-
'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం'.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు మన ఐకాన్ స్టార్. దుబాయ్లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే విడుదలైంది. ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నా.' అని పోస్ట్ చేశారు. It’s a very spl day today 🖤 . My 1st movie #Gangotri was released today in 2003 & today I am launching my Wax statue at #madametussauds dubai . It’s been an unforgettable journey of 21 years . I am grateful to each and every one of you in this journey & special thanks to my Fans… pic.twitter.com/kWRQemlwgi — Allu Arjun (@alluarjun) March 28, 2024 -
దుబాయ్లో అల్లు అర్జున్.. ఆ గౌరవం దక్కించుకున్న తొలి హీరోగా గుర్తింపు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్లో అడుగుపెట్టారు. తన కుటుంబంతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. దుబాయ్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన బన్నీ నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ కుటుంబంతో పాటు దుబాయ్ చేరుకున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకి ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇవి లండన్లోని మ్యూజియంలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తున్నడం విశేషం. దీంతో సౌత్ ఇండియా తొలి హీరోగా బన్నీ రికార్డ్ సెట్ చేశారు. అంతే కాకుండా దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరో కూడా బన్నీనే కావడం మరో విశేషం. సినిమా, క్రీడలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్ మ్యూజియంలో పొందుపరిచారు. సింగపూర్, లండన్, దుబాయ్.. ఇలా వివిధ చోట్ల ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయ్లోని మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్,షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో మన టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ చేరనున్నారు. -
IPL 2024- BCCI: అభిమానులకు బ్యాడ్న్యూస్!
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2024 ద్వితీయ అర్ధభాగ మ్యాచ్ల వేదికను మార్చనున్నట్లు సమాచారం. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్ను పూర్తిగా భారత్లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ గతంలోనే నిర్ధారించారు. ఫలితంగా... లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట మ్యాచ్లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు తెర పడినట్లయింది. తొలుత 15 రోజుల మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేసి... ఆ తర్వాత మిగతా మ్యాచ్ల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాదు.. అన్ని మ్యాచ్లు భారత్లోనే నిర్వహించడం ఖాయమని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఫిబ్రవరి 22న తొలి 17 రోజుల మ్యాచ్ల(21)కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 22 నుంచి లీగ్ ఆరంభం కానున్నట్లు తెలిపారు నిర్వాహకులు. అయితే, సెకండాఫ్ నిర్వహణ విషయంలో మాత్రం బీసీసీఐ తాజాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మ్యాచ్లు దుబాయ్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ‘‘భారత ఎన్నికల సంఘం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ను ప్రకటించనుంది. ఆ తర్వాతే ఐపీఎల్ సెకండాఫ్ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. వేదికగా దుబాయ్ను ఎంచుకోవాలా లేదంటే ఇక్కడే అన్ని మ్యాచ్లను నిర్వహించాలా అన్న విషయం తేలుతుంది. అయితే, బీసీసీఐలోని కొంతమంది పెద్దలు మాత్రం ఇప్పటికే దుబాయ్ వైపు మొగ్గుచూపుతున్నారు’’ అని తెలిపింది. ఒకవేళ ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించడం ఖాయమైతే.. దేశంలోనే మ్యాచ్లు(ఖర్చుల దృష్ట్యా) వీక్షించాలనుకున్న అభిమానులకు షాక్ తగిలినట్లే మరి!! చదవండి: ICC- T20WC: ఎడాపెడా దంచేసినా పర్లేదు కానీ.. ఇకపై అలా కుదరదు! -
T20WC: ఎడాపెడా దంచేసినా పర్లేదు కానీ.. ఇకపై అలా కుదరదు!
ICC’s new stop clock rule- దుబాయ్: పురుషుల జట్లు బ్యాటింగ్లో ఎడాపెడా దంచేసినా, చుక్కలు చూపించినా పర్లేదు. కానీ బౌలింగ్ సమయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఓవర్కు ఓవర్కు మధ్య నిక్కచ్చిగా 60 సెకన్ల సమయాన్ని మాత్రమే తీసుకోవాలి. నింపాదిగా బౌలింగ్ చేస్తానంటే ఇకపై అస్సలు కుదరదు. దుబాయ్లో సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘స్టాప్ క్లాక్’ నిబంధనను ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 ప్రపంచకప్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు టి20 ప్రపంచకప్లో నాకౌట్ దశ మ్యాచ్లన్నింటికీ రిజర్వ్ డేలను ఖరారు చేసింది. ‘స్టాప్ క్లాక్’ నిబంధన? రెండు ఓవర్ల మధ్య విరామ సమయాన్ని తగ్గించడమే ‘స్టాప్ క్లాక్’. ఒక బౌలర్ ఓవర్ ముగించిన వెంటనే మరో బౌలర్ 60 సెకన్లలోపే బౌలింగ్ చేయాలి. బౌలింగ్ జట్టు 60 సెకన్లలోపే ఓవర్ వేయకపోతే అంపైర్లు మూడుసార్లు హెచ్చరికలతో సరిపెడతారు. ఆ తర్వాత పునరావృతమైతే పెనాల్టీ విధిస్తారు. చదవండి: MI: బుమ్రా, హార్దిక్ను వదిలేద్దామంటే.. రోహిత్ శర్మనే అడ్డుకున్నాడు! -
టాలీవుడ్ గామా అవార్డ్స్.. హనుమాన్ హీరోకు అవార్డ్..!
