-
మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
మనం నిత్యం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వేసవికాలంలో వేడిగా అవడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు సాధారణమే.. అలాగే అవే ఫోన్లు వర్షాకాలంలో, చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటే అది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ పేలుళ్లు సంభవించడానికి కారణం కూడా ఈ ఓవర్ హీటే.ఈ ప్రమాదాలు నివారణకై.. గూగుల్ తన కోట్లాది ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొత్త అడాప్టివ్ థర్మల్ ఫీచర్ను తీసుకురానుంది. ఈ ఫీచర్ స్మార్ట్ఫోన్ కు 'కవచం' లాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోగానీ, ఫోటోస్ గానీ తీయటం, చార్జింగ్ పెట్టి మరిచపోవటంలాంటివాటితో ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలడం, మంటలు రావడం జరుగుతూంటాయి.ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానకి గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్పై కసరత్తు చేస్తోంది. ఫోన్ వేడెక్కడం ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ వినియోగదారులకు వెంటవెంటనే నోటిఫికేషన్లను పంపడంతోపాటు అలర్ట్ మెసేజ్ లు కూడా పంపిస్తుంది.ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ గూగుల్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ ఫీచర్ తీసుకురానుంది. కంపెనీ ఈ సేఫ్టీ ఫీచర్కి 'అడాప్టివ్ థర్మల్' అని పేరు పెట్టింది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, ఈ గూగుల్ ఫీచర్ ప్రీ-ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేయడంతో.. వినియోగదారు ఆ సమయాననికి ఫోన్ వాడటం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఫోన్ బ్యాటరీ చల్లగవడానికి సమయం లభిస్తుంది. ఫోన్ పనితీరు మందగించదు.గూగుల్ కంటే ముందు ఐఫోన్ లో ఈ రకమైన ఫీచర్ ఉంది. బ్యాటరీ హీట్ నుంచి రక్షణగా ఇలాంటి హెచ్చరిక మెసేజ్ లు కూడా మీరు పొంది ఉంటారు. ఇకపై గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో ఈ పీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత దీనిని ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా విడుదల చేయవచ్చు.ఇవి చదవండి: జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట! -
భారత్లో గూగుల్ ‘జెమిని’ యాప్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్ ‘జెమిని’ ఆండ్రాయిడ్ యాప్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్ను ప్రవేశపెడతామని పేర్కొంది. భారత్లో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు వివిధ వర్గాల వారు ఉత్పాదకతను పెంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని జెమిని ఎక్స్పీరియన్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమర్ సుబ్రమణ్య ఒక బ్లాగ్ పోస్ట్లో తెలిపారు. తాజాగా గూగుల్కి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జెమిని 1.5 ప్రో ఫీచర్లు కూడా భారత్లోని యూజర్లకు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
భారత్లో గూగుల్ జెమిని లాంచ్ - తొమ్మిది భాషల్లో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న తరుణంలో గూగుల్ తన AI అసిస్టెంట్ 'జెమినీ' మొబైల్ యాప్ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ యాప్ ఇప్పుడు భారతదేశంలో ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.గూగుల్ జెమినీ యాప్లో తనకు కావాల్సిన అంశం గురించి సెర్చ్ చేయవచ్చు లేదా వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇది చదువుకొని వారికి కూడా ఉపయోగపడుతుంది. మొత్తం 9 భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారుడు స్థానిక భాషలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.మేము స్థానిక భాషలను జెమిని అడ్వాన్స్డ్కి జోడించడంతోపాటు ఇతర కొత్త ఫీచర్లను రానున్న రోజుల్లో తీసుకువస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పరిమితమై ఉందని, త్వరలోనే ఐఫోన్ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.Exciting news! 🇮🇳 Today, we're launching the Gemini mobile app in India, available in English and 9 Indian languages. We’re also adding these local languages to Gemini Advanced, plus other new features, and launching Gemini in Google Messages in English. https://t.co/mkdSPZN5lE— Sundar Pichai (@sundarpichai) June 18, 2024 -
యూట్యూబ్లో అదిరిపోయే మరో ఫీచర్
