ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్నటీనటులు: బైలీ మాడిసన్, లెవిస్ పుల్మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, ఎమ్మా బెలోమి, మార్టిన్ హెండర్సన్, డామియన్ మాఫీ, లీ ఎన్స్లిన్ తదితరులుడైరెక్టర్: జోహన్నెస్ రాబర్ట్స్జోనర్: హారర్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్రన్టైమ్: 1 గంట 25 నిమిషాలుసినీ ప్రేక్షకులు హారర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ జోనర్ చిత్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హాలీవుడ్లో హారర్ చిత్రాలకే కొదువే లేదు. ప్రస్తుతం ఓటీటీలు వచ్చాక నచ్చిన సినిమాను ఇంట్లోనే చూసేస్తున్నారు. దీంతో ఆడియన్స్కు ఒళ్లు గగుర్పొడ్చేలా లాంటి సినిమాలు సైతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి ది స్ట్రేంజర్స్ ముందువరుసలో ఉంటుంది. అలా 2008లో వచ్చిన చిత్రం ది స్ట్రేంజర్స్. ఈ సినిమాకు సీక్వెల్గా 2018లో ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను ఎంతవరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం.కథంటేంటే..బైలీ మాడిసన్, లెవిస్ పుల్మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, మార్టిన్ హెండర్సన్ నలుగురు సభ్యులు ఓకే కుటుంబం. వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్తారు. అక్కడికెళ్లిన వీరికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఫ్యామిలీ కలిసి సరదాగా వేకేషన్ ఎంజాయ్ చేద్దామనుకున్న వీరిని ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు వెంబడిస్తారు. అయితే ఆ ముగ్గురు ఎవరు? అసలు వీళ్లను ఎందుకు చంపడాయనికి వచ్చారు? వీరి నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుందా? నలుగురు ప్రాణాలతో బయటపడ్డారా? తెలియాలంటే 'ది స్ట్రేంజర్స్ :ప్రే ఎట్ నైట్' చూడాల్సిందే.కథ విశ్లేషణ..హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది దెయ్యం, భూతం లాంటివే. ఆ జోనర్లో చిత్రాలన్నీ దాదాపు అలాగే ఉంటాయని భావిస్తారు. కానీ ఇందులో మాత్రం ప్రేక్షకులకు సరికొత్త సస్పెన్స్ థ్రిల్ను అందించాడు. సినిమా ప్రారంభం నుంచే అసలు అవీ దెయ్యాలా? లేక మనుషులా అనే సస్పెన్స్ ఆడియన్స్కు కలిగేలా చూపించాడు. కథ మొత్తం ఆ నలుగురు కుటుంబ సభ్యులు, ముసుగులో ఉన్న ముగ్గురి చుట్టే తిరుగుతుంది.ఆ కుటుంబం వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వచ్చే వయొలెంట్ సీన్స్ వెన్నులో వణుకు పట్టిస్తాయి. క్షణం క్షణం ఏం జరుగుతుందో అనే ఆసక్తిని ఆడియన్స్కు కలిగించాడు. ఒకవైపు ప్రాణభయం.. మరోవైపు అంతా చీకటి.. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమా చూసేటప్పుడు ఒక్క రాత్రి ఇంత భయంకరంగా ఉంటుందా? అనే ఫీలింగ్ ఆడియన్స్కు రావడం ఖాయం. ఒక రాత్రిని ఓ యుగంలా మార్చిన డైరెక్టర్.. సరికొత్త హారర్ థ్రిల్ను అందించాడు. ఇది సీక్వెల్ కావడంతో.. ప్రీక్వెల్ చూసిన వారికి మరింత ఆసక్తిగా ఉంటుంది. చివరగా.. హారర్ జోనర్ ఇష్టపడే సినీ ప్రియులకు ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తక్కువ నిడివిలో హారర్ ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. హారర్ చిత్రాల్లో ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కాబట్టి.. సబ్టైటిల్స్తోనే చూసేయొచ్చు. -
ఓటీటీలోకి వచ్చేసిన 'గాడ్జిల్లా మైనస్ వన్'
ఈ వీకెండ్లో మూవీ లవర్స్ కోసం సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్. హాలీవుడ్ హిట్ సినిమా 'గాడ్జిల్లా మైనస్ వన్' ఓటీటీలో విడుదలట్లు ప్రకటించేసింది. 2023 ఆక్టోబర్లో మొదట జపాన్లో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గాడ్జిల్లా ఫ్రాంఛైజీలో 37వ చిత్రంగా 'గాడ్జిల్లా మైనస్ వన్' తెరకెక్కింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ను దక్కించుకున్న ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇండియాలో మాత్రం థియేటర్లలో విడుదల కాలేదు. కానీ, ఓటీటీ వేదికగా చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. అయితే ఈ సినిమా జపనీస్,ఇంగ్లీష్,తమిళ్,హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రాన్ని తకాషి యమజాకి తెరకెక్కించారు. -
