-
తనకంటే ఐదేళ్ల చిన్నవాడితో మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో..
నంద్యాల: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో మహిళ దారి తప్పి చివరకు భర్తనే దారుణంగా హత్య చేయించింది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. ఈనెల 4వ తేదీన నంద్యాల పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద జరిగిన ప్రైవేటు ఉపాధ్యాయుడు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దారుణానికి పాల్పడిన ఏడుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఎస్పీ రఘువీర్రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన సిందే నర్సోజీకి వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన జయశ్రీతో పదేళ్ల క్రితం వివాహమైంది. నర్సోజీ అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. జయశ్రీ(27) గ్రామంలో ఇంటి ఎదురుగా తనకంటే ఐదేళ్లు వయస్సు తక్కువగా ఉన్న రవీంద్ర (22) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రవీంద్ర కొబ్బరి తాళ్లు నేస్తున్నాడు. వీరి మధ్య ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే నెల క్రితం వీరిద్దరి వ్యవహారాన్ని తెలుసుకున్న నర్సోజీ పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. రవీంద్రను ఇకపై తన ఇంటి పరిసరలా వైపు రావద్దని హెచ్చరించాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని ప్రియుడితో కలసి జయశ్రీ కుట్ర పన్నింది. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. నర్సోజీని హత్యచేయాలని జయశ్రీ, ప్రియుడు రవీంద్ర పథకం వేశారు. రవీంద్ర స్నేహితులైన మహదేవాపురం గ్రామానికి చెందిన గుండపోగుల రాజేష్, బసాపురం గ్రామానికి చెందిన కాలె వెంకటరమణ, నక్క చిన్న నరసింహులు, నల్లబోతుల వెంకటేశ్వర్లు, పెద్దకొట్టాలకు చెందిన జజ్జం నాగేంద్రకు విషయం చెప్పి హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 4వ తేదీ సాయంత్రం అయ్యలూరిమెట్ట సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్లో విధులు ముగించుకుని బైక్పై తిరిగి వస్తుండగా నర్సోజీ తలపై వెనుక నుంచి గొడ్డలితో దాడి చేశారు. ప్రాణాలు దక్కించుకునేందుకు నర్సోజీ పారిపోతుండగా గొడ్డలితో తలపై నరికి హత్య చేసి నిందితులు పరారయ్యారు. మృతుడి తల్లి రామబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నంద్యాల తాలూకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి వారి నుంచి గొడ్డలిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు పర్యవేక్షణలో డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐ నాగరాజు, సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకోవటంతో ఎస్పీ వారిని అభినందించారు. -
చెల్లెలితో వివాహేతర సంబంధం.. పరువు పోయిందని భావించి
పులివెందుల : వివాహేతర సంబంధంతోనే నాగరాజు హత్య జరిగిందని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆదివారం పులివెందులలోని పోలీస్స్టేషన్లో ఆయన నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో చింతకాయల నాగరాజు తన మోటారు సైకిల్లో ఇంటి వద్ద నుంచి టమాట తోట వద్దకు వెళ్లగా.. అక్కడ అతని కోసం కాపుకాచి ఉన్న వారు వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి హతమార్చారని తెలిపారు. ఈ హత్యలో బొర్రా చెన్నకేశవులు, బొర్రా చందు, బొర్రా చెన్నకృష్ణ, బొర్రా చండ్రాయుడు, బొర్రా గంగన్న, బొర్రా గోపాల్లకు ప్రమేయం ఉందన్నారు. ఈ హత్యకు ముఖ్య కారణం గతంలోనే నాగరాజుకు వివాహమై భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని, అయితే ఆయన 5 ఏళ్ల నుంచి బొర్రా చెన్నకేశవుల చెల్లెలితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడన్నారు. 2018లో నాగరాజు పులివెందులలో నివాసం ఉన్న సమయంలో బొర్రా చెన్నకేశవులు, అతని తమ్ముడు బొర్రా చందులు నాగరాజు ఇంటి వద్దకు వెళ్లి తమ చెల్లెలి విషయం అడుగగా ఆయన వారిపై వేటకొడవలితో దాడిచేయడం జరిగిందన్నారు. అప్పట్లో నాగరాజుపై ఆ విషయానికి సంబంధించి పులివెందుల పోలీస్స్టేషన్లో కేసు నమోదైందన్నారు. ఆ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన సాక్ష్యం చెప్పాలని హైదరాబాదులో ఉన్న తమ చెల్లెలిని అడుగగా, తాను నాగరాజును పెళ్లి చేసుకున్నానని, ప్రస్తుతం 8 నెలల గర్భవతినని నాగరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు తిరస్కరించిందన్నారు. దీంతో కోపోద్రేక్తులైన బొర్రా చెన్నకేశవుల కుటుంబ సభ్యులు గ్రామంలో తమ పరువు పోయిందని, దీనికంతటికి కారణం నాగరాజుగా భావించి అతనిని చంపేందుకు నిర్ణయించుకున్నారన్నారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన టమాట తోట వద్దకు వచ్చిన నాగరాజును నరికి చంపారని తెలిపారు. కేవలం వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగిందని, దీనిలో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని ఆయన వివరించారు. మీడియా సమావేశంలో సీఐ మద్దిలేటి, లింగాల, తొండూరు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్త చింతకాయల నాగరాజు హత్యపై ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. చంద్రబాబు పర్యటనలో బాణాసంచ కాల్చడం వల్లనే టమాటా తోటలో కాపుకాసి వేట కోడవళ్లతో దాడికి పాల్పడినట్లు దుష్ప్రచారం చేసింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. : వివాహేతర సంబంధంతోనే నాగరాజు హత్య జరిగిందని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో సుకన్య పరార్
