-
జితేందర్ రెడ్డిగా వస్తోన్న రాకేశ్.. ఆసక్తిగా పోస్టర్!
బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రాకేశ్ వర్రే. ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ పేరులో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ మేకర్స్ తెరదించారు. హీరో పేరును రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేశ్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్గా కనిపించారు.ఈ పోస్టర్లో అతను యంగ్ పోలీస్లా కనిపించాడు. హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న రాకేశ్ చాలా గ్యాప్ తర్వాత జితేందర్ రెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే అసలు జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని విషయాలు కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ నటుడు ఎంపిక కోసం దాదాపు 6 నెలల పాటు సమయం పట్టిందట. చాలా మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రేను ఎంచుకున్నారు. ఈ మూవీని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. -
సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ వస్తోంది!
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మూవీ 'దా...దా..'. ఈ చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేత్ కుమార్ సమర్పించారు. తెలుగులో ఈ చిత్రాన్ని నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జేకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) ఈ సందర్బంగా నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'తమిళంలో మంచి యూత్ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన చిత్రం దా...దా... తెలుగువారి కోసం పా...పా..పేరుతో తీసు కొస్తున్నాం. ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడినా.. తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని రెడీ అయ్యాము. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాం. అతి త్వరలో గ్రాండ్గా ట్రైలర్ లాంఛ్ ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. అలానే పా...పా... చిత్రాన్ని తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చెయ్యాలని చేస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు. ఈ చిత్రంలో కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వి టి వి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
డెవిల్స్ ఏంజిల్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సోమవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డెవిల్’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్ లుక్పోస్టర్ను ‘డెవిల్స్ ఏంజిల్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్ నామా. -
SKY:ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే?
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే" అన్నది ట్యాగ్ లైన్. పృథ్వి పేరిచర్ల దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్"పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ "స్కై" చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు. -
క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న ద్రోహి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్నెస్డే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. 'సినిమాకు సంబంధించిన లుక్, గ్లింప్స్ చూశా. చాలా బాగుంది. ఈ సినిమాకు చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు రావాలి. ఈ సినిమా టీమ్ అందరికీ శుభాకాంక్షలు' అని అన్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. 'చక్కని థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ, డెబి, షకలక శంకర్, నిరోజ్, శివ, మహేష్ విట్ట, మెహ్బూబ్, చాందినీ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న ‘సికాడా’.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
రజిత్ సీఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సికాడా. ఈ చిత్రం ద్వారా శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ చందూ మొండేటి, యంగ్ హీరో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. రోటీన్గా కాకుండా ఓ కొత్త కాన్సెప్ట్తో పలకరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్తో రాబోతోన్న ఈ మూవీ విడుదలకు ముందే అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సికాడా చిత్రంలో అందరూ కొత్తవారే నటించడం విశేషం. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీజిత్ గతంలో మ్యూజిక్ డైరెక్టర్గా "కాదల్ ఎన్ కవియే", "నెంజోడు చేరు" వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు. -
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !
తమిళ నటుడు శరత్కుమార్, గౌతమ్ కార్తీక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'క్రిమినల్'. దక్షిణామూర్తి ఈ చిత్రాన్ని పర్సా పిక్చర్స్, పీఆర్.మీనాక్షీసుందరం, బిగ్ ప్రింట్ పిక్చర్స్, ఐబీ.కార్తీకేయన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వస్తోందని చిత్ర దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నానని వాటిని తెరకెక్కించడానికి పలు ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. (ఇది చదవండి: Neha Shetty: టాలీవుడ్ని షేక్ చేస్తున్న ‘రాధిక’) అలాంటి సమయంలో తనకు టీకొట్టు వద్ద ఒక ఆలోచన వచ్చిందని అదే క్రిమినల్ చిత్ర ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నటుడు శరత్కుమార్, గౌతమ్ కార్తిక్ ఈ కథలోకి రావడంతో చిత్రానికి ఇంకా భారీ క్రేజ్ వచ్చిందన్నారు. చిత్ర షూటింగ్లో నిర్మాతలు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రం మాదిరి మదురై నేపథ్యంలో ఇంతకుముందు పలు ప్రేమ కథా చిత్రాలు వచ్చాయని.. అయితే వాటికి క్రిమినల్ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలో జరిగే క్రైమ్, థ్రిల్లర్ సంఘటనలే ఈ చిత్రమని అన్నారు. కాగా దీనికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ప్రసన్న ఎస్ కుమార్ ఛాయాగ్రహణం అందించారని తెలిపారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్, విడుదల తేదీలను వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. Thanks @SilambarasanTR_ for releasing our #Criminal movie First Look poster and for your wishes. https://t.co/U3ggy655Og — Parsa Pictures Pvt Ltd (@ParsaPictures) August 25, 2023 -