ఇక ఆరంభం
ఆస్ట్రేలియాలో సముద్రపు దొంగగా మారిపోయారు ప్రియాంకా చోప్రా. న్యూజిల్యాండ్ యాక్టర్ కర్ల్ అర్బన్, ప్రియాంకా చోప్రా లీడ్ రోల్స్లో నటిస్తున్న హాలీవుడ్ ఫిల్మ్ ‘ది బ్లఫ్’. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్–జో బల్లారిని ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఆరంభం అయ్యాయని తెలియజేస్తూ, తన ఇన్స్టా స్టేటస్లో ‘ఇట్ బిగిన్స్’ అంటూ ‘ది బ్లఫ్’ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నట్లు ఓ పేజీని షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. ఈ చిత్రంలో కానర్ అనే పాత్రలో కర్ల్, ఎర్సెల్ అనే పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలోనే ఉన్నారు ప్రియాంకా చోప్రా.ఇక 19వ శతాబ్దంలో ఎర్సెల్ అనే ఓ సముద్రపు దొంగ జీవితం నేపథ్యంతో ‘ది బ్లఫ్’ సినిమా కథనం సాగుతుంది. కొన్ని కారణాల వల్ల ఎర్సెల్ అనే యువతి సముద్రపు దొంగతనాలు మానేసి, సాధారణ జీవితం గడుపుతుంటుంది. కానీ ఎర్సెల్ సముద్రపు దొంగగా ఉన్న సమయంలో చేసిన పనులు, ఆమె ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? ఆ సమస్యల నుంచి ఎర్సెల్ ఎలా బయటపడింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది బ్లఫ్’ కథనం సాగుతుందని హాలీవుడ్ టాక్. ఇక ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్లో నటించిన మరో హాలీవుడ్ ఫిల్మ్ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ రిలీజ్కు రెడీ అవుతోంది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆస్కార్ విజేత మృతి!
హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆస్కార్ అవార్డ్ విన్నర్, చిత్రనిర్మాత ఆల్బర్ట్ ఎస్ రడ్డీ కన్నుమూశారు. అనారోగ్యంతో లాస్ఎంజిల్స్లోని ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆల్బర్ట్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. ది గాడ్ఫాదర్, మిలియన్ డాలర్ బేబీ లాంటి చిత్రాలకు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. అల్ రడ్డీ సిట్కామ్ హొగన్ హీరోస్, డ్రామా వాకర్, టెక్సాస్ రేంజర్, ది లాంగెస్ట్ యార్డ్ లాంటి సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన బ్యాడ్ గర్ల్స్ (1994) చిత్రాన్ని కూడా నిర్మించాడు. ముఖ్యంగా మహిళా ప్రధాన పాత్రలతో మొదటి పాశ్చాత్య చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత బేస్ బాల్ కామెడీ ది స్కౌట్ (1994), మటిల్డా (1978) లాంటి కామెడీ ఓరియంటెస్ సినిమాలు నిర్మించారు. వీటితో పాటు డెత్ హంట్, మెగాఫోర్స్ , లాస్సిటర్, లేడీబగ్స్ , ప్రిజనర్స్, మీన్ మెషిన్ , కామిల్లె చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.Adiós al gran Albert S. Ruddy, productor (canadiense de nacimiento) con dos Oscars en su haber: EL PADRINO y MILLION DOLLAR BABY. Repitió con Clint Eastwood en CRY MACHO, y nos regaló (también como guionista y argumentista), entre otras pelis, EL ROMPEHUESOS, de Robert Aldrich. pic.twitter.com/gMlIAOMDjN— Fausto Fernández (@faustianovich) May 28, 2024 -
ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
హలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్(37)ను కొందరు దండగులు కాల్చిచంపారు. లాస్ ఏంజిల్స్లోని పికో బౌలేవార్డ్, హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. కారులో వెళ్తున్న ఆయనను దోపిడీ చేసే ప్రయత్నంలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.కాగా.. వాక్టర్ 'జనరల్ హాస్పిటల్' షోలో బ్రాండో కార్బిన్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట లైఫ్టైమ్ డ్రామా సిరీస్ 'ఆర్మీ వైవ్స్'లో అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'వెస్ట్వరల్డ్', 'స్టేషన్ 19', 'సైబీరియా', 'ఏజెంట్ ఎక్స్', 'ఫెంటాస్టిక్', 'యానిమల్ కింగ్డమ్', 'హాలీవుడ్ గర్ల్', 'ట్రైనింగ్ డే', క్రిమినల్ మైండ్స్', 'స్ట్రగ్లింగ్ సర్వర్లు', 'ది ప్యాసింజర్' 'బార్బీ రిహాబ్' లాంటి సిరీస్లలో అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా పలు షార్ట్ ఫిల్మ్లలో కూడా పనిచేశాడు. 2016లో వచ్చిన చిత్రం 'యూఎస్ఎస్ ఇండియానాపోలిస్: మెన్ ఆఫ్ కరేజ్' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు మారియో వాన్ పీబుల్స్ దర్శకత్వం వహించాడు. -
ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు: దర్శకురాలు పాయల్ కపాడియా
కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం చరిత్రలో చెప్పుకునేలా సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘భారతీయ సినిమా’ కాన్స్లో మెరిసింది. తొలి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును మన దేశ దర్శకురాలు పాయల్ కపాడియా తెచ్చారు. ప్రతిష్టాత్మక పియరీ ఏంజెనీ అవార్డును అందుకున్న తొలి ఏషియన్గా ఛాయాగ్రాహకుడు–దర్శక–నిర్మాత సంతోష్ శివన్ సగర్వంగా దేశానికి తిరిగొచ్చారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో అనసూయ సేన్ గుప్తా ‘ది షేమ్లెస్’ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు.ఇదే విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన ‘సంతోష్’ ప్రదర్శితమైంది. కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇక చిదానంద ఎస్. నాయక్ దర్శకత్వం వహించిన కన్నడ లఘు చిత్రం ‘సన్ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ‘లా సినిఫ్’ విభాగంలో మొదటి బహుమతి పొందింది. అలాగే ‘బన్నీ హుడ్’ అనే మరో భారతీయ యానిమేటెడ్ మూవీ మూడో బహుమతి సాధించింది. ఇలా ఈసారి 77వ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం హవా కనిపించింది. మే 14న ఆరంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. దర్శకురాలు పాయల్ కపాడియా అందుకున్న అవార్డు విశేషాలతో పాటు మరిన్ని విషయాలు ఈ విధంగా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రం ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ సినిమా సత్తా చాటింది.గ్రాండ్ ప్రిక్ విభాగంలో అవార్డు సాధించింది. కాన్స్ చిత్రోత్సవాల్లోని ఈ ప్రధాన విభాగంలో అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చరిత్ర సృష్టించింది. కాగా ఈ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక విభాగమైన పామ్ డి ఓర్ అవార్డుకు కూడా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం పోటీలో నిలిచినప్పటికీ, అవార్డును అందుకోలేకపోయింది. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ రూపంలో ఓ భారతీయ చిత్రం పోటీలో నిలవడం ప్రశంసించదగ్గ విషయం. ఇక పామ్ డి ఓర్ విభాగంలో దాదాపు ఇరవై సినిమాలను వెనక్కి నెట్టి, సీన్ బేకర్ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘అనోరా’ అవార్డును ఎగరేసుకుపోయింది.‘గ్రాండ్ టూర్’ సినిమాకు గాను మిగ్యుల్ గోమ్స్ ఉత్తమ దర్శకుడిగా, ‘కైండ్స్ ఆఫ్ కైండ్నెస్’ సినిమాలోని నటనకు గాను జెస్సీ ప్లేమోన్స్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఎమిలియా పరేజ్’లో నటించిన అడ్రియానా పాజ్, కర్లా సోఫియా, సెలెనా గోమేజ్, జో సల్దానాలు ఉత్తమ నటీమణులుగా నిలిచారు. జాక్వెస్ డియార్డ్ నటించిన ఈ సినిమాకే జ్యూరీ ప్రైజ్ దక్కడం విశేషం. చిత్రోత్సవాల తొలి రోజు హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, ఆ తర్వాత జపాన్కు చెందిన యానిమేషన్ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లి’ ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ అవార్డు అందుకోగా చివరి రోజు హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ స్వీకరించారు.‘‘నిజానికి స్క్రిప్ట్ రాసేటప్పుడు కంగారుపడ్డాను. ఆ కంగారులో ఏదో రాశాను (నవ్వుతూ). మా సినిమాని ఇక్కడ వరకూ తీసుకొచ్చిన ‘కాన్స్’కి థ్యాంక్స్. దయచేసి మరో భారతీయ చిత్రం కోసం 30 ఏళ్లు వేచి ఉండొద్దు’’ అని అవార్డు అందుకున్న అనంతరం పాయల్ కపాడియా అన్నారు. వేదిక మీద ఉన్న ఈ మూవీలో నటించిన కనీ కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్లను ఆత్మీయంగా హత్తుకుని, ‘‘తమ సొంత సినిమాలా భావించి చేసిన ఈ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు’’ అన్నారు.