తమిళనాడు: కళాశాల విద్యార్థితో యువతి పరారైంది. దీంతో విద్యార్థి తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణగిరి జిల్లా రాయకోట సమీపం మొల్లంపట్టి గ్రామానికి చెందిన గోవిందన్(55)కు భార్య సాలమ్మాళ్ (48), కుమారుడు తమిళ్సెల్వన్ (21), కుమార్తె మంజుల ఉన్నారు. తమిళసెల్వన్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ప్లస్–1 విద్యార్థిని ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు వ్యతిరేకం తెలుపుతారని తెలిసి తమిళ్ సెల్వన్, అమ్మాయి కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక తల్లిదండ్రులు డెంకణికోట్టైలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక బంధువులు గత 5వ తేదీన తమిళసెల్వన్ ఇంటికి వెళ్లి అతని తండ్రి గోవిందన్, తల్లి సాలమ్మల్పై దాడి చేసి చంపేస్తామని బెదిరించారు. ఇంటిని కూడా ధ్వంసం చేశారు. దీంతో భయాందోళనకు గురైన గోవిందన్, అతని భార్య సాలమ్మల్ గత 7వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికులు వారిని కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోవిందన్ ఆదివారం ఉదయం మృతి చెందాడు. అనంతరం బాలిక బంధువులు ముత్తు, కుమార్, పెరుమాళ్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన అమ్మాయి, తమిళసెల్వన్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. ప్రియుడితో పరార్ ఇంటి పట్టా, నగలు తీసుకుని వివాహిత ప్రియుడితో కలిసి పరారైంది. తంజావూరు సమీపంలోని వాయలూరు సారపల్లం గ్రామానికి చెందిన రాజసెల్వం (45)కు భార్య సుకన్య (33), ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో శనివారం రాజసెల్వం తంజావూరు ఎస్పీ ఆశిష్ రావతికి ఫిర్యాదు చేశాడు. అందులో తమ వీధికి చెందిన ఓ యువకుడు తన భార్య సుకన్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపాడు. తాను వారిని చాలాసార్లు మందలించానని, వారు సంబంధాన్ని వదలలేదని వెల్లడించాడు. ఈ స్థితిలో 4వ తేదీన ఆ యువకుడు తన భార్యను, తన చివరి బిడ్డను తీసుకుని వెళ్లిపోయాడని తెలిపాడు. నగలు, ఇంటి పట్టాను తీసుకుని వెళ్లాడు. యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఖమ్మం: వివాహేతర సంబంధం విషయం బయటపడడంతో మందలిస్తున్న భర్తను అడ్డు తొలగించేందుకు ఓ మహిళ తన సన్నిహితుడితో హత్య చేయించింది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు నిందితుడు, వీరికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సత్తుపల్లి సీఐ మోహన్బాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెంకు చెందిన చిమట కేశవరావు– సత్యవతి భార్యాభర్తలు. ఇందులో సత్యవతికి అదే గ్రామానికి చెందిన చిమట రాముతో ఏడాదిన్నర క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతేర సంబంధానికి దారి తీసింది. వీరి నడుమ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకోలుకు చెందిన గంపా జోజిబాబు మధ్యవర్తిగా సహకరించేవాడు. కొన్నాళ్లకు ఈ విషయం బయటపడడంతో సత్యవతిని కేశవరావు మందలించాడు. ఇది జీర్ణించుకోలేని ఆమె రాముకు చెప్పి తన భర్తను హత్య చేయాలని కోరింది. ఇంతలోనే ఈనెల 1వ తేదీన రాముకు కేశవరావు ఫోన్ చేసి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మందలించాడు. దీంతో రాము తనను క్షమించాలని కోరడంతో పాటు ఓసారి కలుద్దామని చెప్పాడు. ఈమేరకు లింగగూడెంలోని మర్రిచెట్టు వద్దకు కేశవరావు వచ్చాక తన మోటార్ సైకిల్పై తీసుకెళ్తూ ఆయిల్పామ్ తోటలో కత్తితో దాడి చేశాడు. అయితే, కేశవరావు ఇంకా ప్రాణాలతో ఉండడంతో ప్లాస్టిక్ కవర్ను మెడ, తల చుట్టూ కట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో కన్నుమూశాడు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై సరిహద్దు సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం శివార్లకు తీసుకొచ్చి ఆయిల్పామ్ తోటలో వేసి వెళ్లిపోయాడు. కాగా, మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఎలాగైనా పట్టుబడతాననే భయంతో రాము గ్రామ పెద్దలకు చెప్పి సత్తుపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం ఆయన ఇచ్చిన సమాచారంతో శనివారం లింగగూడెం వెళ్లి సత్యవతిని, మంకోలు వెళ్లి గంప జోజిబాబుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ మోహన్బాబు వెల్లడించారు. -
భార్యతో వివాహేతర సంబంధం.. కత్తితో నరికి..చెరువులో పడేసి..
