-
భారతీయులకు కెనడా శుభవార్త
టొరంటో: కెనడాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ వృత్తినిపుణుల కుటుంబసభ్యులకు తీపి కబురు! ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) కింద అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబసభ్యులు కూడా ఇకపై తాత్కాలిక వర్క్ పర్మిట్లతో పనిచేసుకోవచ్చు. వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీన్ ఫ్రాసర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. వర్క్ పర్మిట్లున్న వారి జీవిత భాగస్వామి, పిల్లలు వచ్చే ఏడాది నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ‘‘దేశంలో సమస్యగా మారిన ఉద్యోగుల కొరతకు పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో 2,00,000 మందికిపైగా ఉన్న విదేశీ ఉద్యోగులకు తోడు వారి కుటుంబసభ్యులకు కెనడాలో కొలువుకు అవకాశం దక్కుతుంది. గతంలో ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న ఉద్యోగి హై–స్కిల్డ్ ఉద్యోగం చేస్తేనే జీవితభా గస్వామికి వర్క్ పర్మిషన్ ఇచ్చేవాళ్లం. నిబంధనలను సడలించడంతో వర్క్ పర్మిట్ ఉద్యోగు లు కుటుంబంతో కలిసుంటారు. వారి శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది’ అని ఫ్రాసర్ అభిప్రాయపడ్డారు. దీన్ని మూడు దశల్లో అమలు చేస్తారు. -
సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం!
సూపర్స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మెమోరియల్లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు ఇందుకోసం కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మెమోరియల్ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: కీలక ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ -
వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే..
పనాజీ/ఛండీగఢ్: బీజేపీ నేత, సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 42 ఏళ్ల సోనాలి ఫోగట్ గోవా టూర్లో ఉండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే.. చనిపోవడానికి ముందు అక్కడి పరిస్థితులపై ఫోన్ కాల్ ద్వారా సోనాలి అనుమానాలు వ్యక్తం చేసిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గోవా పోలీసులు మాత్రం పూర్తిస్థాయి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రానందునా అసహజ మరణం కిందే కేసు బుక్ చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి గోవాలో ఆస్పత్రికి తీసుకెళ్లే టైంకి ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే గుండెపోటుతో ఆమె మరణించిందన్న కోణంపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఎలాంటి మందులు వాడడం లేదని సోనాలి ఫోగట్ సోదరి రమణ్ చెబుతోంది. మీడియాతో.. సోనాలి సోదరి రమణ్ ‘‘గుండెపోటుతో సోనాలి ఫోగట్ మరణించారనడం నమ్మశక్యంగా లేదు. మా కుటుంబం ఈ వాదనను అంగీకరించదు. ఆమె ఫిట్గా ఉండేది. ఎలాంటి జబ్బులు లేవు. మందులు కూడా వాడడం లేదు. చనిపోవడానికి ముందు ఆమె నాకు ఫోన్ చేసింది. మా అమ్మతోనూ మాట్లాడింది. భోజనం చేశాక.. ఏదోలా ఉందని చెప్పింది. అక్కడేదో జరుగుతోందని, అనుమానాస్పదంగా ఉందని, నార్మల్ కాల్ కాకుండా.. వాట్సాప్ కాల్లో మాట్లాడదాం అని చెప్పింది. కానీ, మళ్లీ కాల్ చేయలేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉదయానికి ఆమె మరణించిందని తోటి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. ఈ వ్యవహారంలో మాకు అనుమానాలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని హర్యానా, గోవా ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, ఆప్ నేతలతో ఆమె ఫోన్లో మాట్లాడారు. అయితే గోవా పోలీస్ చీఫ్ జస్పాల్ సింగ్ మాత్రం ఈ మరణంలో ఎలాంటి అనుమానాలు తమకు కలగడం లేదని, పోస్ట్మార్టం నివేదికే విషయాన్ని నిర్ధారిస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఆమె పోస్ట్మార్టంను వీడియోగ్రఫీ చేయాలని గోవా పోలీసులు భావిస్తున్నారు. 2016లో సోనాలి భర్త సంజయ్ ఫోగట్ అనుమానాస్పద రీతిలోనే ఓ ఫామ్హౌజ్లో మృతి చెందగా.. ఆ మిస్టరీ ఈనాటికీ వీడలేదు. చనిపోయే ముందు కొన్నిగంటల వ్యవధిలో ఆమె హుషారుగా ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు, వీడియోలు సైతం పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) హర్యానా టీవీ సెలబ్రిటీ అయిన సోనాలి ఫోగట్ బీజేపీలో చేరిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే బిష్ణోయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇటీవలె బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నికలో సోనాలి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇదీ చదవండి: చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం -
రియల్ ఎస్టేట్ గొడవలకు కుటుంబం బలి