ఇంకా ఈ చిత్ర నిర్మాతలు, భాగస్వాములు, ఇతర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అది మాత్రమే కాదు... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తొలి రోజు ఫెస్టివల్ వర్కర్లు మెరుగైన వేతనాలు డిమాండ్ చేస్తూ చేసిన నిరసనకు మద్దతు తెలిపారు. పాయల్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ – ‘‘నేను తీసిన ఈ సినిమా ముగ్గురి మహిళల స్నేహం నేపథ్యంలో ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా ఒకరికొకరు గోతులు తీసుకుంటారు.సమాజం అలానే చిత్రీకరించింది. అది దురదృష్టకరం. కానీ స్నేహం అనేది నాకు ముఖ్యమైన బంధం. ఎందుకంటే అది గొప్పతనానికి దారి తీస్తుంది. కలుపుగోలుతనాన్ని పెంచుతుంది. ఈ విలువలను కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తుండాలి’’ అన్నారు. ఆమె అవార్డు తీసుకురావడం పట్ల భారత ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు.పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. కని కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్ లీడ్ రోల్స్లో ఈ సినిమాను థామస్ హకీమ్, జూలియన్ గ్రాఫ్ నిర్మించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ నెల 23న ఈ చిత్రం ప్రదర్శితమైంది. కాగా పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్కే కాన్స్లోని ఓ ప్రధాన విభాగమైన గ్రాండ్ ప్రిక్ అవార్డు రావడం విశేషం.అయితే కాన్స్లో పాయల్ ప్రతిభ మెరవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఆ ఏడాది గోల్డెన్ ఐ అవార్డు పాయల్కు దక్కింది. అలాగే 2017లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్ నూన్ క్లౌడ్’ ప్రదర్శితమైంది. ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథ ఏంటంటే... కేరళ నుంచి ముంబైకి వెళ్లి నర్సులుగా పని చేస్తుంటారు ప్రభ (కని కస్రుతి), అను (దివ్య ప్రభ). భర్తతో విడిపోయిన ప్రభకు ఓ గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ను ఆమె భర్త పంపిస్తాడు. దీంతో ప్రభకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు అను తన రిలేషన్షిప్లో ఇబ్బందులకు లోనవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ రోడ్ ట్రిప్కు వెళితే ఏం జరిగింది? అన్నదే కథ. -
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
అమెరికన్ ప్రముఖ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(41) అరెస్ట్ అయింది. అయితే, కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమెను విడుదల చేశారు. ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో నిక్కీ మినాజ్కు ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమ్స్టర్డామ్లోని షిపోల్ ఎయిర్పోర్ట్ వద్దకు నిక్కీ చేరుకుంది. తన బ్యాగ్లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమ్స్టర్డామ్ అధికారులు ఆమెను నిర్బంధించారు. దీంతో ఆమె షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సంగీత్ కార్యక్రమం వాయిదా పడింది. ఆమె పాల్గొంటున్న ప్రోగ్రామ్ కోసం సుమారు ఇరువై వేల మంది టికెట్లు కొన్నారు. నిక్కీ వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీల పేరుతో ఆమెను కొన్ని గంటల పాటు ఎయిర్పోర్టులోనే పోలీసులు ఉంచారు. ఫైనల్లీ తనవద్ద డ్రగ్స్ లేవని తేలడంతో ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. అయితే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. అయితే, పోలీసుల తీరుపట్ల నిక్కీ మినాజ్ అసహనం వ్యక్తం చేసింది. తన వద్ద డ్రగ్స్ లేకున్నా కావాలనే తన ప్రోగ్రామ్ చెడగొట్టేందుకు ఎవరో ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, తొమ్మిది అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Barbie (@nickiminaj) -
Sister Death Review: అక్కడ పేరు కనిపిస్తే మరణమే!