స్టేషన్ఘన్పూర్: మండలంలోని శివునిపల్లికి చెందిన తీగల కరుణాకర్(35) దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు.. కరుణాకర్ను కత్తితో దారుణంగా చంపి శివునిపల్లి శివారు నమిలిగొండ చెరువులో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ఘన్పూర్ ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం శివునిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తీగల యోబు, మరియ దంపతుల రెండో కుమారుడు కరుణాకర్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదేవిధంగా శివునిపల్లికి చెందిన చిక్కుడు నాగరాజు హమాలీ పనిచేస్తుంటాడు. నమిలిగొండ శివారులో వారివురి వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో కరుణాకర్కు, నాగరాజు భార్యకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈనెల 25న హైదరాబాద్లో ఉన్న కరుణాకర్.. నాగరాజు భార్య ఫోన్కు ఫోన్ చేయగా ఇంట్లో ఉన్న ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇదీ గమనించని కరుణాకర్ తాను సాయంత్రం వస్తున్నానని, కలుస్తామని చెప్పగా నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ విషయంపై ఏమి తెలియనట్లు బయటకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఆమెకు మరోసారి ఫోన్ రావడంతో తమ వ్యవసాయ భూముల సమీపంలో ఉన్న మామిడితోట వద్దకు వెళ్లింది. గమనించిన నాగరాజు కత్తి తీసుకుని మామిడితోటకు వెళ్లాడు. అక్కడ తన భార్యతో కరుణాకర్ మాట్లాడుతున్న విషయం గుర్తించి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కచ్చువల, సంచిలో కట్టి నమిలిగొండ చెరువులో పడేసి వెళ్లాడు. ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి కరుణాకర్ కనిపించకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికారు. అతడి ఆచూకీ కోసం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో నిందితుడు స్వయంగా మంగళవారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి సీఐలు రాఘవేందర్, శ్రీనివాస్రెడ్డి.. చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటికి తీయించారు. దీంతో మృతుడి భార్య, సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు. కాగా, హత్య ఒక్కరే చేశారా.. మరెవరైనా ఉన్నారా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే పోలీసులు కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. చులకనగా చూస్తోందని
ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ దక్షిణపు వీధిలోని ఒక ఇంట్లో వివాహిత దారుణ హత్యకు గురైంది. మహిళను ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతను నూజివీడులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియురాలిని హత్యచేసి తరువాత రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మహిళ హత్య సమాచారం అందుకున్న ఏలూరు వన్టౌన్ ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు కూడా సంఽఘటనా స్థలానికి వెళ్ళి హత్య ఘటనపై ఆరా తీశారు. దిమ్మిట సత్యనారాయణ(35)కు కొంత కాలం క్రితం వివాహం కాగా, భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. అతను పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవించేవాడు. శనివారపుపేట గాలిగోపురం ప్రాంతానికి చెందిన ఉడత సుజాత (29)తో పరిచయం ఏర్పడింది. సుజాత భర్త లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. సుజాత, సత్యనారాయణ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల సుజాత తనను సరిగా పట్టించుకోవటం లేదని, చులకనగా చూస్తుందంటూ సత్యనారాయణ కక్ష పెంచుకున్నాడు. సుజాతను తన ఇంటికి రప్పించుకుని.. చాకుతో గొంతుకోసి ఆదివారం రాత్రి హత్య చేసి ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని ఏలూరు డీఎస్పీ తెలిపారు. చులకనగా చూడడం వల్లే.. ముందుగా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు రైల్వే బ్రిడ్జి వద్ద రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు అతడి ప్యాంట్ జేబును పరిశీలించగా తన అడ్రస్తో కూడిన ఉత్తరం, సూసైడ్ నోట్ లభించాయి. రైల్వే పోలీసులు ఏలూరులోని సత్యనారాయణ బంధువులకు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం ఇచ్చారు. అనుమానంతో బంధువులు ఇంటికి వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడడంతో మహిళ హత్యకు విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్ళి విచారణ చేశారు. తనను చులకనగా చూడడం, సరిగ్గా పట్టించుకోకపోవటంతో హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో ఉందని తెలుస్తోంది. వన్టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
కరీంనగర్ రూరల్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే మానసిక ఆందోళనగురైన ఓ భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్రూరల్ పోలీసుల కథనంమేరకు కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన భూసారపు అనిల్కుమార్(30)కు పదేళ్లక్రితం పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి మండలం కనగర్తికి చెందిన సౌజన్యతో వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. సౌజన్యకు వివాహానికి ముందునుంచే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం ఉందనే కారణంతో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. మంచిగా ఉంటానని పంచాయితీ పెద్దలకు సౌజన్య చెప్పినప్పటికీ.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఎన్నిసార్లు చెప్పిన తన భార్య వినకపోవడంతో మానసిక ఆందోళనకు గురైన అనిల్ ఈనెల 6న ఇంట్లో గడ్డి మందు తాగిపడిపోయాడు. గమనించిన తల్లి పుష్పలత, భార్య సౌజన్యలు వెంటనే ఆటోలో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మరుసటి రోజు ఇంటికి వెళ్లిన అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 9న కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే భార్య వివాహే తర సంబంధమే తన చావుకు కారణమని సెల్ఫీ వీడియో తీసి పెద్దబావ శ్రీనివాస్కు పంపించాడు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 2గంటలకు మృతిచెందాడు. తల్లి పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపం పెరిగై కులదాసపురం ప్రాంతానికి చెందిన జ్యోతి (36). ఈమె భర్త కేశవమూర్తి మృతిచెందాడు. జ్యోతి కుమార్తెతో కలిసి ఉంటోంది. జ్యోతి అంగన్వాడీ ఉద్యోగి. ఈ క్రమంలో మహారాజపురం ప్రాంతానికి చెందిన వెంకటేష్ (35)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం జ్యోతి అక్క కుమారుడు హరీష్కు తెలిసింది. దీంతో హరీష్ జ్యోతి, వెంకటేష్లను మందలించాడు. కానీ ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం జ్యోతి ఇంటికి హరీష్ వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ జ్యోతి, వెంకటేష్ ఒంటిరిగా ఉండడం చూసి హరీష్ గొడవపడ్డాడు. వెంకటేష్, హరీష్ ఘర్షణ పడ్డారు. ఘర్షణలో గాయపడిన వెంకటేష్ను హొసూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరిగై పోలీసులు అక్కడికి వెళ్లి వెంకటేష్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హరీష్ను పోలీసులు అరెస్టు చేశారు. -
ఆటో డ్రైవర్తో వివాహేతర సంబంధం.. బోనాల పండుగకు రప్పించి..
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోర్వెల్ డ్రిల్లర్ సల్ల సైదులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సఖ్యతకు అడ్డొస్తున్నాడన్న కారణంతో హతుడి ఇల్లాలు, ఆమె ప్రియుడు, మరో పాత్రధారుడితో కలసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సోమవారం డీసీపీ రాజేష్ చంద్ర భువనగిరిలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన సల్ల సైదులుకు శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి.సైదులు బోర్వెల్పై డ్రిల్లర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం గ్రామానికి వచ్చి కట్టెకోత పనికి వెళ్తున్నాడు. మూడేళ్లుగా వివాహేతర సంబంధం సైదులు బోర్వెల్ డ్రిల్లర్గా పనిచేస్తున్న క్రమంలో నెలల తరబడి విధి నిర్వహణలో ఉంటూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ధనమ్మ తరచూ గురజాలలోని పుట్టింటి వద్దే ఎక్కువగా ఉంటుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎడ్ల నవీన్తో మూడేళ్ల క్రితం ధనలక్షి్మకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ధనలక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండడంతో సైదులు అనుమానించాడు. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. విషయం పెద్దమనుషుల వద్దకు చేరడంతో సర్దిచెప్పగా ప్రస్తుతం సజావుగానే కాపురం సాగుతోంది. బోనాల పండుగకు రప్పించి.. ధనలక్షి్మని పుట్టింటికి వెళ్లనీయకుండా తమ సఖ్యతకు సైదులు అడ్డొస్తున్నాడని ఎడ్ల నవీన్ కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని ప్రియురాలు ధనలక్షి్మతో కలసి పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే సైదులు, ధనలక్ష్మి, పిల్ల లను తీసుకుని ఈ నెల 10వ తేదీన గురజాలలోని పుట్టింటికి వచ్చారు. అనుకున్న పథకం ప్రకారం సైదులు హత్య చేసేందుకు నవీన్ తన సమీప బంధువు స్వామి సహాయం కోరాడు. అందుకు అతడు ఒప్పుకోవడంతో ఈ నెల 11వ తేదీన ఇద్దరూ కలసి ధనలక్ష్మి పుట్టింటికి వచ్చారు. అనంతరం మద్యం తాగేందుకు సైదులును వెంటబెట్టుకుని ఆటోలో అమ్మనబోలుకు వెళ్లారు. అక్కడ నవీన్, స్వామి, సైదులు మద్యం తాగారు. పూటుగా మద్యం తాగిన సైదులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం నవీన్, స్వామి ఇద్దరూ కలసి ఆటో స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో సైదులు మెడకు ఉరి బిగించారు. అనంతరం సైదులు ఆటోలో వేసుకుని మోత్కూరు మండలం పొడిచేడులోని మూసీ నది బ్రిడ్జి వద్ద మట్టిరోడ్డులోకి వెళ్లి చనిపోయాడో లేదోనని మరో సారి తాడుతో ఉరి బిగించి ఘాతుకానికి ఒడిగట్టారు. ఆపై మృతదేహాన్ని పొడిచేడు లోని మూసీ నది ఒడ్డున గంగదేవమ్మ ఆలయం సమీపంలో పడవేసి వెళ్లిపోయారు. నిందితుడిని గుర్తించిన డాగ్స్కా్వడ్ మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలోని మూసీ నది ఒడ్డున వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సైదులు మెడకు రెండు చోట్ల తాడుతో ఉరిబిగించినట్లు ఆనవాళ్లు ఉండడంతో హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికే విష యం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హ తుడి తల్లి గురజాలకు చెందిన నవీన్పై అనుమానం వ్యక్తం చేసింది. ఘటనా స్థలంలో ఆటో గుర్తులను గుర్తించిన పోలీసులు పోలీస్ డాగ్స్వా్కడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే, అప్పటికే నవీన్ తన ఆటోలో ధనలక్ష్మి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆటోలో ఘటనా స్థలానికి తీసుకువచ్చాడు. దీంతో పోలీస్ జాగిలం సైదులు మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆటో చుట్టూ తిరగడంతో పాటు నవీన్ను గుర్తించింది. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మిగతా ఇద్దరు నిందితులు హైదరాబా ద్కు పారిపోతుండగా అనాజిపురం వద్ద పట్టుకున్నట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన తాడు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో పోలీస్ డాగ్స్కా్వడ్ కీలకంగా వ్యవహరించిందని డీసీపీ చెప్పారు. సమావేశంలో అడిషినల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరాం, మోత్కూర్ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. -
ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీలో నిద్రమాత్రలు కలిపి
