-
హైదరాబాద్లో దారుణం..కారులో యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగింది.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని అరెస్ట్ చేసిన జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్రెడ్డి బాధితురాలితో కలిసి సైట్ విజిట్ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్ చేశారు. ఆమె తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్డ్రింగ్ ఇచ్చారు. ఆ కూల్డ్రింక్ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్ప్రహ రావడంతో హస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యారు. అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును మియాపూర్ పోలిస్ స్టేషన్కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్ధన్రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాన్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు. -
గంజాయి అలవాటు చేసి మరీ గ్యాంగ్ రేప్
మేడ్చల్, సాక్షి: నగరంలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన మైనర్కు సదరు యువకులు గంజాయి అలవాటు చేశారు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక భయంతో ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పడకుండా ఉండిపోయింది. ఈలోపు శరీరంలో మార్పులు రావడంతో బాధితురాలిని, తల్లి నిలదీసింది. దీంతో జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. ఆ కేసును నేరెడ్మెట్కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
‘హమాస్’ అత్యాచారాలు.. యూఎన్ సంచలన నివేదిక
జెరూసలెం: గతఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి(యూఎన్) సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్ 7 దాడిలో ఇజ్రాయెల్పై దాడి సమయంలో అక్కడి మహిళలపై అత్యాచారాలు జరిగాయనేందుకు కచ్చితమైన, ఆధారలతో కూడిన సమాచారం ఉందని యుద్ధంలో జరిగిన లైంగిక దాడులపై యూఎన్ నియమించిన ప్రమీల పాటెన్ బృందం తేల్చింది. హమాస్ బంధీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని యూఎన్ బృందం తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరిలో పాటెన్తో పాటు నిపుణుల బృందం ఇజ్రాయెల్, వెస్ట్బ్యాంక్లో పర్యటించారు. గాజా సరిహద్దులోని ఇజ్రాయెల్కు చెందిన మూడు ప్రాంతాలు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ సైట్,రోడ్ 232, కిబుట్జ్ రెమ్లలో ఇజ్రాయెలీలపై రేప్లతో పాటు గ్యాంగ్ రేప్లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. చాలా వరకు కేసుల్లో ముందు రేప్ చేసి తర్వాత హత్య చేశారని తెలిపింది. చనిపోయిన మహిళల మృతదేహాలపైన కూడా రెండు చోట్ల అత్యాచారాలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి బృందం తేల్చింది. ఈ అత్యాచారాలపై సాక్ష్యం చెప్పాల్సిందిగా బృందం కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. అత్యాచార ఘటనలపై యూఎన్ బృందం సభ్యులు మొత్తం 5వేల ఫొటోలు, 50 గంటల సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు రేప్కు గురైన బాధితులతో మాట్లాడారు. హమాస్ వద్ద బంధీలుగా ఉండి విడుదలైన వారిని పలువురిని ఇంటర్వ్యూ చేశారు. కాగా, అక్టోబర్ 7న ఇజజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ మెరుపు దాడులు జరిపి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి కొంత మందిని బంధీలుగా తమ వెంట తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై భీకర దాడులు చేస్తోంది. గాజాను మొత్తం చిధ్రం చేసింది. అమెరికా కోరినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఇదీ చదవండి..హైతీలో తీవ్ర అరాచకం -
HYD: తార్నాకలో గ్యాంగ్రేప్, ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఘోరం జరిగింది. లిఫ్ట్ పేరిట ఒక మహిళపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు ఐదుగురు. నిందితుల అరెస్ట్తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు. తన స్కూటీపై ఎక్కించుకుని ప్రశాంత్నగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఫోన్ చేసి తన నలుగురు స్నేహితుల్ని రప్పించుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో మధు యాదవ్, బర్నా యేసు, సిరిగిరి ప్రశాంత్కుమార్, పస్తం తరుణ్కుమార్, కేశోజువా రోహిత్లపై కేసు నమోదు చేసుకున్నారు లాలాగూడ పోలీసులు. ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్ తరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
వివాహితపై అత్యాచారం
కర్ణాటక: వివాహితపై సాముహిక అత్యాచారం చేసి, దానిని మొబైల్లో రికార్డు చేసి బ్లాక్మొయిల్ చేస్తున్న దారుణ ఘటనకు సంబంధించి బెళగావి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గోకాక్ పట్టణంలో సెప్టెంబర్ 5న ఈ దుర్ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోకాక్ చుట్టు పక్కల ఒంటరి మహిళను గుర్తించిన ముఠా సభ్యులు ఆమైపె అత్యాచారం చేశారు. వీరు దోపిడీలకు కూడా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఓ ఇంటిలో రూ. 10 లక్షల విలువైన నగలు దోచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులకు అత్యాచారం ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి కేజీ బంగారు నగలు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. -
ఒంటి నిండా పంటి గాట్లతో రకప్తు మడుగులో..