తెలుగు సినిమా అవార్డ్స్ వేడుక ఘనంగా నిర్వహించారు. గామా పేరిట అందిస్తున్న అవార్డుల నాలుగో ఎడిషన్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. దుబాయ్ వేదికగా జరిగిన వేడుకల్లో టాలీవుడ్ సినీ తారలు హాజరై సందడి చేశారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులను అందింటారు. ఈ వేడుకల్లో గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులుతో పాటు మరికొందరు ముఖ్య అతిథులు విన్నర్స్కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నేహాశెట్టి, ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయాతి, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్ తమ డ్యాన్స్లతో ప్రేక్షకులను అలరించారు. 2021 గామా అవార్డ్ విజేతలు ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు) ఉత్తమ దర్శకుడు- సుకుమార్ (పుష్ప) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - దక్షా నగర్కర్ (జాంబి రెడ్డి) ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప) అత్యంత ప్రజాదరణ పొందిన పాట- నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్) ఉత్తమ గాయకుడు- ధనుంజయ్ (నా మది నీదే) ఉత్తమ గాయని - ఎంఎల్ శృతి (అడిగా అడిగా) గామా బెస్ట్ పాపులర్ సాంగ్ - మౌనిక యాదవ్ (సామి నా సామి - పుష్ప) మూవీ ఆఫ్ ది ఇయర్ - పుష్ప (మైత్రి మూవీ మేకర్స్ - యలమంచిలి రవి, నవీన్ యెర్నేని) 2022 గామా అవార్డ్ విజేతలు ఉత్తమ నటుడు - నిఖిల్ (కార్తికేయ 2) ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతా రామం) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్- డింపుల్ హయతి (ఖిలాడి) మూవీ ఆఫ్ ది ఇయర్ - సీతా రామం (వైజయంతి మూవీస్) ఉత్తమ దర్శకుడు - హను రాఘవపూడి (సీతా రామం) గామా జ్యూరీ ఉత్తమ నటుడు - విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్ఎస్ తమన్ (భీమ్లా నాయక్) ఉత్తమ ఆల్బమ్ - సీతారామం (విశాల్ చంద్రశేఖర్) ఉత్తమ గాయకుడు- అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల... శ్యామ్ సింగరాయ్) ఉత్తమ గాయని - హారిక నారాయణ (లాహే లాహే... ఆచార్య) 2023 గామా అవార్డుల విజేతలు ఉత్తమ నటుడు - ఆనంద్ దేవరకొండ (బేబీ) ఉత్తమ నటి - సంయుక్త (విరూపాక్ష) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ) బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ - తేజ సజ్జా (హను-మాన్) మూవీ ఆఫ్ ది ఇయర్- బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ - టీజీ విశ్వప్రసాద్) ఉత్తమ దర్శకుడు - బాబీ (వాల్తేరు వీరయ్య) గామా జ్యూరీ ఉత్తమ నటుడు - సందీప్ కిషన్ (మైఖేల్) ఉత్తమ విలక్షణ నటుడు - మురళీ శర్మ పలు కేటగిరీల్లో అవార్డులు గామా లెజెండ్రీ సంగీత దర్శకుడు - డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ) గామా స్పెషల్ జ్యూరీ అవార్డు - ఎంఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ) గామా గౌరవ్ సత్కర్ - చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్) ఉత్తమ సంగీత దర్శకుడు - హేషమ్ అబ్దుల్ వాహాబ్ (ఖుషి) ఉత్తమ గేయ రచయిత - కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి... దసరా సినిమా) అత్యంత ప్రజాదరణ పొందిన పాట - పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్) గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ - ఆర్ఆర్ఆర్ (డీవీవీ దానయ్య నిర్మాణం) గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ - నక్కిలీసు గొలుసు (రఘు కుంచె) ఉత్తమ గాయకుడు- రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం - దసరా) ఉత్తమ గాయని - చిన్మయి (ఆరాధ్య - ఖుషి) గామా గద్దర్ మెమోరియల్ అవార్డు - జానపద గాయకుడు ‘నల్లగొండ గద్దర్’ నరసన్న -
Sania Mirza : దుబాయ్ వెకేషన్లో ఆహ్లాదంగా సానియా మీర్జా (ఫొటోలు)
-
దుబాయ్లో రెండు వారాలు ఇలా: సానియా మీర్జా ఫొటోలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కుటుంబంతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు. ప్రతికూల భావనలు దరిచేరకుండా తన చుట్టూ పూర్తి సానుకూల వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు. చిన్నారి కుమారుడు ఇజహాన్, తన చెల్లెలు ఆనం మీర్జాతో కలిసి దుబాయ్ పర్యటనలో సానియా ఆహ్లాదంగా గడిపారు. ఈ క్రమంలో తన టూర్కు సంబంధించిన ఫొటోలను.. ‘‘గత రెండు వారాల్లో నాకు ఇష్టమైన పనులతో ఇలా గడిచింది’’ అనే క్యాప్షన్తో పంచుకున్నారు. కాగా సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. షోయబ్ పాక్ నటి సనా జావెద్ను పెళ్లాడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. సనాను వివాహం చేసుకున్నానంటూ షోయబ్ మాలిక్ ఫొటోలు విడుదల చేసిన తర్వాత.. సానియా కుటుంబం స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాల కారణంగానే సానియా ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఖులా ద్వారా తానే స్వయంగా అతడితో బంధం నుంచి విముక్తి పొందినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జీవితంలోని కఠిన దశను దాటే క్రమంలో సానియా మీర్జా తనకోసం తాను ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. దుబాయ్ పర్యటనలో భాగంగా సానియా మీర్జా పాక్ సింగర్ అతిఫ్ అస్లాం లైవ్ కన్సర్ట్కు హాజరయ్యారు. అస్లాం, అతడి భార్య సారాతో కలిసి లంచ్కు వెళ్లి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. కాగా పాకిస్తాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ను సానియా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు దుబాయ్లో కాపురం ఉన్నారు. అయితే, ఆట నుంచి విరామం తీసుకున్న తర్వాత షోయబ్తో కలిసి ఎక్కువ సమయం గడిపే క్రమంలో.. అతడి గురించి నిజాలు తెలియడంతోనే.. ఆమె అతడి నుంచి విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఇక సానియాకు దుబాయ్లో టెన్నిస్ అకాడమీ ఉంది. ప్రస్తుతం అకాడమీ కార్యకలాపాలతో ఆమె బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ! షాక్లో నెటిజన్లు
ఎన్నో రకాల వంటకాలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి వంటకం మాత్రం చూసి ఉండరు. గోల్డ్తో తయారు చేసిన కొన్ని రకాల రెసిపీలు కూడా చూసి ఉంటారు. కానీ మరీ ఇలా పప్పుని గోల్డ్తో వడించడం చూసి ఉండరు. గోల్డ్ని ఇలా ఆహారం తీసుకుంటే అరుగుతుందా అన్న డౌట్లు వచ్చేస్తుంటాయి. కానీ ఓ రెస్టారెంట్ తన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన వంటకాన్ని అందిస్తుంది. పైగా ధర కూడా ఎక్కువే. ఎక్కడంటే..దుబాయ్లోని కుష్కన్లో పలు అవార్డులు పొందిన సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్కి చెందిన రెస్టారెంట్ బంగారంతో ప్రత్యేక వంటకాన్ని అందిస్తుంది. ఇది విశేష ప్రజాదరణ పొందిన వంటకం అని చెప్పొచ్చు. దీన్ని 'దాల్ కష్కన్' అనిపిలుస్తారు. పప్పుని 24 క్యారెట్ల బంగారపు రజనుతో తయారు చేస్తారు. దీని ధర ఏకంగా 58 దిర్హామ్లు (సుమారు ₹ 1,300). మెహుల్ హింగు అనే ఫుడ్ బ్లాగర్ ఇన్స్టాగ్రామలో ఆ రెసీపీకి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక చెక్కపెట్టేలో ప్రీమియం మసాలాలు, నెయ్యితో తయారు చేసిన పప్పును తీసుకు వస్తారు. సర్వర్ కస్టమర్కు ఆ డిష్ ప్రత్యేకతను వివరించడం జరగుతుంది. ఆ తర్వాత ఒక గిన్నేలోని బంగారు రజనుతో ఉన్న లిక్విడ్ని పప్పుపై వేసి కలపడం కనిపిస్తుంది. ఇది కష్కన్లో దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్లోని రణ్వీర్ బ్రార్ రెస్టారెంట్ '24 క్యారెట్ల గోల్డెన్ తడ్కే వాలీ దాల్' అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశాడు మెహుల్ హింగు. దీన్ని చూసిన నెటిజన్లు బంగారాన్ని మన శరీరం శోషించుకోలేదు. అయినా దీనిలో ఏం పోషకాలు ఉంటాయని ఇలా చేస్తున్నారని, మరోకరు ఫైర్ అవ్వుతూ కామెంట్లతో పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Mehul Hingu (@streetfoodrecipe) (చదవండి: మద్యపాన వ్యసనానికి చెక్పెట్టే సరికొత్త చికిత్స విధానం! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
గామా అవార్డ్స్ మెరిసిన తారలు (ఫొటోలు)
-
దుబాయ్ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా..
దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) భారత్.. దుబాయ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా పొందిన వారు ఐదు సంవత్సరాల పాటు మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ సదుపాయాన్ని పొందుతారు. భారత్ నుంచి 2023 సంవత్సరంలో ఏకంగా 2.46 మిలియన్ల మంది దుబాయ్ వెళ్లినట్లు, ఈ సంఖ్య కరోనా వ్యాపించడానికి ముందు రోజుల కంటే 25 శాతం ఎక్కువని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 2023లో మొత్తం 17.15 మిలియన్ల మంది దుబాయ్ సందర్శించారు. 2022 ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన వారు 1.84 మిలియన్స్ కాగా.. 2019లో ఈ సంఖ్య 1.97 మిలియన్స్ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా 2022లో దుబాయ్ వెళ్లిన పర్యాటకుల సంఖ్య 14.36 మిలియన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా 2022లో కంటే గత ఏడాది ఎక్కువ మంది దుబాయ్ సందర్శించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కాబోయే కోడలి కోసం ఖరీదైన కానుకలు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు.. ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసా అభ్యర్థన స్వీకరించిన తరువాత అన్ని విధాలా ఆమోదం పొందితే.. కేవలం 2 నుంచి 5 పనిదినాల్లో వీసా జారీ చేస్తారు. ఈ వీసా పొందిన తరువాత సంవత్సరంలో 180 రోజులు లేదా 3 నెలలు దుబాయ్లో ఉండవచ్చు. అయితే వారు ప్రతి 90 రోజులకు ఒకసారి అనుమతి పొందాల్సి ఉంటుంది. 180 రోజులు దుబాయ్లో ఉంటే రెండు సార్లు అనుమతి పొందాల్సి ఉంటుంది. -
దుబాయ్ జైలు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల విడుదల
-
ఫలించిన నిరీక్షణ
సిరిసిల్ల: 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దుబాయ్ జైల్లో బందీలుగా ఉన్న ఇద్దరు విడుదలై ఇల్లు చేరా రు. చాలాకాలానికి ఇల్లు చేరిన వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. 2005 లో దుబాయ్ వెళ్లిన వలసజీవులు.. అక్కడ హత్య కేసులో ఇరు క్కుని 18 ఏళ్లపాటు శిక్ష అనుభవించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శివారులోని పెద్దూరు ఒడ్డెరకాలనీకి చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి (45) బుధవారం ఇంటికి వచ్చారు. వీరు దుబాయ్లో కల్లీవెల్లి వీసా(కంపెనీ వీసా కాదు)పై పనిచేశారు. 2006లో దుబాయ్లో నేపాల్కు చెందిన సెక్యూరిటీ గార్డు హత్య కేసులో నలుగురు పాకిస్తానీయులు, ఆరుగురు తెలంగాణవాసులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయు లు, కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీం ఇప్పటికే విడుదలయ్యారు. సిరిసిల్లకు చెందిన మల్లేశం, రవి, కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్, జగిత్యాల జిల్లాకు చెందిన శివరాత్రి హన్మంతు, చందుర్తి మండలం మల్యాలకు చెందిన నాంపల్లి వెంకటి జైలు శిక్షను పొడిగించడంతో బందీలుగా ఉన్నారు. వీరిలో లక్ష్మణ్, హన్మంతు ఇటీవల విడుదలకాగా.. తాజాగా మల్లేశం, రవి విడుదలయ్యారు. వెంకటి మరో నెల రోజుల్లో విడుదల కానున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వీరి విడుదల కోసం ఎంతో కృషిచేశారు. మ ల్లేశం, రవికి విమాన టికెట్లు, హైదరాబాద్ నుంచి పెద్దూ రు చేరేందుకు వాహనాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారు. మల్లేశం, రవి కుటుంబ సభ్యులతో అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ఫోన్లో మాట్లా డారు. బాధితుల కుటుంబ సభ్యులు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
18 ఏళ్ల తరువాత.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు
సాక్షి, సిరిసిల్ల: సుదీర్ఘ కాలం దుబాయ్ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో జైలు నుంచి విడుదలైన వీరికి ఆయనే సొంత ఖర్చులతో విమాన టికెట్లు అందజేశారు. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన సిరిసిల్లకు చెందిన దండుగుల లక్ష్మణ్ రెండు రోజుల క్రితం విడుదలైన రుద్రంగి మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. పెద్దూరు గ్రామానికి చేరుకున్న శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు కార్మికులు మంగళవారం సిరిసిల్లకు చేరుకున్నారు. వచ్చే నెలలో చందుర్తికి చెందిన మరో కార్మికుడు వెంకటేశ్ జైలు నుంచి విడుదలై తిరిగి రానున్నానడు. కమ్యూనికేషన్ సమస్య వల్ల దుబాయ్ జైల్లో మగ్గిపోయిన వీరిని విడిపించేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దీంతో దుబాయ్లో జైలు పక్షులుగా మారిన సిరిసిల్ల వాసులు ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం కనీళ్లు, ఆనంద భాష్పాలతో కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. ఇదీ చదవండి.. రాజకీయాలకు రైతులను బలి చేయొద్దు -
కేటీఆర్ కడుపు సల్లగుండాలి...