టైటిల్: సిస్టర్ డెత్నటీనటులు: అరియా బెడ్మర్, మరు వల్దీవిల్సో, లూయిసా మెరెలస్, చెలో వివరెస్, సారా రోచ్, అల్ముడెనా ఆమొర్ తదితరులుదర్శకుడు: పాసో ప్లాజాజానర్: హారర్ఓటీటీ ప్లాట్ఫామ్: నెట్ఫ్లిక్స్నిడివి: 1 గంట 30 నిమిషాలుహారర్ సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు! కొన్ని పేరుకే హారర్ మూవీస్ అంటారు కానీ అందులో భయపడేంత సీన్ ఏం ఉండదు. ఇక్కడ చెప్పుకునే సిస్టర్ డెత్ మూవీలో మాత్రం మొదట్లో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టేందుకు ప్రయత్నించారు. మరి అందులో సక్సెస్ అయ్యారా? అసలు ఈ సినిమా కథేంటి? ఎలా ఉందనేది రివ్యూలో మాట్లాడుకుందాం..కథసిస్టర్ నార్సిసా.. కాన్వెంట్ స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నన్స్కు ఈమె పెద్దగా నచ్చదు. అది పట్టించుకోని నార్సిసా తన పని తాను చేసుకుపోతోంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్లో బోర్డ్ మీద తనను తాను పరిచయం చేసుకుంటూ పేరు రాస్తుంది. అది చూసి అక్కడున్నవాళ్లు షాక్ అవుతారు. కారణం.. దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. అలా ఓసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది. నీకేం కానివ్వను అని హామీ ఇచ్చిన నార్సిసా ఆ బాలిక ప్రాణాలు కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడి నన్స్ నార్సిసాను వెళ్లిపోమంటారు. పెట్టేబేడా సర్దుకుని బయటకు వెళ్లిపోయే క్రమంలో నన్స్ దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి హీరోయిన్ సాయం చేస్తుంది. అందుకు కారణమేంటి? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!విశ్లేషణనన్ను దెయ్యంగా చూపిస్తూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే! కానీ ఇందులో ఆ నన్ దెయ్యంగా ఎలా మారిందని చూపించారు. కొన్ని సంఘటనలు కలలా? నిజంగా జరుగుతున్నాయా? అనేవి అర్థం కావు. రియల్ సన్నివేశాల కంటే ఆ కలలే కాస్త భయంకరంగా ఉంటాయి. దెయ్యం తన గతానికి ముడిపడి ఉన్నవారిని చంపడం ఓకే కానీ ఏ సంబంధమూ లేని చిన్నారిని బలి తీసుకోవడం మింగుడుపడదు. చాలా సింపుల్గా కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు వికృత ఆకారాలతో దెయ్యాన్ని చూపించి భయపెట్టాలనుకోలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. రాసుకున్న కథ మాత్రం బాగుంది. చివర్లో జరిగేది ప్రేక్షకుడు ముందే పసిగట్టేలా ఉండటం మైనస్. నార్సిసా పాత్రలో స్పానిష్ హీరోయిన్ అరియా బెడ్మర్ చాలా బాగా నటించింది. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. పీరియాడిక్ ఫిలిం కావడంతో సినిమా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్లోనే సాగుతుంది.సినిమాను ఒకటిన్నర గంటలో పూర్తి చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా ఎండింగ్లో ఇది వెరోనికా(2017) చిత్రానికి ప్రీక్వెల్ అని అర్థమవుతుంది. మీరు హారర్ సినిమా అభిమానులైతే వెంటనే చూసేయండి.. కాకపోతే ఈ స్పానిష్ సినిమాకు తెలుగు డబ్ వర్షన్ లేదు. హిందీ, ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది. -