క్రైమ్: మానవ మృగాల అకృత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వావివరుసలు, వయసు తారతమ్యాలు లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. సామూహిక అత్యాచారానికి గురై.. అత్యంత దీనస్థితిలో ఓ మైనర్ బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సాత్నా జిల్లా మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. అర్కండికి చెందిన 11 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. అయితే శుక్రవారం ఉదయం మైహర్ శివారులోని అడవుల్లో శారదా దేవి ఆలయం సమీపంలో రక్తపు మడుగులో బాలిక కనిపించింది. నగ్నంగా పడి ఉన్న బాలికను గమనించిన కొందరు భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను మైహర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒంటి నిండా పంటి గాయాలు ఉన్నాయని.. పదునైన ఆయుధాలతో ఆమె అంతర్గత అవయవాలనూ గాయపరిచారని వైద్యులు నివేదిక ఇచ్చారు. బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రవేశాలను రగిల్చింది. ఆస్పత్రికి చేరుకుని ‘‘న్యాయం చేయాలనే’’ నినాదాలతో హోరెత్తించారు వాళ్లు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. వాళ్లను శాంతపరిచారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మైహర్ మైనర్ బాలిక గ్యాంగ్రేప్ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్.. బీజేపీ సర్కార్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. -
మణిపూర్లో కీచక పర్వం.. స్మృతి ఇరానీ స్పందన
ఇంఫాల్/ఢిల్లీ: అల్లర్లలో అట్టుడికిపోతున్న మణిపూర్లో కీచక పర్వం వెలుగుచూసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. ఆపై పంట పొలాల్లోకి లాక్కెల్లి కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కెమెరాల సాక్షిగా ఇది జరగ్గా.. ఈ ఘోరానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు రాజకీయ నేతలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్లో తాజాగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే.. చుట్టూ ఉన్న మూక వాళ్లను ఇష్టానుసారం తాకుకూ వేధించడం అందులో ఉంది. ఆపై వాళ్లను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్తూ మరో వీడియో వైరల్ అయ్యింది. అయితే ఆపై ఆ ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిగిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజధాని ఇంఫాల్కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లా పరిధిలో మే 4వ తేదీన ఇది జరిగిందని ఐటీఎల్ఎఫ్ (ఆదివాసీ గిరిజన నేతల సంఘం) ఆరోపిస్తోంది. అయితే.. పోలీసులు మాత్రం ఇది వేరే చోట జరిగిందని.. ఎఫ్ఐఆర్ మాత్రం కాంగ్పోక్పిలో నమోదు అయ్యిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందించారు. హైప్రొఫైల్ కేసుగా దీనిని దర్యాప్తు చేపట్టాలని మణిపూర్ పోలీస్ శాఖను ఆదేశించారు. The horrific video of sexual assault of 2 women emanating from Manipur is condemnable and downright inhuman. Spoke to CM @NBirenSingh ji who has informed me that investigation is currently underway & assured that no effort will be spared to bring perpetrators to justice. — Smriti Z Irani (@smritiirani) July 19, 2023 అంతకు ముందు కేంద్ర శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘటనపై.. భయంకరమైన ఘటన అని ట్వీట్ చేశారామె. ఘటనపై సీఎం బీరెన్, మణిపూర్ సీఎస్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని.. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె వాళ్లను కోరినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించామని.. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుంటామని మణిపూర్ పోలీస్ శాఖ ప్రకటించింది. బాధితులు కుకీ తెగ మహిళలుగా తెలుస్తోంది. *All out effort to arrest culprits as regard to the viral video of 02 (two) women paraded naked :* As regard to the viral video of 02 (two) women paraded naked by unknown armed miscreants on 4th May, 2023, a case of abduction, gangrape and murder etc 1/2 — Manipur Police (@manipur_police) July 19, 2023 PM’s silence and inaction has led Manipur into anarchy. INDIA will not stay silent while the idea of India is being attacked in Manipur. We stand with the people of Manipur. Peace is the only way forward. — Rahul Gandhi (@RahulGandhi) July 19, 2023 ఈ ఘటనకు ఒక్కరోజు ముందు నుంచే మణిపూర్ రణరంగంగా మారడం ప్రారంభమైందన్నది తెలిసిందే. గిరిజన హోదా కోరుతూ మెయితీలు చేస్తున్న విజ్ఞప్తులు.. అక్కడి కుకీ గిరిజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. మానప్రాణాలు పోతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి.. అపహరణ, గ్యాంగ్రేప్తో పాటు