యూట్యూబ్.. ఈ యాప్ గురించి తెలియనివారెవరూ ఉండరు. వినోదానికి కేరాఫ్ అడ్రస్గా మారిన యూట్యూబ్.. వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సమాచారాలకు సంబంధించిన వీడియోలను ముందుకు తీసుకువస్తుంది. తాజాగా యూట్యూబ్లో మరో ఫీచర్ దర్శనవివ్వనుంది. అది యూజర్స్కు సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు. గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ ప్రతి స్మార్ట్ఫోన్లోనూ ఇన్స్టాల్ అయి ఉంటుంది. స్మార్ట్ఫోన్ వినియోగదారులు రోజులో కొంతసేపైనా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అత్యధిక వినియోగదారుల బేస్ కలిగిన యూట్యూబ్ మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తరచూ నూతన ఫీచర్లను అందిస్తుంటుంది.త్వరలో యూట్యూబ్లో గూగుల్ లెన్స్ బటన్ యూజర్స్కు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఫోను వినియోగదారులు గూగుల్ లెన్స్ బటన్ ఉపయోగించడం ద్వారా టైప్ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను శోధించవచ్చు. యూట్యూబ్ యాప్ అప్డేట్లో గూగుల్ లెన్స్ బటన్ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్ యూజర్స్ ఫోనులోని మైక్రోఫోన్ బటన్ సహాయంతో, మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం ఉంది. -
టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్
భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభ చాటుతున్నారు. అందులో ప్రపంచ నం.1 సెర్చ్ఇంజిన్ కంపెనీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు ప్రత్యేకస్థానం ఉంది. తమిళనాడులోని మధురైలో పుట్టి టాప్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఈఓగా ఎంపికవ్వడం మామూలు విషయంకాదు. ఈరోజు సుందర్ పిచాయ్(52) పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి తోటి ఉద్యోగులు సుందర్పిచాయ్గా పిలవడం ప్రారంభించారు. ఆయన 1972, జూన్ 10న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి లక్ష్మి, స్టెనోగ్రాఫర్..తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ హయాంలో జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ(జీఈసీ)లో ఇంజినీర్గా పనిచేసేవారు. సుందర్ స్థానికంగా ఉన్న వనవాణి మెట్రిక్యులేషన్ పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేశారు. అనంతరం అధ్యాపకులు అక్కడే పీహెచ్డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లి సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.చదువుపూర్తయ్యాక అప్లైడ్మెటీరియల్స్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేశారు. మెకిన్సే అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టింగ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ టూల్బార్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర అప్లికేషన్ల అభివృద్ధిని పర్యవేక్షించారు.మార్చి 13, 2013న పిచాయ్ తాను పర్యవేక్షించిన గూగుల్ ఉత్పత్తుల జాబితాను ఆండ్రాయిడ్కు జోడించారు. ఆగస్టు 10, 2015లో పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ ఆయన సారథ్యంలో ఇటీవల ‘జెమినీ’ అనే జనరేటివ్ ఏఐను ఆవిష్కరించింది. ఆయన టెక్ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్తో గౌరవించింది. 2019 డిసెంబర్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్ 2022 సంవత్సరానికిగానూ 226 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్జాబ్స్..!టెన్షన్ పడిన సీఈఓ..సుందర్ది ప్రేమ వివాహం. ఐఐటీ ఖరగ్పుర్లో బీటెక్ చూస్తున్నపుడు అంజలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు. తన భార్య గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మేం ఖరగ్పుర్ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్ చేసేటప్పుడు నా టెన్షన్ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు. నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు. తక్షణ పరిష్కారాన్ని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్, యాహూ, ట్విటర్ వంటి సంస్థల నుంచి అవకాశాలెన్నో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పుడు గూగుల్ నుంచి వెళ్లొద్దన్న తన సూచనను పాటించడమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది’ అన్నారు. సుందర్ దంపతులకు కావ్య పిచాయ్, కిరణ్ పిచాయ్ ఇద్దరు పిల్లలు. -
చిలుకూరు ఆలయంపై తప్పుడు ప్రచారం
-
గూగుల్పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
Tech Talk: గూగుల్ 'ఆస్క్ ఫొటోస్' తో.. ఈ వెతుకులాటకి చెక్!
