-
నేతల జంప్ జిలానీ.. బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మొన్నటికి మొన్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్.. మంగళవారం భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు.ఫాంహౌజ్కు వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. అనంతరం ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ నేతలెవరూ తొందరపడవద్దని తెలిపారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టి మారటం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు గతంలనూ జరిగాయని, అయినా మనం భయపడలేదని చెప్పారు.ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. భవిష్యత్తులో బీఅర్ఎస్ మంచి రోజులు వస్తాయని, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఅర్ఎస్కు వచ్చే నష్టం లేదని తెలిపారు. రేపటి నుంచి(బుధవారం) వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు.కాగా ఈ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి వారిని పార్టీలోకి ఆహ్వానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రచారంలో నీతులు చెప్పి, ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారంటూ రేవంత్పై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు.‘ముఖ్యమంత్రి గారు.. ప్రచారంలో నీతులు..? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?నాడు..ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు.ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు. భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు.చివరికి...ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారు.రాజీనామా చేయకుండా చేరితో ఊళ్లనుంచే తరిమికొట్టమన్నారుమరి ఇవాళ మీరే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ.. కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా ?జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి..ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారు ! ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారు !!ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని ?రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి ??ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే.. రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరేఅందుకే జవాబు చెప్పాల్సింది కూడా మీరే..!!!జై తెలంగాణ’ -
రేవ్పార్టీపై సమగ్ర దర్యాప్తు
బనశంకరి: బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో ఓ ఫాంహౌస్లో జరిగిన రేవ్పార్టీపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. ఈ పార్టీలో తెలుగు సినీ నటులు ఉన్నారని, అయితే ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ ఉన్నారు. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ అని ఈ రేవ్పార్టీకి పేరుపెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలనుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. రేవ్పార్టీలో పాల్గొన్న వారి పేర్లలో హేమ పేరు వినబడగానే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్లో ఫాంహౌస్లో ఉన్నాను అని చెప్పింది. ఆమె వీడియో గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. ..పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్యపరీక్షలు చేపట్టాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రేవ్పార్టీ జరిగిన స్థలం బెంగళూరు రూరల్లోని హెబ్బగోడి పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఎల్రక్టానిక్ సిటీ పీఎస్ నుంచి హెబ్బగోడి పీఎస్కు బదిలీ చేశాం. డ్రగ్స్ విసిరేశారు: రేవ్పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించాయి. కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్పూల్, టాయ్లెట్ తదితర స్థలాల్లోకి డ్రగ్స్ విసిరేశారు, వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణదీర్, మహమ్మద్సిద్దికి, వాసు, అరుణ్కుమార్, నాగబాబులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. పార్టీలో సిద్దిక్, రణ«దీర్, రాజ్బావ డ్రగ్స్ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అదికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలుస్తాం’అని దయానంద్ తెలిపారు.నిందితుల అరెస్ట్రేవ్పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధికి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. రేవ్పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.వాసుది విజయవాడబెంగుళూరు డ్రగ్స్ పార్టీ వెనుక ఏపీ మూలాలు ఉన్నట్లు తేలింది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసు స్వస్థలం విజయవాడగా పోలీసులు ధృవీకరించారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో భాగమైన వాసు.. క్రికెట్ బెట్టింగ్లో ఆరితేరాడు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఈ మధ్యే ఖరీదైన స్థలాలు కొన్న వాసు గ్యాంగ్.. బెంగుళూరు పార్టీ కేంద్రంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. -
ఫాంహౌస్లో శవమై తేలిన వ్యాపారవేత్త భార్య
కర్ణాటక: వ్యాపారవేత్త భార్య ఫాంహౌస్లో శవమై కనిపించింది. ఈ ఘటన రామనగర జిల్లా కగ్గలీపుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శాంతి స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని ఉగ్రప్ప తన భార్య శాంతమ్మ(50)పేరుతో పలు వ్యాపారాలు చేస్తుండేవారు. ఉగ్రప్ప కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో శాంతమ్మ గిరిగౌడనదొడ్డిలోని ఫాంహౌస్లో నివసిస్తుండేది. శాంతమ్మ అక్క కుమారుడు డాక్టర్ నంజేశ్ ఆమెకు కేర్టేకర్గా ఉండేవాడు. ఏం జరిగిందో ఏమో శాంతమ్మ ఫాంహౌస్లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కగ్గలీపుర పోలీసులు వచ్చి పరిశీలించారు. తలపై బలంగా రాతితో బాదిన ఆనవాళ్లు కనిపించాయి. హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
వ్యభిచార గృహాలుగా ఫాంహౌస్లు!