కాన్స్లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్కతా. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్లో 2020 జూన్లో ‘ది షేమ్లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి
సినిమా హీరోయిన్లు చాలామంది లేటుగానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బ్యూటీ 20 ఏళ్లకే తొందరపడింది. తన 22 ఏళ్ల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరోవైపు హ్యాపీగానూ ఫీలవుతున్నారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్తో మన దగ్గర కూడా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్. దీనితో పాటు పలు సినిమాలు, ఇతర సిరీసులు కూడా ఈమె చేసింది. అయితే టీనేజీలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి మోడల్ జేక్ బొంగివోయ్తో రిలేషన్లో ఉంది. సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటకొచ్చింది.అయితే సడన్గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమేనని, గతవారం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సీక్రెట్గా జరిగింది. ఇలా చిన్న వయసులోనే 'స్ట్రేంజర్ థింగ్స్' నటి మిల్లీ బాబీ బ్రౌన్ పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది.(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ) -
పెళ్లి చేసుకున్నా బాగుండేది.. ఇవన్నీ తప్పేవి: నటి
ఇద్దరు సెలబ్రిటీలు ఒకచోట కనిపిస్తే చాలు లవ్ అని పేరు పెట్టేస్తున్నారు. డేటింగ్ అంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఓసారి ఈ రూమర్స్ బారిన పడినవారే! ఆ మధ్య బాద్షా హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో కనిపించగా సమ్థింగ్..సమ్థింగ్.. ఏదో జరుగుతోందని వెంటపడ్డారు. అలాంటిదేమీ లేదండీ బాబు అని బాద్షా స్వయంగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. పాకిస్తాన్ నటి హనియా ఆమిర్తోనూ బాద్షాను లింక్ చేశారు. వీరిద్దరూ ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇస్తుంటారు. దుబాయ్లోనూ కలుసుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.పార్టీ చేసుకున్నాం..తాజాగా తన డేటింగ్ రూమర్పై హనియా స్పందించింది. బాద్షా పాటలంటే నాకు ఇష్టం. అతడు నా ఫ్రెండ్. తనతో కలిసి పార్టీ చేసుకున్నదానికి రిలేషన్షిప్లో ఉన్నామని అతిగా ఊహించుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నేను పెళ్లి చేసుకోకపోవడమే పెద్ద సమస్య అనుకుంటా.. వైవాహిక జీవితం మొదలుపెట్టి ఉంటే ఇలాంటి రూమర్లకు దూరంగా ఉండేదాన్ని.ఆన్లైన్ ఫ్రెండ్షిప్బాద్షాతో నా స్నేహం ఎలా మొదలైందంటే.. ఇన్స్టాగ్రామ్లో నేను చేసిన రీల్కు అతడు కామెంట్ పెట్టాడు. అది నా ఫ్రెండ్ చూసి బాద్షా కామెంట్ చేశాడంది. ఏంటి, నిజమా? అని ఆశ్చర్యపోయాను. తను నాకు డైరెక్ట్గా కూడా మెసేజ్ చేశాడు. అలా ఇద్దరం మాట్లాడుకున్నాం. తను చాలా మంచి వ్యక్తి. నేనెప్పుడైనా బాధలో ఉండి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోతే.. ఏమైంది? అంతా ఓకేనా? ఏం జరుగుతోంది? అని ఆరా తీస్తుంటాడు. బాద్షా నాకు దొరికిన గొప్ప మిత్రుడు అని హనియా చెప్పుకొచ్చింది.చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ -
చరణ్-తారక్పై మనసు పారేసుకున్న హాలీవుడ్ భామ.. ఏం చెప్పిందంటే?