హత్యానేరాల కింద కేసులు నమోదు చేసినట్లు మణిపూర్ పోలీస్ శాఖ వెల్లడించింది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. मणिपुर से आ रही महिलाओं के खिलाफ यौन हिंसा की तस्वीरें दिल दहला देने वाली हैं। महिलाओं के साथ घटी इस भयावह हिंसा की घटना की जितनी निंदा की जाए कम है। समाज में हिंसा का सबसे ज्यादा दंश महिलाओं और बच्चों को झेलना पड़ता है। हम सभी को मणिपुर में शांति के प्रयासों को आगे बढ़ाते हुए… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2023 Attention India! The modesty of two tribal women from Manipur were outraged on 4th May. They were paraded naked, fondled and beaten in full public glare! A disturbing video taken by a perpetrator leaked and got viral today. This breaks all level of humanity. @PMOIndia @NCWIndia — hoihnu hauzel - www.thenestories.com (@hoihnu) July 19, 2023 ట్విటర్లో వీడియోలు తొలగింపు.. చర్యలు? మణిపూర్లో ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా ఊరేగిస్తూ.. ఇష్టానుసారం తాకుతూ ఉరేగించిన వీడియో ట్విటర్ను కుదిపేసింది. వాళ్లపై సామూహిక అత్యాచారమూ జరిగిందన్న ఆరోపణలతో యావత్ దేశం భగ్గుమంది. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఘటనలకు వీడియోలను తొలగించాలని ట్విటర్ను కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా వీడియోను తొలగించాలని ట్విటర్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. భారత చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విటర్పై చర్యలకు ఉపక్రమించిబోతున్నట్లు సమాచారం. -
బీజేపీ నేత కొడుకు ఘాతుకం.. ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్రేప్
భోపాల్: మధ్యప్రదేశ్లోని ధాతియా జిల్లాలో దారుణం జరిగింది. అధికార బీజేపీ పార్టీ ప్రతినిధి కుమారుడు స్నేహితులతో కలిసి ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మైనర్ చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. అవమానభారంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ హోం శాఖమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ధాతియా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన యువతి ఆత్మహత్యకు పాలపడిన తర్వాత విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, భారీ సంఖ్యలో స్థానికులు ఉన్నవ్ పోలీసు స్టేషన్ వద్ద గుమికూడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా స్పందిస్తూ.. ఒకవేళ ఆ అమ్మాయి తన వాంగ్మూలంలో బీజేపీ నాయకుడి కుమారుడి పేరు చెబితే తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనర్ బాలిక ఇచ్చిన కంప్లైంట్ లో.. బీజేపీ లీడర్ కొడుకు తన స్నేహితులతో కలిసి మొత్తం నలుగురు తనను, తన సోదరిని తీసుకుని ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుని వెళ్లారని, అక్కపై సామూహికంగా అత్యాచారం చేసి తనపై కూడా లైంగిక దడి చేశారని తెలిపింది. సంఘటన అనంతరం ఇద్దరూ ఇంటికి చేరుకోగా తన సోదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొంది. ధాతియా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడుతో సహా ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని ఒకరు మాత్రం పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుకి చేరువలో ఝాన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని అన్నారు. ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
లైంగిక సుఖానికి దూరమయ్యా... రూ.10,006 కోట్లివ్వండి
రత్లాం: గ్యాంగ్ రేప్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన ఓ వ్యక్తి తనకు ప్రభుత్వం నష్ట పరిహారంగా రూ.10,006.2 కోట్ల చెల్లించాల్సిందేనంటూ కోర్టుకెక్కాడు. మధ్యప్రదేశ్లోని రత్లాం పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గిరిజనుడైన కాంతూ ఆలియాస్ కాంతీలాల్ భీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో 2020 డిసెంబర్ 23న పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు. స్థానిక కోర్టు 2022 అక్టోబర్ 20న అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అంతరం కాంతీలాల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లో ఉన్నప్పుడు భార్యతో లైంగిక సుఖానికి దూరమయ్యానని, దేవుడిచ్చిన వరం వృథా అయ్యిందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు రూ.10,006.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందులో రూ.10,000 కోట్లు మానసిక క్షోభ అనుభవించినందుకు మిగతా రూ.6.02 కోట్ల ఇతర ఖర్చుల కోసమని విన్నవించాడు. -
మరో నిర్భయ.. షేర్డ్ ట్యాక్సీలో యువతిపై సామూహిక లైంగిక దాడి
