-
హెచ్ఏఎల్, మరో మూడు ఐపివోలకు సెబీ ఆమోదం
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తో సహా నాలుగు కంపెనీల ఐపీవోకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) అనుమతి లభించింది. దీంతో పాటు మరోమూడు సంస్థల ఐపీవోకు కూడా సెబీ అంగీకరించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని హెచ్ఏఎల్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్, గంధర్ చమురు శుద్ధి కర్మాగారం (ఇండియా) లిమిటెడ్, ఆస్టర్ డిఎమ్ హెల్త్కేర్ లిమిటెడ్,తొలి పబ్లిక్ ఆఫర్లను ప్రారంభించేందుకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు, సెప్టెంబరు మధ్య సెబికి తమ ముసాయిదా పత్రాలను దాఖలు చేయగా, అక్టోబర 26న సెబి పరిశీలన అనంతరం పబ్లిక్ ఆఫర్లను ప్రారంభించేందుకు అనుమతి లభించింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ ఈ ఐపీవో ద్వారా, ప్రభుత్వం ముసాయిదా పత్రాల ప్రకారం, 3.61 కోట్ల షేర్లను (10శాతంవాటాను) వరకు విక్రయిస్తుంది. ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ గ్రిఫ్ఫిన్ భాగస్వాముల ద్వారా 78,27,656 ఈక్విటీ వాటాలను, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా 19,56,914 ఈక్విటీ వాటాలను అమ్మడానికి ప్రతిపాదించింది. వ్యాపారి బ్యాంకింగ్ వర్గాల ప్రకారం ఐపీవో ద్వారా రూ .700 కోట్లు ఆర్జించాలనేది అంచనా. -
శకలాలు దొరికాయి
ఇటానగర్: భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ శకలాన్ని బుధవారం అరుణాచల్ప్రదేశ్ సమీపంలో అధికారులు గుర్తించారు. మంగళవారం హెలికాప్టర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదు. వాళ్లు ప్రాణాలతో ఉన్నారా.. లేదా అన్న విషయం తెలియడం లేదని రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అరుణాచల్ప్రదేశ్లోని పపుమ్పరే జిల్లాలో గల సగలీకు సమీపాన ఈ హెలికాప్టర్ ప్రయాణం ప్రారంభించిన కొద్ది సమయానికే రాడార్తో సంబంధాలు కోల్పోయినట్లు రక్షణశాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సంబిత్ఘోష్ తెలిపారు. సగలీ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన అడ్వాన్సెడ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్హెచ్) మంగళవారం సగలీ బయలుదేరింది. ఆ సమయంలోనే హెలికాప్టర్ అదృశ్యమైంది. -
పరీకర్ పెట్టిన టార్గెట్.. 13 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రాబోయే రెండేళ్లలో ఆయుధాల ఎగుమతులను రూ. 13.40 లక్షల కోట్లకు పెంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. ఏరోస్పేస్ అండ్ ఏఎంపీ రక్షణ సదస్సులో మాట్లాడిన ఆయన ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టం కూడా కాదని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లను తయారుచేయనున్నట్లు వివరించారు. దేశీయంగా తయారుచేసే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల ఎగుమతి విషయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులతో పలుమార్లు సమావేశమైనట్లు తెలిపారు. దాదాపు 120 తేజస్ విమానాలను తయారుచేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అందించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తయారీ విషయంలో ఒకటి లేదా రెండు మార్పులు ఉండే అవకాశం ఉందని వివరించారు. -
అమ్మకానికి ఐడీపీఎల్ భూములు!
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐడీపీఎల్తో పాటు ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలకు చెందిన నిరుపయోగ భూమిని విక్రయించాలనే యోచన ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్(బీసీపీఎల్), హిందూస్తాన్ యాంటిబయాటిక్స్(హెచ్ఏఎల్), హిందూస్తాన్ ఆర్గానిక్ కెమికల్స్(హెచ్ఓసీఎల్) తదితర కంపెనీలకు ముంబై, పుణే, తదితర ప్రధాన నగరాల్లో వేల కోట్ల విలువ చేసే భూములు నిరుపయోగంగా ఉన్నాయని వివరించారు. ఈ భూముల విక్రయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, విక్రయించాలనే అభిప్రాయం ప్రాథమికంగా వ్యక్తం అయిందని పేర్కొన్నారు. ఐడీపీఎల్కు హైదరాబాద్, గుర్గావ్, హరిద్వార్ల్లో, బీసీపీఎల్కు కోల్కతా, ముంబై, కాన్పూర్లలో హెచ్ఏఎల్కు పుణే లో, హెచ్ఓసీఎల్కు మహారాష్ట్ర, కేరళల్లో భూములున్నాయన్నారు. డిజిన్వెస్ట్మెంట్కు సమస్యల నేపథ్యంలో వాటా విక్రయం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోందని, దీంట్లో భాగంగానే ఈ భూ ముల విక్రయం తెరపైకి వచ్చిందని సమాచారం.