కర్ణాటక: ప్రేమికునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యను చిక్కమగళూరు జిల్లా యగటి పోలీసులు అరెస్ట్ చేశారు. కడూరు తాలూకా హనుమనహళ్లికి చెందిన పావనికి నవీన్ (29)తో ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. ఇటీవల భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త గొడవ పడగా పెద్దలు రాజీ పంచాయతీ చేశారు. ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీల్లో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. భర్త తిని నిద్రలోకి వెళ్లగానే ప్రియునితో కలిసి హత్య చేసి మూడు కిలోమీటర్ల దూరంలో పడేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది. అయితే ఇది ఆత్మహత్య కాదని తెలిసి పావనిని విచారించగా నిజం చెప్పింది. ఇద్దరినీ అరెస్టు చేశారు. -
పని మనిషి ఆత్మహత్య.. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
హైదరాబాద్: ల్యాంకోహిల్స్లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం నగరానికి చేరి బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్స్ 15 ఎల్హెచ్ బ్లాక్లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్టేకర్గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం . కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం పూర్ణచంద్రావు కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీపై 21వఅంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్కు చేరగా.. అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. వేధింపుల వల్లేనా? కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్రావు ప్రచారం చేసుకునేవాడు. సినీపరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్కు వచ్చారని వివరించారు. అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన పోలీసులు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణచంద్రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దూరంగా భర్త.. మరో వ్యక్తితో రెండేళ్లుగా భార్య వివాహేతర సంబంధం..
తూర్పు గోదావరి: వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలికొంది. మండలంలోని కొంతంగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్తిపాడు సీఐ కె.కిషోర్బాబు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన పగడం దుర్గాప్రసాద్(21)కు, అదే గ్రామానికి చెందిన మహిళతో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది. ఉపాధి నిమిత్తం భర్త దూర ప్రాంతంలో ఉండటంతో ఆ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కొంతంగిలోని పుట్టింటికి వచ్చింది. ప్రసాద్ కూడా రాచపల్లి నుంచి ఆదివారం రాత్రి కొంతంగి వచ్చాడు. వివాహేతర సంబంధం విషయంలో అతడు అల్లరి చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రసాద్ను మేడ పైకి తీసుకువెళ్లి, కళ్లల్లో కారం కొట్టి, హతమార్చారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సీఐ కిషోర్బాబు, అన్నవరం ఎస్సై వి.కిషోర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హతుడికి తల్లి, పెళ్లి కావలసిన అన్న, చెల్లెలు ఉన్నారు. -
నా భార్యతో సమీర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అందుకే..
జగిత్యాల: రెండ్రోజుల క్రితం పట్టణ శివారులోని డీ–40 కాలువలో అనుమానాస్పదంగా మృతిచెందిన షేక్ సమీర్ (22) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రవీణ్ కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బీముని దుబ్బలో నివసిస్తున్న షేక్ సమీర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అంబేద్కర్ నగర్కు చెందిన కండ్లె ఈశ్వర్ (23), నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఉట్నూర్ బాలా శంకర్ ఈనెల 2న రాత్రి సమీర్ను డి–40 కాలువ వద్దకు పిలిపించుకొని ముగ్గురు మద్యం తాగారు. ఈ క్రమంలో కండ్లె ఈశ్వర్, సమీర్ గొడవపడగా అప్పటికే పథకం ప్రకారం తమతో తెచ్చుకున్న నైలాన్ తాడును ఉట్నూర్ బాలా శంకర్, ఈశ్వర్లు సమీర్ మెడకు చుట్టి హత్యచేశారు. మృతదేహంతో పాటు ద్విచక్రవాహనాన్ని కాలువలో పడేశారు. రెండ్రోజుల క్రితం డీ–40 కాలువలో సమీర్ మృతదేహం లభ్యంకాగా మృతుడి బావ అమీర్ కండ్లె ఈశ్వర్పై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కల్లూర్ రోడ్డులో ఈశ్వర్ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్యతో సమీర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. అందుకు తన స్నేహితుడు బాలా శంకర్ సాయం తీసుకున్నాడని, రూ.40 వేలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈశ్వర్ తెలిపాడని సీఐ వెల్లడించారు. నిందితుల వద్ద రెండు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు చెప్పారు. ఎస్సై కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. -
వివాహేతర సంబంధం: భర్తను వదిలి రమ్మంటే రాలేదని..