దేశంలో రోజురోజుకు యువతులు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతూనే ఉన్నాయి. కొందరు మృగాలు రెచ్చిపోతూ ఆఫీసులకు వెళ్లే యువతులు, నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్లే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. షేర్డ్ టాక్సీలో వెళ్తున్న యువతి లైంగికదాడికి గురైంది. వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఓ యువతి.. షేర్డ్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. ఈ క్రమంలో ట్యాక్సీ రాగానే లోపల కూర్చుంది. అయితే, ట్యాక్సీ కొంత దూరం వెళ్లగానే మరో ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. అనంతరం, కొద్ది దూరం వెళ్లగానే యువతిపై యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత, ఆమెను ఎత్మాద్పూర్ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా ఆగ్రా సీపీ ప్రీతింధర్ సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలు షేర్డ్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తుండగా ముగ్గురూ కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించి నిందితుల కోసం గాలిస్తున్నాము. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య చిక్సితలు అందిస్తున్నట్టు తెలిపారు. Uttar Pradesh | A woman gave a complaint at Etmadpur police station today. In the complaint, she said she took a shared taxi from Noida and on the way, 3 boys raped her and dropped her near Etmadpur: Preetinder Singh, CP, Agra pic.twitter.com/i1Kxn9Qlil — ANI UP/Uttarakhand (@ANINewsUP) December 28, 2022 -
మైనర్పై సామూహిక అత్యాచారం.. 12 గంటలపాటు నిర్బంధించి..
మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కామాంధులు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలే కాకుండా పసిపిలల్లపై సైతం లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో సభ్య సమాజం లదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై కొంతమంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 12 గంటలపాటు బాలికను నిర్భంధించి అత్యంత దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. పాల్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. పాల్ఘర్ జిల్లా రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల మైనర్ బాలికపై 8 మంది వ్యక్తులు అత్యాచారం చేశారు. డిసెంబర్ 16న(శుక్రవారం) కొందరు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి మహిమ్ గ్రామంలోని ఖాళీగా ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేగాక అక్కడి నుంచి సముద్ర తీరానికి తీసుకెళ్లి అక్కడి పొదల్లో మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు. మొత్తం 12 గంటలపాటు (శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు) బాలికను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు సత్పతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు -
11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో
న్యూఢిల్లీ: తనపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1992 ఉపశమన నిబంధనలకు ఈ కేసుకు వర్తింపజేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో అనుమతివ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి, ఒకే ధర్మాసనం విచారించే విషయాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మూడెళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు. ఐదు నెలల గర్భవతి కూడా. ఈ దారుణ ఘటనలో 11 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే 15 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వీరిని ఈ ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
-
దారుణం.. బ్లాక్మెయిల్ చేసి 8 మంది అత్యాచారం
జైపూర్: రాజస్థాన్ అల్వార్లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 8 మంది యువకులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు ఫోటోలు రహస్యంగా తీసి బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బాధితురాలి నుంచి రూ.50వేలు వసూలు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ 1న ప్రధాన నిందితుడు సోహిల్ తనకు సోదరి వరసయ్యే బాలికకు ఫోన్ చేసి ఓ చోటుకు రమ్మన్నాడు. అక్కడకి రాకపోతే సీక్రెట్గా తీసిన ప్రైవేటు చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయంతో అక్కడకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లిన ఆమెపై సోహిల్, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని ఫోన్లో చిత్రీకరించారు. ఆ తర్వాత నుంచి బాధితురాలిని తరచూ బ్లాక్ చేసి డబ్బు వసూలు చేశాడు సోహిల్. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఓసారి బాలిక డబ్బు ఇవ్వకపోవడంతో నిందితుడు ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత! -
Hyderabad: మహిళ కిడ్నాప్.. సామూహిక అత్యాచారం?