ఖలీల్వాడి (నిజామాబాద్అర్బన్)/ఆదిలాబాద్ టౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాముల వేధింపుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొత్తకొండ సూర్యప్రకాశ్ కుటుంబం ఏడెనిమిదేళ్లనుంచి నుంచి హైదరాబాద్లో నివాసం ఉంటోంది. సూర్యప్రకాశ్ కొంతమంది పార్ట్నర్స్తో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వెంచర్ నిర్వహణలో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. వ్యాపార నిర్వహణకు ఇంకా పెట్టుబడి పెట్టాలని భాగస్వాములు అతనిపై ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో సూర్యప్రకాశ్ నివాసానికి పార్ట్నర్స్ వెళ్లి గొడవపడినట్లు తెలిసింది. సూర్యప్రకాశ్ను అతని భార్య, కూతురు, కుమారుడిని కొట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. వీరి వేధింపులు తాళలేక సూర్యప్రకాశ్ కుటుంబం ఈ నెల 4న నిజామాబాద్లోని ఓ హోటల్లో దిగింది. అప్పటినుంచి హోటల్లోని రూం నంబర్ 101 లోనే ఉంటున్నారు. కాగా, ఆదివారం ఉదయం హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి తలుపు తట్టగా ఎంత సేపటికీ తెరుచుకోకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాలుగో టౌన్ పోలీసులు గదిని తెరిచారు. లోపల కొత్తకొండ సూర్య ప్రకా శ్ (37) ఉరి వేసుకుని చనిపోగా భార్య అక్షయ (36), కూతురు ప్ర త్యూష (13) కొడుకు అద్వైత్ (10) విష ప్రభావంతో మృతి చెందారు. కేక్లో విషం కలిపి ముందుగా భార్య, కూతురు, కుమారుడికి తినిపించి వారు మృతి చెందారని నిర్ధారించుకున్న తర్వాత సూర్యప్రకాశ్ చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావి స్తున్నారు. హోటల్ గదిలో సూర్యప్రకాశ్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సూసైడ్ నోట్లో కొందరు రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ వేధిస్తున్నట్లు పేర్కొంటూ, వారి పేర్లు రాశారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్కు వలస వెళ్లి సూర్యప్రకాశ్ తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లాకు చెందిన కొత్తకొండ అనుసూయ, కృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబం నలభై ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వలస వెళ్లింది. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్లో హార్డ్వేర్ షాప్ ఏర్పాటు చేశారు. చిన్న కుమారుడైన సూర్యప్రకాశ్ ఆది లాబాద్లోనే పుట్టి పెరిగారు. వీరి కుటుంబం హార్డ్వేర్ షాప్ తో పాటు పట్టణంలో పెట్రోల్బంక్ను కూడా ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వృద్ధి చెందడంతో సూర్యప్రకాశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారంకోసం ఏడెనిమిదేళ్ల క్రితం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు మకాం మా ర్చారు. సూర్యప్రకాశ్ భార్య అక్షయది ఆదిలాబాద్ జిల్లా జైన థ్ మండలం దీపాయిగూడ గ్రామం. కాగా హైదరాబాద్లో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. లాక్డౌన్ సమ యంలో శంకరంపేట సమీపంలో భాగస్వాములతో కలసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వ్యాపా రంలో నష్టం రావడంతో అప్పుల కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. దానికితోడు బిజినెస్ పార్ట్నర్లు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈనెల 4న హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వచ్చి ఓ హోటల్లో దిగారు. రెండు, మూడు రోజుల క్రితం నిజామాబాద్లోని వారి బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతంలో సైతం కుటుంబ సమేతంగా పాల్గొన్నారని తెలిసింది. -
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబసభ్యులకు ఏపీ గవర్నర్ ఘన సత్కారం
సాక్షి, విజయవాడ: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు’లో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబసభ్యులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సన్మానించారు. భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనుమరాలు సుశీల, స్వాతంత్ర సమరయోధులు కోపల్లె హనుమంతరావు మనుమడు హనుమంతరావు, కాకాని వెంకటరత్నం మనుమడు కాకాని విజయ్ కుమార్, అయ్యదేవర కాళేశ్వరరావు మనుమడు ఇవటూరి కృష్ణకుమార్.. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతుల కుమారుడు చింతకాయల చిట్టిబాబు, పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి మనవరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పెనుమత్స సుబ్బన్న భార్య శ్యామలను గవర్నర్ ఘనంగా సత్కరించారు. పింగళి వెంకయ్య.. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1947లో స్వాతంత్ర్యం సాధించడానికి ముందు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారంతా వివిధ జాతీయ జెండాలను ఉపయోగించేవారు.. కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపొందించి మహాత్మా గాంధీ విజయవాడ పర్యటనలో వారికి అందించారు. "పింగళి వెంకయ్య వ్యవసాయవేత్త, మచిలీపట్నంలోనూ విద్యాసంస్థను స్థాపించిన విద్యావేత్త. 1963లో పేదరికంతో మరణించారు. 2009 లో పింగళి స్మారకార్థం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగే "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" ప్రారంభోత్సవం సందర్భంగా గంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న దివంగత వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం జగన్మోహన్ రెడ్డి సన్మానించారు. వారి మనుమరాలు సుశీలను గవర్నర్ నేడు ఘనంగా సత్కరించారు. కోపల్లె హనుమంతరావు కోపల్లె హనుమంతరావుగారు 1879, ఏప్రిల్ 12 న మచిలీపట్నం లోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరు చల్లపల్లి సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు జేష్ఠ పుత్రులు. ఈయన తండ్రి న్యాయవాదిగా బందరులో పనిచేసారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు. హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఎం.ఏ, లా డిగ్రీ చదివి ఊటీలో కొన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసారు. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి బ్రిటీషు ప్రభుత్వంపై నిరసన ప్రకటించారు. 