-
ఆలస్యంగా వెలుగులోకి.. తల్లితో గొడవపడి బయటికి వెళ్లిన బాలికపై
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్టేషన్ పరిధిలో నివాసం ఉండే 14 ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవపడి బయటికి వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ముగ్గురు నలుగురు యువకులు మీ తల్లి దగ్గరకు తీసుకెళుతామంటూ నమ్మించారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తప్పించుకున్న బాలిక శనివారం సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఎక్కడికి వెళ్లావని బాలికను నిలదీయడంతో అసలు విషయాన్ని తెలిపింది. బాధితురాలి తల్లి చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు (మంగళవారం) రిమాండ్కు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి.... -
స్నేహం ముసుగులో మైనర్పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్
గ్వాలియర్: మధ్యప్రదేశ్లో అమానుషం దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్ నగరంలో స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్లో స్ట్రీమ్ చేసి రాక్షస ఆనందం పొందారు. ఏడాదిగా బాలికపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే బాధితురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థమైంది. దీనిని అదునుగా భావించిన నిందితులు అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. బాలిక తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అన్యాయంపై ఝాన్సీ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మొదటగా 2021 జూన్ 2న ఓ హోటల్కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. లైంగికదాడి సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను తర్వాత వాళ్లు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని తెలిపింది. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది. శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. చదవండి: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మాట్లాడాలని పిలిచి మూడు రోజులు.. -
మైనర్ పై సాముహిక అత్యాచారం... ఫిర్యాదు చేసిందనే కోపంతో తోటి విద్యార్థులే...
పాట్నా: రాను రాను మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల జరగడం అనేది సర్వసాధారణంగా అయిపోతుందేమో. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా పరిస్థితి నానాటకీ దిగజారిపోతుందే గానీ చక్కబడుతుందనే ఆశ కానరావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు గురించే వింటున్నాం. చదువుకున్నవాళ్లు సైతం కామంధులై అత్యంత దారుణాలకి ఒడిగడుతున్నారు. అచ్చం అలానే బీహార్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బీహార్లోని జాముయ్లో ఒక మైనర్ కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె పై ఐదుగురు విద్యార్థులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఐదుగురు అదే కోచింగ్ సెంటర్ విద్యార్థులు. ఐతే ఆ బాలిక గతంలో తనతో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఆమె పై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మైనర్ తల్లిదండ్రులు కోచింగ్ నిర్వాహకులు ఇకపై మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడంతోనే కోచింగ్ సెంటర్ పంపామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్లో పోలీసులు..) -
హైదరాబాద్: ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన మానసిక స్థితి సరిగా లేని 30 ఏళ్ల రెండ్రోజుల క్రితం నగరానికి వచ్చింది. శక్రవారం రాత్రి గండిమైసమ్మ నుంచి దుండిగల్కు వెళ్లే రోడ్డులోని ఉజ్వల బార్ అండ్ రెస్టారెంట్ పక్కన సదరు మహిళ ఒంటరిగా నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఐదుగురు యువకులు ఆమెను ఉజ్వల బార్ వెనుక ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇమ్రాన్(20)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. మరికొందరు నిందితులు నర్సింహ, ఖుద్దూస్, ఉమిద్దీన్, ఇమామ్లు పరారీలో ఉన్నారు. కాగా నిందితులంతా డి.పోచంపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లుగా తేలింది. వారిపై 377డీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మిసిసిపీ ఫెస్టివల్లో అపశ్రుతి -
విజయవాడ ఆస్పత్రి ఘటన.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి.. వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. సీఎస్ ఆర్ఎంఓకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. చదవండి👉 విజయవాడ: టీడీపీ కార్యకర్తల వీరంగం.. వాసిరెడ్డి పద్మపై దాడి -
భర్తను చెట్టుకు కట్టేసి.. మహిళపై గ్యాంగ్రేప్!