మొయినాబాద్: వారాంతపు విడిదిలు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. వీకెండ్లో సరదాగా గడపడానికంటూ నగర శివారు ప్రాంతాల్లో నిర్మించుకుంటున్న ఫాంహౌస్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టురట్టు చేస్తున్నా మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఫాంహౌస్లను లీజ్కు తీసుకుని వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటికి ఆకర్షితులై యువత పెడదారి పడుతుంది. హైదరాబాద్ శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది బడాబాబులు ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్ మండలాల్లో ఫాంహౌస్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్లున్నాయి. హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి 1 ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఫాంహౌస్లు నిర్మించుకుని తర్వాత వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. నిర్వాహకుల అడ్డగోలు దందా.. ఫాంహౌస్లను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్ టూ గెదర్ పారీ్టలు, ఫ్యామిలీ పారీ్టలు, బర్త్డేలంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. ఫాంహౌస్లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఫాంహౌస్లలో ఉంచుతున్నారు. అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దింపి యువకుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, చాకలిగూడ, సురంగల్, శ్రీరాంనగర్, తోలుకట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, ఎలుకగూడ, కుత్బుద్దీన్గూడ, రెడ్డిపల్లి, ఎనికేపల్లి, అజీజ్నగర్, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఫాంహౌస్లలో ఈ దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. నిఘా వైఫల్యం! ఫాంహౌస్ల్లో జరుగుతున్న వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని తెలుస్తుంది. ఫాంహౌస్లపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్వాహకులతో మిలాకత్ అవుతున్నట్లు సమాచారం. అందుకే ఫాంహౌస్ల్లో రాత్రిపూట ఎంత హంగామా జరిగినా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎలుకగూడ సమీపంలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహించడం వల్ల యువకుల మధ్య జరిగిన గొడవలు ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసినట్లు సమాచారం. అప్పడప్పుడు ఫాంహౌస్లపై జరుగుతున్న దాడులు ఎస్ఓటీ పోలీసులు చేస్తున్నవే కావడం విశేషం. వరుస ఘటనలు... మొయినాబాద్ మండలంలోని ఫాంహౌస్ల్లో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు నెలల క్రితం కనకమామిడి రెవెన్యూలోని మ్యాంగోహుడ్ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా గురువారం రాత్రి కనకమామిడి రెవెన్యూ పరిధిలోని హ్యాపీహోంస్లో ఉన్న రాజు ఫాంహౌస్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ఓ వాచ్మెన్, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై సైతం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. -
కేసీఆర్ ఫామ్హౌస్పై దాడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఫామ్హౌస్పై దాడి చేస్తామని కాంగ్రెస్ మాజీఎంపీ మధుయాíష్కీగౌడ్ అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్పై దాడి చేస్తే వందల కోట్ల రూపాయలు బయటపడతాయని, అక్కడ ఆయన నోట్ల కట్టలపైనే పడుకుంటారని, అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ వి«ధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటకు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అధికారినీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య తెరవెనుక ఉన్న వ్యాపారం, అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్ చుట్టూవున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాజీమంత్రి కేటీఆర్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అమెరికా, దుబాయ్లో పెట్టారని ఆరోపించారు. కల్ల»ొల్లి మాటలు, అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు. -
కేసీఆర్ ఫామ్హౌస్పై విచారణ చేపడతాం: మధుయాష్కీ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్పై విచారణ చేసి అవినీతిని వెలికితీస్తామని హెచ్చరిక చేశారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. కాగా, మధు యాష్కీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ నేతలు గుంట నక్కలా వేచి చూస్తున్నారు. కానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా లేదు. అధిష్టానం బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తాను’ అని స్పష్టం చేశారు. -