మల్యాల(చొప్పదండి): పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి.. అక్కడ హత్యకేసులో ఇరుక్కుని జైలుకెళ్లి 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు. గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతుకు బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన పద్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం హనుమంతు దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాప పుట్టిన తర్వాత పురుడు చేసిన మరునాడే దుబాయ్ వెళ్లాడు. మూడు నెలలకే హత్య కేసులో జైలుకెళ్లాడు. అప్పటి నుంచి ఆయన భార్య పద్మ భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె 18ఏళ్ల నిరీక్షణ ఫలించాయి. దుబాయ్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరిన భర్త హనుమంతును చూసి కడుపులో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘మాది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద వడ్డెర కుటుంబం. ఉపాధి కోసం ఆయన (హనుమంతు) దుబాయ్ పోయిండు. అక్కడ జైలులో పడ్డడు. పద్దెనిమిదేళ్లుగా భర్త కోసం ఎదురుచూసిన. నా ఐదుగురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ల సహకారంతో తల్లిగారింట్లో ఉంటూ.. బీడీలు చేస్తూ, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కాలం వెళ్లదీసిన. మూడు, నాలుగు నెలలకు ఒకసారి భర్తతో ఫోన్లో మాట్లాడిన. భర్తను తలుచుకుని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపిన. కూతురు గౌతమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. హనుమంతును ఇంటికి రప్పించేందుకు కేటీఆర్ సారును కలిసినం. కేటీఆర్ సారు కడుపు సల్లగుండ ఆయన చేసిన మేలుతో దుబాయ్ జైలు నుంచి నా భర్త బయటపడి ఇంటికి చేరిండు. ఆయన చేసిన మేలు జీవితకాలం మరిచిపోను..’ అని తన భర్త జైలు నుండి విడుదల కోసం కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్కు హనుమంతు భార్య పద్మ కృతజ్ఞతలు తెలిపింది. -
2025..దుబాయ్లో వచ్చేస్తోంది..
అదిగో ఫ్లయింగ్ ట్యాక్సీ.. ఇదిగో ఫ్లయింగ్ ట్యాక్సీ అనడమే తప్ప.. అవి వాస్తవ రూపంలోకి ఎప్పుడు వస్తాయన్నది మాత్రం ఇప్పటి వరకూ తేలలేదు. అయితే.. దుబాయ్లో వచ్చే ఏడాది నుంచి తాము ఈ సర్వీసులు నడపనున్నట్లు కాలిఫోర్నియాకు చెందిన జాబీ ఏవియేషన్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ వద్ద ఇవి అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్లతో నడిచే ఈ ట్యాక్సీల్లో పైలట్, మరో నలుగురు ప్రయాణించవచ్చు. దీనికి రన్వే అవసరం ఉండదు. హెలికాప్టర్ తరహాలో గాల్లోకి లేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే.. 160 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ లెక్కన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పామ్ జుమేరా(కృత్రిమ దీవులు)కు కేవలం 10 నిమిషాల్లో వెళ్లవచ్చు. రెగ్యులర్ ట్యాక్సీల్లో అయితే.. ఇందుకు 45 నిమిషాల సమయం పడుతుంది. టికెట్లను యాప్లో బుక్ చేసుకోవచ్చు. ధర విషయాన్ని ఇంకా ప్రకటించనప్పటికీ.. హెలికాప్టర్ ట్రిప్కు అయ్యే ఖర్చు కన్నా.. తక్కువే ఉంటుందని కంపెనీ తెలిపింది. విమానంలా కాకుండా.. ఒక ఎస్యూవీలో ప్రయాణిస్తున్న అనుభూతిని ఇది కలిగిస్తుందని జాబీ ఏవియేషన్ పేర్కొంది. -
డ్రాగన్మార్ట్కు పోటీగా ‘భారత్మార్ట్’.. ఎక్కడో తెలుసా..
భారతప్రధాని మోదీ దుబాయ్ పర్యటనలో భాగంగా ‘భారత్ మార్ట్’కు శంకుస్థాపన చేశారు. యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో కలిసి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్లోని జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాలను అందించేలా ఈ మార్ట్ను ఏర్పాటు చేయనున్నారు. భారత్ మార్ట్ దుబాయ్కు చెందిన లాజిస్టిక్స్, పోర్ట్ టెర్మినల్ కార్యకలాపాలు, మెరిటైమ్ సేవలను అందిస్తున్న డీపీ వరల్డ్తో కలిసి రూపొందించనున్నారు. భారత్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తయారుచేస్తున్న ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్ట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దాదాపు 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ మార్ట్ 2025 వరకు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. చైనాకు పోటీగా.. ప్రధానంగా ఈమార్ట్ వల్ల దుబాయ్తోపాటు దగ్గర్లోని ఇతర దేశాలకు త్వరగా సరుకులు రవాణాచేసేలా వీలవుతుంది. దాంతో సమయం, రవాణా ఖర్చులు తగ్గి ప్రపంచంలోని ఇతర దేశాలకు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా, యురేషియాలోని అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఇది వేదికగా మారనుంది. దుబాయ్లో నెలకొల్పనున్న భారత్ మార్ట్ చైనాకు చెందిన డ్రాగన్ మార్ట్తో పోటీపడనుంది. డ్రాగన్ మార్ట్లాగా భారత్ మార్ట్ కూడా దుబాయ్లో అనేక ఉత్పత్తులను విక్రయించనుంది. పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు.. మహ్మద్ బిన్ రషీద్తో మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక రంగాలలో సహకారంపై చర్చించారు. భారత్, యుఏఈ మధ్య పెరుగుతున్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కొత్తప్లాన్తో భారత్లోకి టెస్లా.. ప్రయత్నం ఫలిస్తుందా..? ఈ నేపథ్యంలో 2022లో ఇరు దేశాలు కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యాన్ని గుర్తించి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు. దుబాయ్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేలా ప్రత్యేక కమ్యూనిటీ హాస్పిటల్ కోసం భూమిని కేటాయించారు. -
సమీకృత, అవినీతిరహిత ప్రభుత్వాలు కావాలి
దుబాయ్: సమీకృత, అవినీతిరహిత ప్రభుత్వాలు ప్రపంచానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’ తమ మంత్రమన్నారు. బుధవారం దుబాయ్లో బుధవారం ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం సాధ్యమైనంత తక్కువగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం లేదనే భావన ప్రజలకు కలగకూడదని, ప్రభుత్వాల ఒత్తిడి వారిపై ఉండకూడదని అన్నారు. భారత్లో కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమివ్వడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అనంతరం దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్–మక్తూమ్తో మోదీ సమావేశమయ్యారు. -
రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్కు ఇంగ్లండ్ జట్టు? ఎందుకంటే?
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 67/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను సమం చేసింది. ఇక ఇరు జట్లు ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుపై కన్నేశాయి. ఈ మ్యాచ్ కోసం తమ ఆస్రాలను, వ్యూహాలను సిద్దం చేసుకునే పనిలో ఇరు జట్లు పడ్డాయి. దుబాయ్ వెళ్లనున్న ఇంగ్లండ్ టీమ్.. అయితే మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల గ్యాప్ రావడంతో ఇంగ్లండ్ దుబాయ్ వెళ్లనుంది. అక్కడ ఇంగ్లీష్ జట్టు విశ్రాంతి తీసుకోనుంది. ఆ జట్టు కుటంబసభ్యులు కూడా దుబాయ్కు చేరుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మూడో టెస్టు కోసం కూడా ఇంగ్లండ్ అక్కడ ప్రాక్టీస్ చేయనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఇంగ్లండ్ ప్రాక్టీస్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్లీ అదే స్టేడియంలో రాజ్కోట్ టెస్టు కోసం తీవ్రంగా శ్రమించనుంది. ముఖ్యంగా అక్కడ స్పిన్ ట్రాక్ను ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు గోల్ఫ్ కూడా ఆడే అవకాశముంది. తిరిగి మళ్లీ ఫిబ్రవరి 13న ఇంగ్లండ్ టీమ్ నేరుగా రాజ్కోట్కు చేరుకునే ఛాన్స్ ఉంది. చదవండి: SA T20 2024: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్కు ఊహించని షాక్.. గన్తో బెదిరించి! ఏకంగా -
14న మరో అద్భుత ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ
సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యానగరిలోని భవ్యమైన ఆలయంలో రామ్లల్లా కొలువయ్యాడు. తాజాగా ఒక ముస్లిం దేశంలోని హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నెల ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మితమయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 13న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ప్రవాస భారతీయులు పాల్గొనే ‘హలో మోదీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న యూఏఈ రాజధాని దుబాయ్లోని బీఏపీఎస్లో నిర్మితమైన హిందూ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ ‘హలో మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈలోని 150 భారతీయ కమ్యూనిటీ సొసైటీలు సంయుక్తంగా ‘హలో మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. యూఏఈలో మూడేళ్ల వ్యవధిలో ఈ ఆలయాన్ని రాజస్థాన్, గుజరాత్లకు చెందినవారు నిర్మించారు. ఫిబ్రవరి 13న షేక్ జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయుల సమావేశం నిర్వహించనున్నట్లు యూఏఈ రాయబారి తెలిపారు. 2020 నివేదిక ప్రకారం యూఏఈలో 35 లక్షలమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. పురాతన, పాశ్చాత్య శిల్పకళల కలయికతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. -