ముజఫర్నగర్(యూపీ): ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో కొందరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం చెప్పారు. ఆమె భర్తను చెట్టుకు కట్టేసి దురాగతం సాగించారని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ ఘటనపై న్యూమండీ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. చదవండి: (నిర్మాత అని చెప్పి పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయమంటున్నాడు: సహాయనటి) -
Metaverse: కనీవినీ ఎరుగని రీతిలో సామూహిక అత్యాచారం
ప్రపంచంలో ఏదో ఒక మూల.. ప్రతీ నిమిషానికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి మహిళలు మృగాల చేతిలో చితికిపోతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన.. బహుశా ఇది వరకు విని, చదివి ఉండరు. వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఆడవాళ్ల భద్రతపై అనుమానాల్ని పెంచే ఘటన ఇది. పైగా అవి మరింత ఘోరంగా.. ఆందోళనకరంగా ఉంటాయనే విషయాన్ని రుజువు చేసింది ఇది. బ్రిటన్కు చెందిన ఓ మహిళ(43).. ఫేస్బుక్ మెటావర్స్ ‘హోరిజోన్ వెన్యూస్’పై సంచలన ఆరోపణలకు దిగింది. ఆ వేదికపై తాను గ్యాంగ్రేప్నకు గురయ్యానని ఆమె ఫిర్యాదు చేసింది. వర్చువల్ వరల్డ్లోకి జాయిన్ అయిన నిమిషానికే.. తనను ముగ్గురు-నలుగురు (మేల్ అవతార్స్) చుట్టుముట్టి బలాత్కారం చేశారని, ఆపై ఆ అఘాయిత్యాన్ని ఫొటోలు సైతం తీశారని ఆమె వాపోయింది. ఆర్తనాదాలు. అరణ్యరోదనే! అఘాయిత్యం జరుగుతున్న టైంలో తను గట్టిగట్టిగా అరిచినా.. స్పందన కరువైందని ఆమె వాపోయింది. ఆ సమయంలో చాలామంది లాగిన్లో ఉన్నారు. కానీ, నా అరుపులను ఎవరూ పట్టించుకోలేదు. పైగా నా అవతార్ మీద ఘాతుకానికి పాల్పడ్డ మగ అవతార్లు మృగాళ్లా ప్రవర్తించాయి. దుర్భాషలాడాయి.. నాపై దాడి చేశాయి. దుస్తులు చించేశాయి. ఏం జరుగుతుందో అర్థం కావడానికే నాకు కొన్ని నిమిషాలు పట్టింది. ఆ భయంకరమైన అనుభవంతో వెంటనే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తీసేసి, లాగౌట్ అయ్యానని ఆమె పేర్కొంది. ఇక ఘటనపై తన అనుభవాన్ని ఓ బ్లాగ్లో పంచుకున్న బాధితురాలు. వర్చువల్ ఘటనను అనవసరంగా సీన్ చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, వాస్తవాల నుంచి వర్చువల్ అనుభవాలు వేరు చేయలేవని ఆమె అంటోంది. అందుకే వర్చువల్ ప్రపంచంలోనూ అనుభవాలకు 'వాస్తవికత' ఉంటుందని పేర్కొంది. వర్చువల్ రియాలిటీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు.. అక్కడ వాస్తవికతకు ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలని, తనకు ఎదురైన అనుభవం వర్చువల్ ప్రపంచంలోనూ మరెవరికీ ఎదురు కాకూడదని ఆమె అంటోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించని ఫేస్బుక్ మెటావర్స్.. భద్రత విషయంలో మార్పులు చేస్తున్నట్లు ఆ మధ్య ఒక ప్రకటనతోనే సరిపెట్టింది. సంబంధిత వార్త: పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని’!! -
యువతిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. సాముహిక అత్యాచారం.. ఆపై
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానుషం చోటు చేసుకుంది. ఒక యువతిపై మద్యం, డ్రగ్స్ కుటుంబానికి వారు సాముహికంగా అత్యాచారం చేసి, ఆపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న కస్తూర్బా నగర్కు చెందిన 20 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి ఉన్న ఒక యువకుడు ప్రేమించాడు. చాలా రోజులు ఆమె వెంటపడ్డాడు. యువతి ప్రేమను అంగీకరించకపోవడంతో విచారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. అయితే, తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమని యువకుడి కుటుంబ సభ్యులు ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయువతిని నిన్న ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆమెను జుట్టుపట్టుకొని కొడుతూ.. నీచంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో కొంత మంది పురుషులు.. ఆ యువతిపై బహిరంగంగానే సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడ ఉన్న మహిళలు కూడా.. యువతిపై పురుషులు అత్యాచారం చేసేలా ప్రేరేపించారు. ఆమెను నానా దుర్భాషలాడుతూ.... ఆమె జుట్టును కత్తిరించారు. ఆమె ముఖానికి నలుపు రంగు