టెక్ దిగ్గజం గూగుల్ రకరకాల కొత్త ఫీచర్ల గురించి ప్రకటించింది. అందులో ‘ఆస్క్ ఫొటోస్’ ఒకటి. అడ్వాన్స్డ్ జెమిని ఏఐ మోడల్తో వస్తున్న ఈ ఫీచర్ను యూజర్లు తమ ఫొటో కలెక్షన్స్తో ఇంటరాక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. యూజర్లు తమ గ్యాలరీని విస్తరించినప్పుడు వారికి అవసరమైన ఫొటోను కనుక్కోవడం కష్టంగా ఉండవచ్చు.దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పెసిఫిక్ ఫొటోను త్వరగా కనిపెట్టడానికి ‘ఆస్క్ ఫొటోస్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. కీవర్డ్ కాంబినేషన్స్తో పనిలేదు. ప్రాంప్ట్ చాలు. ఉదాహరణకు... ‘షో మీ ది బెస్ట్ ఫొటో ఫ్రమ్ ఈచ్ నేషనల్ పార్క్ ఐ హ్యావ్ విజిటెడ్’ అని ప్రాంప్ట్ ఇస్తే సంబంధిత ఇమేజ్లను చూపిస్తుంది. ఈ ఏఐ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.... యూజర్లు తమ ఫొటోల గురించి వివరంగా అడగవచ్చు.హువావే వాచ్ ఫిట్ 3డిస్ప్లే: 1.82 అంగుళాలురిజల్యూషన్: 480“408 పిక్సెల్స్బరువు: 26 గ్రా బ్యాటరీ: 400 ఎంఏహెచ్- ఆటోమెటిక్ప్రాంప్ట్స్ – ట్రాక్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్, వెదర్ వార్నింగ్స్ డిస్ప్లేఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కు సంగీతం..ఇన్స్టాగ్రామ్ప్రొఫైల్కు పర్సనలైజ్డ్ టచ్ ఇవ్వడానికి, మ్యూజిక్ ద్వారా మన మూడ్ను రెఫ్లెక్ట్ చేయడానికి ఉపకరించే లేటెస్ట్ ఫీచర్ ఇది. దీని కోసం...– ఇన్స్టాగ్రామ్ యాప్ను అప్డేట్ చేయాలి– ప్రొఫైల్ స్క్రీన్తో యాక్సెస్ కావడానికి బాటమ్ రైట్ కార్నర్లోనిప్రొఫైల్ పిక్చర్ ట్యాప్ చేయాలి– ఎడిట్ప్రొఫైల్–ట్యాప్– మ్యూజిక్–ట్యాప్– పాటను ఎంపిక చేసుకోవడానికి ప్రొఫైల్ సాంగ్ సెక్షన్లో ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయాలి.షావోమీ ప్యాడ్ 6ఎస్ ప్రో 12.4..డిస్ప్లే: 12.40 అంగుళాలు ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 10000 ఎంఏహెచ్ రిఫ్రెష్ రేట్: 144 హెచ్జడ్మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 256జీబి 12జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్డ్రీమ్ స్క్రీన్..‘డ్రీమ్ స్క్రీన్’ అనే కొత్తఫీచర్ని పరీక్షిస్తోంది యూట్యూబ్. ఏఐ ద్వారా ‘షార్ట్స్’కు బ్యాక్డ్రాప్ను జెనరేట్ చేసే ఫీచర్ ఇది. యూజర్లు డ్రీమ్ స్క్రీన్కు యాక్సెస్ ΄÷ందిన తరువాత బ్యాక్గ్రౌండ్లో తమకు ఏమి కావాలో వివరిస్తూప్రాంప్ట్ ఇవ్వవచ్చు.ఉదా: ఒక ద్వీపంలో ఫ్యాన్సీ హోటల్. ఇమేజ్ జనరేట్ అయిన తరువాత వెంటనే బ్యాక్గ్రౌండ్కు జత చేయవచ్చు. ఈ ప్రయోగాత్మక ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన ‘షార్ట్స్’ క్రియేటర్స్ మాత్రమే అందుబాటులో ఉంది.ఇవి చదవండి: Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్లో ఉంటాయి’ -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్గా గూగుల్లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
గూగుల్ మ్యాజిక్ ఎడిటర్.. గురించి ఎప్పుడైనా విన్నారా!