ఆరడుగుల స్థలంలో ‘బుర్జ్ ఖలీఫా: దుబాయ్లో కాదు.. మరెక్కడ?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అనగానే దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా గుర్తొస్తుంది ఎవరికైనా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్తో సహా ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. వాస్తవానికి నిర్మాణ శైలికి, ఇంజినీరింగ్ సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలిచే భవానాలకు నిలయం దుబాయ్. నగరంలోని సుదూర ప్రాంతాలనుంచి కూడా 160-అంతస్తుల టవర్ను ఈజీగా గుర్తు పట్టేయొచ్చు. మన దేశంలో కూడా బుర్జ్ ఖలీఫా అంటూ ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అదే బిహార్ బుర్జ్ ఖలీఫా. మరి ఈ ఇంట్రస్టింగ్ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం బిహార్లోని ముజఫర్పూర్లోని గన్నిపూర్ ప్రాంతంలో ఉంది ఈ భవనం. కేవలం ఆరడుగుల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించడం విశేషం. అంతేకాదు ఇంటి వెడల్పు కూడా ఐదు అడుగుల మాత్రమే. క్యాండీమేన్ వ్లాగర్ ప్రకారం స్థానికులు ముచ్చటగా దీన్ని ఈఫిల్ టవర్ అని పిలుస్తుంటారట. అంతేకాదు 2015లో సంతోష్ అనే వ్యక్తి తన భార్యకు బహుమతిగా దీన్ని నిర్మించాడట. అందుకే దీన్ని ఐకానిక్ తాజ్ మహల్తో పోల్చాడు. పెళ్లి తరువాత భార్యతో కలిసి ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు. కానీ ఇంత తక్కువ ప్లేస్లో ఎక్కువ సౌకర్యాలతో భవనం నిర్మించాలనే ఆలోచనతో సంతోష్ ఓ ఇంజినీర్ను కలిసాడు. ఫలితంగా అద్భుతమై భవనాన్ని డిజైన్ చేసి ఇచ్చాడు ఇంజినీర్. సమీప గ్రామాల ప్రజలు ఈ భవనాన్ని చూసేందుకు తరచూ వస్తుంటారట. దీంతో ఇది టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోయిందంటూ ఈ భవనం విశేషాలు పంచుకున్నాడు ఈ వీడియోలో. ఇక దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇల్లు చాలా తక్కువ స్థలం ఉన్నప్పటికీ, వంటగది, బాత్రూమ్ పడకగదితో సహా అన్ని సౌకర్యాలను కలిగి ఉండే విధంగా దీన్ని నిర్మించారు. ఇది రెండు భాగాలుగా ఇంటి మొదటి భాగంలో మెట్లు , రెండో భాగంలో గదులు ఉంటాయి. ప్రస్తుతం ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చారు. కానీ దీని స్పెషల్ లుక్ చూసి అబ్బురపడుతూ ఉంటారట సందర్శకులు. View this post on Instagram A post shared by Jay (@candymanvlog) -
ప్రపంచాన్ని ఆకర్షించేలా ‘మూసీ’
సాక్షి, హైదరాబాద్: మూసీ నదీ తీర అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దుబాయ్లో ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్లతో వరుసగా భేటీలు నిర్వహించారు. 56 కిలోమీటర్ల పొడవునా రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలను పరిశీలించడంతో పాటు వాటికి అవసరమైన పెట్టుబడుల గురించి దాదాపు 70 సంస్థలతో ఆయన సంప్రదింపులు జరిపారు. దుబాయ్ వేదికగా ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా దాదాపు అన్ని సంస్థలూ.. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చాయనీ, సంప్రదింపుల కోసం త్వరలోనే రాష్ట్రా నికి వచ్చేందుకు అంగీకరించాయని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్లో సండే వర్కింగ్ డే ఆదివారం సెలవుదినాన్ని సీఎం రేవంత్ అండ్ టీం దుబాయ్లో వర్కింగ్ డే తరహాలో గడిపింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో భాగంగా సీఎం రేవం™త్ మాట్లాడుతూ ‘చరిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది’అని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాలతో తాము పోటీ పడడం లేదని ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్మార్క్ నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నామని చెప్పిన రేవంత్ అందుకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని కోరా రు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈనెల 15న ప్రారంభమైన సీఎం రేవంత్ దావోస్, లండన్, దుబాయ్ టూర్ ముగిసింది. ఈ మూడు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బృందం సోమ వారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దావోస్ పర్యటనలో భాగంగా ఈనెల 15 నుంచి జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ వార్షిక సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడితో సహా పలు దేశాల పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో పెట్టుబడుల కు అనువైన పరిస్థితులను వ్యాపార వర్గాలకు వివరించడం ద్వారా రూ.40వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన హామీలను రాబట్టగలిగారు. ఆ తర్వాత లండన్ వెళ్లిన సీఎం అక్కడ ఇండియా డయాస్పోరా అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొ ని ప్రవాస తెలంగాణీయులనుద్దేశించి మాట్లాడా రు. లండన్లోని ప్రముఖ ప్రాంతాలను అధికారుల బృందంతో కలిసి సందర్శించిన రేవంత్ థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి దుబాయ్ చేరుకున్న రేవంత్ టీం మూసీ రివర్ఫ్రంట్పై ప్రత్యేక దృష్టితో రోజంతా సంప్రదింపులు జరిపారు. అనంతరం తన బృందంతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. దుబాయ్ వాటర్ ఫ్రంట్ను సందర్శించిన సీఎం దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక ఆకాశ హర్మ్యం మీదికి వెళ్లి ఏరియల్ వ్యూలో కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్లో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సీఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది ? ఎంత ఖర్చయింది ? ఏమేం సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. -
దుబాయ్ లో మల్లారెడ్డి ధూమ్ ధామ్
-
రికార్డులను చుట్టూ తిప్పుకుంటున్న గాయని.. మూడేళ్లకే!
మనసుంటే మార్గముంటుంది. ప్రతిభ ఉండాలేగానీ అవార్డులు, రివార్డులు, ప్రపంచ రికార్డులు మనకోసం వెదుక్కుంటూ వస్తాయి. ఇదే విషయాన్ని ఒక యువతి నిరూపించింది. తన పాటలతో రికార్డులను తన వెంట తిప్పుకుంటోంది. ఒక కాన్సర్ట్లో ఏకంగా 140 భాషల్లో పాటలు పాడి సరికొత్త ప్రపంచ రికార్డును సాధించింది కేరళ కుట్టి. గత ఏడాది నవంబర్ 24న దుబాయ్, యుఎఇలో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా కేరళకు చెందిన సుచేత సతీష్ తన గాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. తన అద్భుత ఘనతను చాటుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను నెలకొల్పింది. దీనికిసంబంధించిన వీడియో ఇన్స్టాలో షేర్ అవుతోంది. ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీ ప్రకారం , దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి సుచేత 140 భాషలలో ప్రదర్శనలిచ్చి రికార్డును బద్దలు కొట్టారు. దుబాయ్లో జరిగిన COP 28 సమ్మిట్కు హాజరైన 140 దేశాల ప్రాతినిధ్యానికి గుర్తుగా 140 నంబర్ ఎంపిక చేసినట్టు వివరించింది. సుచేత సతీష్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన విజయాన్ని షేర్ చేసింది. దీంతో నెటిజనులు అభినందనలు కురిపించారు. ఇన్క్రెడిబుల్! వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంటూ కామెంట్ చేశారు. 2018 జనవరిలో లాంగెస్ట్ లైవ్ సింగింగ్ కన్సర్డ్ పెట్టిన అమ్మాయిగా రికార్డు. అలాగే అత్యధిక భాషల్లో పాడిన ప్రపంచ రికార్డుకూడా సొంతం చేసుకుంది. 2021 మ్యూజిక్ బియాండ్ బోర్డర్స్ గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ ప్రోగ్రామ్లో సుచేత సతీష్ 6 గంటల 15 నిమిషాల పాటు 102 భాషల్లో పాడి రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఈ రికార్డులను అమెరికా, మయామి వరల్డ్ రికార్డ్ అకాడెమీ నిర్ధారించింది. 2005 ఆగస్టు17న కన్నూర్లో అయిలియాత్ సుమిత, డాక్టర్ టీసీ సతీష్ దంపతులకు జన్మించింది. అన్నయ్య సుశాంత్ సతీష్ ఉన్నారు. 2 నెలల వయస్సులో దుబాయ్కి షిప్ట్. మూడేళ్ల వయస్సు నుంచే పాడటం మొదలు పెట్టింది. నాలుగేళ్లనుంచే కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. చాలా చిన్న వయసులోనే ప్రముఖ గాయనీ గాయకులందరికీతోనూ పరిచయాటుండటం తన అదృష్టమనీ, ప్రముఖ గాయని శ్రీమతి పి.సుశీలను తన గాడ్ మదర్గా భావిస్తుందిసుచేత సతీష్. -
MS Dhoni: దుబాయ్ వెకేషన్లో ధోని.. ఫొటోలు తీసుకున్న హీరోయిన్లు
-
దుబాయ్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
దుబాయ్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. యూఏఈలో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా ఆధ్వర్యంలో డేరా క్రీక్ ధోవ్ క్రూయిజ్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు, ఇతర మతస్థులు, వారి కుటుంబాలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. . ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్తో కలిసి అందరూ పాటలు, ప్రార్థనలతో అలరించారు. బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్తో కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్లోని వివిధ సంఘాల పాస్టర్స్, సంఘ పెద్దలతో పాటు పాస్టర్లు జాన్ ప్రసాద్, జైకుమార్ రబ్బి తదితరులు హాజరయ్యారు.