పూశారు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. అవమానపర్చారు. చెప్పులు, బూట్లతో కొడుతూ.. దండలు చేసి యువతి మెడలో వేసి.. ఊరేగించారు. చనిపోయిన బాలుడు కుటుంబానికి చెందిన వారంతా మద్యం, డ్రగ్స్ వ్యాపారస్తులని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఢిల్లీ మహిళ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను పరామర్శించారు. వెంటనే బాధిత యువతిపై దాడిచేసిన వారందరిని అరెస్టు చేయాలని ట్విటర్ వేదికగా ఢిల్లీ పోలీసు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఘటనపై 72 గంటలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు నోటిసులు జారీచేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని పోలీసువారిని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3 — Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022 చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్ -
యువతిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు మైనర్ల అరెస్ట్
ముంబై: ముంబైలోని ఈస్ట్రన్ ఉపనగరం గోవండీ ప్రాంతంలో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. స్థానిక శివాజీనగర్ ఏరియాలోని మట్టీరోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన యువతి ఓ సంస్థలో కేటరర్గా పనిచేస్తోంది. శుక్రవారం పనిలోకి వెళ్లిన యువతి సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెతో పనిచేసే ఓ యువకుడు తనతో కొంచెం పని ఉందని, మాట్లాడాలని చెప్పి ఆమెను ఇంటికి వెళ్లకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఆ యువతిని తీసుకుని ఓ మురికివాడలోని చిన్ని గదిలో బంధించివేశాడు. చదవండి: (నేరస్తుల పాలిట సింహస్వప్నం.. ఏఏ ఖాన్ కన్నుమూత) అనంతరం అతని స్నేహితులకు సమాచారం అందించి ఆ యువతిపై నలుగురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి నిందితులు పారిపోయారు. వెంటనే బాధితురాలు లేచి జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులపై ఐపీఎస్ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (విద్యుత్ బిల్లు కొట్టేందుకు వెళ్లి మైనర్పై అఘాయిత్యం) -
Hyderabad: రాజేంద్రనగర్లో మహిళపై సామూహిక అత్యాచారం
సాక్షి, రంగారెడ్డి: నగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కొందరు దుండగులు ఓ మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) -
Nizamabad: రాజు ఘటన మరువకముందే మరో దారుణం
-
మద్యం తాగించి డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి డిగ్రీ చదువుతున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు యువకులు బాధితురాలికి మద్యం తాగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్మూర్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన యువతి బోధన్లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. యువతికి జిల్లా కేంద్రంలోని డెకొరేషన్ పనిచేసే శేఖర్ అనే యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. యువతి బర్త్డే ఉండడంతో పార్టీ చేసుకోవాలంటూ శేఖర్ ఆమెను జిల్లా కేంద్రానికి రప్పించాడు. సాయంత్రం ఐదు గంటలకు గాయత్రినగర్లోని రూమ్కు తీసుకెళ్లాడు. అతని స్నేహితులు మరో ముగ్గురిని పిలిచాడు. అక్కడ యువతితో మద్యం తాగించి వారు తాగారు. మద్యం మత్తులో యువతిపై నలుగురు అత్యాచారం జరిపారు. రాత్రి 11 గంటల వరకు రూమ్లోనే ఉన్నారు. అనంతరం యువతిని ఇంటికి పంపించేందుకు బైక్పై ఆర్మూర్ రోడ్డువైపు వెళ్లారు. అప్పటికే యువతి మద్యం మత్తులో ఉండడంతో ఉదయం పంపించాలని తిరిగి బస్టాండ్ వైపు వచ్చారు. యువకుడికి బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే యువకుడు పరిచయం ఉండడంతో అతనికి ఫోన్చేసి ఈ రాత్రికి యువతిని ఉంచేందుకు ఆస్పత్రిలో రూమ్ కావాలని అడిగారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత మద్యం మత్తులో ఉన్న యువతిని ఇద్దరు యువకులు బలవంతంగా ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్నారని గమనించిన ఆస్పత్రి ముందు గల షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డులు వారిని నిలదీశారు. దీంతో యువకులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వివాదం