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతానికి చెందిన మహిళ(27)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్–దిడిగి గ్రామ శివారులోని ఓ వెంచర్లో శనివారం ఓ మహిళ మద్యం మత్తులో పడి ఉండగా దారిన వెళ్లే వారు చూసి ఆమెను జహీరాబాద్లోని ఆస్పత్రికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సంగారెడ్డిలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయమై డీఎస్పీ రఘును వివరణ కోరగా మహిళ మద్యం మత్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదన్నారు. ఇందుకు సంబంధించి కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలు పూర్తి వివరాలు సరిగ్గా చెప్పడం లేదన్నారు. తన స్వస్థలం ఒకసారి కూకట్పల్లి అని, మరోసారి బాలానగర్ అని చెబుతోందన్నారు. జహీరాబాద్కు ఎలా వచ్చింది.. ఎవరితో వచ్చిందనే వివరాలను కూడా చెప్పడం లేదన్నారు. మద్యం మత్తులో ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతుందన్నారు. విచారణలో పొంతన లేని సమాధానం ఇస్తోందన్నారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోందన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఇందుకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విచారణ చేపట్టామని, విచారణ అనంతరమే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉంటే మహిళ పరిస్థితి బట్టి చూస్తే గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చి సామూహిక అత్యాచారం జరిపి ఉంటారనే ప్రచారం సాగుతోంది. చదవండి: అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్ -
దేశ రాజధానిలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడ్ని కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో అబ్బాయిలకు కూడా రక్షణ లేదు అని మండిపడ్డారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. दिल्ली में लड़की तो क्या लड़के भी सुरक्षित नहीं हैं। एक 12 साल के लड़के के साथ 4 लोगों ने बुरी तरह से रेप किया और डंडों से पीटकर अधमरी हालत में छोड़कर चले गए। हमारी टीम ने मामले में FIR दर्ज करवाई। 1 आरोपी गिरफ़्तार, 3 अब भी फ़रार, दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। pic.twitter.com/tXrqK7xkwm — Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022 ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఘటనపై మహిళా ప్యానెల్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. చదవండి: వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు -
బాలికపై సామూహిక లైంగిక దాడి! మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భీమిని: వరసకు అన్నయ్య అయ్యే ఓ బాలుడు, అతని స్నేహితుడు కలసి మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. దీన్ని వీడియో కూడా తీశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం.. నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో వరసకు కొడుకైన ఓ బాలుడు ఆటో నడుపుతూ నాలుగు నెలలుగా ఉంటున్నాడు. మూడు నెలల క్రితం సదరు వ్యక్తి కూతురుని, మూడేళ్ల బాబును మంచినీళ్లు తీసుకొద్దామని ఆ బాలుడు ఆటోలో బోరింగ్ పంపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడికి మరో బాలుడు వచ్చాడు. అక్కడి నుంచి నలుగురు ఆటోలో గ్రామ శివారులోని శ్మశాన వాటిక వైపు వెళ్లారు. అక్కడ మూడేళ్ల బాబు సమక్షంలోనే ఇద్దరు బాలురు ఆటో వెనక సీటులో ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేస్తూ సెల్ఫోన్లో వీడియోలు తీశారు. వాటిని స్నేహితులకు పంపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించడంతో విషయం బయటపడలేదు. రెండు రోజుల క్రితం బాలిక.. తన అమ్మమ్మకు ఈ దారుణం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకులా భావించి ఇంట్లో ఉంచుకుంటే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. నిందితులు పరారీలో ఉన్నారు. చదవండి:మరో నిర్భయ.. రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారయత్నం.. ఆ తర్వాత.. -
మైనర్పై సోదరుల గ్యాంగ్ రేప్.. అడ్డొచ్చిన బామ్మపైనా..!