పాత పిక్సెల్ ఫోన్లకు ‘మ్యాజిక్ ఎడిటర్’ను తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించింది. ‘మ్యాజిక్ ఎడిటర్’లో రకరకాల ఇమేజ్ ఎడిటింగ్, ఎన్హాన్స్మెంట్ టూల్స్ ఉంటాయి. ఫొటో రిసైజ్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి, యూనిక్ ఫిల్టర్లను అప్లై చేయడానికి మ్యాజిక్ ఎడిటర్ ఉపయోగపడుతుంది.కొత్త ఫ్రీ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్లు ప్రస్తుతం కొన్ని పిక్సెల్స్ 7, పిక్సెల్స్ 6 సిరీస్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. ‘మ్యాజిక్ ఎడిటర్’తోపాటు ఫొటోఅన్బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, పోట్రాయిట్ లైట్లాంటి ఏఐ–పవర్డ్ ఫొటో–ఎడిటింగ్ ఫీచర్లు అన్ని ఆండ్రాయిడ్ డివైజ్లకు అందుబాటులోకి రానున్నాయి.యాపిల్ ఐపాడ్ ప్రో 11బాడీ: 249.7“177.5“5.3 ఎంఎం; బరువు: 466 గ్రా.; డిస్ప్లే: 11.00 వోఎస్/సాఫ్ట్వేర్: ఐపాడ్వోఎస్ 17.5; రిజల్యూషన్: 1668“2420; బ్యాటరీ: 7,606 ఎంఏహెచ్; మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 8జీబి ర్యామ్/ 1టీబి 16జీబి ర్యామ్/ 2టీబి 16జీబి ర్యామ్పోకో ఎఫ్ 6..సైజ్: 6.67 అంగుళాలు రిజల్యూషన్: 1220“2712 పిక్సెల్స్బరువు: 179 గ్రా; బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ఇంటర్నల్: 256జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్ కలర్స్: బ్లాక్, గ్రీన్, టైటానియంఇవి చదవండి: సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే! -
నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్
బెంగళూరులో ఇటీవల లీజుకు తీసుకున్న ఆఫీస్ స్థలానికి గూగుల్ ఏకంగా నెలకు రూ.4కోట్లు అద్దె చెల్లించనుంది.మీడియా సంస్థల కథనం ప్రకారం..బెంగళూరు వైట్ఫీల్డ్లోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ ఇటీవల లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ.62 నెలవారీ అద్దె రేటుతో కార్యాలయాన్ని మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్తో ఒప్పందం చేసుకుంది. దాంతో మొత్తం ఆఫీస్ స్థలానికి రూ.4,02,38,000 నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంది.గూగుల్ కనెక్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్లో 6లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజును పునరుద్ధరించింది. 2020 నుంచి భారత్లో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్ఫోలియోను 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర పెంచింది. దాంతో మొత్తం దేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్స్పేస్ను కలిగి ఉంది.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’గూగుల్ తన ఉత్పత్తులను భారత్లో తయారు చేయాలని భావిస్తోంది. దాంతో స్థానికంగా మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని ఫాక్స్కాన్ ఫెసిలిటీలో స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. గతేడాది జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్లో ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. -
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
టెక్నలాజి పెరుగుతున్న తరుణంలో యూజర్లకు కూడా.. కొత్త ఫీచర్స్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల ప్రారంభంలో గూగుల్ ఏఐ సెర్చింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ సమాధానాలను అందిస్తోంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ కొత్త ఫీచర్ యూజర్లను తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఒక యూజర్ రోజుకు ఎన్ని రాళ్లు తినాలి అని అడిగితే.. రాళ్ళల్లో మినరల్స్ ఉంటాయి. కాబట్టి రోజుకు కనీసం ఒక చిన్న రాయి తినండి అని సమాధానం ఇచ్చింది.మరో యూజర్ పిజ్జా మీద చీజ్ నిలబడలేదు, ఏం చేయాలి అని అడిగినప్పుడు.. గ్లూ (గమ్) వేసుకోండి అని.. సింపుల్గా సమాధానం ఇచ్చింది. ఇంకొకరు ఎంత మంది ముస్లింలు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడయ్యారు అని గూగుల్ ఏఐని అడిగినప్పుడు.. యునైటెడ్ స్టేట్స్లో ఒక ముస్లిం అధ్యక్షుడు ఉన్నారు. ఆయన పేరు బరాక్ హుస్సేన్ ఒబామా అని సమాధానం ఇచ్చింది.గూగుల్ ఇచ్చిన సమాధానాలను యూజర్లు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. గూగుల్ ఏఐను విమర్శిస్తున్నారు.Google AI is diabolical 💀 pic.twitter.com/YDw34414TO— no context memes (@weirddalle) May 24, 2024 -