బెంగుళూరులో మెగాస్టార్ చిరంజీవి ఫామ్హౌస్ చూశారా? (ఫొటోలు)
-
కర్ర సాయంతో కేసీఆర్ నడక
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు చేతి కర్ర సాయంతో నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. గత నాలుగు రోజులుగా సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌజ్లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమారు తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాలు తొంటి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఇటీవలే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ చేరుకున్నారు. చదవండి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన -
స్టార్ హీరో ఇంట్లోకి చొరబాటు.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్
స్టార్ హీరో ఇంటి దగ్గర అలజడి. అభిమానులు అని చెప్పిన ఇద్దరు అనుమానితులు.. బలవంతంగా సదరు హీరో ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో అంతా టెన్షన్ టెన్షన్గా మారిపోయింది. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. ఇద్దరు అజ్ఞాత వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అసలు వాళ్లెవరు? ఇక్కడికొచ్చి ఎందుకు చొరబడే ప్రయత్నం చేశారని దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ముంబయికి సమీపంలోని పాన్వెల్ ప్రాంతంలో ఫామ్ హౌస్ ఉంది. ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటాడు. తాజాగా ఈ ఫామ్ హౌస్లోకి ఇద్దరు అనుమానితులు చొరబడే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ గార్డ్స్తోనూ వాదించారు. పోలీసులకు సమాచారం అందించగా వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తుల దగ్గర నకిలీ ఐడీ కార్డ్స్ ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే గతంలో సల్మాన్ ఖాన్.. కృష్ణజింకలని వేటాడాడు. ఇందులో భాగంగానే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఈ హీరోకి బెదిరింపు ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి. గతేడాది ఇతడితో పాటు మరో ఇద్దరిపైనా కేసు పెట్టారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బిష్ణోయ్.. సల్మాన్ని చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు అనుమానితులు.. సల్మాన్ ఇంటి దగ్గర కనిపించడం ఆందోళన కలిగించింది. అయితే వీళ్లు సల్మాన్ని చంపడానికి వచ్చారా? మరోదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ కొత్త మూవీ) -
కేసీఆర్ కోసం చింతమడక ప్రజల పడిగాపులు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలవడానికి వెళ్లిన చింతమడక వాసులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. దీంతో చాలా సేపు బయటే ఎదురు చూడాల్సి వచ్చింది చింతమడక వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్కు సంఘీభావం తెలిపేందుకు ఆయన స్వగ్రామం చింతమడక నుంచి 500 మంది.. ఎర్రవల్లి ఫామ్హౌజ్కు వచ్చారు. అయితే ఫామ్ హౌజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు వాళ్లు ఫామ్హౌజ్ చెక్పోస్ట్ వద్ద ఆగిపోవడంతో.. ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో వెళ్లి కేసీఆర్ను కలిశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా.. బీఆర్ఎస్ అధ్యక్ష హోదాతో పాటు తాజా మాజీ సీఎం కావడంతో ఇంకా సెక్యూరిటీ కొనసాగుతోంది. -
కేసీఆర్ కోసం ఫామ్హౌజ్కు ఎమ్మెల్యేలు
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావును కలిసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయిన అనంతరం.. అటు నుంచే అటే ఎర్రవెల్లికి బయల్దేరారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో ఉన్న కేసీఆర్ను కలిసి ఎన్నికల ఫలితాలపై వాళ్లు చర్చించనున్నారు. అలాగే.. పార్టీ కార్యాచరణ గురించి వాళ్లు చర్చించనున్నట్లు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్లు కూడా వాళ్ల వెంట ఫామ్హౌజ్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన రాజశ్యామల యాగం
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం శుక్రవారం ముగిసింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాగం చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకారంతో దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. మహాపూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ పాదపూజ చేసి పుష్పాభిషేకంతో గురువందనం సమర్పించారు. -
సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద మూడు రోజులపాటు ఈ యాగం చేయనున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం ఈ రాజశ్యామల యాగానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. ఈ యాగం మహా శక్తివంతమైనదని తెలిపారు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల అని పేర్కొన్నారు. మహాభారతం చదివిన జ్ఞాని, హైందవతత్వం పరిపూర్ణంగా తెలిసిన నేత సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు కరిపించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే ఈ యాగం చేపట్టారని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలని ఆశీస్సులు అందించారు. చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్లో చేరిక తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చెప్పించారు. విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. యాగంలో పాల్గొనే పండితులు, రుత్విక్కులకు కేసీఆర్ దంపతులు దీక్షా వస్త్రాలను స్వయంగా అందించారు. అఖండ స్థాపన అనంతరం అగ్నిమధనం చేసి యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహిస్తారు. చివరిరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని తలపెట్టారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠానికి ప్రత్యేకమని చెప్పారు. యాగంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్లో చక్కటి ఫాం హౌస్తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్లో అందమైన ఫామ్హౌస్ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్హౌస్లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్మెంట్కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
కేసీఆర్ సర్కార్కు కౌంట్డౌన్ మొదలు
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ సర్కార్కు కౌంట్డౌన్ మొదలైంది.. ప్రగతి భవన్లో కేసీఆర్ ఉండేది కేవ లం 90 రోజులే.. ఆ తర్వాత శాశ్వతంగా ఫాంహౌస్లోనే ఆయన ఉండబోతున్నారు’అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రగతి భవన్.. కేసీఆర్ కుటుంబ భవన్ తప్ప తెలంగాణ ప్రజలది కాదు. కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్ల దోపిడీ చేసింది. అందుకే అడుగడుగునా బీఆర్ఎస్ను ప్రజలు నిలదీస్తున్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో... ఇది తెలంగాణ ప్రజల నినాదం’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తుంటే వాటిలో పాల్గొనే తీరికలేని, కుట్రలు చేసే సీఎం తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. శనివారం పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ నేత టి. ఆచారిల సమక్షంలో మాజీ మంత్రులు సి. కృష్ణయాదవ్, జె.చిత్తరంజన్దాస్, సిర్పూర్ జెడ్పీటీసీ రేఖా సత్యనారాయణ, మరో నేత బండల రామచంద్రారెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కిషన్రెడ్డి, ఈటల, అరుణ కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ అనేక సర్వేల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి ఖాయమని తెలియడంతో కేసీఆర్ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఅర్ఎస్కు ఓటేసినట్టేనని కిషన్రెడ్డి ఆరోపించారు. గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఇష్టమొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు కాదు... 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు. పార్టీ గెలుపునకు కృషి: కృష్ణయాదవ్, చిత్తరంజన్దాస్ ‘రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉంది. కిషన్రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పనిచేస్తా. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తా’అని మాజీ మంత్రి కృష్ణయాదవ్ చెప్పారు. మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపులో నా పాత్ర కూడా ఉంటుందని అనుకుంటున్నా’అని పేర్కొన్నారు. తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగనుంది: ఈటల ‘బీఅర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది బీజేపీలోకి వస్తున్నారని... రాబోయే కాలంలో తెలంగాణ గడ్డపై తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగబోతోందని చెప్పారు. డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. -