1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపుతో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల ఇప్పటీకీ నడుస్తున్నాయి. వీరు కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగక ప్రయత్నించి అప్పట్లోనే లక్షలాది రూపాయల ధనంతో ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ కళాశాల 2010లో నూరేళ్ళ పండగ జరుపుకున్నది. వీరి మనుమడు హనుమంతరావుగారు ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం ఉన్న ప్రాంతానికే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు.. వారిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. కాకాని వెంకటరత్నం ప్రముఖ స్వాతంత్ర్య పోరాట సమరయోధుడు కాకాని వెంకటరత్నంగారు ఉక్కు కాకాణిగా పేరుగాంచారు.. 1900 సంవత్సరం ఆగస్టు 3న తేదీన కృష్ణా జిల్లా ఆకునూరు గ్రామంలో జన్మించారు, మహాత్మాగాంధీ ఉపదేశాలకు స్ఫూర్తి చెంది 1924లో కాంగ్రెస్ లో పనిచేశారు, 1930 ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొని రెండు సంవత్సరాలు జైలుజీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1955 లో శాసనభ్యులుగా తొలి అడుగులువేసి మంత్రిగా పనిచేసారు. 1972 లో జైఆంధ్రా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.. ఆ ఉద్యమంలో విద్యార్థుల పై పోలీసులు కాల్పుల్లో మరణించారు అన్న వార్త విని డిసెంబర్ 25 న గుండెపోటు తో మరణించారు. తుదిశ్వాస వరకూ జై ఆంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వారి మనుమడు కాకాని విజయ్ కుమార్ను గవర్నర్ ఘనంగా సత్కరించారు. అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావుగారు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకర్.. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాడిన మలితరం మహా నాయకులలో డా.పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారున్నారు. కాళేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసి. 1881 జనవరి 22వ తేదీన జన్మించిన కాళేశ్వరరావు బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో విశేష కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను పనిచేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. 1962 ఫిబ్రవరి 26వ తేదీన విజయవాడలో పరమపదించారు. వారి మనుమడు ఇవటూరి క్రిష్ణకుమార్ గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు విజయవాడవాసులు.. మొదటినుండి జాతీయ భావాలు కలిగిన వీరు జాతీయ ఉద్యమంలో ఈ ప్రాంతంనుండి ప్రాతినిధ్యం వహించారు. అయ్యదేవర కాళేశ్వరరావుతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో పనిచేసారు. అనేకమార్లు అరెస్ట్ కాబడి బ్రిటిష్ పోలీసులచేత దెబ్బలు తిన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారికి ఆరోజుల్లో వారిచేతులతోనే భోజనాలు వండి పెట్టేవారు. వీరి కుమారులు చింతకాయల చిట్టిబాబు గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు. పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి వీరు ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు. స్వాతంత్ర్య పోరాటంలో పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మిలకు జైలు శిక్ష పడగా వారికి కారాగారంలో పసల కృష్ణభారతి జన్మించారు. 1921లో గాంధీ సమక్షంలో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు వీరిని 1931లో ఆంగ్లేయ సర్కారు జైలుకు పంపించింది. నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను ఒడిలో పట్టుకొనే జైలుజీవితం గడిపారు. పదినెలల గర్భంతోనే జైలుకు వెళ్లారామె. అక్టోబరు 29న వెల్లూరు జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు 'కృష్ణ', భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు 'భారతి' కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పసల కృష్ణభారతి గారి పాదాలకు నమస్కరించి ఆమెను సన్మానించారు. పసల కృష్ణమూర్తి అంజ లక్ష్మి మనవరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. పెనుమత్స సుబ్బన్న సుబ్బన్న గారు.. ప్రముఖ స్వతంత్ర పోరాట సమరయోధుడు స్వాతంత్రం కోసం జైలుజీవితం గడిపిన వ్యక్తి.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బన్న గాంధీజీ ఆశ్రమానికి వెళ్లి గాంధీజీని కలిసారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా దేశమంతా ప్రజల తిరుగుబాటుతో ఆంగ్ల ప్రభుత్వ పరిపాలనను స్తంభించే విధంగా పనిచేశారు. ఆంగ్లేయులు ఆయనను ఏలూరు, బళ్లారి జైళ్లల్లో పలుసార్లు బంధించారు. ఆ జైలలో పొట్టి శ్రీరాములు వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహా నాయకులతో సన్నిహితంగా ఉన్నారు. 2007 సెప్టెంబర్ 22న అనారోగ్యంతో మరణించారు. పెనుమత్స సుబ్బన్నగారి భార్య శ్యామలను గవర్నర్ ఘనంగా సత్కరించారు. -
సండే ఫ్లాష్..: బ్యాక్సినిమాకెళ్తాం నాన్నా!
షూటింగ్లు ఆగిపోతాయట.. సినిమా టికెట్లు తగ్గించాలట. కలెక్షన్లు లేవట.. థియేటర్లు ఖాళీ అట. ఇవీ ఇవాళ్టి వార్తలు. కాని థియేటర్లో రిలీజయ్యే సినిమాయే ఏకైక వినోదంగా ఉన్న 1980–90లలో సినిమాకు వెళ్లాలంటే ఎంత తతంగం. ఎంత ప్రిపరేషను. ఎన్ని పర్మిషన్లు. ఎంత హడావిడి. ఎంత సంబరం. జ్ఞాపకం ఉన్నాయా ఆ రోజులు. జ్ఞాపకం చేయమంటారా? నేల డెబ్బయి అయిదు పైసలు. బెంచి రూపాయి. కుర్చీ రూపాయిన్నర. బాల్కనీ రెండు రూపాయలు. ఆ డబ్బులు ఉండేవి కాదు. సినిమాకంటూ కొంత డబ్బు మిగలాలంటే ఇంటి బడ్జెట్లో చాలా కుదరాలి. ఎవరికో హటాత్తుగా జ్వరం రాకూడదు. ఏ ఇంటనో పెళ్లి జరక్కూడదు. ఏదో ఒక బంధువుల ఇంటికి ప్రయాణం పడకూడదు. చుట్టాలు ఊడి పడకూడదు. నోటు పుస్తకాలని, టెక్ట్స్ పుస్తకాలని పిల్లలు డబ్బులు అడక్కూడదు. అన్నీ కుదిరి ఇంట్లో ఐదు రూపాయల వరకూ ఉంటే ఫ్యామిలీ అంతా సినిమాకు