మరో హిట్కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
ది కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదాశర్మ. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ కథలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే హారర్ జానర్తో అలరించేందు సిద్ధమైంది. సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సీడీతో ఆదాశర్మ మన ముందుకు రాబోతోంది. డిఫరెంట్ ఫీలింగ్ కలిగింగ్ సరికొత్త స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ మరో లీడ్ రోల్ సినిమాలో ఆసక్తి పెంచుతోంది. (ఇది చదవండి: ‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్) సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) చిత్రాన్ని కృష్ణ అన్నం దర్శకత్వంలో తెరకెక్కిస్కున్నారు. ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై.. గిరిధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దెయ్యాల చేతుల మధ్యన ఆదాశర్మ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. పోస్టర్ చూస్తే అదా శర్మ సీరియస్ లుక్, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రంలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: ఆ హీరోతో నటించాలని కోరిక.. కానీ ఆ పాత్ర చేయను: రాశి) -
'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
జీవీ, 8 తోట్టాగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ వెట్రి హీరోగా.. పూచ్చాండి చిత్రం ఫేమ్ హంశినీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లాక్డౌన్ నైట్స్. ఈ చిత్రానికి ఎస్ ఎస్.స్టాన్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాత వినోద్ శబరీస్ తాజాగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం లాక్డౌన్ నైట్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర టైటిల్ పోస్టర్ను సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా.. ఇటీవల కన్నడలో కిశోర్, పూజా గాంధీ జంటగా సంహారిణి అనే భారీ చిత్రాన్ని వినోద్ శబరీస్ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: 'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!) ఎస్ ఎస్.స్టాన్లీ ఇంతకు ముందు ఏప్రిల్ మాదత్తిల్, పుదుకోట్టైయిలిరుందు సరవణన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు గంగై అమరన్, మదియళగన్, లోగన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాలై సహదేవన్ ఛాయాగ్రహణం, జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్ను పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే 'తంతిరం' చూడాల్సిందే
శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో 'సినిమా బండి ప్రొడక్షన్స్' పతాకంపై శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం 'తంతిరం'. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల (SK) నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రగుల మాట్లాడుతూ ' ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇది హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మా 'తంతిరం' చిత్రం చూడాల్సిందే. మా చిత్రం కేరళ ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాము, షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఈరోజు మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశాం. త్వరలోనే టీజర్, ట్రైలర్తో మీ ముందుకు వస్తాం' అని నిర్మాత శ్రీకాంత్ తెలిపారు. -
ధీమహి చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు) అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ 'ధీమహి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. 7:11 చిత్రంలో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రంలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రంలోని పాటలను త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాము. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, త్వరలోనే ట్రైలర్తో మీముందుకు వస్తాం. ఆపై రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తాం.' అని తెలిపారు. -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న 'రసవతి'..!
అర్జున్దాస్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'రసవాది'. మౌనగురు, మహాముని వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శాంతకుమార్. కథలను నమ్మి చిత్రాలు చేసే ఈయన పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అలా శాంతకుమార్ తెరకెక్కిస్తున్న మూడో చిత్రం 'రసవాది'. డీఎన్ఏ మెకానిక్ కంపెనీ సరస్వతి సినీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి రమ్య సుబ్రమణియన్, జీఎం సుందర్, సుజిత్ శంకర్, రేష్మ, సుజాత, రిషీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తుండగా.. వరవణన్ ఇళవరసు, శివకుమార్ల ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. (ఇది చదవండి: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? బడ్జెట్లో సగం సూపర్స్టార్కే! ) దర్శకుడు శాంతకుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో క్రైమ్, రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. తాను గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేటర్ ఎక్స్పీరియన్న్స్ ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్ను కొడైకనాల్, మదురై, కడలూర్, పళని ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో, విడుదల తేదీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. (ఇది చదవండి: శ్రీరామ్ కార్తీక్ హీరోగా కొత్త ప్రేమ కథా చిత్రం!) A movie I’ve been super excited about! Can’t wait for you all to watch what @Santhakumar_Dir has made#Rasavathi 🔥💥 A @MusicThaman Musical 💥@actortanya @ReshmaVenkates1 @actorramya @GMSundar_ @SPremChandra1 @saranelavarasu @EditorSabu @minu_jayebal @dancersatz… pic.twitter.com/NshqoLmP5J — Arjun Das (@iam_arjundas) August 5, 2023 -
త్వరలోనే మరో ప్రేమకథా చిత్రం ‘మదిలో మది’