బీజేపీ అసంతృప్తుల వరుస భేటీలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ముఖ్యనేతలు కొందరు తరచూ సమావేశం కావడం పార్టీ లో కలకలం సృష్టిస్తోంది. అసంతృప్త నేతలుగా భావిస్తున్న వీరంతా ఇటీవలి కాలంలో రెండు, మూడుసార్లు భేటీ అవడంతో.. వీరెందుకు సమావేశమవుతున్నారు? ముఖ్యోద్దేశమేమిటి? అనే చర్చ సాగుతోంది. పార్టీని వీడెందుకేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్టు జరుగుతున్న ప్రచారం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే బీఆర్ఎస్తో బీజేపీకి దోస్తీ లేదని అధినాయకత్వం సుస్పష్టం చేయడంతో పాటు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణ కమిటీ వేయడం, తదితర చర్యలు తీసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు, పార్టీ కేడర్కు స్పష్టత ఇవ్వాలనేది కొందరు నేతల డిమాండ్గా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కొందరు నేతలు ఏకంగా మోదీ, అమిత్షా, ఇతర జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పు బట్టడమే కాకుండా, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యతనివ్వకపోవడం లాంటి అంశాలను లేవనెత్తుతుండడంతో..అసలు ఏం జరుగుతోంది? అనే సందేహాలు రాష్ట్ర నేతలను, పార్టీ కేడర్ను పట్టి పీడిస్తున్నాయి. ఫామ్హౌస్లో పలు అంశాలపై చర్చ తాజాగా ఆదివారం నగర శివార్లలోని ఓ ఫామ్హౌస్లో జరిగిన సమావేశానికి జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, జి.విజయరామారావు తదితరులు హాజరైనట్లు సమాచారం. త్వరలోనే ఢిల్లీ వెళ్లి అమిత్షాను కలిసి తమ అభిప్రాయాలను స్పష్టం చేయాలని, తాము చేసిన సూచనలకు అనుగుణంగా జాతీయ నాయకత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణపై నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వీరు వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ లో జరుగుతున్న పరిణామాలు, తమ ప్రమేయం, సంబంధం లేకుండానే కొందరిని బీజేపీలో చేర్చుకోవడం, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్కు జాతీయ నాయకత్వం అత్యధిక ప్రాధాన్యతనివ్వడం.. ముఖ్యనేతలుగా, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా అవమానించే పద్ధతుల్లో వ్యవహరించడం తదితర అంశాలు ఫామ్హౌస్ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి సోమవారం పలువురు నేతలు, తన శ్రేయోభిలాషులు, అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీలోనే కొనసాగాలా? కాంగ్రెస్లో చేరాలా.. వద్దా? వంటి అంశాలపై చర్చించేందుకే ఈ భేటీ నిర్వహిస్తున్నారని అంటున్నారు. -
ఫామ్హౌస్లో మృతదేహం పూడ్చివేత
రంగారెడ్డి: ఓ ఫామ్హౌస్లో గుర్తు తెలియని మహిళ శవాన్ని పాతిపెట్టిన విషయం ఆదివారం చేవెళ్లలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలకేంద్రంలోని కనకమామిడి మల్లారెడ్డి అనే రైతు ఫామ్హౌస్లో సత్తయ్య, కల్పన అనే ఇద్దరు భార్యాభర్తలు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈనెల 7న సత్తయ్య, కల్పనలు ఓ మహిళ, మరో వ్యక్తిని ఫామ్హౌస్కు తీసుకువచ్చారు. వారు తమ అన్నావదినలుగా యాజమానికి పరిచయం చేశారు. శుక్రవారం సత్తయ్య, కల్పనలు తమ ఇంటి వద్ద గొడవలు జరుగుతున్నాయని ఇంటికి వెళ్తున్నామని మల్లారెడ్డికి చెప్పి వెళ్లారు. దీంతో ఆయన నిన్న వచ్చిన మీ అన్నావదినలు ఎక్కడని అడగ్గా వాళ్లు నిన్ననే వెళ్లిపోయారని చెప్పారు. ఆదివారం పొలం వద్ద పైపులైన్ పగిలిపోవటంతో సరిచేసేందుకు మల్లారెడ్డితో పాటు మరో వ్యక్తి వెంకట్రెడ్డి, డ్రైవర్ శేఖర్లు వెళ్లారు. దీంతో సామగిన్రి తీసుకువచ్చి గది పక్కనే ఉన్న గేట్ వాల్ను బంద్ చేసేందుకు వెళ్లా రు. అక్కడే మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు శవాన్ని బయటకు తీసి తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐలతో శవ పంచనామా చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీ నేత ఫామ్హౌస్లో పోలీసుల తనిఖీ
రాయచోటి : ముంబై డ్రగ్స్ మాఫియా ముఠా సభ్యుడు విడిది చేసిన టీడీపీ నేత ఫామ్హౌస్ను రాయచోటి డీఎస్పీ మహబూబ్బాషా, అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాయచోటి–రాజంపేట మార్గంలోని ఓదివీడు సమీపంలో ఉన్న టీడీపీనేత ఫామ్హౌస్ను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రగ్స్ మాఫియాతో టీడీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఆ పార్టీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డ్రగ్స్ మాఫియా కలకలం వారిలో మరింత వేదనకు గురిచేస్తోంది. మరోవైపు కేసు నుంచి బయటపడేందుకు ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి పోలీసులపై ఒత్తిడిలు తెస్తున్నట్లు సమాచారం. వారం రోజుల కిందట డ్రగ్స్ మాఫియా సభ్యుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అతని అరెస్టుతో పాటు అక్కడే ఉన్న కొంత మాదక