న్యూఢిల్లీ: రాబోయే రెండేళ్లలో ఆయుధాల ఎగుమతులను రూ. 13.40 లక్షల కోట్లకు పెంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. ఏరోస్పేస్ అండ్ ఏఎంపీ రక్షణ సదస్సులో మాట్లాడిన ఆయన ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టం కూడా కాదని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లను తయారుచేయనున్నట్లు వివరించారు.
దేశీయంగా తయారుచేసే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల ఎగుమతి విషయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులతో పలుమార్లు సమావేశమైనట్లు తెలిపారు. దాదాపు 120 తేజస్ విమానాలను తయారుచేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అందించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తయారీ విషయంలో ఒకటి లేదా రెండు మార్పులు ఉండే అవకాశం ఉందని వివరించారు.
పరీకర్ పెట్టిన టార్గెట్.. 13 లక్షల కోట్లు!
Published Sat, May 14 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Related news by tags
-
పేటీఎంను పూర్తిగా వదిలించుకున్న సాఫ్ట్బ్యాంక్
ఫిన్టెక్ మేజర్ పేటీఎం (Paytm) నుంచి జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ నిష్క్రమించింది. సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడి విభాగం సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ (SVF) జూన్ త్రైమాసికంలో సుమారు 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.సాఫ్ట్బ్యాంక్ 2017లో పేటీఎం బ్రాండ్ యజమాన్య సంస్థ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్'లో సుమారు 1.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10-12 శాతం నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎం ఐపీఓకి ముందు సాఫ్ట్బ్యాంక్ పేటీఎంలో దాదాపు 18.5 శాతం వాటాను కలిగి ఉంది.సాఫ్ట్బ్యాంక్ ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 17.3 శాతం వాటాను, ఎస్వీఎఫ్ పాంథర్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఎస్వీఎఫ్ పాంథర్ ఐపీఓ సమయంలో తన మొత్తం వాటాను రూ.1,689 కోట్లకు అంటే దాదాపు 225 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ పేటీఎంలో తన మిగిలిన 1.4 శాతం వాటాను విక్రయించింది.ఐపీఓ జరిగిన 24 నెలల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించనున్నట్లు గతంలోనే సాఫ్ట్బ్యాంక్ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు బయటకు వచ్చేసింది. అయితే, ఆ సమయంలోనే కంపెనీ నష్టాన్ని అంచనా వేసిందని కంపెనీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. అప్పట్లో సాఫ్ట్బ్యాంక్ పేటీఎం షేర్లను సగటున రూ.800 చొప్పున కొనుగోలు చేసింది. -
సీబీడీటీ కొత్త చైర్మన్గా రవి అగర్వాల్
ఆదాయపు పన్ను శాఖ పరిపాలనా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్గా 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ 1986 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది.గుప్తా 2022 జూన్లో సీబీడీటీ చీఫ్గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబరులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా జూన్ వరకు తొమ్మిది నెలల పొడిగింపు ఇచ్చారు. కొత్త సీబీడీటీ చీఫ్ ప్రస్తుతం బోర్డులో మెంబర్ (అడ్మినిస్ట్రేషన్)గా వ్యవహరిస్తున్నారు.అగర్వాల్ 2025 జూన్ వరకు సీబీడీటీకి నేతృత్వం వహిస్తారని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అగర్వాల్ సెప్టెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, నియామక నిబంధనల సడలింపులో తిరిగి నియమితులైన కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తించే సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పునర్నియామకం కొనసాగుతుందని ఆయన నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సీబీడీటీకి చైర్మన్ నేతృత్వం వహిస్తుండగా, ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రగ్యా సహాయ్ సక్సేనా, హెచ్బీఎస్ గిల్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, సంజయ్ కుమార్ వర్మ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. జూన్ 30వ తేదీన వర్మ పదవీ విరమణ చేస్తున్నారు. -
విజయ్ మాల్యా ఇంట పెళ్లి సందడి
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరూ ఫొటో షూట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా? లేదంటే కొద్ది మంది సమక్షంలోనే జరపనున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వీళ్లిద్దరూ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. కిందటి ఏడాది హలోవీన్ సందర్భంలో రింగ్ తొడిగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు సిద్ధార్థ్. అలా ఆ ప్రపోజల్తో ఈ జంట వార్తల్లోకి ఎక్కింది. జాస్మిన్ ఇన్స్టా బయోలో యూఎస్ అని ఉంది. ఆమె ప్రొఫైల్ను బట్టి మాజీ మోడల్గా తెలుస్తోంది. ఇంతకి మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె కుటుంబ నేపథ్యం తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధార్థ్ నటుడిగా, మోడల్గా పరిచయస్థుడే. విజయ్ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతులకు సిద్ధార్థ్ జన్మించాడు. కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్లో పుట్టి.. లండన్, యూఏఈలో పెరిగాడు సిద్ధార్థ్. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్ తరఫున ఆర్బీబీ డైరెక్టర్గానూ వ్యవహరించిన సిద్ధార్థ్.. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్ఫిషర్ మోడల్స్ జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్గా మారాడు. నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే.. ఆ తర్వాతే సిద్ధార్థ్ కెరీర్లో మార్పు కనిపించింది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ వైపు మళ్లిన సిద్ధార్థ్.. యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు. View this post on Instagram A post shared by Sid (@sidmallya)ఇక.. సిద్ధార్థ్ తండ్రి విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఆయన భారత్లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది. అతడు ఫ్రాన్స్లో 35 మిలియన్ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్మో హోల్డింగ్ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరో వైపు ఫ్రాన్స్ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది. -
జొమాటో చేతికి ఆ పేటీఎం బిజినెస్.. పురోగతిలో చర్చలు!