'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికే ఎక్కడో ఓ చోట ఇంకా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మన సినిమా కాబట్టి మనం మాట్లాడుకోవడంలో వింతేం లేదు. కానీ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దీనికి ఫిదా అయిపోయి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తాజాగా హాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' గురించి మాట్లాడుతూ తన కోరిక బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'బిగ్బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?)'నేను అందరిలానే 'ఆర్ఆర్ఆర్' సినిమాని ఎంతో ఇష్టపడ్డాను. ఇది అద్భుతంగా ఉంది. ఇందులో నటించిన వాళ్లలో ఎవరితోనైనా కలిసి పనిచేయడం నిజంగానే ఓ డ్రీమ్' అని హాలీవుడ్ నటి ఆన్ హాథవే చెప్పుకొచ్చింది.హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలైన 'ఇంటర్ స్టెల్లార్', 'ద డార్క్ నైట్ రైజెస్' తదితర సినిమాల్లో నటించిన ఆన్ హాథవే ఇప్పుడు 'ద ఐడియా ఆఫ్ యూ' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ కానుంది. దీని ప్రీమియర్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'ఆర్ఆర్ఆర్'పై తాను మనసు పారేసుకున్న విషయాన్ని బయటపెట్టింది. ఆన్ కామెంట్స్ బట్టి చూస్తే తారక్, చరణ్లతో నటించాలనుకుంటోంది. చూద్దాం మరి ఈ కాంబోని ఎవరైనా సెట్ చేస్తారేమో?(ఇదీ చదవండి: పిల్లలు వద్దని కండీషన్ పెట్టా.. ప్రెగ్నెన్సీ వస్తే రోజూ ఏడుస్తూ..: సీనియర్ నటి కవిత)Hollywood #Interstellar Movie Actress #AnneHathaway Loved #RRRMovie ❤️she would like to work With Cast Involved with RRR Movie 🔥@tarak9999 @RRRMovie pic.twitter.com/wXqiwEg5l9— Jr NTR Fan Club (@JrNTRFC) May 24, 2024 -
బయోపిక్లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ 2024లో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రముఖ వ్యాపారదిగ్గజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ‘ది అప్రెంటైస్’ అందుకు కారణం. సినిమా మట్టుకు అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలపాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినప్పటికీ.. ట్రంప్ పర్సనల్ లైఫ్లోని కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తన మాజీ భార్య ఇవానా(దివంగత)పై ట్రంప్ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్ ఉంది. ఆ సన్నివేశం కేన్స్ ఆడియొన్స్ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని చిత్రాన్ని వీక్షించిన విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కేవలం 70, 80 దశకాల్లో కేవలం ట్రంప్ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్ టవర్ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు. దావాకు రెడీమరోవైపు ఈ చిత్రం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్కు.. పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై దావా వేసేందుకు సిద్ధం అయ్యారాయన. ‘‘ ఈ చిత్రం(ది అప్రెంటైస్) ఒక చెత్త. కల్పిత కథనాలతో సంచలనంగా.. చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంపై దావా వేయబోతున్నాం’’ అని ట్రంప్ టీం ఒక అధికారిక ప్రకటక విడుదల చేసింది.ట్రంప్ ఆశ్చర్యపోతారేమో: డైరెక్టర్ అబ్బాసీఅయితే ట్రంప్ టీం దావా బెదిరింపులపైనా చిత్ర డైరెక్టర్ అలీ అబ్బాసీ స్పందించారు. డొనాల్డ్ టీం తప్పకుండా ఈ చిత్రం చూడాలని. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అంటున్నారు. అంతేకాదు ట్రంప్ సైతం ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగకపోవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారు. కానీ, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరు. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుంది. బహుశా ట్రంప్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోవచ్చు’’ అని అబ్బాసీ అన్నారు.ది అప్రెంటిస్ చిత్రంలో ట్రంప్ పాత్రను నటుడు సెబాస్టియన్ స్టాన్(మార్వెల్ చిత్రాల ఫేమ్) పోషించగా.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ జెర్మీ స్ట్రాంగ్ పాత్రలో రోయ్ కోన్, ఇవానా ట్రంప్ రోల్లో మరియా బాకాలోవా నటించారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 20వ తేదీన చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. -
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్ను కాన్స్లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్లో భారతీయం... కాన్స్లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు.