-
ఫిలిప్పీన్స్లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మనీలా: ఫిలిప్పీన్స్లోని మిండనావో దీవిని శనివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూమిలో 32 కిలోమీటర్ల లోతులో రాత్రి 10.37 గంటల సమయంలో ఇది సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్, ఇండోనేసియాలోని కొన్ని ప్రాంతాలు, మలేసియాలో సునామీ అలలు మీటరు ఎత్తున ఎగసిపడే అవకాశముందని అంచనా వేసినట్లు పసిఫిక్ సునామీ వారి్నంగ్ సెంటర్ తెలిపింది. -
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
Philippines Massive Earthquake Tsunami Warning ఫిలిప్సీన్స్లో మరోసారి భారీగా భూమి కంపించింది. మిండనావోలో శనివారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. దీంతో జనం భయకంపితులయ్యారు. 50కి పైగా నివాసాలు, ఇతర భవనాలను ధ్వంసమైనాయి. దీంతో అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నవంబరు 17న సంభవించిన భూకంపంలో సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులో కొంత ప్రాణ నష్టం జరిగింది. కాగా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ప్రాంతాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప , అగ్నిపర్వత క్రియాశీల జోన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. PHIVOLCS has issued a #Tsunami Warning for the #Philippines after the powerful #earthquake (#lindol) in #Mindanao. People in the Philippines and nearby countries need to check local authorities for local tsunami information and the aftershocks of the earthquake. #sismo #quake https://t.co/YEsbKT3sVs pic.twitter.com/TlCo8Y0lsR — 🌊 Earthquake Updates Worldwide - #StopWar 🎗️ (@InfoEarthquakes) December 2, 2023 -
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం
ఫిలిప్పీన్స్ మరోసారి భారీ భూకంపంతో కంపించి పోయింది. శుక్రవారం దక్షిణ ఫిలిప్పిన్స్ మిందానో ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని జర్మనీ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని, భూకంప నష్టంపై తక్షణ సమాచారం ఏదీ లేదని ప్రకటించింది. అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ సూచించింది. తాను ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదే బలమైన భూకంపం అని షియా లేరాన్ తెలిపారు. దీంతో జనం భయాందోళనలతో పరుగులు తీశారని చెప్పారు. భూకంప కేంద్రం నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో జరిగే సమావేశానికి ఆమె హాజరుకానున్నారు. అలాగే బలమైన భూకంపంతో గోడలు దెబ్బతిన్నాయని, కంప్యూటర్లు కింద పడిపోయాయని దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లెనీ అరనెగో తెలిపారు. జనరల్ శాంటాస్ సిటీ విమానాశ్రయంలోని ప్రయాణికులను టార్మాక్కు తరలించారని భూకంపం సంభవించినప్పుడు విమాన ప్రయాణికుడు మైఖేల్ రికాఫోర్ట్ తెలిపారు. జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కేంద్రం "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్లో భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. దీంతోపాటు గత వారం పది రోజుల్లో పలు దేశాల్లో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. 🧵 Video and images emerging after a M6.7 earthquake struck Mindanao in the #Philippines. Terrifying 😳 pic.twitter.com/KkKVLU53vt — Volcaholic 🌋 (@volcaholic1) November 17, 2023 🧵 Video and images emerging after a M6.7 earthquake struck Mindanao in the #Philippines. Terrifying 😳 pic.twitter.com/KkKVLU53vt — Volcaholic 🌋 (@volcaholic1) November 17, 2023 -
14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి
రేగ్యావిక్: ఒక భూ కంపం వస్తేనే ప్రజలు వణికిపోతారు.పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి.అలాంటిది ఐస్లాండ్ దేశంలో కేవలం 14 గంటల్లో ఎనిమిది వందల సార్లు భూమి కంపించిందంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వరుస భూ కంపాలు బెంబేలిత్తిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఐస్లాండ్ మెట్ ఆఫీస్ తెలిపిన దాని ప్రకారం రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో గ్రిండావిక్ గ్రామంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.రాజధాని రేగ్యావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కిటికీల తలుపులు, వస్తువులు కొద్దిసేపు ఊగాయి.వరుస భూ ప్రకంపనలు సంభవించినపుడు అగ్నిపర్వతం బద్దలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఐలాండ్ దేశంలో 33 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.యూరప్లోనే ఇది అత్యధికం. ఇదీ చదవండి...అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత -
ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు
శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్ స్కేల్పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాందా సముద్రంలో టానింబర్ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది. ఏడాది వేల భూకంపాలు ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. -
నేపాల్లో మరోసారి భూకంపం
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్ ప్రజలను మరోసారి భూకంపం భయపెట్టింది. శుక్రవారం భూకంపం సంభవించిన పశ్చిమ నేపాల్లోని జజర్కోట్ పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4.31 గంటల సమయంలో భూమి కంపించింది. ఆ తర్వాత 4.40 సమయంలో 4.5 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు నమోదయ్యాయి. తాజా భూకంప కేంద్రం జజర్కోట్ జిల్లాలోని రమిదండాలో ఉందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాజధాని కఠ్మాండులోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకు న్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. తాజా భూకంపంతో వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో గత శుక్రవారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 157కు చేరుకుంది. -
ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు
ఢిల్లీ: దేశ రాజధానితో సహా ఉత్తర భారతంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం సాయంత్రం 4:18 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. నేపాల్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతంలో భూమి వణికింది. Earthquake tremors felt in Delhi. Details awaited. pic.twitter.com/nRMLKZ9DdK — ANI (@ANI) October 15, 2023 గత నాలుగు రోజుల్లో వరుసగా మూడో సారి భూమి కంపించింది. ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో సామాగ్రి కిందపడిపోయిందని స్థానికులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు తెలిపారు. Earthquake measuring 5.6 on the Richter scale struck Nepal at 1616 hours today, says National Center for Seismology (NCS). — ANI (@ANI) November 6, 2023 ఇదీ చదవండి: మహిళా అధికారి హత్య కేసులో మాజీ డ్రైవర్ అరెస్టు -
Nepal earthquake: నేపాల్ను కుదిపేసిన భూకంపం
కఠ్మాండు: హిమాలయ దేశం నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన తీవ్ర భూకంపంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మందికి పైగా గాయపడ్డారు. వందలాదిగా నివాసాలు ధ్వంసమయ్యాయి. దేశ రాజధాని కఠ్మాండుకు పశి్చమాన 500 కిలోమీటర్ల దూరంలోని జజర్కోట్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు తెలిపారు. అనంతర ప్రకంపనలు 159 వరకు నమోదైనట్లు చెప్పారు. జాజర్కోట్తోపాటు రుకుమ్ జిల్లాపైనా భూకంప ప్రభావం చూపిందని పేర్కొన్నారు. తీవ్రతకు కఠ్మాండుతోపాటు భారత్ రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. ఘటనా ప్రాంతంలో నేపాల్ సైన్యం, పోలీసు బృందాలు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. నేలమట్టమైన ఇళ్ల శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు అవరోధం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య జాజర్కోట్, రుకుమ్ జిల్లాల్లో కలిపి 157కి చేరుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అదేవిధంగా, క్షతగాత్రుల సంఖ్య 160 దాటిందని పేర్కొంది. మృతుల్లో జజర్కోట్ జిల్లా నల్గధ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సరితా సింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్లు దెబ్బతినడంతోపాటు భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో భయభ్రాంతులకు గురైన జనం రాత్రంతా వీధుల్లోనే జాగారం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం జనం చిమ్మచీకట్లోనే తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’శనివారం ఉదయం వైద్య బృందంతో భూకంప ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. సుర్ఖెట్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. నేపాల్ భూకంపంలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించడంపై భారత ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత మేర నేపాల్ ప్రజలకు సాయం అందిస్తామని ప్రకటించారు. టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉన్న నేపాల్కు భూకంపాల బెడద ఎక్కువగా ఉంటోంది. 2015లో నేపాల్లో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో 9వేల మంది చనిపోగా మరో 22 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. 8 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో నేపాల్లో మూడుసార్లు భూకంపం సంభవించింది. -
నేపాల్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే..
హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్లో మరోసారి భూమి కంపించింది. ఈ విపత్తులో 70 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా కనిపించింది. నేపాల్లో గతంలోనూ అనేక భూకంపాలు సంభవించాయి. 2015లో నేపాల్లో సంభవించిన భూకంపంలో ఎనిమిది వేల మంది మృత్యువాతపడ్డారు. అయితే నేపాల్లో తరచూ భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి? శాస్త్రవేత్తలు దీనిపై ఏమంటున్నారు? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్ భౌగోళిక స్వరూపమే తరచూ భూకంపాలు సంభవించడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్లో 17 శాతం ప్రాంతం మాత్రమే మైదానం. మిగిలిన ప్రాంతంలో పర్వతాలు, అడవులు ఉన్నాయి. నేపాల్ ఉత్తర చివరలో ఎత్తయిన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. నేపాల్ తరచూ భూకంపాలకు ఎందుకు గురవుతుందో తెలసుకోవాలంటే ముందుగా భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. భూమి అనేది భారీ టెక్టోనిక్ ప్లేట్లతో రూపొందింది. భూమిలోపలి ఈ టెక్టోనిక్ ప్లేట్లు వివిధ పరిస్థితుల కారణంగా కదులుతూ ఉంటాయి. అలాగే ఒకదానికొకటి ఢీకొంటాయి. నేపాల్.. రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల అంచున ఉంది. నేపాల్ ఇండో-ఆస్ట్రేలియన్, యురేషియన్ ప్లేట్ల మధ్య ఉంది. ఈ రెండు ప్లేట్లు ఢీకొన్నప్పుడు నేపాల్లో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ రెండు ప్లేట్లు ప్రతి సంవత్సరం ఐదు సెంటీమీటర్ల చొప్పున ఒకదానిపైకి మరొకటి ఎక్కేలా కదులుతున్నాయి. ఫలితంగా నేపాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ఐదు సెంటీమీటర్ల వేగం చిన్నదిగా అనిపించినప్పటికీ, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు పలకల తాకిడి కారణంగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయని చెబుతారు. నేపాల్కు ఉన్న మరో పెద్ద సమస్య అక్కడి బలహీనమైన భవనాలు. ఇవి బలమైన భూప్రకంపనలను తట్టుకోలేవు. భూకంపం వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
Nepal Earthquake: నేపాల్లో భూకంప విధ్వంసం.. శిథిలమైన భవనాలు (ఫొటోలు)
-
ఉత్తర భారతంతో పాటు నేపాల్ లో అర్ధరాత్రి భూకంపం
-
ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ భారీగా భూప్రకంపనలు
ఢిల్లీ: నేపాల్లో 6.4 తీవ్రతతో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం.. అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఉత్తర భారతం వణికిపోయింది. నేపాల్లో భూకంప నమోదు ప్రాంతానికి 500 కి.మీపైగా దూరంలో ఉన్న ఉత్తర భారత దేశంలోనూ ఈ ప్రభావం కనిపించింది. ఢిల్లీతో పాటు యూపీ, బీహార్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. సుమారు 20 సెకన్ల పాటు భారీగానే భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్తో పాటు యూపీ ప్రయాగ్రాజ్, ఫరీదాబాద్, గురుగ్రామ్, భాగ్పట్, వారాణాసి, సుల్తాన్పూర్, కుషీనగర్, గోరఖ్పూర్, మీర్జాపూర్లోనూ ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. North India including bihar patna , delhi ncr , Gurgaon , haryana and Nepal hit by a scary earthquake.#earthquake #Delhi #Nepal #DelhiNCR #Noida #Tremors #भूकंप #Bihar #Patna #lucknow pic.twitter.com/TK72oCKfOV — Dr. Shivam dubey (@ShivamdubeYspn) November 4, 2023 #WATCH | Bihar: People come out of their homes as tremors felt in Patna pic.twitter.com/PoINrMXIA1 — ANI (@ANI) November 3, 2023 -
భారీ భూకంపం: నేపాల్ లో 70 మంది దుర్మరణం, పలువురికి గాయాలు
-
నేపాల్ భారీ భూకంపం: 140కి చేరిన మృతుల సంఖ్య
ఖాట్మాండు: నేపాల్ పెను భూకంపం (Nepal earthquake).. పలువురిని పొట్టనబెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటిదాకా 140 మృతదేహాల్ని వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. గాఢనిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో.. ప్రాణాల కోసం పరుగులు తీసేందుకు అవకాశం కూడా లేకపోయింది. రుకమ్, జజర్కోట్లో ఇళ్లు వందల సంఖ్యలో నేలమట్టం అయ్యాయి. శిథిలాలు తొలగిస్తోన్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. గాయపడిన వాళ్ల సంఖ్య వందల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదీ చదవండి: భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం? నేపాల్లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్కోట్లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. రాత్రి దాటాక సంభవించిన భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. జనం రాత్రంతా రోడ్లపైనే గడిపారు. పైగా అర్ధరాత్రి కావడంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు. ఉదయం నుంచి సహాయక చర్యలు తీవ్రతరం చేశారు. నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగగా.. భూకంప బాధిత ప్రాంతాలల్లో ప్రధాని పుష్ప కమల్ పర్యటించనున్నట్లు సమాచారం. క్షతగ్రాతుల రోదనలతో ఆస్పత్రుల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. More then 128 people died and above 500 were injured after a strong 6.4 magnitude earthquake in Nepal... #Nepal #NepalEarthquake #earthquakenepal #earthquake #BREAKING_NEWS #latestnews #NepalNews #Jajarkot #Kathmandu pic.twitter.com/6c4MILmvaY — Vikas Bailwal (@VikasBailwal4) November 4, 2023 Tragedy strikes again in #Nepal . A powerful 6.4-magnitude earthquake claims 129 lives, above 500 reported injured shaking northwestern districts. Prayers for #Nepal 🙏🙏 #NepalEarthquake #earthquake pic.twitter.com/6rjl3A3vm3 — Stranger (@amarDgreat) November 4, 2023 नेपाल के जजरकोट में कल रात आए भूकंप से के कारण काफी नुकसान हुआ। तबाही की तस्वीरें...#earthquakes #NepalEarthquake pic.twitter.com/lKWK5nxg7x — Kuldeep Raghav 🇮🇳 (@ImKuldeepRaghav) November 4, 2023 రుకమ్ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్కోట్లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ.. మృతదేహాలు అక్కడ మరిన్ని బయటపడుతున్నాయి. నిన్న రాత్రి భూకంపం సంభవించడంతో సహాయ చర్యలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ భూకంపాలు సహజమే! భూకంపాల జోన్లో ఉన్న హిమాలయా దేశం నేపాల్లో ప్రకంపనలు సర్వసాధారణమే. తక్కువ తీవ్రతతో ప్రకంపనలు సంభవించినప్పటికీ.. ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంటాయి అక్కడ. ఇక్కడ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్లోకి నెట్టి హిమాలయాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల భూకంపాలు సంభవించడం సర్వ సాధారణంగా మారింది. గత నెలవ్యవధిలోనే మూడు భూకంపాలు(పెద్దగా నష్టం వాటిల్లలేదు) సంభవించాయక్కడ. అక్టోబర్ 3వ తేదీన రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంపైనా ప్రభావం చూపించింది. ఇక కిందటి ఏడాది నవంబర్లో దోతీ జిల్లాలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆరుగురిని బలిగొంది. అయితే.. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం మాత్రం నేపాల్ చరిత్రలోనే పెను విషాదాన్నే మిగిల్చింది. నాటి భూకంపంలో 12 వేల మందికి పైగా మరణించగా.. పదిలక్షల భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇదీ చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే.. భారత ప్రధాని దిగ్భ్రాంతి నేపాల్ భారీ భూకంపం, భారీగా ప్రాణ నష్టం సంభవించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది అని ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నేపాల్లో భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి బాధగా ఉంది. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు యావత్ భారతదేశం సంఘీభావం ప్రకటిస్తోంది. సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారాయన. అలాగే మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించిన ప్రధాని మోదీ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. Deeply saddened by loss of lives and damage due to the earthquake in Nepal. India stands in solidarity with the people of Nepal and is ready to extend all possible assistance. Our thoughts are with the bereaved families and we wish the injured a quick recovery. @cmprachanda — Narendra Modi (@narendramodi) November 4, 2023 ఇవీ కూడా చదవండి: నేపాల్కు శాస్త్రవేత్తల హెచ్చరిక! నేపాల్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే.. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏమిటి? -
ఇండోనేసియాలో భూకంపం
జకార్తా: ఇండోనేసియా ఆగ్నేయప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఈస్ట్ నుసా తెంగ్గారా ప్రావిన్స్ రాజధాని కుపంగ్కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో కుపంగ్ నగరంలోని ఇళ్లు, ఇతర భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. -
Earthquake in Nepal: నేపాల్లో భూకంపం
కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండును ఆదివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ధడింగ్ జిల్లా కేంద్రంగా ఉదయం 7.39 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూమి కంపించిందని యంత్రాంగం తెలిపింది. మరో 29 నిమిషాల అనంతరం ధడింగ్ జిల్లాలోనే భూ ప్రకంపనలు మరో నాలుగుసార్లు సంభవించినట్లు పేర్కొంది. దీంతో, రాజధాని ప్రాంతంలోని 20 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయని, మరో 70 వరకు ఇళ్ల గోడలు బీటలువారాయని పేర్కొంది. ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదని వెల్లడించింది. భూకంపం ప్రభావం బాగ్మతి, గండకి ప్రావిన్స్ల వరకు కనిపించింది. -
భూకంపాలను తట్టుకొని నిలబడే ఇల్లు, కేవలం 26 గంటల్లోనే..
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే జీవితంలో ఈ రెండు పనులు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది దాని అర్థం. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది చాలామందికి కలగా ఉంటుంది. అయితే ఇదంత చిన్న విషయం కాదు. ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. పునాది మొదలు పైకప్పు దాకా కొన్ని నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా భారత నిర్మాణ రంగంలో త్రీ డైమెన్షనల్ ప్రింటింగ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేదు.జస్ట్.. ఇంటి స్థలం ఒక్కటి చాలు. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు భూకంపాలను తట్టుకొని నిలబడి ఇంటి నిర్మాణాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ప్రముఖ సిమెంట్ కంపెనీ ప్రోగ్రెసో తన మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ ఇంటిని నిర్మించింది. ప్రోటోటైప్ డిజైన్తో భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ ఇంటిని డిజైన్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం 26 గంటల్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు భూకంపాలను తట్టుకొని నిలబడగలదు. 49 స్క్వైర్ఫీట్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఇందులో COBOD ప్రింటర్ను ఉపయోగించారు. రీసెంట్గా బెంగళూరులో తొలి 3డి ప్రింటింగ్తో ఏర్పాటైన పోస్టాఫీస్ నిర్మాణంలోనూ ఇదే తరహా ప్రింటర్ను ఉపయోగించారు. ఇంటి పైకప్పులను రాంచో రకం తాటాకులతో నిర్మించారు. ఈ తరహా నిర్మాణం సాధారణంగా కొన్నేళ్లుగా లాటిన్ అమెరికాలో ఉపయోగిస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో పాటు ఇంటిని కాస్త వేడిగా ఉంచుతుంది. 3డీ ప్రింటింగ్ నిర్మాణం ముఖ్యంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలాకు బాగా సరిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో 3డీ నిర్మాణం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేకుండా కేవలం ఇంటి స్థలం ఉంటే చాలు అందమైన ఇంటిని కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. రోబోల మాదిరిగా రోజుల్లోనే ఇంటిని కట్టిపడేస్తోందీ ఈ 3డీ టెక్నాలజీ. జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇల్లు రెడీ అవుతుంది మరి. 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి? సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు.అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. -
అఫ్గానిస్తాన్లో మళ్లీ భూకంపం
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లో మరోసారి భూకంపం సంభవించింది. ఈనెల 7వ తేదీన శక్తివంతమైన భూకంపం చోటుచేసుకున్న హెరాట్ ప్రావిన్స్లోనే ఆదివారం మళ్లీ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం హెరాట్ ప్రావిన్స్ రాజధాని హెరాట్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో భూమికి 8 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. తాజా భూకంపం తాకిడికి నలుగురు చనిపోగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు స్వచ్చంద సంస్థలు తెలిపాయి. బలోచ్ ప్రాంతంలోని రబట్ సాంగి జిల్లాలోని కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 7న భూకంపం సంభవించిన హెరాట్ ప్రావిన్స్లో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. మొత్తం 2 వేల మందికి పైగా చనిపోగా మృతుల్లో 90 శాతం వరకు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
వారంలోనే అఫ్గానిస్తాన్లో మళ్లీ భూకంపం
చాహక్: అఫ్గానిస్తాన్లో మళ్లీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదయ్యింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు భూమి కంపించింది. పశ్చిమ అఫ్గానిస్తాన్లో హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది ఇటీవలె అఫ్గానిస్తాన్ పశ్చిమ ప్రాంతాన్ని పెనుభూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్లో అఫ్గానిస్తాన్లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. -
అఫ్గాన్లో భూకంపం.. బాధితులను పట్టించుకోని తాలిబన్ సర్కార్
అఫ్గాన్లో భూకంపం.. బాధితులను పట్టించుకోని తాలిబన్ సర్కార్ -
రషీద్ ఖాన్ మంచి మనసు.. ఆఫ్గాన్ భూకంప బాధితులకు విరాళం
ఆఫ్గానిస్తాన్లో సంభవించిన భుకంపం పెను విషాదం మిగిలిచ్చింది. ఈ ఘటనలో దాదాపు 2400 పైగా మృతిచెందారు. భూకంపం ధాటికి ఏకంగా 12కు పైగా గ్రామాలు నేలమట్టమయ్యాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో ఆఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల ఫీజు రూపంలో తనకు వచ్చే మొత్తం ఆదాయాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు రషీద్ ప్రకటించాడు. "ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రావిన్స్లోని హెరాత్, ఫరా, బాద్గీస్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చిందని తెలిసి చాలా బాధపడ్డాను. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను. అదే విధంగా భూకంప బాధితులను అదుకునేందుకు ఫండ్స్ సేకరించేందుకు త్వరలో ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడతానని ట్విటర్లో రషీద్ పేర్కొన్నాడు. చదవండి: అజారుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! అందుకే అనర్హత వేటు... ఇక మర్చిపోవాల్సిందే! I learned with great sadness about the tragic consequences of the earthquake that struck the western provinces (Herat, Farah, and Badghis) of Afghanistan. I am donating all of my #CWC23 match fees to help the affected people. Soon, we will be launching a fundraising campaign to… pic.twitter.com/dHAO1IGQlq — Rashid Khan (@rashidkhan_19) October 8, 2023 -
అఫ్గాన్ భూకంపం..2,400కు చేరిన మరణాలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లోని హెరాట్ ప్రావిన్స్లో శనివారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 2,445కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, క్షతగాత్రుల సంఖ్య గతంలో ప్రకటించిన 9,240 కాదన్నారు. 2వేల మంది మాత్రమే గాయపడ్డారన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి వెలుపల బాధితుల కోసం బెడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తెలిపింది. సోమవారం మరోసారి భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై రోడ్లపైకి చేరుకున్నారు. అఫ్గాన్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి అబ్దుల్ బరాదర్ సోమవారం హెరాట్ ప్రావిన్స్లో పర్యటించారు. ఇజ్రాయెల్ పరిణామాలపైనే ప్రపంచదేశాల దృష్టి కేంద్రీకృతం కావడంతో అఫ్గాన్లో భూకంపబాధితులకు సాయం నెమ్మదిగా అందుతోంది. దశాబ్దాలపాటు అంతర్యుద్ధంతో చితికిపోయిన అఫ్గానిస్తాన్ ప్రజలకు తాజాగా సంభవించిన భూకంపం మరింత కుంగదీసింది. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినప్పటికీ చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని పొరుగుదేశాలు మాత్రమే అఫ్గాన్లకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. అఫ్గాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీకి చెందిన 20 బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. నీడ కోల్పోయిన వారికోసం తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేసింది. -
2 వేలు దాటిన అఫ్గాన్ మరణాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ పశి్చమ ప్రాంతాన్ని శనివారం కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్లో అఫ్గానిస్తాన్లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. అఫ్గాన్లో నాలుగో అతి పెద్ద నగరమైన హెరాత్ కేంద్రంగా శనివారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 2,100కి చేరువలో ఉందని ఆదివారం తాలిబన్ సమాచార, సాంస్కృతిక శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రయాన్ చెప్పారు. మరో 9,240 మందికి తీవ్ర గాయాలయ్యాయని 1,320 ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆయన తెలిపారు. డజనుకి పైగా బృందాలు అత్యవసర సహాయ చర్యల్లో మునిగిపోయాయి. కొన్ని గ్రామాల్లోకి సహాయ సిబ్బంది అడుగు పెట్టడానికి కూడా వీల్లేకుండా శిథిలాలతో నిండిపోయాయి. ఎటు చూసినా శిథిలాల్లో చిక్కుకున్న వారి రోదనలే వినిపిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడడానికి సహాయ బృందాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ చేతులనే ఆయుధాలుగా చేసుకొని శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటకి వస్తున్నాయి. మరికొందరు స్థానికులు శిథిలాల మీద పాకుతూ వెళుతూ వాటిని తొలగిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని కాపాడుతున్నారు. హెరాత్లో నేలమట్టమైన ఓ ఇంటి శిథిలాల్లో నుంచి ఆదివారం ఒక శిశువును అక్కడి వారు కాపాడుతున్న దృశ్యాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ప్రసారం చేసింది. అక్కడే శిథిలాల నుంచి ఓ మహిళ చేయి బయటికి కనిపిస్తుండటం కూడా రికార్డయ్యింది. ఆ మహిళ చిన్నారి తల్లేనని స్థానికులు తెలిపారు. ఆమె బతికున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధితులకు అందుతున్న సాయం.. అఫ్గాన్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి నుంచి భూకంప బాధితుల్ని కాపాడేందుకు యూనిసెఫ్ దుస్తులు, దుప్పట్లు, టార్పాలిన్లు తదితరాలను పంపించింది. ఐరాస వలసల విభాగం నాలుగు అంబులెన్సులు, వైద్యులు, ఇతర సిబ్బందిని అక్కడి ఆస్పత్రికి పంపించింది. మూడు మొబైల్ వైద్య బృందాలను జెందాజన్ జిల్లాకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ కూడా 80 మంది రోగులకు సరిపోయే అయిదు మెడికల్ టెంట్లను హెరాత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం వంటి సంస్థలు కూడా అత్యవసరాలను అఫ్గానిస్తాన్కు అందజేస్తామని ప్రకటించాయి. -
అఫ్గాన్ భూకంప విలయం.. 2000 మంది మృతి
కాబూల్: ఆఫ్గానిస్థాన్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు దశాబ్దాల్లో ఇంతస్థాయిలో భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు తెలిపారు. వేలాది ఇళ్లు నేలకూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. Today’s earthquake in Herat province of Afghanistan has completely destroyed four villages and many people have lost their lives. May Allah have mercy on them. pic.twitter.com/zWArtneBZs — اماراتي ځـدراڼ (@AmaratyD34809) October 8, 2023 అఫ్గాన్–ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని హీరట్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. భూకంప ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 400కు పైగా ఇళ్లు నేలకూలాయి. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఏడాది తూర్పు ఆఫ్గానిస్థాన్లో భయంకరమైన భూకంపం సంభవించింది. కొండప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ భూకంపంలో దాదాపు 1000 నుంచి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్లో మరింత దారుణం.. యుద్ధంలోకి ‘హెజ్బొల్లా’ గ్రూప్ Follow the Sakshi Telugu News channel on WhatsApp: -
అఫ్గాన్లో భూకంపం..120 మంది మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లో సంభవించిన భూకంపంలో 120 మంది చనిపోగా, 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం తాకిడికి హీరట్ ప్రావిన్స్ జెందా జాన్ జిల్లాలోని నాలుగు గ్రామాల్లోని డజన్లకొద్దీ ఇళ్లు ధ్వంసమయినట్లు అఫ్గాన్ జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. అఫ్గాన్–ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని హీరట్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. భూకంప నష్టం, మృతులకు సంబంధించి తాలిబన్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. Today’s earthquake in Herat province of Afghanistan has completely destroyed four villages and many people have lost their lives. May Allah have mercy on them. pic.twitter.com/zWArtneBZs — اماراتي ځـدراڼ (@AmaratyD34809) October 8, 2023 #Blak_Day 11 members of a family living in this house have lost their lives and are buried under the rubble of their house. Their house has completely collapsed, their bodies are still under the rubble. Today’s earthquake in Herat & Badghis provinces of Afghanistan has caused hug pic.twitter.com/RE5p6ytL2G — ابو محمد عمر (@MdafYn) October 8, 2023