పోవచ్చు. సినిమా మారితే గోడ మీద పోస్టర్ పడుతుంది. దానిమీద నీలి సిరాతో థియేటర్ పేరు... ఎన్ని ఆటలో రాసి ఉంటుంది. బండి వీధుల్లో తిరుగుతూ మైక్లో ‘మీ అభిమాన థియేటర్ శ్రీ వేంకటేశ్వరలో... రేపటి నుండి’... అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అది ఫ్యామిలీ సినిమా అయితే అమ్మ మనసు లాగుతుంది. ఫైటింగ్ సినిమా అయితే పిల్లలకు తబ్బిబ్బవుతుంది. నాన్నకు ఏ సినిమా అయినా ఒకటే. ఆయన ఉదయం వెళ్లి రాత్రివరకూ పని చేస్తూనో ఉద్యోగం చేస్తూనో షాపు నడుపుతూనో బిజీ. సినిమా మారినట్టే తెలియదు. చూద్దామనే ఆసక్తీ ఉండదు. కాని పర్మిషన్ ఇవ్వాల్సిందీ డబ్బు చేతిలో పెట్టాల్సిందీ ఆయనే. కొందరు నాన్నలు ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఉంటారు. వారిని సినిమాకు పర్మిషన్ అడగాలంటే భయం. కాని ఆ నాన్నలే పిల్లల మాట వింటారు. ‘రేయ్... సినిమాకెళ్తామని మీ నాన్నని అడగండిరా’ అని తల్లులు పిల్లల్ని రాయబారానికి పంపుతారు. కొందరు నాన్నలు చుట్టాలు ఇంటికి రాగానే పొంగిపోతారు. ‘అందరు కలిసి సినిమాకు పోండి’ అని డబ్బులిచ్చి పంపుతారు. కొందరు నాన్నలు చాలా వింత. వాళ్లకై వాళ్లు ఏ మ్యాట్నీయో చూసేసి ఏమెరగనట్టు ఉంటారుగాని ఇంట్లోవాళ్లు సినిమాకు వెళతామంటే మాత్రం ఒప్పుకోరు. కొందరు నాన్నలు అందరూ కలిసి వెళ్లేలా టికెట్లు ముందే తెచ్చి తీసుకువెళతారు. వీళ్లు మాత్రం చాలా మంచి నాన్నలు. ఈ రోజు ఫస్ట్ షోకు వెళ్లాలంటే పొద్దున్నుంచే హడావిడి. ఇరుగమ్మకు పొరుగమ్మకు అవసరం ఉన్నా లేకపోయినా ‘ఇవాళ మేము సినిమాకు వెళుతున్నాం’ అని చెప్తుంది అమ్మ. మంచి చీరా జాకెట్టు వెతుక్కోవడం, వంట తొందరగా ముగించడం, నాన్నకోసం తాళం పక్కింట్లో ఇవ్వడం.... పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు పోతారు– సినిమాకు వెళుతున్నామని. ఇంట్లో నానమ్మ ఉంటే ఆమె మెల్లగా నడుస్తుంది కనుక చాలా ముందే బయలుదేరాలి. ఆమె వేలు పట్టుకుని నడిపించడానికి మనవడు తెగ తొందర పడుతుంటాడు. ట్రైల్పార్ట్ ఉంటుందని కొందరు ఆరాంగా బయలుదేరుతారు. మరికొందరు ‘డింగ్డింగ్ డింగ్డింగ్’ అని మ్యూజిక్ వచ్చి కుచ్చుల తెర పైకి లేచేప్పటి నుంచి చూడాలని ముందే వచ్చేస్తారు. చివరి నిమిషంలో టికెట్లు అయిపోయాయని వెనక్కు వెళ్లేవాళ్లు కొందరైతే... సినిమాకు గంట ముందే వచ్చి ముందు జాగ్రత్తగా ఖాళీ క్యూలో నిల్చునేవారు కొందరు. ఇంటర్వెల్లో ఏం తినాలి? దాని బడ్జెట్ ఎంత? అనేదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. పిల్లలకు పావలా ఇవ్వడం పెద్ద విషయం. కొందరు తల్లులు ఏ జామకాయనో, బొరుగులనో జేబుల్లో పోసి ఇవి తిను అంటారు. ఉప్పుజల్లిన రేక్కాయలు పది పైసలకు కూడా దొరుకుతాయి హాలు బయట. లోపలకు తీసుకెళ్లి తినడమే. వడలు, బజ్జీలు తింటే అదో తృప్తి. పెద్ద కుటుంబాల వారు ఇంటర్వెల్లో గోల్డ్స్పాట్ కొనుక్కుని మెల్లమెల్లగా తాగుతూ చూస్తారు. అన్నింటికంటే ముఖ్యం స్టిల్స్ డబ్బా ముందు నిలబడి ఎన్ని స్టిల్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయో ఎన్ని స్టిల్స్ సెకండ్ హాఫ్లో రానున్నాయో చూసుకోవడం. రాబోయే సినిమాల పోస్టర్లను నోరు వెళ్లబెట్టి చూడటం. తెలిసిన ఏ ఒక్కరు కనిపించినా ‘ఏవోయ్... సినిమాకు వచ్చావా?’ అని అడగడం. సినిమాహాల్లో కనిపించినవాడు సినిమాకు రాక టిఫిన్ తినడానికి వస్తాడా? సినిమాలో మనం కట్టుకోలేని బట్టలు హీరో హీరోయిన్లు కట్టుకుంటారు. మనం చేయలేని సాహసాలు హీరోలు చేస్తారు. మనం చూడని ప్రదేశాలు అందంగా చూపిస్తారు. మనం నవ్వే ఏడ్చే సందర్భాలను రక్తి కట్టిస్తారు. అద్దె ఇళ్లు, రేషన్ సరుకు, చాలీ చాలని ఆదాయం, స్లిప్పర్లు కూడా లేని జీవితం, బయట టీ తాగడానికి కూడా ఆలోచించే బతుకు... వీటిమధ్య మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. ఇవాళ? చేతిలో కంప్యూటర్లో టీవీలో ఎన్ని కావాలంటే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి సినిమాలు కావాలంటే అటువంటివి ఉంటే... అంతా అతి అయిపోతే కొద్దిపాటి రుచిలోని మాధుర్యం పోయింది. ఎంతో గొప్ప వంటకం తెర కోసం తయారైందని తెలిస్తే తప్ప హాలు వైపు నడవడం లేదు ఎవరూ. కొత్తొక రోత. పాతొక వింత. మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. -
ఆ దుర్మార్గులు ఎంత పని చేశారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మందిని..
ముంబై: మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసుకి సంబంధించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్యగా గుర్తించారు. వారిది ఆత్మహత్య కాదు హత్య.. సాంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిది మంది ఉండేవారు. ఈ నెల 20న కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మొదటగా.. అన్నదమ్ములకు అప్పులు ఎక్కువ ఉండడంతో, వాటిని తీర్చడం కష్టంగా భావించి వేరే దారి లేక కుటుంబంతో సహా వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని తేలింది. కానీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఎక్కడో అనుమానం రావడంతో ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలువడ్డాయి! ఆ కుటుంబ సభ్యులకు ఆత్మహత్య కాదని, విషం ఇచ్చి వారిని చంపేశారని గుర్తించారు. గుప్త నిధుల కోసం ధీరజ్ చంద్రకాంత్, అబ్బాస్ మహ్మద్ అలీ అనే ఇద్దరు మాంత్రికులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు దర్తాప్తులో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరేదైన కోణం కూడా దాగుందా అని పోలీసులు భావిస్తున్నారు. -
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
విహారంలో విషాదం.. అంత వరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది!