సంచలన నివేదికలు.. మరోసారి తెరపైకి షానన్ - మస్క్ సాన్నిహిత్యం
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్య కోల్ షానన్కు, మస్క్కు సాన్నిహిత్యం ఉందని.. ఆ కారణంగానే సెర్గీ, నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.సెర్గీబ్రిన్, ఎలోన్ మస్క్ ఒకప్పుడు ప్రాణస్నేహితులు. కాబట్టే మస్క్ ఎదుర్కొన్న అనేక ఆర్ధిక ఇబ్బందుల నుంచి సెర్గీబ్రిన్ బయటపడేసినట్లు మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అయితే, ఇంతటి ప్రాణ స్నేహితులు విడిపోవడానికి నికోల్ షానన్తో మస్క్కు ఉన్న సాన్నిహిత్యమేనేని నిర్ధారించారు.షానహన్ -సెర్గీ బ్రిన్లు 2018లో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత కోల్ షానన్కు, మస్క్కు సాన్నిహిత్యం బయటపడడంతో సెర్గీ-నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారు. సెటిల్ మెంట్ కింద నికోల్కు సెర్గీ 1 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఎనిమిది మంది వ్యక్తులు సాక్షులు ,కీలక డాక్యుమెంట్లను న్యూయార్క్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. ‘ఏ రన్నింగ్ మేట్స్ హిస్టరీ’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. ఈ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని షానహన్-సెర్గీ బ్రిన్లు ఖండించారు. -
ఈ-కామర్స్ రంగంపై గూగుల్ కన్ను.. ఫ్లిప్కార్ట్లో భారీ పెట్టుబడులు
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారత్ ఈ-కామర్స్ రంగంపై కన్నేసింది. దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో 350 మిలియన్ డాలర్ల విలువైన మైనారిటీ వాటాను కొనుగోలు చేయనుందని సమాచారం. ఫ్లిప్కార్ట్ విలువ 37 బిలియన్ డాలర్లు.అయితే ఈ కొనుగోలుపై గూగుల్,ఫ్లిప్కార్ట్ స్పందించలేదు. కానీ వాటా కొనుగోలుపై రెగ్యులరేటరీ నుంచి ఆ రెండు సంస్థలు అనుమతులు తీసుకున్నాయంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.గూగుల్ తన పెట్టుబడితో ఫ్లిప్కార్ట్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు, దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించేందుకు, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో సహాయపడతాయి అని ఫ్లిప్కార్ట్ తెలిపింది.రీసెర్చ్ సంస్థ రెడ్ సీర్ అంచనాల ప్రకారం.. భారతదేశ ఈ-కామర్స్ మార్కెట్ 2023లో 60-65 బిలియన్ల నుండి 2030 నాటికి 200-230 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఈ తరుణంలో బడాబడా కంపెనీలు భారత్ ఈ-కామర్స్ రంగంపై దృష్టి సారించాయి. తమ సేవల్ని విస్తరించనున్నాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు, తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభ్యంతో ఈకామర్స్ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగా 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులతో ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు, బ్లింకిట్, మీషో, నైకా వంటి ఇతర సెగ్మెంట్లోని ఈ-కామర్స్ సంస్థల వ్యాపారం జోరుగా సాగుతోంది. -
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
ఆన్లైన్ పేమెంట్ యాప్లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్ (గూగుల్ పే) జూన్ నాలుగు తరువాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది.ఇండియా, సింగపూర్ మినహా జూన్ 4 తరువాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని స్థానంలో గూగుల్ వాలెట్ వస్తుంది. అమెరికాలో గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఎక్కువమంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలు భారత్, సింగపూర్ దేశాల్లో యధివిధాగా కొనసాగుతాయి. కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వాలెట్కి మారాలని కంపెనీ కోరింది. గూగుల్.. తన గూగుల్ వాలెట్ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'గూగుల్ పే'ను కంపెనీ సుమారు 180 దేశాల్లో గూగుల్ వాలెట్తో రీప్లేస్ చేసినట్లు సమాచారం. -
ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు
ఆల్ఫాబెట్ ఇంక్ ఇటీవల నిర్వహించిన గూగుల్ I/O 2024 సదస్సులో ఆండ్రాయిడ్ 15 బీటా 2ను పీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ ఫోన్ను గూగుల్ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. దాంతో కొత్త ఫీచర్లు తమ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంచింది.గూగుల్ ప్రకటించిన ఈ ఫీచర్లను త్వరలో ఆండ్రాయిడ్ వాడుతున్న ఇతర కంపెనీ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. డెవలపర్ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్గా బీటా 2 అప్డేట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఆండ్రాయిడ్ 15 బీటా 2లో కొన్ని ఫీచర్లు..ఆండ్రాయిడ్ 15 బీటా 2లో ప్రైవేట్ స్పేస్ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక ప్రొఫైల్ను క్రియేట్ చేసి కావాల్సిన యాప్లను విడిగా సేవ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ లాక్ చేసినప్పుడు అవి కనిపించవు.ప్రైవేట్ స్పేస్లోని యాప్లన్నీ లాంఛర్లోని ప్రత్యేక కంటైనర్లో ఉంటాయి. రీసెంట్ యాప్స్, నోటిఫికేషన్స్, సెటింగ్స్లోనూ కనిపించవు.ఫీచర్ యాప్ పెయిర్స్ అనే కొత్త ఫీచర్తో స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఒకేసారి రెండు యాప్లను లాంఛ్ చేయొచ్చు. తరచూ ఉపయోగించే యాప్లను వెంటవెంటనే ఓపెన్ చేయొచ్చు.ఇదీ చదవండి: పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్ఫామ్లుహెల్త్ కనెక్ట్ ఫీచర్లో స్కిన్ టెంపరేచర్, ట్రైనింగ్ ప్లాన్స్ అనే విభాగాలు చేర్చారు. దాంతో యూజర్లు తమ ఆరోగ్యం, ఫిట్నెస్పై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంది. -
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనకు నచ్చిన ఆహార పదార్ధాల గురించి బహిర్ఘతం చేశారు. నిత్యం ఏఐ, యాప్స్, టెక్నాలజీ అంటూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిచాయ్ ఓ పాడ్ కాస్ట్లో కాస్త రిలాక్స్ అయ్యారు. పిచాయ్ ఇటీవల యూట్యూబర్ వరుణ్ మయ్య పాడ్కాస్ట్లో దేశంలో ఏఐ ప్రభావం, ఐటీ నిపుణులకు సలహాలు, ర్యాపర్ స్టార్టప్తో పాటు పలు అంశాలపై చర్చించారు. అదే సమయంలో తన అభిమాన భారతీయ వంటకాలను కూడా వెల్లడించారు.భారత్లో తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పమని సుందర్ పిచాయ్ను మయ్య అడిగినప్పుడు సీఈఓ సుందర్ పిచాయ్ దౌత్యంతో సమాధానమిచ్చారు. ప్రాంతాల వారీ ఎదురుయ్యే ఇబ్బందుల్ని ముందే పసిగట్టారు. దేశీయంగా ఉన్న మూడు మెట్రో నగరాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్ధాల గురించి తన మనుసులో మాటను బయట పెట్టారు. బెంగుళూరులో దోసె, ఢిల్లీలో చోలే భతురే ముంబైలో పావ్ భాజీలను ఇష్టంగా తింటానని తెలిపారు. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
న్యూఢిల్లీ: గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ గూగుల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. గూగుల్ ఈ యాప్ను తొలిసారి 2022లో అమెరికాలో లాంచ్ చేసింది. రెండు సంవత్సరాల తర్వాత భారత్ వినియోగదారులకు పరిచయం చేసింది. గూగుల్ వాలెట్అంటే ఏమిటి?గూగుల్ వాలెట్ వివిధ డిజిటల్ ఆస్తులను ఒకే అనుకూలమైన ప్రదేశంలో స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. యాప్లో బోర్డింగ్ పాస్లు, లాయల్టీ కార్డ్లు, ఈవెంట్ టిక్కెట్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్లు, గిఫ్ట్ కార్డ్లు ఇతర డిజిటల్ డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు. గూగుల్పేపై ప్రభావం గూగుల్ వాలెట్ లాంచ్తో గూగుల్ పే యాప్ పనిచేస్తోందా? అనే అనుమానాలపై గూగుల్ స్పందించింది. గూగుల్ వాలెట్ వల్ల గూగుల్ పే వల్ల ఎలాంటి ప్రతి కూల ప్రభావం చూపదని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ పేకి, గూగుల్ వాలెట్కి మధ్య తేడా చెల్లింపు కార్డ్లను గూగుల్ వ్యాలెట్కు అనుసంధానిస్తే.. గూగుల్ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్లైన్లో చెల్లింపులు చేయొచ్చు. ప్రధాన కంపెనీలతో భాగస్వామ్యం పీవీఆర్ ఐనాక్స్, ఫ్లిప్కార్ట్, ఎయిర్ ఇండియా, షాపర్స్ స్టాప్, ఇక్సిగోతో పాటు ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతదేశంలో గూగుల్ వాలెట్ ప్రారంభించిన సందర్భంగా గూగుల్ ప్రకటించింది.ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ వాలెట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్లు, క్రెడిట్ కార్డ్లు, లాయల్టీ కార్డ్లు, గిఫ్ట్ కార్డ్లను ఒక అనుకూలమైన ప్లాట్ఫారమ్లో నిల్వ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు. -
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.ఈమేరకు గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్కు అధిపతిగా నియమించింది. ఇన్ఫ్లెక్షన్ స్టార్టప్లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
ప్రభుత్వ యాప్లకు ప్రత్యేక లేబుల్..! కారణం..