టాలీవుడ్లో ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. లవ్స్టోరీలో వైవిద్యం ఉంటే చాలు ఆ చిత్రాన్ని కచ్చితంగా హిట్ చేస్తారు. అందుకు మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘బేబీ’ మూవీ. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన బేబి సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందే మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా మదిలో మది అనే చిత్రం రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మదిలో మది సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్ను చూశాను అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్కు ఆల్ ది బెస్ట్ ’ అని అన్నారు. -
Yamudu Movie: ‘యముడి’పై కొత్త చిత్రం
తెలుగు తెరపై యముడి కేరెక్టర్ ఓ సక్సెస్ ఫార్ములా. ఇప్పటికే యముని వేషాలతో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ఆదరించారు. కొన్ని చిత్రాలు అయితే బాక్సాఫీస్ని షేక్ చేశాయి. అయితే ఈ మధ్య కాలంలో యముని కాన్సెప్ట్తో కొత్త చిత్రమేది రాలేదు. కానీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు మరోసారి యమలోకాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు జగదీష్ ఆమంచి. జగన్నాధ పిక్చర్స్ పతకం పై స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ధర్మో రక్షతి రక్షితః ఉప శీర్చిక. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘ఇదొక ఒక థ్రిల్లర్ చిత్రం. కథ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది’అని దర్శకనిర్మాత జగదీష్ తెలిపారు. ఈ చిత్రానికిష్ణు కెమెరా మాన్ గా వ్యవహారిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. -
ఘోరంగా హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్
-
ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన రుహానీ శర్మ
రుహాణీ శర్మ పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ‘హర్’. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో రఘు సంకురాత్రి, దీపాసంకురాత్రి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి. సురేష్బాబు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్. -
హీరో విజయ్ ఇలా చేస్తారనుకోలేదు.. పోస్టర్పై తీవ్ర విమర్శలు!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'లియో'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ లలిత్కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటి త్రిష , ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్దత్, నటుడు అర్జున్, మన్సూర్ అలీఖాన్ దర్శకుడు మిష్కిన్, గౌతమ్ వాసుదేవన్, శాండీ మాస్టర్, మాథ్యూథామస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్) మాస్టర్ చిత్రం తర్వాత విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రం చివరి దశకు చేరుకుంది. దీంతో చిత్రం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఆడియో హక్కులు, ఓటీటీ హక్కును అంటూ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు టాక్ వైరల్ అవుతోంది. తాజాగా మరో అప్డేట్ వెల్లడించారు. ఈనెల 22న నటుడు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని అలర్ట్ ఈగో నా రెడీ అనే పల్లవితో సాగే తొలి పాటను విడుదలైనట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో విజయ్ చేతుల్లో గన్ను, నోట్లో సిగరెట్ పెట్టుకుని ఫోర్స్గా కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పీఎంకే పార్టీ నేత రామదాసు విజయ్పై విమర్శలు గుప్పించారు. ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ విజయ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చాలా కాలం క్రితం తన చిత్రాల్లో సిగరెట్లు కాల్చే సన్నివేశాలను, మద్యం తాగే సన్నివేశాలను చోటు చేసుకోవడాన్ని తాను అనుమతించనని వాగ్దానం చేశారన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ మాట తప్పి ఇప్పుడు లియో చిత్రంలో అలా రెండు అంశాలు చోటు చేసుకోవడం ఆయన అభిమానులను చెడు త్రోవ పట్టించడం కాదా అని ప్రశ్నించారు. (ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) First Single #NaaReady on @actorvijay Anna's Birthday #Leo 🔥🧊 pic.twitter.com/xG5T46GWyR — Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 16, 2023 -
తిరగబడరా...
రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేబీ, కెమెరా: జవహర్ రెడ్డి. -
'గుంటూరు కారం' శ్రీలీల ఫస్ట్ లుక్.. ఇది గమనించారా?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ హిట్ కొట్టి నిలబడేవాళ్లు మాత్రం చాలా తక్కువ. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీలీల. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ అంతంతమాత్రంగా ఆడినప్పటికీ.. అవకాశాల మాత్రం వెల్లువలా వచ్చేశాయి. (ఇదీ చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) గతేడాది 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ అయిపోయింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం'లోనూ శ్రీలీల వన్ ఆఫ్ ది హీరోయిన్. బుధవారం ఈమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రకారం విలేజీ బ్యూటీగా శ్రీలీల కనిపించనుంది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న లుక్ ని రిలీజ్ చేశారు. ఇలా శ్రీలీలని చూస్తుంటే.. 'గుంటూరు కారం'లో హీరో మహేష్ బాబునే డామినేట్ చేస్తుందా అనిపించేలా ఉంది. త్రివిక్రమ్ తీస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. అలానే రామ్-బోయపాటి మూవీలో శ్రీలీల ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మోడ్రన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా: శ్రీలీల) Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 - Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨ Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf — Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023 -
విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
విజయ్ ఆంటోనీ టాలీవుడ్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవలే బిచ్చగాడు -2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా 'విక్రమ్ రాథోడ్' సినిమా తెలుగులోనూ రాబోతోంది. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?) -
ద్రవిడభూమి గొప్పతనంతో...