కామారెడ్డి: వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదని మహిళపై నీలేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. రెండో టౌన్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు.. నగరంలోని కసాబ్గల్లీకి చెందిన స్వాతి, భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. స్వాతికి నీలేష్ అనే వ్యక్తితో గతంలో వివాహేతర సంబంధం ఉండేది. వారి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. స్వాతిని భర్తను వదిలి తన వద్దకు రావాలని తరుచూ వేధించేవాడు. దీనికి మహిళ ఒప్పుకోకపోవడంతో, ఆదివారం ఉదయం కసాబ్గల్లీలో ఒంటరిగా ఉన్న స్వాతిపై, నీలేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో నాలుగు పోట్లు పొడిచాడు. స్థానికులు అక్కడికి చేరుకోగానే నీలేష్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిలేష్ మహారాష్ట్రలోని నాందేడ్కు చెందినవాడని పోలీసులు తెలిపారు. -
పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం.. ప్రియుడి స్కూటీపై పరార్
ఏలూరు టౌన్ : ప్రియుడితో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ఓ వివాహిత నిద్రిస్తున్న భర్తను చాకుతో మెడపై విచక్షణారహితంగా పొడిచి హత్యచేయించింది. ఈ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటలలోపే ఛేదించి నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మేరకు శనివారం ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామానికి చెందిన కురిపాటి చంద్రశేఖర్కు 11 ఏళ్ల క్రితం భువనేశ్వరితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ఉంగుటూరు మండలం నారాయణపురం వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ నారాయణపురం టైల్స్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. తాడేపల్లిగూడెం కోతిబోమ్మసెంటర్ ప్రాంతానికి చెందిన గొర్ల సూర్యనారాయణ వీరు నివాసం ఉంటున్న ఇంటిపక్కన తాపీ పని నిమిత్తం వచ్చాడు. భువనేశ్వరికి తాపీ పనిచేస్తున్న గొర్ల సూర్యనారాయణతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. వీరి విషయం భర్త చంద్రశేఖర్కు తెలియడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకునేందుకు హత్యకు పథక రచన చేశారు. సూర్యనారాయణ తాడేపల్లిగూడెంలో ఒక చాకును కొనుగోలు చేసి స్కూటీలో పెట్టుకుని, భువనేశ్వరి ఇంటికి వచ్చాడు. ఈనెల 3వ తేదీ రాత్రి చంద్రశేఖర్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో భువనేశ్వరి, సూర్యనారాయణ చాకుతో దాడి చేశారు. పీక, మెడమీద విచక్షణారహితంగా పొడవటంతో చంద్రశేఖర్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఇంటిలోనే నిద్రిస్త్తున్న పిల్లలను వదిలేసి భువనేశ్వరి, సూర్యనారాయణ స్కూటీపై పరారయ్యారు. ఈ హత్య కేసును క్రైమ్ నెంబర్ 168/2023 యూ/ఎస్ 302, 449, 120(బీ), రెడ్విత్ 34 ఐపీసీగా నమోదు చేశారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, చేబ్రోలు ఎస్సై కె.స్వామి, నిడమర్రు ఎస్సై ఆర్.శ్రీను దర్యాప్తు చేపట్టారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ఉంచారు. హత్య కేసును చేధించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు. -
మై వైఫ్ .. శివాని గురించి రమేశ్ చివరిమాటలు
సాక్షి, క్రైమ్: విశాఖలో వివాహేతర సంబంధంతో భర్త రమేశ్ను ప్రియుడితోపాటు హత్య చేసిన ఉదంతంలో సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. భర్తను హత్యకు ముందు శివాని చేసిన పనికి పోలీసులు సైతం షాక్ తిన్నారు. రమేశ్కు మద్యం తాగించి.. ఆ సమయంలో తన గురించి పొగిడినదంతా ఆమె వీడియోలు తీయించుకుంది. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు లో కీలక వీడియోలు సాక్షి టివి చేతికి అందాయి. రమేశ్ని చంపే ముందూ.. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియోలు రికార్డు చేసింది. భర్తకి మటన్ వండి పెట్టీ.. మందు తాగించి.. ‘నా భార్య మంచిది’ అని రమేశ్తో చెప్పించింది శివాని. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టినదంతా కూడా రికార్డు అయ్యింది. మా ఆవిడ చాలా తెలివైంది. గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధిస్తుంది. నా వైఫ్.. మై లైఫ్. చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నంత వరకు ధైర్యం చూపిస్తుంది. నేను ఎప్పుడు ఉంటానో.. ఎప్పుడు పోతానో తెలియదు. నేను పోయాక కూడా అదే ధైర్యం చూపించాలి. నా వైఫ్ బెస్ట్ అంటూ మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. భర్త హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడే క్రమంలో.. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది శివాని. ఆమె ఫోన్ నుంచి వీడియోలు సేకరించిన పోలీసులు.. నేరస్తురాలి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు. 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ బర్రి రమేష్(35). 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య శివాని(శివజ్యోతి) పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. ఈ అఘాయిత్యంలో శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మకు కూడా భాగం అయ్యిందనే అనుమానాలు ఉన్నాయి. పైడమ్మ వల్లే తనకు రామారావు పరిచయం అయ్యాడని శివాని పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని పైడమ్మ వాపోతోంది. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం..