పేటీఎంకు సంబంధించిన మూవీ టికెటింగ్ అండ్ ఈవెంట్స్ బిజినెస్ను ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కొనుగోలు చేయబోతోంది. రూ.1,500 కోట్లకు ఈ బిజినెస్ను కొనుగోలు చేసేందుకు జొమాటో చర్చలు జరుపుతోందని, ఈ చర్చలు పురోగతిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.పేటీఎం ఈవెంట్లు, మూవీ టికెటింగ్ వ్యాపారంపై జొమాటో ఆసక్తి వ్యూహాత్మకంగా సరిపోతుందని, ఆహారం, కిరాణా, వినోదంతో సహా వివిధ కేటగిరీల్లో వినియోగదారుల డిమాండ్ను చేజిక్కించుకోవడమే దాని విస్తృత లక్ష్యమని ఈటీ నివేదిక పేర్కొంది. ఈ కొనుగోలు ఖరారైతే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్)ను కొనుగోలు చేసిన తర్వాత జొమాటోకి ఇది రెండో అతిపెద్ద కొనుగోలు అవుతుంది. 2022లో రూ.4,447 కోట్ల విలువైన బ్లింకిట్ను జొమాటో కొనుగోలు చేసింది.క్విక్ కామర్స్ విభాగంలో పోటీ పెరిగిన నేపథ్యంలో జొమాటో తన క్విక్ కామర్స్ అనుబంధ సంస్థ బ్లింకిట్ లోకి రూ.300 కోట్లు చొప్పించనుంది. తాజా విడతలో బ్లింకిట్ లో జొమాటో మొత్తం పెట్టుబడులు రూ.2,300 కోట్లకు చేరినట్లు టోఫ్లర్ నుంచి లభించిన ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది. పేటీఎం తన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ బిజినెస్కు సంబంధించిన వ్యాపార గణాంకాలను వెల్లడించలేదు. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం తన మార్కెటింగ్ సేవల వ్యాపారంలో రూ .1,740 కోట్లు వార్షిక అమ్మకాలను నివేదించింది, ఇందులో సినిమా, ఈవెంట్లు, క్రెడిట్ కార్డ్ మార్కెటింగ్, గిఫ్ట్ వోచర్లు ఉన్నాయి. -
మస్క్కు జాక్పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్తో సందడి చేశారు. టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024
Related News by category
-
స్నానానికి దిగి గల్లంతైన నవ వధూవరులు
కలిదిండి/కై కలూరు/కాళ్ల: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి ముచ్చటగా రెండు మాసాలు గడవలేదు. పెళ్లి పందిరి తోరణాలు కూడా వాడలేదు. అంతలోనే నవవధూవరులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు నూతన జంట గల్లంతయ్యారనే సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది బీచ్లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనతో వధూవరుల ఇళ్లు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఏలూరు జిల్లా కలిదిండి మండలం గుర్వాయిపాలెం గ్రామానికి చెందిన అంబటి పరుశురామయ్య, ఉదయలక్ష్మీ మొదటి కుమార్తె గాయత్రీ (21)ని పశ్చిమగోదావరి జిల్లా జువ్వాలపాలెంకు చెందిన రేలంగి బసవలింగం, జయలక్ష్మీ కుమారుడు లక్ష్మీనారాయణ (26)తో నవంబర్ 1న కై కలూరు నియోజకవర్గం సింగరాయపాలెం గుడిలో ఘనంగా వివాహం జరిపించారు. లక్ష్మీనారాయణ బీటెక్, బీఈడీ చేసి భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో కొత్త దంపతులు లక్ష్మీనారాయణ, గాయత్రీ ద్విచక్రవాహనంపై మధ్యాహ్నం 3 గంటలకు అంతర్వేది దేవాలయాన్ని దర్శించుకుని నాలుగు గంటలకు బీచ్కు వెళ్లారు. బంధువులతో కలిసి కాకుండా వాహనంపై బీచ్లో దూరంగా వెళ్లారు. అక్కడ వాహనం, సెల్ఫోన్లు ఉంచి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. తరువాత కొద్ది సమయానికే వీరు కనిపించలేదు. సెల్ఫోను ఆధారంగా బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో వరుడి తండ్రి బసవలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు, మైరెన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు వారి జాడ లేదు. -
‘ఆప్’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతీకి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఆసుపత్రి ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్ధారణ కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తున్నట్లు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర పాండే శనివారం స్పష్టం చేశారు. రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమ్నాథ్ భారతీకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. 2016 సెప్టెంబర్ 9న సోమ్నాథ్ భారతీ మరో 300 మందితో కలిసి ఎయిమ్స్ ప్రహరీ గోడపై ఉన్న ఫెన్సింగ్ను ధ్వంసం చేసినట్లు కేసు నమోదయ్యింది. అంతేకాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో 2014లో అర్ధరాత్రి సమయంలో ఓ ఆఫ్రికా మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. -
కరోనా వ్యాక్సిన్ ‘రెడీ టూ యూజ్’ : రష్యా మంత్రి