రణస్థలం(శ్రీకాకుళం): విహారం విషాదంగా మారింది. సరదాగా సముద్ర స్నానానికి వెళితే ప్రాణాలమీదకు వచ్చింది. మండలంలోని ఎన్జీఆర్పురం పంచాయతీలో గల పోతయ్యపేటలో సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. జేఆర్ పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కొవ్వాడ పంచాయతీలో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన గాదం పాపాయమ్మ, గాదం కృష్ణ ఇంటికి వారి అల్లుడు తిరుపతి గణేష్ తన భార్య ఈశ్వరమ్మతో కలిసి ఇద్దరు పిల్లలతో రెండు వారాల కిందట వచ్చారు. ఈయన స్వగ్రామం విశాఖలోని భీమిలి. భార్యా పిల్లలను కొవ్వాడలోనే వదిలేసి గణేష్ మరుసటి రోజు వైజాగ్ వెళ్లిపోయారు. మళ్లీ శనివారం ఉదయం ఆయన తన మేనకోడలు దీవెనతో కలిసి రామచంద్రపురం వచ్చారు. సాయంత్రం ఏడుగురు కుటుంబ సభ్యులు పోతయ్యపేటలోని సముద్ర తీరానికి సరదాగా వెళ్లారు. అంతా కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో తిరుపతి గణేష్(32), తిరుపతి మానస (9), మేనకోడలు వానమామల దీవెన (18)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డున ఉన్న వారంతా గగ్గోలు పెట్టారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. వారు పడవలపై సముద్రంలోకి వెళ్లారు. వలలు వేసి గల్లంతైన వారి కోసం వెతికినా లాభం లేకపోయింది. గల్లంతైన వారిలో భీమిలి మండలంలోని కాపులుప్పాడ సమీపంలోని నగరప్పాలెం గ్రామం. ఆయన మేనకోడలు దీవెనది విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో గల వడ్డాది గ్రామం. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చదవండి: Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. -
ఏడేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకుందామన్న యువతి.. సెల్కు ఫోన్ చేస్తే..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నిశ్చితార్థం జరిగి ఏడాదిన్నర అయినా పెళ్లి గురించి మాట్లాడకుండా దాటవేస్తుండటమే కాక పెళ్లెప్పుడు చేసుకుందామని యువతి అడిగినందుకు యువకుడి కుటుంబసభ్యులు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పాయకాపురం సుందరయ్య నగర్కు చెందిన మునపర్తి రమ్యదుర్గ, ఆమె సమీప బంధువైన భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన రమ్య, భాస్కర్ కుటుంబ సభ్యులు 2020 నవంబర్ 25వ తేదీన ఇద్దరికీ నిశ్చితార్ధం చేశారు. చదవండి: ట్యూషన్కు వచ్చిన విద్యార్థినిపై లైంగిక దాడి.. వీడియోలు తీసి.. అయితే భాస్కర్ అక్కకు వివాహం చేయాల్సి ఉందని చెప్పి ఏడాది గడువు అడిగారు. దీనికి రమ్య కుటుంబ సభ్యులు అంగీకరించారు. అది జరిగి ఏడాదిన్నర అయినా భాస్కర్ అక్కకు పెళ్లి చేయలేదు. విసిగి వేసారిన రమ్యదుర్గ ఈ నెల 24వ తేదీన పెళ్లి ఎప్పుడు చేసుకుందామని భాస్కర్కు మెసేజ్ పెట్టింది. అప్పటి నుంచి భాస్కర్ కనిపించకుండా పోయాడు. సెల్కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. ఈ నేపథ్యంలో భాస్కర్ తల్లిదండ్రులు, మరికొంత మంది కలసి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో రమ్య ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో రమ్య తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. రమ్యదుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘పెళ్లి కార్డులు ఇవ్వాలి.. తలుపు తీయండి’... అలా తెరిచారో లేదో.. !
రాయగడ(భువనేశ్వర్): ‘పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చాం.. తలుపు తీయండి’ అని పిలవడంతో బయటకు వచ్చిన వారిని దుండగులు బంధించి, దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానిక బుదరావలసలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. బుదరావలసలో నివాసముంటున్న జగన్నాథ మహంతి అనే వ్యక్తి ఇంటికి ఐదుగురు వెళ్లి తలుపులు తట్టారు. మీ దుకాణానికి వెళ్తే.. మూసివేసి ఉందని, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని పిలవడంతో జగన్నాథ భార్య జ్యోతి తలుపులు తెరిచారు. అంతా లోపలికి వచ్చి, ఎండతో వచ్చాం.. తాగేందుకు నీళ్లు ఇవ్వండని అనడంతో ఆమె వంటగది వైపు వెళ్లగా ఆమె వెనకాల వెళ్లిన దుండగులు.. కత్తితో బెదిరించారు. అదే సమయంలో ఆమె కొడుకు ప్రీతమ్(15) తన తల్లిపై దాడి చేయండం గమనించి అవరడంతో అతడిని కొటి,్ట బాత్రూంలో బంధించారు. దీంతో వేరే గదిలో ఉన్న ఆమె కూతురు చాందిని(17) కేకలు వేయగా ఇరుగు–పొరుగు వారు రావడంతో దుండగులు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న 15 వవార్డు కౌన్సిలర్ సంతోష్ కుమార్ దొళాయి పోలీసులకు సమాచారం అందించారు. సైంటిఫిక్ బృందం ఆధారాలు సేకరించిందని ఐఐసీ రస్మీరంజన్ ప్రదాన్ తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే.. -
ఇక అత్తారింటి కుటుంబంలో పేరు నమోదు సులువే
సాక్షి, అమరావతి: కొత్తగా పెళ్లయ్యి అత్తారింటికి వెళ్లిన వారికి.. ఆ కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునేందుకు గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ పేరు నమోదు సమయంలో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు కూడా నమోదు చేసుకుంటారు. సచివాలయాల్లో నమోదయ్యే ఈ వివరాలను ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయా వ్యక్తులు సంబంధిత కుటుంబంలో సభ్యులుగా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. వ లంటీర్లు ఆయా కుటుంబసభ్యులుగా పేరు నమోదు చేసిన అనంతరం రేషన్కార్డులో కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ, వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్గా, పట్టణాల్లో 70–100 కుటుంబాలను ఒక క్లస్టర్గా వర్గీకరించి, ఒక్కొక్క క్లస్టర్కు ఒక్కొక్కరి చొప్పున వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1.65 కోట్ల కుటుంబాల్లో 4.67 కోట్ల మంది తమ పేర్లు నమోదుచేసుకోగా, ఆయా కుటుంబాల ను 2.65 లక్షల వలంటీరు క్లస్టర్లుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాల ప్రకారమే అర్హులను గుర్తిస్తోంది. -
సీఐ, ఎస్ఐకి రూ.15 లక్షల లంచం?
