-
స్టెతస్కోప్ తగ్గిందా?
డాక్టర్ అనగానే మనకు ఠక్కున స్టెతస్కోప్ గుర్తొస్తుంది. మెడలో స్టెతస్కోప్ వేసుకునో, దానితో చెక్ చేస్తూనో ఉన్న వైద్యులు గుర్తుకు వస్తారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు.. గుండె, ఊపిరితిత్తుల్లో చప్పుడు, పల్స్ రేటును పరిశీలించేందుకు సుమారు 200 ఏళ్లకుపైగా డాక్టర్లు స్టెతస్కోప్ను వాడుతున్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పేషెంట్ పల్స్, హార్ట్బీట్ తెలుసుకునేందుకు డిజిటల్ పరికరాలు వచ్చేశాయి.దీనితో స్టెతస్కోప్తో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ముంబైలోని బాంబే హాస్పిటల్లో ‘ఏఐ, హెల్త్కేర్’అంశంపై జరిగిన కాన్ఫరెన్స్లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. స్టెతస్కోప్ వాడకంపై చర్చించారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని వైద్యులు స్టెతస్కోప్ను వినియోగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ఇదే తొలిసారి కాదు.. స్టెతస్కోప్ వాడకంపై ఏళ్ల కిందే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. స్టెతస్కోప్ కనిపెట్టి 2016 నాటికి 200 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో అంతా స్టెతస్కోప్ రెండు శతాబ్దాల వేడుకలు చేసుకోవాలని భావిస్తుంటే.. అమెరికాకు చెందిన జగత్ నరులా అనే కార్డియాలజిస్టు మాత్రం ‘స్టెతస్కోప్ చనిపోయింది’అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అప్పట్లోనే డాక్టర్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన డాక్టర్ రీడ్ థామ్సన్ మాత్రం దీన్ని ఖండించారు.మరోవైపు భవిష్యత్తులో సంప్రదాయ స్టెతస్కోప్లపై ఆధారపడటం చాలా తగ్గుతుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సత్యవాన్ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న స్టెతస్కోప్ల స్థానాన్ని ఎల్రక్టానిక్, డిజిటల్, ఏఐతో రూపొందించిన స్టెతస్కోప్లు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్లంతా ఏఐతో నడిచే వాటినే ఉపయోగిస్తారని అంచనా వేశారు. అయితే ఎన్ని కొత్త సాధనాలు వచి్చనా స్టెతస్కోప్ వన్నె ఎప్పటికీ తగ్గదని.. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్టెతస్కోప్తో చూస్తేనే సంతృప్తి కలుగుతుందని ఊపిరితిత్తుల నిపుణుడు లాన్సెలాట్ పింటో చెప్పారు.స్టెతస్కోప్ను ఎప్పుడు కనిపెట్టారు?స్టెతస్కోప్ను 1860 సమయంలో తొలిసారిగా కనిపెట్టారు. అంతకుముందు వైద్యులు నేరుగా పేషెంట్ల శరీరానికి చెవిని ఆనించి గుండె చప్పుడు వినేవారు. ఆ సమయంలో మహిళా రోగుల ఇబ్బందులను గుర్తించి.. ఏదైనా పరికరాన్ని రూపొందించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలిసారిగా ఫ్రెంచ్ డాక్టర్ రీన్ లానెక్ కాగితాన్ని ట్యూబ్లా చుట్టి స్టెతస్కోప్లా వాడారు. ఆయనే దీనికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో స్టెతోస్ అంటే ఛాతీ అని.. స్కోపీన్ అంటే చూడటమని అర్థం. ఆ తర్వాత కొన్ని రకాల ప్రాథమిక స్టెతస్కోప్లు తయారు చేశారు. వాటిని దాదాపు 25 ఏళ్ల పాటు వాడారు. ఆర్థర్ లీర్డ్ అనే ఐరిష్ డాక్టర్ కాస్త మెరుగైన స్టెతస్కోప్ను తయారు చేశారు. ప్రస్తుతం వాడుతున్న స్టెతస్కోప్ను లిట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు.పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించొచ్చు.. పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులను స్టెతస్కోప్తో గుర్తించొచ్చు. గుండె నుంచి ఏదైనా అసాధారణ శబ్దాలు వినిపిస్తే (కార్డియాక్ మర్మర్) కాంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టెతస్కోప్ ద్వారానే దీన్ని గమనించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలు దీన్ని గుర్తించలేవు. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్, మెడికల్ ఆఫీసర్స్టెత్కు ఎప్పటికీ వన్నె తగ్గదు స్టెతస్కోప్ వినియోగం ఎప్పటికీ తగ్గదు. సహాయక సిబ్బంది డిజిటల్ పరికరాల ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. కానీ డాక్టర్గా స్టెతస్కోప్తో రోగిని చూస్తేనే సంతృప్తి కలుగుతుంది. స్టెతస్కోప్ కచి్చతత్వం ఎప్పుడూ మారదు. – శిరందాస్ శ్రీనివాసులు, నిమ్స్ రేడియోగ్రాఫర్ అత్యవసర సమయాల్లో దానితోనే మేలు అత్యవసర సమయాల్లో స్టెతస్కోప్ ఎంతో ఉపయోగపడుతుంది. రోగికి వెంటిలేటర్ అమర్చే సమయంలో పైప్ సరిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందో లేదో స్టెతస్కోప్తోనే తెలుస్తుంది. ముక్కు ద్వారా ఆహారం అందించే పైపులు వేసే సమయంలో కూడా స్టెత్ లేనిదే పనికాదు. – విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు -
ఎంబీబీఎస్కు నీలం.. ఆయుర్వేదకు ఆకుపచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా ఇతర స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు తప్పనిసరిగా నీలం (బ్లూ) రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు పెట్టే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులు నిజమైన వైద్యులను గుర్తించేలా, ఏ తరహా వైద్యుడని తెలుసుకునేలా.. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ప్రత్యేకతను తెలిపే రంగు (కలర్ కోడెడ్) బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అటువంటి రంగు బోర్డుల వల్ల రోగులు మోసపోరనీ, నకిలీ డాక్టర్లను పట్టుకోవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని... అలాంటి వారికి ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు. ప్రజలకు సులభంగా కన్పించాలి కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ ప్రకారం కలర్ కోడెడ్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, ఇతర సంబంధిత వివరాలను చూపాలి. ఆయా బోర్డులపై వారు చేసే వైద్యం, ఆ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించాలి. ప్రజలకు సులభంగా కనిపించేలా ఈ సమాచారాన్ని ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రంగు కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టనుంది. పెద్దయెత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధన తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మోసగాళ్ల నుండి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని డాక్టర్ అర్షియ కోరారు. -
టెన్షన్.. టెన్షన్!