ద్రవ్యాన్ని కూడా ముంబై పోలీసులు స్వాధీనం చేసుకుని పట్టుకెళ్లారు. డ్రగ్స్ ముఠా మాఫియాతో టీడీపీ నేతకున్న సంబంధాలపైన కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆశ్రయం కల్పించిన ఆ టీడీపీ నేతకు చెందిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలన చేస్తున్నట్లు రాయచోటి అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. వారి కుటుంబసభ్యుల సెల్ఫోన్ నెంబర్లను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విడిది చేసిన ఫామ్హౌస్ను, పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించి పలు అనుమానాలను నివృత్తి చేసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మాఫియా ముఠా పరిస్థితులపై ముంబై పోలీసులు అందించే సమాచారం కోసం వేచిచూస్తున్నామని సీఐ తెలిపారు. డ్రగ్స్ మాఫియా సభ్యుడితో టీడీపీ నేతకున్న సంబంధాలు, ఈ ప్రాంతంలో మరేతర వారితో ఉన్న వ్యాపార సంబంధాల పైన కూడా మా కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా డ్రగ్స్ ముఠా సభ్యుడికి ఆశ్రయంకల్పించిన టీడీపీ నేతపై ఆ పార్టీ నేతలు సీరియస్గా ఉన్నట్లు సమాచారం. -
రూ.19 కోట్లతో కోహ్లీ లగ్జరీ ఫోమ్ హౌస్
-
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్లు: ఏఆర్ రెహమాన్ గీతం అదుర్స్
కేప్టౌన్ (దక్షిణాఫ్రికా): ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్తగా మరిన్ని వాహనాలను ఆవిష్కరించింది. చిన్న ట్రాక్టర్లు, కార్లు వీటిలో ఉన్నాయి. చిన్న కమతాల రైతులు, వ్యక్తిగత ఫామ్హౌస్లున్న వారు మొదలైన వర్గాలకు ఉపయోగపడేలా తేలికపాటి, చిన్న ట్రాక్టర్లను ఫ్యూచర్స్కేప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రవేశపెట్టింది. మహీంద్రా ఓజా పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్ల శ్రేణిలో ఏడు మోడల్స్ ఉంటాయి. వీటి ధర రూ. 5,64,500 నుంచి రూ. 7,35,000 వరకు (పుణె– ఎక్స్ షోరూమ్) ఉంటుంది. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో తయారు చేసే ఈ ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడంతో పాటు ఉత్తర అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఈడీ (ఆటో, ఫార్మ్ విభాగాలు) రాజేశ్ జెజూరికర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ట్రాక్టర్ల ఎగుమతులను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,000 పైచిలుకు ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. ఓజా ప్లాట్ఫాంపై రూ. 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు జెజూరికర్ వివరించారు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. (2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్) థార్.ఈ, గ్లోబల్ పికప్ ఆవిష్కరణ.. ఫ్యూచర్స్కేప్ కార్యక్రమంలో భాగంగా ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘థార్.ఈ’ని కూడా ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్, ఇంటీరియర్స్తో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజే నక్రా తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్ పికప్ వాహనాన్ని సైతం సంస్థ ఆవిష్కరించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు సాహస ట్రిప్లకు కూడా అనువుగా ఇది ఉంటుందని నక్రా వివరించారు. అటు, విద్యుత్ వాహనాల శ్రేణి కోసం నెలకొల్పిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ (ఎంఈఏఎల్)కి కొత్త లోగోను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ‘లే ఛలాంగ్’ ప్రచార గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపర్చారు. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) -
రూ.19 కోట్ల లగ్జరీ ఫామ్హౌస్,క్రికెట్ పిచ్ కూడా: విరాట్ కోహ్లీ క్లారిటీ
అటు క్రికెట్ వరల్డ్ ఇటు గ్లామర్ ప్రపంచంలోని పవర్ అండ్ స్వీట్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ కోట్లాది ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నారు. వీరు ఏం చేసినా ఫ్యాన్స్కు అదో సంచలనమే. తాజాగా వీరి ఫామ్ హౌస్లో క్రికెట్ పిచ్ను నిర్మించనున్నారనే వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 11, 2017న వివాహం చేసుకుని అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ విరుష్కగా ఫ్యామస్ అయ్యారు. వీరికి 2021లో ఆడబిడ్డ (వామిక) జన్మించింది. 2022లో విరుష్క జంట గణేష్ చతుర్థి శుభ సందర్భంగా విలాస వంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు. అలీబాగ్లోని జిరాద్ సమీపంలో 8 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నారు. దీని విలువు దాదాపు రూ. 