బనశంకరి: గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్ఐ ఒక హత్యకేసులో అమాయకులను అరెస్ట్చేసి రూ.15 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. 2021 జూలై 17 గోకాక్లోని మహంతేశ్ నగర లేఔట్లో మంజునాథ మురకిబావి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సిద్దప్ప బబలి పిల్లలైన కృష్ణ, అర్జున్ అనే ఇద్దరిని అరెస్ట్చేశారు. నిందితుల అక్క కుమార్తెను మంజునాథ ప్రేమించేవాడని, అదే హత్యకు కారణమని ఎవరో చెప్పడంతో తమవారిని సీఐ అరెస్టు చేశాడని నిందితుల బంధువులు ఆరోపించారు. అంతేగాక భారీగా డబ్బు ఇవ్వకపోతే కుటుంబసభ్యులపై కూడా కేసు పెడతామని బెదిరింపులకు దిగారని, ఇలా అప్పటి గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్ఐ రూ.15 లక్షలు లంచం తీసుకున్నారని సిద్దప్పబబలి కుటుంబసభ్యులు ఆరోపించారు. భూమి కుదవపెట్టి డబ్బు ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని వారు ఆదివారం మీడియా ముందు కన్నీరు పెట్టారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఏఎస్పీని ఎస్పీ లక్ష్మణ నింబరగి ఆదేశించారు. (చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు) -
అధిష్టానం ‘అలయ్ బలయ్’!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం అల్లంత దూరమనే భావన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు దూరమవుతోందా? తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దగ్గరవుతున్నారా? గత మూడు రోజులుగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ నేతలు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రత్యేకంగా మకాం వేసి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తుండడం, వీహెచ్, జగ్గారెడ్డి తదితర నాయకులకు ఢిల్లీ అగ్రనేతలు వరుసగా అపాయింట్మెంట్లు ఇస్తుండడం, త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్గాంధీ పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరుస భేటీలు తెలంగాణలో పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్గాంధీ సమావేశం కావడంతో భేటీల పరంపర మొదలయింది. అంతకుముందే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. రాహుల్తో సమావేశం ముగిసిన మరుసటి రోజే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డిలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ను జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈలోపే రాహుల్గాంధీ కూడా జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ను కూడా కలిసేందుకు అంగీకరించారు. కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు జగ్గారెడ్డి.. తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమారుడు భరత్సాయిరెడ్డి, కుమార్తె జయారెడ్డిలతో కలిసి వెళ్లి రాహుల్ను కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక మహేశ్కుమార్గౌడ్ తన కుమారుడు, లా విద్యార్థి ప్రణవ్గౌడ్ను వెంటబెట్టుకుని రాహుల్ను కలిశారు. ఇద్దరు నేతలు రాహుల్ను కలిసినప్పుడు కూడా రాజకీయ అంశాల కంటే పిల్లల చదువులు, కుటుంబ అంశాలపైనే రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి కూడా రాహుల్తో భేటీ అయ్యారు. రాహుల్తో భేటీ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గ నేతలను కూడా ఢిల్లీకి తీసుకువచ్చి రాహుల్ను కలిసి ఫొటోలు దిగేలా ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం. గతానికి భిన్నంగా.. కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీ వెళ్లి కలవడం ఎంత కష్టమో.. రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అంతే కష్టమనే భావన రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉంది. రాహుల్ లేదా సోనియా లేదా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎవరు వచ్చినా కీలక నాయకులు మినహా ఎవరికీ వారిని కలిసే అవకాశముండేది కాదు. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవడం ఓ టాస్క్లాగానే ఉండేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా రాహుల్గాంధీ తెలంగాణ పర్యటన ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈనెలాఖరులో రాష్ట్రానికి రానున్న రాహుల్ రెండ్రోజులు ఇక్కడే ఉంటారని, ఒకరోజు బహిరంగ సభకు హాజరు కానుండగా, మరోరోజు రాష్ట్రానికి చెందిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నేతలందరినీ కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులు, సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో కూడా రాహుల్తో కలిపించాలనే భావనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందని ద్రాక్షలు కాదు..! ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అందని ద్రాక్షలేమీ కాదని, అందరితో కలివిడిగా ఉంటారనే భావనను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లాలనేది రేవంత్రెడ్డి యోచనగా కనిపిస్తోంది. ఆ భావన కలిగించడం ద్వారా జరగబోయే ఎన్నికల్లో మరింత క్రియాశీలంగా కేడర్ పనిచేస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. -
మైనర్పై ఐదేళ్లుగా కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు.. తండ్రితో సహా..
సాక్షి, ముంబై: దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వావివరుసలు మరచి చిన్నారులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కన్న కూతురిపైనే తండ్రి, ఇంటి సభ్యులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు(11) కుటుంబం బీహార్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. సదరు మైనర్ తాను చదువుతున్న పాఠశాలలో జరిగిన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమంలో తన గోడును వెల్లడించింది. తాను ఐదేళ్లుగా కన్న తండ్రి, ఇంటి సభ్యులతో లైంగికంగా వేధించబడుతున్నట్టు తెలిపింది. 2017 నుంచి తండ్రి లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా.. తండ్రి, సోదరుడు వేరు వేరు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 2020లో ఆమె సోదరుడు బాధితురాలిపై లైంగిక దాడి చేయగా.. తాత, మామ కూడా మైనర్ను లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది సామూహిక లైంగిక దాడి కాదని, మైనర్పై లైంగిక దాడులన్నీ వేర్వేరు సందర్బాల్లో జరిగాయని ఎస్సై అశ్విని సాత్పుతె పేర్కొన్నారు. ఈ క్రమంలో మైనర్ కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. -
గౌతమ్రెడ్డి మృతిపై అసత్య ప్రచారం.. ఖండించిన కుటుంబ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్రెడ్డి మృతి చెందినప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై ఆయన కుటుంబం స్పదించింది. గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. గౌతమ్రెడ్డి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... ► ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి మేకపాటి ఇంటికి చేరారు. ► 06.00 గంటలకు రోజూలాగే ఉదయాన్నే ఆయన మేల్కొన్నారు. ► 06:30 గంటల వరకూ మంత్రిగారు ఫోన్లతో కాలక్షేపం చేశారు. ► 07.00 గంటలకు నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో మంత్రి కూర్చుని ఉన్నారు. ► 07:12 గంటలకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు. ► 07:15గంటలకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోఫా నుంచి ఆయన మెల్లిగా కిందకి ఒరిగారు. ► 7:16 గంటలకు మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి కంగారు పడి గట్టిగా అరిచారు. ► 07:18 గంటలకు పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతి మీద చేయితో నొక్కి డ్రైవర్ నాగేశ్వరరావు స్వల్ప ఉపశమనం కలిగించారు. ► 07:20 గంటలకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తమయ్యారు. ► 07:20 గంటలకు మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన భార్య శ్రీకీర్తి.. వెంటనే మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు. ► 07:22 ‘నొప్పి పెడుతుంది కీర్తి’ అంటున్న మంత్రి మాటలకు స్పందించి.. అక్కడి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరారు. ► 07:27 మంత్రి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆస్పత్రికి, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటి డ్రైవర్, సిబ్బంది చేర్చారు. ► 08:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. ► 09:13 గంటలకు మంత్రి మేకపాటి ఇక లేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ► 09:15 గంటలకు మంత్రి మేకపాటి మృతిచెందినట్లు అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు. -
మంత్రాల నెపంతో దంపతులపై దాడి
అల్లాదుర్గం(మెదక్): మంత్రాలు(చేతబడి) చేస్తున్నారనే నెపంతో దంపతులను కరెంటు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లాదుర్గం గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. తమ పాలివారైన రమేశ్ కుటుంబం చేతబడే... కిష్టయ్య అనారోగ్యానికి కారణమని ఆరోపిస్తూ ఆయన కుటుంబీకులు ఆదివారంరాత్రి గొడవపడ్డారు. సోమవారం ఉదయం మళ్లీ గొడవకు దిగి రమేశ్ను, ఆయన భార్య రజితను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి నడిరోడ్డుపై స్తంభానికి వైర్లతో కట్టేశారు. కట్టెలతో కొట్టారు. పోలీసులు వచ్చి రమేశ్ దంపతులను ఆసుపత్రికి తరలించారు. రమేశ్ ఫిర్యాదు మేరకు కిష్టయ్య కొడుకులు కుమార్, నగేశ్, భేతయ్య, భార్య ఆశమ్మ, కూతురు అంబమ్మపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి జోగిపేట కోర్టుకు రిమాండ్కు తరలించారు. -
ఆ ఇంట్లో అందరూ దొంగలే
కర్ణాటక(యశవంతపుర): ఆ ఇంట్లో అందరూ దొంగలే. తల్లి, ఆమె తనయుడు, తనయ మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలబాట పట్టారు. ఎట్టకేలకు ముఠాకు చెందిన 8 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఉత్తర విభాగం డీసీపీ వినాయక పాటిల్ వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని మాదనాయకనహళ్లి దొమ్మరహళ్లి నివాసి మంజునాథ్ అలియాస్ కోళిమంజ(31), అతని తల్లి ప్రేమ(50), అయన చెల్లెలు అన్నపూర్ణ అలియాస్ అను(28), లగ్గేరి నివాసి దీపక్ అలియాస్ దీపు(31), గంగానగరకు చెందిన మను అలియాస్ మహేంద్ర(21), దయానంద్ అలియాస్ దయా(25), మునిస్వామి అలియాస్ స్వామి(34), సతీశ్(24)లను ఉత్తర విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.45 లక్షల విలువైన 332 గ్రాములు బంగారం, రూ.59 వేల నగదు, 23 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఉపాధ్యాయురాలు జనవరి 10న బీఎంటీసీ బస్ దిగి కాలినడకన వెళ్తుండగా బైకుపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని 50 గ్రాములు బంగారు మాంగల్య చైన్ లాక్కొని ఉడాయించారు. ఈ చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మ, అమ్మమ్మ కలిసి.. అమ్మాయిని అమ్మబోయి..