ప్రముఖ రచయిత సౌద అరుణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కోడ్ రామాయణ’. ఈ చిత్రంలో సుమారు 50 మంది నూతన నటీనటులు యాక్ట్ చేశారు. సౌద అరుణ్ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌ¯Œ ్సమెంట్ హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చిన బౌద్ధ భిక్షువు బంతె షీల్ రక్షిత్, ప్రముఖ రచయిత్రి లలిత. పి. చేతుల మీదుగా ‘కోడ్ రామాయణ’ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత సౌద అరుణ్ మాట్లాడుతూ–‘‘ద్రవిడ భూమి గొప్పతనాన్ని ప్రపంచం మరింత అర్థం చేసుకోవాలనే ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా(కోడ్ రామాయణ, రావణ చరిత్ర, ఉత్తర రామాయణం) ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రంలో దుర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ–‘‘కోడ్ రామాయణ’ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం. ఈ సినిమాని చిరంజీవిగారికి చూపించి, రెండో భాగంలో రావణాసుర పాత్ర చేయమని కోరతాం’’ అన్నారు. నటులు శ్రీశైల్ రెడ్డి, పి.జగదీశ్ పాల్గొన్నారు. -
ఆసక్తి పెంచుతున్న శివ కోన కొత్త సినిమా పోస్టర్
శివా కోన దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతుంది. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ పోస్టర్ని మాత్రం వదిలారు. ఆ పోస్టర్లోక్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరికి ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరక్కబోతుందని అర్థం అవుతుంది. కాలేజీకి వెళ్లే కుర్రాళ్ల చేతుల్లో గన్ను ఉంది. వాళ్ల పక్కనే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. వీరికి ముందు ఒక సూటు వేసుకున్న గ్రే షేడ్ క్యారెక్టర్, తన పక్కనే ఓ గ్లామర్ బ్యూటీ ఉంది. వీరే కాకుండా రేయ్ ఎవర్రా మీరంతా అంటే నోట్లో సిగర్ పెట్టుకుని కొని, చేతిలో కోడిని పట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కుర్చీలో కూర్చున్న పోస్టర్ ఆలరిస్తోంది. -
NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్30'. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు!) అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్ 30 టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి అందరూ ఊహించినట్లుగానే దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కత్తి చేతిలో పట్టుకుని సముద్రం పక్కన నిలబడి ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్30 టైటిల్ నాదే.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్) జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ లుక్ని రివీల్ చేయగా.. ఇంతవరకు ఎన్టీఆర్ లుక్ని రిలీజ్ చేయలేదు. తారక్ బర్త్డేకు ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించనుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #Devara pic.twitter.com/bUrmfh46sR — Jr NTR (@tarak9999) May 19, 2023 -
NTR30: ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ఎన్టీఆర్ ఫస్ట్లుక్ కోసం బీ రెడీ
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 అనే వర్కింగ్లో టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్కి జోడీగా నటిస్తుంది. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తారక్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను అందించారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్లుక్ పోస్టర్ను ఈరోజు(శుక్రవారం)రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే జాన్వీ లుక్ని రివీల్ చేయగా ఇంతవరకు ఎన్టీఆర్ లుక్ని రిలీజ్ చేయలేదు. దీంతో ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తారక్ బర్త్డేకు ఒకరోజు ముందుగానే సర్ప్రైజ్ లభిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
యదార్థ సంఘటన ఆధారంగా 'గూడు'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
కోలీవుడ్లో వైవిధ్యభరిత కథ, కథనాలతో కూడిన ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవకు చెందిన చిత్రమే గూడు. స్కైమూన్ ఎంటర్టైన్మెంట్, ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేతలు ఎం.గణేశ్, పి.కన్నన్ కలిసి నిర్మిస్తున్న ఈజ్ చిత్రం ద్వారా జోయల్ విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్ర టైటిల్ను, ఫస్ట్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ పోస్టర్లో నటీనటులు ఎవరు లేరు. చిత్రం టైటిల్కు అద్దం పట్టేలా గూడు ఫొటోను మాత్రమే పోస్టర్ పొందుపరిచారు. చిత్ర చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యదార్థ సంఘటన ఇతివృత్తంగా రూపొందిస్తున్న కథా చిత్రం ఇదని చెప్పారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం వైవిద్యంగా ఉంటుందని చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు సినీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. Here is the first look of #Koodu 🪺 A heartwarming tale based on a true story, Releasing in Tamil, Telugu, Hindi, Kannada and Malayalam languages. #KooduFirstLook #SkyMoonEntertainment #AEntertainment #MGanesh #KannanP @joyalvijay_dir @arunprajeethm @proyuvraaj pic.twitter.com/JyDsCWfH7m — Sreedhar Pillai (@sri50) May 5, 2023