ప్రభుత్వ మొబైల్ యాప్లకు ప్రత్యేకమైన లేబుల్ వాడనున్నారు. ఈమేరకు ప్లేస్టోర్లో ప్రభుత్వ యాప్లకు లేబుల్వాడేందుకు గూగుల్ సిద్ధమైంది. ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలతోపాటు ఓటీటీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకూ..దాదాపు డిజిటల్గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. వీటిని కట్టడిచేసేందుకు ఈ మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది.ప్లేస్టోర్లో లక్షల్లో యాప్లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులకు ఏది నమ్మకమైన యాప్..ఏది కాదో అనే అంశంపై స్పష్టత కరవవుతోంది. కొన్ని ప్రభుత్వ యాప్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మన వివరాలిస్తున్న యాప్ అసలు ప్రభుత్వ ఆమోదం పొందిందా..లేదా అనే విషయాన్ని ధ్రువపరుస్తూ కొత్త మార్పులు తీసుకురానున్నారు. ప్లేస్టోర్లోని ప్రభుత్వ యాప్లకు ప్రత్యేక లేబుల్ ఉపయోగించనున్నారు. దాంతో ఆ యాప్లను వెంటనే గుర్తించే వీలుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మేరకు యాప్లో లేబుల్ ఉంచేందుకు గూగుల్ సైతం సిద్ధమైందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..‘ఎక్స్’ (ట్విటర్)లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను తేలిగ్గా గుర్తించడానికి గ్రే టిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారిని తేలిగ్గా గుర్తించవచ్చు. ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్లకు గూగుల్ ప్లే స్టోర్లో ఇకపై లేబుల్ కనిపిస్తుంది. -
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
చాలామంది తమకు ఇష్టమైన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడతారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఫెయిల్యూర్స్ వస్తుంటారు. తమ తోటి వాళ్లు సెలెక్ట్ అవుతున్న వీళ్లు మాత్రం పెయిల్ అవ్వుతూనే ఉండటంతో వెంటనే తమని తాము నిందించుకుంటూ ప్రయత్నాలు విరమించుకుంటుంటారు. అలాంటి వారికి గూగుల్లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ ఆసక్తికరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఐతే ఇక్కడ ఆమె కూడా అంత ఈజీగా ఈ కంపెనీలో ఉద్యోగం పొందలేదట.ఆమె పేరు క్విన్గ్యూ వాంగ్. గూగుల్లో ఇంజనీర్గా పనిచేస్తుంది. ఆమె కొత్తగా ఉద్యోగాల కోసం సర్చ్ చేయాలనుకునేవాళ్లు ముందు ఇలాంటి పనులు చేయకూడదంటూ..తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాన్వేషణలో మిమ్మల్ని తక్కువ చేసుకుని నిందించుకోవడం వంటివి చేస్తారు. ఇదే ఫెయిల్యూర్కి ప్రధాన కారణం అని అంటోంది. తాను కూడా ఉద్యోగ అన్వేషణలో ఇలానే చేసి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదుసార్లే ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చింది. తాను తొలిసారిగా 2018లో గూగుల్లో ఉద్యోగం కోసం ట్రై చేశానని, ఆ టైంలో ఆన్లైన్ అసాస్మెంట్ (ఓఏ) రౌండ్లోనే పోయిందని చెప్పింది. అయితే ఇంటర్వ్యూర్ నాకు మరో అవకాశం ఇచ్చారు గానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం కూడా వినయోగించుకోలేకపోయా. మళ్లీ మూడోసారి అదే కంపెనీలో తన ప్రయత్నం 2020లో ప్రారంభమయ్యింది. అందులో కూడా ఫోన్ స్క్రీన్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో సైట్ రిలయబిలిటీ ఇంజీనీర్ రిక్రూట్మెంట్కి దరఖాస్తు చేశా నాలుగో రౌండ్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చినా..సరిగ్గా మహమ్మారి కావడంతో ఆ ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేసింది. ఇక ఐదో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించడమే గాక టెక్ దిగ్గజం నుంచి అభినందనల తోపాటు ఉద్యోగం సంపాదించటం చాలా కష్టం అని వ్రాసిన పేపర్ను కూడా అందుకుంది వాంగ్. ఎట్టకేలకు వాంగ్ ఐదో ప్రయత్నంలో తాను కోరుకున్నట్లుగా సాప్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించింది. అందుకు సంబంధించిన కాగితాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఉద్యోగాన్వేషణ ప్రక్రియ అంత సులువు కాదనీ, కష్టపడి లక్ష్యాన్ని అందుకోవాలని అంది. ఆ క్రమంలో ఓటమి ఎదురైనా ప్రతిసారి మిమ్మల్ని నిందించుకోవడం లేదా అవమానంగా భావించడం మానేయాలని చెబుతోంది. ఎన్ని తిరస్కరణలు ఎదురైనా.. ప్రయత్నం విరమించకుండా అనుకున్నది సాధించాలని అంటోంది వాంగ్. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమేగాక లక్షకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి.(చదవండి: అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!) -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్లో భాగంగా.. పంజాబ్లో ఒకరిని, కోల్కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్ సఫారి బ్రౌజర్లో గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా ఉండటానికి 2022లో 20 బిలియన్ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది. గూగుల్కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.ఆన్లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్ చెప్పింది. యాపిల్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉన్నందుకు సెర్చ్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.కోర్టు పత్రాల వల్ల యాపిల్కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్ డీల్ అత్యంత ముఖ్యమైంది. యూఎస్లో అధికంగా ఉపయోగించే స్మార్ట్ఫోన్ సెర్చ్ ఇంజిన్ సఫారి బ్రౌజర్ కావడంతో గూగుల్కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్లో గూగుల్ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి బ్రౌజర్లో డిఫాల్ట్ సెర్చ్ఇంజిన్ కోసం యాపిల్కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇదీ చదవండి: బేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లుసెర్చ్ ఇంజిన్లో గూగుల్తో పోటీపడుతున్న బింగ్ను యాపిల్ డిఫాల్ట్బ్రౌజర్గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్ను డిఫాల్ట్గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధ పడింది. -
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. -
గూగుల్లో మళ్లీ లే ఆఫ్స్.. ఎందుకో తెలుసా..
టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీమ్ల నుంచి ఉద్యోగులను తొలగించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. త్వరలో సంస్థ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరుగనున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయినవారు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ఈ అంశాన్ని వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్ ప్రకటించారో మాత్రం స్పష్టం కాలేదు.ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఉద్యోగాలు కోల్పోయినవారు కంపెనీలోని ఇతర విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కంపెనీ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో తొలగింపు ప్రక్రియ అమలుచేసింది. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు’ అని చెప్పారు.గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ లేఆఫ్స్కు సంబంధించి ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో స్పందిస్తూ.. కంపెనీ నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్ వంటి ప్రదేశాల్లో గూగుల్ ‘గ్రోత్ హబ్లను’ నిర్మిస్తుందని చెప్పారు. రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్కార్డులున్నాయో తెలుసుకోండిలా..జనవరిలోనూ వందల మంది ఉద్యోగులను ఇంజినీరింగ్, హార్డ్వేర్, అసిస్టెంట్ బృందాల్లో గూగుల్ తొలగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుండడంతో ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని తెలిసింది.