భోపాల్: దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసినవారే రాక్షసుల్లా మారి దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లాలో వెలుగు చూసింది. వరుసకు సోదరులయ్యే ఇద్దరు యువకులు ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు వచ్చిన ఆమె బామ్మపైనా నిందితుల్లో ఒకడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తన తండ్రితో కలిసి ముంబైలో నివాసం ఉంటోంది. ఆగస్టు 11న జబల్పూర్లోని తన పెదనాన్న వాళ్ల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 13న బాలికపై ఆమె ఇద్దరు కజిన్ సోదరులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రోజుల తరబడి అఘాయిత్యానికి పాల్పడుతూ తీవ్రంగా కొట్టారు. బాధితురాలిని గమనించిన కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. జబల్పూర్లోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. తన కూతురిపై ఇద్దరు సోదరులు గ్యాంగ్ రేప్కు పాల్పడి తీవ్రంగా కొట్టటం వల్ల ప్రాణాలు కోల్పోయిందని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దుశ్చర్యను ఆపేందుకు వెళ్లిన తన తల్లిపైనా అత్యాచారం చేశారని, ఆమె చెబితేనే తనకు అసలు విషయం తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఎస్పీ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. ఆగస్టు 23న బాధితురాలి మృతదేహాన్ని పరీక్షించామని, వృద్ధురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. పోక్సోతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నిందితుల్లో ఒకరని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి చికిత్స అందించిన వైద్యులను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై.. -
యువతిపై అఘాయిత్యం.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం మండ్యకు చెందిన యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఆమె ప్రియుడు నగరానికి తీసుకువచ్చాడు. ఆమెను ఒక గదిలో ఉంచి ప్రియుడు, ఆపై మరికొందరు ఒకేసారి ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. శివానందసర్కిల్ వద్ద గల ఒక లాడ్జి యజమాని సంతోష్ కూడా ఇందులో ఉన్నాడు. తరువాత యువతిని వ్యభిచార ముఠాకు విక్రయించారు. ఇటీవల పోలీసులు ఒక లాడ్జిలో జరుగుతున్న పడుపు దందాపై దాడి చేయగా పట్టుబడిన ఈ యువతి దీనగాథను వివరించింది. ఈ ఘటనపై హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, మంజుల, బ్రహ్మేంద్ర, సంతోష్ కుమార్లను శనివారం అరెస్టు చేశారు. అలాగే మోసపోయిన యువతి స్టేట్మెంట్ను రికార్డు చేసిన అనంతరం గ్యాంగ్ రేపుపై మరో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
Crime News: బెయిల్పై వచ్చి మళ్లీ రేప్ చేశాడు
భోపాల్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ మానవ మృగం.. మరోసారి కిరాతకానికి పాల్పడింది. బెయిల్ మీద బయటకు వచ్చి మరీ స్నేహితుడితో కలిసి మళ్లీ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది ఇంతటితోనే ఆగలేదు.. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలిపై మళ్లీ అత్యాచారానికి తెగపడ్డాడు దుర్మార్గుడు. ఈసారి స్నేహితుడితో కలిసి అఘాయిత్యాన్ని పాల్పడి.. అంతటితో ఆగకుండా ఆ నేరాన్ని వీడియో తీశాడు. తన మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకోకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలికి ఇప్పుడు 19 ఏళ్లు. రెండేళ్ల కిందట.. ఆమెపై వివేక్ పటేల్ అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఏడాది తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న టైంలో కత్తితో బెదిరించి తన స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న వివేక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెబుతోంది బాధితురాలు. ఇదీ చదవండి: భర్త వివాహేతర సంబంధం! సహించలేక పసిబిడ్డకు ఉరేసి.. -
దారుణం.. కట్నం కోసం స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్!