పహాడీషరీఫ్: పేదరికమో, మరో కారణమో.. డబ్బుల కోసం 14 ఏళ్ల అమ్మాయిని ఓ కుటుంబం బేరానికి పెట్టింది.. భార్యకు విడాకులిచ్చి ‘మరో తోడు’ కోసం చూస్తున్న 61 ఏళ్ల వృద్ధుడికి ఆమెను అమ్మేందుకు సిద్ధమైంది. అమ్మ, అమ్మమ్మ కలిసి.. మరో ఐదుగురు మహిళలు మధ్యవర్తులుగా నిలిచి.. చేయబోయిన ఈ దారుణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి దాడులు చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని బండ్లగూడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ అలీ (61) ఆరేళ్ల క్రితం తన భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు మరో తోడు అవసరమని భావించాడు. ఇందుకోసం హైదరాబాద్లోని క్యూబా కాలనీలో నివాసం ఉండే అఖిల్ అహ్మద్ (37)ను సంప్రదించాడు. ఇద్దరూ కలిసి షాహీన్నగర్, చాంద్రాయణగుట్ట పరిసరాలకు చెందిన మహిళలను అక్రమంగా రవాణా చేసే జరీనా బేగం (25), షబానా బేగం (38), షమీం సుల్తానా (45), నస్రీన్ బేగం (40), జాహెద్బీ (72)లను మధ్యవర్తులుగా పెట్టుకున్నారు. ఈ మధ్యవర్తులు బండ్లగూడ నూరీ నగర్కు చెందిన అష్రియా బేగం కుమార్తె (14 ఏళ్లు)ను అల్తాఫ్ అలీకి రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఆమె అమ్మమ్మ చాంద్ సుల్తానా (65) సమక్షంలో మూడు నెలల కింద ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అల్తాఫ్ డబ్బు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో ఒప్పందం రద్దయింది. అయితే కొద్దిరోజుల కింద బాలిక మేనమామకు ప్రమాదం జరిగి, డబ్బులు అవసరం పడ్డాయి. దీనితో అష్రియా బేగం తన బిడ్డను విక్రయించేందుకు సిద్ధమై మధ్యవర్తులను ఆశ్రయించింది. వారు వెంటనే ముంబైకి చెందిన అల్తాఫ్ అలీకి సమాచారమిచ్చారు. డబ్బు అత్యవసరం కావడంతో ఈసారి రూ.3 లక్షలకే బాలికను కొనేందుకు బేరం కుదుర్చుకొన్నారు. డబ్బు చెల్లించి బాలికను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో.. బాలాపూర్ ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసు బృందం ఆదివారం రాత్రి దామని ఎర్రకుంటలో దాడులు చేసింది. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి బాలికను రక్షించింది. పోలీసులు నిందితులపై పోక్సో, మహిళల అక్రమ రవాణా చట్టాల కింద కేసు నమోదుచేసి నిందితులను రిమాండ్కు తరలించారు. -
మొత్తం నాలుగు రోజుల సెలవులు! అక్కడి ఉద్యోగులకు సర్కార్ బంపరాఫర్
సాధారణంగా చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలకు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉంటాయనేది తెలిసిందే కదా. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం ఈ వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు రోజులు అదనపు సెలవులు ప్రకటించారు. ఎందుకో తెలుసా?.. అస్సాం(అసోం) ప్రభుత్వం ఉద్యోగుల కోసం అరుదైన ప్రకటన చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా వెల్లడించారు. కుటుంబ సభ్యులతో మనసారా గడిపేందుకు ఈ సమయం కేటాయించండంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అస్సాం సాధారణ పరిపాలక విభాగం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఆపై 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం.. కూడా సెలవు దినాలే. అంటే మొత్తం వరుసగా నాలుగు సెలవురోజులు వచ్చాయి. ఇక ప్రత్యేక సెలవుల కోసం ముందుగా ఉద్యోగులు తమ సీనియర్ అధికారులకు లీవ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సోమవారం(జనవరి 10వ తేదీ) తిరిగి విధుల్లోకి వచ్చేటప్పుడు.. ప్రత్యేక సెలవుల్లో(ఆ రెండురోజులపాటు) కుటుంబంతోనే గడిపినట్లు ఫొటోల్ని ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం అంతేకాదు ఈ హాలీడేస్ ఫొటోల్ని ప్రభుత్వం నిర్వహించే పోర్టల్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ ప్రత్యేక లీవులు కాస్త క్యాజువల్ లీవులుగా మారిపోతాయి. అంతేకాదు ప్రత్యేక సెలవుల్ని దుర్వినియోగం చేసినందుకు చర్యలు కూడా ఉంటాయి. To uphold ancient Indian values, I urge Assam Govt employees to spend quality time with their parents/in-laws on Jan 6 & 7, 2022 designated as spl leave. I request them to rededicate themselves to the cause of building a New Assam & New India with blessings of their parents. pic.twitter.com/hZ2iwbgKoB — Himanta Biswa Sarma (@himantabiswa) January 2, 2022 టాప్ సివిల్ సర్వెంట్ నుంచి ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగుల దాకా.. అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. తల్లిదండ్రులు లేని ఉద్యోగులకు ఈ సెలవుల నిబంధన వర్తించదు. అలాగే ఆ లీవ్స్ను తర్వాత ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేదు. ఉద్యోగులు తమ కుటుంబీకులతో సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చిన హిమంత సర్కార్పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. నవంబర్లోనే ఈ జీవోకు అస్సాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చదవండి: టెస్లాలో మనోడు.. తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర -
ఏం జరిగిందో ఏమో.. 20 రోజుల్లో నలుగురి కన్నుమూత