జరిగింది. సెక్యూరిటీ గార్డులు డయల్ 100కు ఫోన్ చేయడంతో యువతిని అక్కడే వదిలివేసి యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒకటో టౌన్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పారిపోతున్న నలుగురిలో ఇద్దరిని పట్టుకున్నారు. యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులను తెల్లవారుజామున పట్టుకున్నారు. నిందితుల్లో శేఖర్తో పాటు అతని స్నేహితులు కోటగల్లికి చెందిన భానుప్రకాశ్, నవీన్, బస్టాండ్లో పనిచేసే కరీం ఉన్నారు. అడిషనల్ డీసీపీ ఉషావిశ్వనాథ్ యువతిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలిని సఖీ కేంద్రానికి తరలించారు. -
జిరాక్స్ కోసం వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
కన్నౌజ్: పత్రాలను జిరాక్స్ తీయించుకోవడానికి సైబర్ కేఫ్కు వెళ్లిన ఇద్దరు బాలికలను నలుగురు వ్యక్తులు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరిగింది. ఓ మహిళ సహా మొత్తం ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. అత్యాచారాన్ని నిందితులు వీడియో తీశారని, ఈ ఘటన బయటకు చెప్తే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్లు 17 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం రూ. 10 వేలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. దీంతో తాను, తన మిత్రురాలు కలసి తమ ఇళ్లలో దొంగతనం చేసి డబ్బు చెల్లించినట్లు చెప్పారు. డబ్బు పోయిన సంగతిని తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయగా, అత్యాచారం విషయం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కేఫ్లో వ్యభిచారం జరుగుతున్నట్లు కూడా తేలిందన్నారు. చుట్టుపక్కల వారు సైతం ఆ కేఫ్ వద్ద యువతులను పలు మార్లు చూసినట్లు చెప్పారని పేర్కొన్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: (ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..) -
దారుణం: మహిళా కానిస్టేబుల్పై సామూహిక లైంగిక దాడి
నీముచ్: మహిళా పోలీసులకు కూడా రక్షణ కరువైందని తెలిపే తాజా ఉదాహరణ ఇది. ఓ మహిళా కానిస్టేబుల్(30)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ అకృత్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఘటన చోటుచేసుకోగా బాధితురాలు 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలితో నిందితుడు ఏప్రిల్ నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం కొనసాగిస్తున్నాడు. తన సోదరుడి బర్త్డే పార్టీకి ఆహ్వానించగా బాధితురాలు వెళ్లింది. అక్కడే ఆమెపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయిదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. -
వివాహితపై గ్యాంగ్ రేప్
మేడికొండూరు (తాడికొండ): ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న దంపతులను అటకాయించి గుర్తుతెలియని దుండగులు వారిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. భార్యాభర్తలిద్దరినీ కత్తులతో బెదిరించిన వారు భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్ల ముందే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. గుండెలను దహించే ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని సత్తెనపల్లి రూరల్ మండలం పెంటపాడుకు చెందిన దంపతులు కొంతకాలంగా సత్తెనపల్లిలో ఉంటున్నారు. బంధువుల ఇంట బారసాల కార్యక్రమానికి బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు వెళ్లారు. వేడుక అనంతరం రాత్రి 9.30 గంటలకు సత్తెనపల్లికి ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. పాలడుగు రోడ్డు మూలమలుపు వద్ద దారికి అడ్డంగా చెట్టుకొమ్మ పడి ఉండటంతో ద్విచక్ర వాహనం ఆపారు. ఇంతలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లపై నుంచి నలుగురు దుండగులు ఒక్కసారిగా కిందకు దూకారు. మద్యం మత్తులో ఉన్న వారు కత్తులు చూపి దంపతులను బెదిరించారు. పక్కనే ఉన్న పొలాల్లోకి వారిని, ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లారు. భర్తను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చెట్టుకు కట్టేసి అరిస్తే చంపుతామని బెదిరించారు. అనంతరం మహిళపై నలుగురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. తర్వాత వారిద్దరినీ రోడ్డుపైకి తీసుకొచ్చి ద్విచక్రవాహనం స్టార్ట్చేసి అరవకుండా వెళ్లిపోవాలని బెదిరించారు. సుమారు 3 గంటల పాటు దంపతులను చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర వేదనతో బయలుదేరిన దంపతులు అర్ధరాత్రి సమయంలో సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడి పోలీసులు మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేడికొండూరు పోలీసులు సత్తెనపల్లి వెళ్లి బాధితులను కారులో ఎక్కించుకుని ఘటనా ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించాయి. గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ గంగాధరం, సౌత్జోన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, మేడికొండూరు సీఐ మారుతీకృష్ణ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసినట్లు అదనపు ఎస్పీ గంగాధరం వివరించారు. పోలీసుల అదుపులో అనుమానితులు దాడి దోపిడీ, లైంగిక దాడి ఘటన జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో కొత్తగా కోల్డ్స్టోరేజీ నిర్మాణం జరుగుతోంది. అక్కడ పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఉంటున్నారు. వీరిలో ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
మైసూరు అత్యాచార ఘటన: కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, బెంగళూరు: మైసూరులో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసు దర్యాప్తులో పురోగతి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. ఆరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టయిన అయిదుగురు తమిళనాడులోని తరుప్పూర్ జిల్లాకు చెందిన అరటిపండ్లు విక్రయించే కూలీలుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిలో ఒకరు 17 ఏళ్ల బాలనేరస్తుడని అనుమానిస్తున్నారు. తమిళనాడులోని సత్యమంగళలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తిని కర్ణాటకలోని చామరాజనగర్లో పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నలుగురు నిందితుల్లో ముగ్గురు నేర చరిత్ర కలిగి ఉన్నారు. చదవండి: మైసూరు ఘటన: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్ కాగా మైసూరు నగరం చాముండి కొండ సమీపంలో ఈనెల 24న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు ప్రత్యేక బృందాలు ఈ కేసును వివిధ కోణాల్లో విచారిస్తున్నాయి. తొలుత ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారని వార్తలు వచ్చాయి. వీరంతా మైసూరులో ఇంజినీరింగ్ చదువుతున్నారని, వీరిలో ముగ్గురు తమిళనాడు, ఒకరు కేరళకు చెందిన వారని దర్యాప్తులో వెలుగు చూసినట్లు ప్రచారం జరిగింది. అయితే తరువాత వారికి ఈ నేరంతో సంబంధం లేనట్లు తేలింది. -
బెంగళూరు గ్యాంగ్రేప్ కేసు: 12 మంది నిందితుల అరెస్టు
బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువతిని 12 మంది యువకులు సాముహిక అత్యాచారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాగా, ఈ ఏడాది మే నెలలో, అత్యాచార ఘటన జరిగిందని బెంగళూరు పోలీసు అధికారి కమల్ పంత్ తెలిపారు. ఈ కేసును కేవలం ఐదు వారాల వ్యవధిలోనే పూర్తి చేసి, కోర్ట్లో చార్జ్షిట్ దాఖలు చేశామని ఈరోజు (గురువారం) ట్వీట్ చేశారు. అదే విధంగా, ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించినందుకు, దీనిలో పాల్గోన్న అధికారులకు 1 లక్ష రూపాలయలను రివార్డుగా ప్రకటించారు. అయితే, నిందితులంతా బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్యాంగ్, బంగ్లాదేశ్కు చెందిన యువతిని, మూడేళ్ల క్రితం అక్రమంగా తీసుకోచ్చి అస్సాం, పశ్చిమబెంగాల్, తెలంగాణ, కర్ణాటకలో తిప్పుతూ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిమధ్య డబ్బుల విషయంలో గొడవ రావడంతో, మిగతావార ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. వీరంతా ఒకే గ్రూప్కు చెందినవారుగా భావిస్తున్నారు. అయితే, 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్లో ఇద్దరు యువతులు ఉన్నట్లు గుర్తించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడ్డారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారి కమల్ పంత్ తెలిపారు. -
గ్యాంగ్రేప్; ఎవరికైనా చెబితే నగ్న వీడియోలు నెట్లో పెడతాం..
సాక్షి, నరసరావుపేట టౌన్: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ కృష్ణయ్య మంగళవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన ఓ యువతి భర్తతో విభేదాల కారణంగా నరసరావుపేట పట్టణంలో ఒంటరిగా నివసిస్తోంది. తన దగ్గర ఉన్న 47 సవర్ల బంగారాన్ని భద్రపరచమని సుమారు ఏడాది కిందట బరంపేటకు చెందిన ఆవుల మస్తాన్రావు, కనపర్రు గ్రామానికి చెందిన గుంజి శ్రీనివాసరావులకు ఇచ్చింది. అయితే బంగారం తిరిగి ఇవ్వకపోవటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసి బంగారం తిరిగి ఇప్పిస్తానని మాజీ రౌడీషీటర్ గుజ్జర్లపూడి ఆనంద్ విజయ్కుమార్ అలియాస్ కన్నల్ పోలీస్ స్టేషన్లో ఆరు నెలల కిందట ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసనగర్లో ఓ గృహం అద్దెకు తీసుకొని యువతిని అక్కడ ఉంచాడు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన కన్నల్, అతని స్నేహితుడు వినుకొండ నియోజకవర్గ ఓ పార్టీ ఇన్చార్జి అట్లూరి విజయకుమార్ కలిసి గృహంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎక్కడైనా చెబితే తమ దగ్గర ఉన్న నగ్నవీడియోలు నెట్లో పెడతామని ఆమెను బెదిరించారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై టూటౌన్ పోలీసులు అదే రోజు గ్యాంగ్రేప్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితులిద్దరు పరారై ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కేసులో రెండవ నిందితుడైన అట్లూరి విజయకుమార్ను అరెస్ట్ చేశారు. చదవండి: ‘ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదు’ -
వదినపై నలుగురితో కలిసి మరిది గ్యాంగ్ రేప్
జైపూర్: వదినపై మరో నలుగురితో కలిసి మరిది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్తను కట్టేసి అతడి భార్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్లోని బరాన్ జిల్లాలో చోటుచేసుకుంది. భర్తతో కలిసి ఆలయానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా ఐదుగురు అడ్డగించారు. ప్రధాన రహదారికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆలస్యంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఎస్పీ వినీత్కుమార్ తెలిపారు. భర్తపై దాడి చేసి పక్కకు తీసుకెళ్లి కట్టేశారు. ఇక ఆ మహిళను బలవంతంగా పొదల్లోకి లాకెళ్లారు. అనంతరం అందరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. భర్త కళ్లెదుటే ఆమెపై అఘాయిత్యం జరిగింది. అనంతరం బాధితురాలు తన భర్తతో కలిసి సదార్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మొదటి భర్త కుటుంబసభ్యులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా.. ఆమెపై కక్ష కట్టి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని ఎస్పీ వినీత్కుమార్ తెలిపారు. ప్రస్తుతం వారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రధాన నిందితుడు దినేశ్గా గుర్తించారు. -
బాలికపై సామూహిక అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. వివరాల ప్రకారం..యూపీలోని హమీర్పూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆసుపత్రికి తరలించే నాటికి ఆమె పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో బుధవారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆమె చనిపోయిన తర్వాతే విషయం తెలిసిందని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తమ కుమర్తెపై ఐదుగురు వ్యక్తులు సోమవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి మీడియాతో వాపోయాడు. నిందితుల నుంచి ప్రాణహాని ఉంటుందేమోనన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపాడు. చదవండి : (బస్సులో పరిచయం, విటమిన్ ట్యాబ్లెట్లు అని నిద్రమాత్రలు) (టీ చేయను అనడం భర్తను రెచ్చగొట్టడం కాదు: కోర్టు) -
దారుణం: యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్
శందోల్: మధ్యప్రదేశ్లోని శందోల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు 20 ఏళ్ల యువతికి మద్యం తాగించి, రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జైత్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గడాఘాట్ ప్రాంతంలోని ఓ ఫామ్హౌస్లో ఈ నెల 18, 19 తేదీల్లో యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. అంతకుముందు ఆమెను కారులో అపహరించారు. ఫామ్హౌస్కు తీసుకొచ్చి బలవంతంగా మద్యం తాగించారు. రాక్షసకాండ పూర్తయ్యాక ఈ నెల 20న ఆమె ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. నలుగురు కామాంధులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితుల్లో ఒకడు స్థానిక బీజేపీ నాయకుడు విజయ్ త్రిపాఠీ అని తెలిసింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. చదవండి: (అందమైన అమ్మాయిలతో మసాజ్.. 55 లక్షలు దోచుకున్నారు) -
32ఏళ్ల మహిళపై పాశవిక అత్యాచారం
లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కేంద్రం ఎన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చిన వాటిని మానవ మృగాళ్లు లెక్క చేయడం లేదు. బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 32ఏళ్ల మహిళ బలైపోయింది. ఈ సామూహిక అత్యాచారానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాకింగ్ సంఘటన తెరపైకి వచ్చింది. మహిళపై సామూహిక అత్యాచారం 5 నెలల క్రితం జరిగింది. అయితే ఈ సంఘటన వీడియో నెట్లో ప్రసారం అయిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి బాధితురాలు గురువారం (జనవరి 28) పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురు మైనర్లు ఉన్నారు.(చదవండి: ఇంటి దొంగే.. రూ.10 కోట్లు డిమాండ్!) ఐదు నెలల క్రితం కట్టెల కోసం దగ్గరలోని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ యువకులు తనపై సామూహిక అత్యాచారం పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు గ్యాంగ్రేప్ను కూడా చిత్రీకరించారని తెలిపింది. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తామని, తన భర్త, పిల్లలను చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆమె తెలిపారు. అయితే, వీడియో ప్రసారం అయిన తర్వాతే ఆ మహిళ ధైర్యాన్ని కూడగట్టుకొని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. బడాన్ జిల్లా ఎస్ఎస్పి సంకల్ప్ శర్మ మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు ఈ వీడియో క్లిప్లను గ్రామ పరిసర ప్రాంతాలలోని కొంతమందికి రూ.300 చొప్పున విక్రయించారని తెలిపారు. దీంతో ఈ వీడియో బయటకి వచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ అంత్యంత దారుణంగా బలైపోయింది. దేవాలయానికి వెళ్లిన 50ఏళ్ల మహిళపై కామాంధులు విరుచుకుపడ్డారు. ఆమె దేహంతో ఆటబొమ్మతో ఆడుకున్నట్లుగా అత్యంత కిరాతకంగా.. పాశవికంగా ఇష్టమొచ్చినట్లుగా ఆడుకున్నారు. -
దివ్యాంగురాలిపై లైంగిక దాడి, చూపు కోల్పోయిన బాలిక
బిహార్: దివ్యాంగురాలు అని కూడా చూడకుండా 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్లోని మధుబాన్ జిల్లాలో బుధవారం జరిగింది. మధుబాన్ జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్లకి పోలీస్స్టేషన్ పరిధిలోని కౌవహ బర్హి గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) బాలిక (15) తన స్నేహితులతో కలిసి మేకల్ని తోలుకొని అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వెంట పడి బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాంతో తోటి బాలికలు వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. దుండగుల దాడిలో ఆ బాలిక కంటిచూపు కోల్పోయింది. బాధితురాలిని మధుబానీలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ పాశవిక దాడి ఘటనపై బిహార్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఘటనను ఖండిస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. -
జైలులో యువతిపై గ్యాంగ్ రేప్?
మధ్యప్రదేశ్ : జైలులోని ఓ యువతిపై పోలీసులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఇన్చార్జ్తో సహా ఐదుగురు పోలీసులు 10 రోజుల పాటు సదరు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఓ హత్య కేసులో 20 ఏళ్ల యువతి రేవా జిల్లాలోని మాంగ్వాన్ పోలీసుల కస్టడీలో ఉంది. అక్టోబర్ పదో తేదీన జైలును తనిఖీ చేసేందుకు అడిషనల్ జిల్లా జడ్జితో పాటు కొందరు లాయర్ల వెళ్లగా ఈ విషయం బయటపడింది. తనపై మే 9వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు ఐదుగురు పోలీసులు లాకప్లోనే అత్యాచారం చేసినట్టు వివరించింది. ఈ విషయాన్ని మూడు నెలల క్రితమే జైలు వార్డెన్కు చెప్పానని, అయినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొంది. కాగా సదరు యువతిని అరెస్టు చేసిందే మే 21వ తేదీన అని, అడిషనల్ జిల్లా జడ్జి జ్యుడీషియల్ ఎంక్వైరీ ఆదేశాల నేపథ్యంలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. -
యూపీలో ‘నిర్భయ’
న్యూఢిల్లీ/హాథ్రస్: నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. 19 ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్రవర్ణ యువకులు అత్యంత దారుణంగా గాయపర్చి, పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయింది. తెగిన నాలుక, విరిగిన ఎముకలు, పూర్తిగా చచ్చుపడిపోయిన కాళ్లు, పాక్షికంగా పక్షవాతానికి గురైన చేతులు, మెడకు, వెన్నెముకకు అయిన తీవ్ర గాయాలు.. ఆ యువతిపై ఆ రాక్షసులు సాగించిన దమనకాండకు సాక్ష్యాలుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు, నిర్భయ చట్టానికి కారణమైన 8 ఏళ్ల క్రితం నాటి నిర్భయ అత్యాచార ఘటనను ఈ దారుణం గుర్తుకు తెచ్చింది. దళిత యువతి మృతిపై పౌర సమాజ కార్యకర్తలు, దళిత సంఘాలు, భీమ్ ఆర్మీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించాయి. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వెలుపల భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో వేలాది మంది ధర్నాకు దిగారు. ఆ దళిత యువతికి న్యాయం చేయాలని, దోషులను బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దళితులంతా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆజాద్ పిలుపునిచ్చారు. ఆటవిక రాజ్యం నడుస్తున్న యూపీలో మరో దళిత యువతి బలి అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని విజయ్ చౌక్లో, యూపీలోని హాథ్రస్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని హాథ్రస్ ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. సందీప్, రాము, లవ్కుశ్, రవి తనపై అత్యాచారం చేశారని, వారిని అడ్డుకుంటుండగా, గట్టిగా గొంతు నులిమారని, అప్పుడు నాలుక తెగిందని బాధిత యువతి మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించింది. బాధిత మహిళను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించి మెరుగైన చికిత్స అందించకుండా.. పరిస్థితి పూర్తిగా విషమించిన తరువాత, సోమవారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అలాగే, బాధితుల ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, నాలుగైదు రోజుల తరువాత కేసు నమోదు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. అసలేం జరిగింది.. సుమారు రెండు వారాల క్రితం, సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాథ్రస్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, బాధితురాలి సోదరుడు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆ రోజు ఉదయం పశువులకు గడ్డి కోసేందుకు తల్లి, అన్నతో కలిసి ఆమె పొలంకు వెళ్లింది. కాసేపయ్యాక గడ్డిమోపుతో ఆమె సోదరుడు ఇంటికి తిరిగి వెళ్లాడు. యువతి తల్లికి కొద్ది దూరంలో ఉండి గడ్డి కోస్తుంది. ఇంతలో, వెనక నుంచి వచ్చిన ముష్కరులు ఆమె నోరు మూసి, చున్నీని మెడకు చుట్టి దూరంగా లాక్కెళ్లారు. కాసేపటికి కూతురు కనిపించడం లేదని గుర్తించిన తల్లి వెతకగా.. దారుణంగా అత్యాచారానికి గురై, రక్తమోడుతూ, ఒళ్లంతా గాయాలతో, అపస్మారక స్థితిలో కనిపించింది. మొదట, ఆమెను అలీçగఢ్లోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చేర్చారు. అయితే, చికిత్సకు స్పందించడం లేదని..మెడకు అయిన గాయం కారణంగా కాళ్లు పూర్తిగా, చేతులు పాక్షికంగా చచ్చుబడిపోయాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాంతో, ఆమెను సోమవారం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ వైద్యశాలకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందింది. అరెస్ట్ చేశాం.. నిందితులు అగ్రవర్ణాలకు చెందిన వారయినందున, ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదని వచ్చిన ఆరోపణలు సత్యదూరమని ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని, బాధితురాలు మరణించినందున వారిపై పెట్టిన కేసుల్లో హత్యానేరం కింద ఐపీసీ 302 సెక్షన్ను కూడా చేరుస్తామన్నారు. 8 రోజులు ఏం చేశారు? ‘జవాబుల్లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఘటన జరిగిన తరువాత, ఫిర్యాదు అందిన తరువాత 8 రోజుల పాటు పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? బాధిత యువతిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్కు ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ నలుగురు రాక్షసులపై ఎన్ఎస్ఏ(నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) కింద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ దారుణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ ష్రినతే ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత యువతి మృతికి మొత్తం సమాజం సిగ్గుతో తల దించుకోవాలని ఢిల్లీ సీఎంæ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ హత్యాచార ఘటనపై క్రికెటర్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తర్ ఆవేదనను వ్యక్తపరిచారు. వెల్లువెత్తిన నిరసనలు దళిత యువతి హత్యాచారంపై నిరసనలు వెల్లువెత్తాయి. ‘ప్రభుత్వం మా ఓపికను పరీక్షించవద్దు. వారిని ఉరి తీసేవరకు మేం విశ్రమించం’ అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ స్పష్టం చేశారు. ఆమెను ఎయిమ్స్కు మార్చి, మరింత మెరుగైన చికిత్స అందించాలన్న తన విజ్ఞప్తిని యూపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ యువతి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆజాద్ పేర్కొన్నారు. సమాచారం తీసుకున్నాం.. ఈ ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలు చెప్పాలని పోలీసులను ఆదేశించామని జాతీయ మహిళాకమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.