19 కోట్ల 24 లక్షల 50 వేలు అని అంచనా. దీంతోపాటు ఈ జంటకు అత్యంత విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయి ముంబై, గుర్గావ్లో రెండు లగ్జరీ భవనాలతో పాటు, కొన్ని ఇతర విలువైన ఆస్తులతో ఈ జంటది కింగ్-సైజ్ జీవితమని ఫ్యాన్స్ నమ్ముతారు. అయితే తాజా సమాచారం ప్రకారం లగ్జరీ ఫామ్హౌస్ నిర్మాణానికి సంబందించిన అన్ని అనుమతులు పొందిన కోహ్లీ నిర్మాణ పనులను షురూ చేశాడు. ఇటీవల (ఆదివారం) ఈ ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించాడట. ప్రకృతి ప్రేమికులైన విరుష్క జంట విలువైన ఇన్పుట్లు ఇస్తున్నారట. చక్కటి నిర్మాణ శైలి, పచ్చదనంతో నిండి వుండేలా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్కి సూచించారట. రియల్ ఎస్టేట్ కంపెనీ సమీరా హాబిటాట్స్ ద్వారా సేకరించిన భూమిలో ఉదయన్ మజుందార్ అండ్ బ్లాంకా బ్రేవో రేయిస్ ఆధ్వర్యంలో ఈ విలాసవంతమైన ఫామ్హౌస్ సిద్ధమవుతోంది. మాండ్వా జెట్టీకి కేవలం 10 నిమిషాల దూరంలో అలీబాగ్లోని ఆవాస్ గ్రామంలోని 4BHK విల్లా, ఇది విల్లాలో నాలుగు బెడ్రూమ్లు, రెండు కవర్ కార్ గ్యారేజీలు, పౌడర్ రూమ్లతో నాలుగు బాత్రూమ్లు, టెర్రస్, అవుట్డోర్ డైనింగ్, ఒక ప్రైవేట్ పూల్, చాలా అవుట్డోర్ ఓపెన్ స్పేస్, స్టాఫ్ క్వార్టర్స్ తోపాటు ముఖ్యంగా కోహ్లీ మేరకు ఈ ప్రాంగణంలోనే క్రికెట్ పిచ్ కూడా ఏర్పాటు చేయనున్నారట. సో.. అతను కావాలనుకున్నపుడు క్రికెట్ ప్రాక్టీస్ చేయవచ్చు లేదా ఫ్రెండ్స్ వచ్చినపుడు సరదాగా ఆడుకోవచ్చునేది ప్లాన్.అయితే ఇటీవల సోషల్ మీడియా ఎండార్స్మెంట్ల వార్తలపై స్పందించిన ఈ స్టార్ క్రికెటర్ తాజా ఊహాగానాలపై కూడా స్పందించారు. అయితే ఈ వార్తలను విరాట్ కోహ్లీ ఇన్స్టా స్టోరీలో కొట్టి పారేశారు. -
కేసీఆర్కు వెయ్యి ఎకరాల్లో ఫామ్హౌస్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్కు వెయ్యి ఎకరాలలో, కేటీఆర్కు వంద ఎకరాలలో ఫామ్ హౌస్లు, రూ.వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, టీవీలు, పేపర్లు వచ్చాయి కానీ దత్తత తీసుకున్న పాలమూరు మాత్రం పడావు పడిందన్నారు. ఉద్యమ సమయంలో ఎంపీగా గెలిపించిన మహబూబ్నగర్ జిల్లాకు, జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఆదివారం జూబ్లిహిల్స్లోని తన నివాసంలో కాంగ్రెస్లో చేరిన మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాధ అమర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమరెందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లును అమ్మి పాలమూరును అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ సీఎం అయి తొమ్మిదేళ్లయినా అతీగతీ లేకుండా పోయిందన్నారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న హామీ ఏమైందన్నారు. వక్ఫ్ భూములనూ వదలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, వక్ఫ్ భూములను సైతం వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. ఏ దందాలో చూసినా బీఆరెస్ నేతలే ఉన్నారని, వాళ్ల అరాచకాలను ఎదిరించేందుకు కాంగ్రెస్లో చేరడం అభినందనీయమన్నారు. పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని, అక్రమ కేసులు పెడితే మిత్తితో సహా చెల్లిస్తామని రేవంత్ హెచ్చరించారు. -
Anasuya Bharadwaj : అనసూయని ఎత్తుకున్న భర్త.. మామిడితోటలో అలా! (ఫోటోలు)
-
ప్రకృతి ఒడి.. ప్రశాంత లోగిలి!
కరోనా మహమ్మారి జీవనాన్ని కొత్త దారిలో తీసుకెళ్తోంది. పట్టణాల్లో చిన్న పని దొరికితే చాలు.. అపార్ట్మెంట్ ఎన్నో అంతస్తు అయినా పరవాలేదు.. సర్దుకుపోదాం అనే ధోరణి ఇప్పుడు తగ్గుతోంది. కాస్తంత రెంటు ఎక్కువైనా.. వ్యక్తిగత ఇల్లు మేలు అనే భావన ఇప్పుడు అధికమవుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం.. కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో పట్టణానికి కాస్త దూరమైనా ప్రశాంతమైన వాతావరణంలో నివసించేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొక్కలు నాటేందుకు ఇష్టపడని వారు కూడా.. ఇప్పుడు ప్రకృతితో మమేకమై జీవించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. – సాక్షి, కర్నూలు డెస్క్ నంద్యాల పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ వెంచర్ రూపుదిద్దుకుంటోంది. మహానంది మండలం బుక్కాపురం వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్లో 12 విల్లాలను ఒక్కొక్కటి 25 సెంట్ల స్థలంలో నిర్మించనున్నారు. మిగిలిన స్థలం అంతా పచ్చదనానికి కేటాయిస్తున్నారు. అంటే.. ప్రశాంత జీవనానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ వెంచర్ను చూస్తే అర్థమవుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది పల్లెల నుంచి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు పట్టణాల్లో కలిసిపోతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ ఎక్కడా ఖాళీ స్థలం కనిపించని పరిస్థితి. అంతో ఇంతో స్థలం ఉందంటే అపార్ట్మెంట్, లేక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఆలోచన వస్తోంది. ఈ కారణంగా కనుచూపు మేరలో కాంక్రీటు వనాలే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు ఏడాదికేడాది విపరీతంగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి . అపార్ట్మెంట్ సంస్కృతి ఇటీవల కాలంలో అధికమైంది. ఉపాధి, ఉద్యోగంలో భాగంగా పట్టణాల్లో ఉండాల్సి రావడంతో ఎక్కడికక్కడ అపార్ల్మెంట్లు పుట్టుకొచ్చాయి. ఐదు అంతస్తులతో, వందలాది నివాసాలతో కూడిన ఈ కాంక్రీటు వనాలు మనుషులను దగ్గర చేస్తున్నా, మనసులను దూరంగా ఉంచుతున్నాయి. పక్కపక్కనే ఉంటున్నా ఎవరికి వారుగా బతికేస్తున్నారు. ఇక ఇటీవల కరోనా సృష్టించిన విలయం నేపథ్యంలో ఇలా ఇరుకిరుకు ప్లాట్లలో కాకుండా ఊరికి దూరంగా విశాలమైన వ్యక్తిగత ఇళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పచ్చని చెట్లు కనుమరుగు పట్టణాల పరిధి పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్క గ్రామాలు అందులో విలీనం అవుతున్నాయి. ఈ కారణంగా అభివృద్ధి విస్తరిస్తుండటంతో గ్రామీణ వాతావరణం కనుమరుగవుతోంది. శివారు కాలనీల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు పుట్టుకొస్తుండగా.. ఆ ప్రాంతంలోని చెట్లు తొలగించక తప్పని పరిస్థితి. కొంత స్థలం ఉందంటే చాలు.. రెండు ఇల్లు కట్టుకొని, ఒకటి బాడుగకు ఇచ్చుకోవడమో.. లేదంటే అపార్ట్మెంట్ కడితే జీవనానికి కాస్త ఊరట కలిగిస్తుందనే ఆశ పచ్చని చెట్లకు శాపమవుతోంది. పల్లెకు పోదాం.. పట్టణాల్లో వాతావరణం రోజురోజుకూ కాలుష్యంతో నిండుకుంటోంది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఎక్కడన్నా సేదతీరుదామంటే చెట్టు నీడను వెతుక్కోవాల్సిందే. సెంటు స్థలం ఉందంటే చాలు రోడ్డు పక్కనైతే దుకాణం కడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంటి ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగా మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని నగరానికి దూరంగా, పల్లెలకు సమీపంలోని వెంచర్లలో ప్లాట్లు కొంటున్నారు. పదవీ విరమణ వయస్సు తర్వాత పల్లె వాతావరణంలో సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. అభిరుచికి అనుగుణంగా వెంచర్లు కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటోంది. ఇప్పటి వరకు 3 నుంచి 5 సెంట్ల స్థలాలతో వెంచర్లు ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 25 సెంట్ల స్థలాలతో వెంచర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు, అధికారులు, వైద్యులు ఈవిధమైన వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. రియల్టర్లు ఇలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని అందుకు అనుగుణంగా వెంచర్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కూడా పరిమితంగా ఉంటుండటం విశేషం. ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడుపుతాం పట్టణాల్లో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే ఎమ్మిగనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా సొంత పొలంలోనే ఫాంహౌస్ కట్టుకున్నాం. ఉన్న ఇద్దరు కుమారులు మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రశాంతత లేదని చెబుతుంటారు. చిన్నబ్బాయి హర్ష ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. యాంత్రిక జీవనం నుంచి బయటపడేందుకు, ఇంటిల్లి పాది సంతోషంగా గడిపేందుకు ఈ ప్రాంతం మాకు ఎంతో అనువుగా ఉంది. ప్రకృతి ఒడిలో సేదతీరితే ఎంతో ఆరోగ్యం. – మాచాని నాగరాజు ప్రశాంతత కోసం నగరానికి దూరంగా ఇల్లు కరోనా నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేం. నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా అధికం కావడంతో ఇరుకు ప్రాంతాల్లో సర్దుకుపోయి జీవించాల్సిన పరిస్థితి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఊరి బయట ప్రశాంత వాతావరణంలో ఇటీవల వ్యక్తిగత ఇల్లు నిర్మించుకున్నాం. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రాంతంలో నివాసం ఉంటే వ్యాధుల బారి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చు. – హరగోపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కర్నూలు