పిఠాపురం: తక్కువ కాల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వరుస మరణాలతో తేరుకోలేకపోతోంది. కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్ నిర్వాసిత కాలనీలోని కొల్లావారిపాకలులో కొల్ల సింహాచలం కుటుంబం నివసిస్తోంది. ఈమెకు ఒక కొడుకు, నలుగురు కుమార్తెలు. ఉద్యోగ రీత్యా కొడుకు శ్రీను హైదరాబాద్లో ఉంటున్నాడు. గత నెల 26న స్వగ్రామంలో బంధువుల ఇంట వివాహానికి వచ్చాడు. ఆ సమయంలో అతడి మేనల్లుడు కామేశ్వరరావు పచ్చ కామెర్ల బారిన పడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేనల్లుడి పెద్దకార్యం అయ్యాక వెళదామని శ్రీను ఉండిపోయాడు. ఈలోగా మనవడు కామేశ్వరరావు చనిపోయాడన్న దిగులుతో శ్రీను తల్లి సింహాచలం మంచం పట్టింది. మృతులు సింహాచలం, కొల్ల శ్రీను (ఫైల్) ఈ నెల 11న వాంతులు విరేచనాలు అవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడింది. మేనల్లుడు, తల్లి మృత్యువాత పడడం తట్టుకోలేక శ్రీను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతడు కూడా వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ నెల 12న కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. వరుస మరణాలతో కుంగిపోయిన కామేశ్వరరావు భార్య లోవకుమారి కూడా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు కూడా వాంతులు, విరోచనాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న చనిపోయింది. 20 రోజుల వ్యవధిలోనే నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అమ్మ, నాన్న కావాలంటూ దీనంగా చూస్తున్న మనోజ్ ఏం జరిగిందో.. నలుగురిలో ముగ్గురు వాంతులు, విరేచనాల లక్షణాలతోనే చనిపోయారు. అసలేం జరుగుతోందో.. ఎందుకిలా వరుస మరణాలు సంభవించాయో తెలియక ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నలుగురు చనిపోయినా గ్రామంలో స్థానిక అధికారులెవరూ స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది కానీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది కానీ వచ్చి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటున్నారు. చనిపోయిన వారికి ఏవ్యాధి సోకిందనేది చర్చనీయాంశమైంది.వారి ఆలనాపాలన మాటేంటి..! కామేశ్వరరావు దంపతులు కన్నుమూయడంతో మనోజ్ ఒంటరి అయ్యాడు. అమ్మా నాన్న తప్ప మరో లోకం తెలియని రెండేళ్ల ఈ పసివాడిని చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. మృతురాలు సింహాచలానికి నలుగురు కుమార్తెలు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది. మరో ఇద్దరు కుమార్తెలు రామలక్ష్మి, సూరీడు దివ్యాంగులు. వీరిది లేచి నడవలేని స్థితి. ఇన్నాళ్లూ తల్లి సింహాచలమే అన్నీ తానై సేవలు చేస్తూ పోషించింది. తల్లి సింహాచలం మృతి చెందడంతో అనాథలుగా మిగిలిపోయారు. -
ప్రముఖ సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని హరిణి కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారం నుంచి వారందరి మొబైల్స్ కూడా స్విచ్చాఫ్లో ఉన్నాయి. ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. బెంగళూరులోని రైల్వేట్రాక్పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఏకే రావు మృతిపై బెంగళూరు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏకే రావు శరీరంపై కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయన సుజనా ఫౌండేషన్ సీఈఓగా, సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఏకే రావు ఫ్యామిలీతో నివాసముంటున్నారు. చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట! ఈ నెల 8న ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు చివరిసారిగా ఈ నెల 19న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. 23 న ఏకే రావు మృతి చెందినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బెంగుళూరులోనే మృతుడి అంతక్రియలు పూర్తి చేశారు. మృతుడి శరీరంపై కత్తిగాట్లు ఉండటంతో హత్య కోణంలో బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఏకేరావును హతమార్చి మృతదేహాన్ని ట్రాక్పై పడేసి ఉండొచ్చిని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హరిణి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియాల్సి ఉంది. హరిణి ఓ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్. ఆమె గాయని మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. తమిళం, తెలుగు, కన్నడ, మాళయాలం, హిందీ సినిమాల్లో చాలా పాటలు పాడారు. -
నెల్లూరులో విషాదం: గ్యాస్ లీక్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు:నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు భారీగా వ్యాపించడంతో దంపతులు అబ్బాస్, నౌషాద్కు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందగా, కుమార్తె అయేషాను చికిత్సకోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయేషా కూడా మృతి చెందింది. వివరాల ప్రకారం.. అబ్బాస్ కుటుంబం మల్లంలో టిఫిన్ అంగడి నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే గ్యాస్ లీక్ అయిన క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితులు అహకారాలు చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే ఇంట్లో ఉంటున్న ముగ్గురు తీవ్రగాయాలపాలై మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో.. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం
అనంతపురం క్రైం: నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోయారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని మారుతీనగర్కు చెందిన సంగమేష్, సాయిమౌనిక దంపతులు. 2011లో వివాహమైన వీరికి లిఖిత శరణ్య, లిఖిత కార్తికేయన్, మణికృష్ణ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంగమేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చదవండి: పాతిక కోట్లను బాంబులతో పేల్చేశారు! సోమవారం ఉదయం పిల్లలను పాఠశాల వద్దకు వదిలి వస్తానని చెప్పి వెళ్లిన భార్య సాయి మౌనిక తిరిగి రాలేదు. దీంతో పిల్లలు చదువుతున్న పాఠశాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో సంగమేష్ గాలించాడు. ఫలితం లేకపోవడంతో సాయంత్రం నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. చదవండి: బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