విశాఖపట్నం: వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
రమేష్ హత్య కేసును చేధించిన పోలీసులు.. సినిమాను మించిన ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: వన్టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ బర్రి రమేష్ మృతికేసును పోలీసులు చేధించారు. రమేష్ మృతి కేసులో అతడి భార్య శివజ్యోతి అలియాస్ శివానినే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి శివాని.. రమేష్ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు విశాఖ నగర కమిషనర్ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో సీపీ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రమేష్ను అతడి భార్య శివాని హత్య చేయించింది. మూడు రోజుల క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతిచెందాడని శివాని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రమేష్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్బాడీని పోస్టుమార్టంకు పంపించాం. రిపోర్టులో రమేష్.. ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివానినే ప్రియుడి కోసం భర్త రమేష్ను చంపించింది. మూడు రోజుల క్రితం రమేష్తో మద్యం తాగించి వీడియో తీసింది. ఆ తర్వాత రమేష్ పడుకునే వరకు ప్రియుడు రామారావు బయటే ఉన్నాడు. అనంతరం, ఇంట్లోకి వెళ్లిన రామారావు, అతడి స్నేహితుడు రమేష్ను దిండుతో నొక్కి చంపాడు. ఆ సమయంలో రమేష్ కాళ్లు కదలకుండా భార్య శివానీ అతడిని పట్టుకుంది. కాగా, రమేష్ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చారు. అయితే.. రమేష్, శివానీ ప్రేమ వ్యవహారంపై గతంలో అనేక గొడవలు జరిగాయి. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోవాలని రమేష్ కోరాడు. కాగా, తమ వ్యవహారానికి రమేష్ అడ్డుగా ఉన్నారని వారిని చంపేశారు. ఇక, శివాని.. రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చింది. శివానికి నేర స్వభావం ఉంది. ఆమె తల్లిదండ్రులతో సైతం గొడవలు ఉన్నాయి. ఈ కేసులో ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: యువతిని రూమ్కు తీసుకెళ్లి.. కూల్డ్రింక్లో మద్యం కలిపి ఫొటోలు.. ఆపై.. -
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం.. భార్యను హత్య చేసిన భర్త
అనకాపల్లి: భార్యపై అనుమానంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన మంగళవారం మండలంలోని తోటాడలో చోటు చేసుకుంది. గ్రామంలో దళితవాడకు చెందిన కొత్తలంక నూకప్పారావు స్థానికంగా సీలింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి పదేళ్ల క్రితం గొలుగొండ మండలం గుండపాలకు చెందిన దీనమ్మ(26)తో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. పిల్లలు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయమై భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల్లో వేరే కాపురం ఉంటూ వచ్చారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో అసహనానికి గురయ్యాడు. ఇంతలో ఇరువురి మధ్య గొడవలు పెరిగిపోవడంతో ఈ నెల 23న పెద్దల వద్ద పంచాయితీ పెట్టించారు. దీనిలో భాగంగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తమ పిల్లలు బడికి వెళ్లిపోయాక మరోసారి ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో భర్త కోపోద్రిక్తుడై భార్య మెడకు చున్నీ బిగించాడు. ఈ పెనుగులాటలో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అతడు నేరుగా అనకాపల్లి దిశ పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న యలమంచిలి రూరల్ సీఐ గఫూర్ నూకప్పారావును అదుపులోకి తీసుకున్నారు. వీఆర్వో సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గఫూర్ తెలిపారు. నిందితుడి ఇంటిని క్లూస్ టీమ్ పరిశీలించింది. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఉదయం ఎంతో సరదాగా స్కూల్కు వెళ్లిన పిల్లలు తమ తల్లికి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి లేని పిల్లలు ఎలా బతుకుతారో అని స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Amalapuram Malleshwari Death Case: అక్రమ సంబంధం.. భర్తకు అనుమానం.. భార్య హతం
అమలాపురం టౌన్: స్థానిక వనచర్ల వీధికి చెందిన శ్రీపతి మల్లేశ్వరి (24)ది హత్యేనని పోలీసు దర్యాప్తులో తేలింది. రెండు వారాలుగా సాగుతున్న ఈ కేసు చిక్కుముడి చివరికి వీడింది. డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి లోతుగా దర్యాప్తు చేసి హత్య కోణాన్ని వెలికి తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం డీఎస్పీ అంబికా ప్రసాద్ వివరించారు. ఆయన కథనం మేరకు.. నాగబాబు, మల్లేశ్వరిలకు గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగాయి. నాగబాబు భార్యను, మల్లేశ్వరి భర్తను వదిలేసి వీరిద్దరూ స్థానిక వనచర్ల వీధిలో సహ జీవనం సాగించారు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. మల్లేశ్వరి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఆమెను నాగబాబు తరచూ మద్యం తాగి వేధించేవాడు. ఐదేళ్ల కిందట అమలాపురంలో నాగబాబు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను నిర్వహిస్తున్నప్పుడు అందులో పనిచేసే ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందన్నది నాగబాబు అనుమానం. హత్య చేసిందిలా.. ఈ నెల 7వ తేదీ రాత్రి నుంచి మల్లేశ్వరి కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత అమలాపురం పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. తర్వాత 9వ తేదీ ఉదయం అమలాపురం బైపాస్ రోడ్డలో శ్మశానం వద్ద పంట కాలువ నీటి అంచున మల్లేశ్వరి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడాన్ని స్థానికులు, పోలీసులు గుర్తించారు. 7వ తేదీ రాత్రి వనచర్లవారి వీధిలోని వారున్న ఇంట్లోనే మల్లేశ్వరి మెడకు చీరను బిగించి నాగబాబు హత్య చేశాడు. అతనికి ఆ ఇంటి యాజమాని కుమారుడు కముజు నరసింహం సహకరించాడు. అప్పటికే చనిపోయిన మల్లేశ్వరికి ఒంట్లో బాగోలేదని.. ఆస్పత్రికి తీసుకు వెళుతున్నామని ఇరుగు పొరుగు వారికి చెప్పి నాగబాబు, నరసింహం ఇద్దరూ మోటారు సైకిల్పై ఆమె మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. పంట కాలువ వద్దకు వెళ్లి మృతదేహాన్ని పడేశారు. మృతదేహం కాలువలో కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోతుందని వారు అంచనా వేశారు. అయితే ఆ మృతదేహం కాలువ నీటి అంచునే ఆగిపోవడంతో వారి పధకం నెరవేరక ఆనక వారి కుట్ర బయటపడింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే గాని అది ఆత్మహత్యా... హత్యా అనేది ఇప్పుడే చెప్పలేమని అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో మల్లేశ్వరిది హత్యేనని తేలడంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా మార్చి ఆ దిశగా దర్యాప్తు చేశారు. నిందితుడు నాగబాబు, సహకరించిన నరసింహంలను అరెస్ట్ చేసి ఆదివారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు పట్టణ సీఐ దుర్గాశేఖరరెడ్డి తెలిపారు. -
సెక్యూరిటీ గార్డుతో వివాహేతర సంబంధం..