లక్నో: దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు.. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని కన్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, అతడి స్నేహితులపై ఛకేరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2020, మార్చి 6 నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె భర్త, ఆడపడుచు రూ.2 లక్షలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు. అయితే.. అడిగిన డబ్బు, కారు ఇవ్వలేకపోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు. నలుగురు కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనను చంపేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్ పతాక్ తెలిపారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
దారుణం.. తొమ్మిదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలలపాటు..
రాంచీ: జార్ఖండ్ బోకారోలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులై 19న బాధితురాలు ఎలాగోలా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. అప్పటికే తమ బిడ్డ కన్పించట్లేదని కేసు పెట్టిన తల్లిదండ్రులు విషయం తెలిసిన వెంటనే బాధితురాల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను మనోజ్ కుమార్, విష్ణు కుమార్, మంతోష్ కుమార్లుగా గుర్తించారు. మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఏప్రిల్ 20న బాలిక మార్కెట్ నుంచి తిరిగివస్తుండగా.. ఆటోలో వచ్చిన మంతోష్ కుమార్ మరో ఇద్దరి సాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికను ఓ గదిలో బంధించి రోజు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను గదిలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయేవారు. జులై 19న అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ బాధితురాలి పరిస్థితిని చూసి రాయితో తాళం పగలగొట్టి విముక్తి కల్పించింది. వెంటనే బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కన్నతండ్రే కాలయముడై... కూతురిని, అల్లుడిని చంపి... -
గ్యాంగ్ రేప్ నిందితులకు డీఎన్ఏ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసులో నిందితుడు, చట్టంతో విభేదించిన బాలురకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ (టీఐపీ) పూర్తి చేసిన అధికారులు నిందితులకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాలు అనుమతి మంజూరు చేయడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అవసరమైన పక్షంలో బాధితురాలి నుంచీ నమూనాలు సేకరించాలని యోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో సాదుద్దీన్, మరో ఐదుగురు చట్టంతో విభేదించిన బాలురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు సైతం పట్టుబడి జువైనల్ హోమ్కు చేరాడు. అయితే ఇతడు కేవలం బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడానికి సంబంధించి మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సాదుద్దీన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు సహా ఐదుగురు మాత్రం గ్యాంగ్రేప్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాన్సూ బేకరీ నుంచి బాలికను ఇన్నోవా కారులో పెద్దమ్మ గుడి సమీప ప్రాంతాలకు తీసుకువెళ్లిన ఈ ఐదుగురూ గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో వెంట్రుకలు, వినియోగించిన టిష్యూ పేపర్లతో సహా అనేక ఆధారాలు సేకరించారు. బాలిక పోలీసులకు, న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలోనూ తనపై ఆ కారులోనే అఘాయిత్యం జరిగినట్లు బయటపెట్టింది. దీంతో ఇన్నోవా కారులో లభించిన ఆధారాలు క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇప్పుడు సాదుద్దీన్ సహా ఐదుగురి నుంచి సేకరించిన నమూనాలకూ పంపనున్నారు. ఈ రెండింటినీ సరిపోల్చే నిపుణులు ఆ రోజు కారులో ఉన్నది, బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది వీరేనంటూ సాంకేతికంగా నిర్థారించనున్నారు. పోలీసులు దాఖలు చేసే అభియోగపత్రాల్లోనూ ఈ అంశాన్ని పొందుపరుస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి ఇది కీలకం కానుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టుల్లో బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసులు కోర్టును కోరుతున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారంలో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర లేకున్నా... బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు, ఆధారాలు ఉండటంతోనే జువైనల్ హోమ్కు చేరాడు. ఇతడిపై ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద సదరు ఆరోపణలు నమోదు చేశారు. ఆమ్నేషియా పబ్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఓ కీలక విషయం గుర్తించారు. ఇన్నోవా కారులో అప్పటికే ఉన్న సాదుద్దీన్ను దింపిన ఎమ్మెల్యే కుమారుడు అక్కడే కారు ఎక్కాడని, అలా ఈ కేసులో చిక్కాడని తెలుసుకున్నారు. (చదవండి: కోర్టును ఆశ్రయించిన పోలీసులు.. ఎందుకంటే..?) -
మైనర్ బాలిక కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్