మాస్కో: కరోనా వైరస్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వేగంగా కదులుతున్న రష్యా మరో కీలక విషయాన్ని ప్రకటించింది. తమ దేశానికి చెందిన కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ వాడకానికి వచ్చే నెలలోనే సిద్ధంగా ఉంటుందని ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్ ప్రకటించారు. మాస్కోకు చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలికోవ్ ఈ విషయం చెప్పారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. తమ వ్యాక్సిన్కు సంబంధించిన మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశామని సాలికోవ్ తెలిపారు. ముఖ్యంగా రెండవ దశ పరీక్షలు విచారణ సోమవారం ముగిసాయనీ, వీరందరూ కరోనావైరస్ నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నారని, త్వరితంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను వేలాదిమందిపై త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఎపుడు మొదలుపెట్టేదీ, టీకా ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సాలికోవ్ చేసిన వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా మాస్కోలోని ప్రభుత్వ సంస్థ గమలేయ ఇన్స్స్టిట్యూట్ అండ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో కరోనావైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యన్ ఆర్మీ ఇటీవల ప్రకటించింది. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేలాది మంది వాలంటీర్లతో దశ-3 మానవ క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయనీ, టీకా పంపిణీ సెప్టెంబరు నాటికి ప్రారంభమవుతుందని (ఆర్డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రోవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిమిత్రోవ్ ప్రకారం, దేశీయంగా 30 మిలియన్ మోతాదులను, అంతర్జాతీయంగా170 మిలియన్లను తయారు చేయనుంది. వ్యాక్సిన్ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి. -
శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరిదేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాదిలానే తెలంగాణా నుంచి అమ్మ వారికి బోనాలను సమర్పించేందుకు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం ఇంద్రకీలాద్రికి విచ్చేయనుంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మ వారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్త బృందాలు అమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఉత్సవాలు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తాయి. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు అమ్మ వారి దర్శనాన్ని నిలిపివేస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు అమ్మ వారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాలను, మూలవిరాట్లకు కాయగూరలు, పండ్లు, డ్రైప్రూట్స్తో అలంకరిస్తారు. ఆలయాలను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించేందుకు అవసరమైన కూరగాయల దండలను సేవా సిబ్బంది, భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపుగా బోనాలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనాలను సమర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది. కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ అమ్మ వారి అలంకరణకు తొలి రోజైన ఆదివారం ఆకుకూరలను వినియోగిస్తారు. రెండో రోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడో రోజైన మంగళవారం బాదం, జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ప్రూట్స్తో అలంకరిస్తారు. అమ్మ వారి అలంకరణకు ఉపయోగించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడు రోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకూకూరలను దండలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తుంటారు. దేవస్థానం కదంబం ప్రసాదాన్ని అమ్మ వారి మహా ప్రసాదంగా భక్తులకు వితరణ జరుగుతుంది. దేవస్థాన ఉచిత ప్రసాదాల కౌంటర్లో కదంబం ప్రసాదాన్ని వితరణ చేస్తారు. నేడు లక్ష మంది దర్శనం ఒక వైపు శాకంబరిదేవి ఉత్సవాలు, మరో వైపున తెలంగాణా నుంచి బోనాలు, ఆదివారం, ఆషాఢ సారెను సమర్పించేందుకు తరలివచ్చే భక్త బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ నెలకొంది. ఒకే రోజు మూడు విశేషమైన ఉత్సవాలు జరుగుతుండటంతో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష పైబడి భక్తులు అమ్మ వారి దర్శనానికి విచ్చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మ వారి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి. మరో వైపున ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాలను దేవస్థాన కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
నరసాపురంలో జిల్లా విజయోత్సవ అభినందన సభ
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని, అందుకే తెలివిగా వ్యవహరించి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో నరసాపురంలో జిల్లా విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా, ప్రజలకు నిజాయితీతో కూడిన పాలన అందించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘురామకృష్ణంరాజు, కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొన్నారు.