బనశంకరి: ప్రియుడు దూరంగా ఉండటాన్ని సహించలేక ప్రియురాలు అతడిపై చాకుతో దాడిచేసి హత్యకు ప్రయత్నించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడు జోగిశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. అసోంకు చెందిన జుంటిదాస్ (36) అనే మహిళ.. భర్తకు విడాకులు ఇచ్చి 18 ఏళ్లు కూతురితో కలిసి జిగణిలో నివాసముంటోంది. డే కేర్ సంస్థలో జుంటిదాస్ పనిచేసేది. గత కొద్దినెలల క్రితం అసోంకే చెందిన జోగిశ్ (27) పరిచయమై ప్రేమగా మారి సహజీవనం ప్రారంభించారు. జోగిశ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆమె తరచూ డబ్బుల కోసం వేధిస్తుండడంతో జోగిశ్ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ మహిళ అతనిపై చాకుతో ఇష్టానుసారం దాడిచేసి పరారైంది. వివేకనగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని మహిళను అరెస్ట్చేశారు. బాధితుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు ప్లాన్.. వైన్స్లో మందు కొని..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) తన భార్యతో కలిసి సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఈశ్వరమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకొచ్చింది. అనంతరం ఘట్కేసర్లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకొచ్చిన భార్య.. డాక్టర్ అందుబాటులో లేడని చెప్పింది. రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న భర్తకు పక్కనే ఉన్న వైన్ షాప్లో మద్యాన్ని ఈశ్వరమ్మ కొనుగోలు చేసింది. చదవండి: మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..! ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్లో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. రహస్యంగా మద్యంలో పురుగుల మందు కలిపిన భార్య.. భర్తకు తాగించింది. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కనున్న వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన భార్య ఈశ్వరమ్మ తరలిచింది. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకొచ్చింది. భార్య ఈశ్వరమ్మను, ప్రియుడు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో బిడ్డకు జన్మనిచ్చిన ప్రియురాలు
తమిళనాడు: వివాహేతర సంబంధంతో పుట్టిన బిడ్డను నీటి డ్రమ్ములో ముంచి చంపి తర్వాత తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అరియలూరు జిల్లా సెంతురై సమీపంలోని దిఖుర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి (27). ఈమె భర్త చనిపోయాడు. రాజేశ్వరి తిరుపూర్లోని ఒక బనియన్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఒకరితో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజేశ్వరి గర్భం దాల్లి నాలుగు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ స్థితిలో చిన్నారి తండ్రి ఎవరని బంధువులు తరచూ అడగడంతో రాజేశ్వరి మనస్తాపం చెందింది. ఇంట్లో ఉన్న వాటర్ డ్రమ్ములో బిడ్డను ముంచి కడతేర్చింది. తర్వాత రాజేశ్వరి ఇంటి సమీపంలోని చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కువాగం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జయంగొండం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డ్యూటీకి వెళ్లిన భర్త .. ప్రియుడిని ఇంటికి పిలిచి అడ్డంగా బుక్కైన భార్య
కర్ణాటక: వివాహేతర సంబంధం గురించి ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల మేరకు సూళగిరి సమీపంలోని కారుబల గ్రామానికి చెందిన డ్రైవర్ రామచంద్రన్ (38). అతని భార్య రూప (28). అదే ప్రాంతానికి చెందిన జావిద్ (21)కు రూపతో వివాహేతర సంబంధం ఉండేది. గత 17వ తేదీ డ్యూటీపై వెళ్లిన రామచంద్రన్ రాత్రి ఇంటికొచ్చేసరికి జావిద్ కనిపించాడు. దీంతో భార్యను, అతన్ని నిలదీశాడు. దీంతో ఆవేశానికి గురైన భార్య రూప, ప్రియుడు జావిద్లు కలిసి రామచంద్రన్పై దాడి చేశారు. తీవ్ర గాయాలేర్పడిన రామచంద్రన్ను స్థానికులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొమని జావిద్ను అరెస్ట్ చేశారు.