కర్నూలు (హాస్పిటల్): వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టెన్షన్ ఉంటోంది. పిల్లలకు చదువుపై టెన్షన్. ఇన్టైమ్లో హోమ్ వర్క్ చేయడం, చెప్పిన పాఠాలు అర్థం చేసుకోవడం, హోమ్వర్క్ చేయకపోతే టీచర్ కొడుతుందేమోనని భయం వారిది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం యువత టెన్షన్. ఉద్యోగం వస్తేనే అమ్మాయిని ఇస్తారనేది ఇంకో టెన్షన్. ఇలా ఉద్యోగం లేక, పెళ్లి కాని యువత చాలామందే ఉన్నారు. తీరా ఉద్యోగం వచ్చాక ఆయా సంస్థలు, ఉన్నతాధికారులు ఇచ్చే లక్ష్యాలు నెరవేర్చాలంటే మరో టెన్షన్. వీకెండ్ వస్తే ఇంట్లో భార్యాపిల్లల ఇష్టాలు తీర్చేందుకు అవసరమైన డబ్బు లేదనేది మరికొందరి టెన్షన్. పిల్లలు పెద్దయ్యాక వారికి వివాహాలు చేయడం మరో టెన్షన్. దీంతోపాటు ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయాలు, వారి ఆలనాపాలనా చూసేవారు కరువు కావడం, అందరూ ఉన్నా అనాథలు కావడం ఇంకో టెన్షన్. ఇలా ఎవరి స్థాయిలో వారికి టెన్షన్ ఉంటోంది. ఈ క్రమంలో టెన్షన్తో పాటు ఆందోళన, డిప్రెషన్ వస్తున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇటీవల మానసిక వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఓపీ పెరుగుతోంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి ప్రతిరోజూ 75 నుంచి 90 మంది వరకు రోగులు వస్తుండగా.. అందులో 40 శాతం కొత్తవారు ఉండటం గమనార్హం. వీరిలో 40 నుంచి 50 శాతం వరకు ఆందోళన, కుంగుబాటు(డిప్రెషన్)కు గురై చికిత్స కోసం వస్తున్న వారే ఉంటున్నారు. వీరు గాక నగరంలోని ప్రైవేటు మానసిక వైద్యుల వద్దకు, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైతం ప్రతిరోజూ 220 నుంచి 250 మంది దాకా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైకోసొమాటిక్ (శారీరక, మానసిక) జబ్బులతో బాధపడే వారే ఎక్కువ. దీంతోపాటు 30 శాతం మద్యం, సిగరెట్ అలవాట్లు, 20 నుంచి 30 శాతం మంది తీవ్రమైన మానసిక సమస్యలు (స్క్రిజోఫీనియా, మానియా, డిల్యూషన్ డిజార్డర్లు, బైపోలార్, సివియర్ డిప్రెషన్)తో వస్తున్నారు. వృద్ధుల్లో 5 శాతం మంది నిద్రలేమి, మతిమరుపు సమస్యలతో వస్తున్నారు. చిన్నపిల్లల్లోనూ 5శాతం మంది మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. 2021లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక జబ్బుల విభాగానికి ఓపీ 15,942, ఇన్పేషెంట్లుగా 92 మంది చికిత్స పొందగా.. 2022లో ఈ సంఖ్య ఓపీలో 19,475కి, ఇన్పేòÙంట్లు 175కి, 2023లో ఓపీ 20,323, ఇన్పేòÙంట్ల సంఖ్య 245కు పెరిగింది. నిద్ర లేకపోవడంతోనే సమస్యలు కొంతమంది కొద్దిపాటి సమయం లభించినా కూర్చున్న చోటే ఒక కునుకు తీస్తారు. మరికొందరు అర్ధరాత్రి దాటినా కళ్లు తెరుచుకుని అటూఇటూ చూస్తూనే ఉంటారు. ఇంకొందరు నిద్రపట్టక నిశాచర జీవుల్లా రాత్రిళ్లు ఊరంతా చుట్టేస్తుంటారు. పట్టణాల్లో అధికంగా రాత్రివేళ టీ స్టాల్స్ వద్ద ఇలాంటి వారే మనకు కనిపిస్తుంటారు. ఎప్పుడో తెల్లవారుజామున మూడు, నాలుగు సమయంలో వీరు ఇళ్లకు చేరుకుని నిద్రించి, మరునాడు ఉదయం 10 గంటల వరకు లేవడం లేదు. దీనికి మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్, ఆందోళనతో పాటు శారీరక వ్యాయామం లేకపోవడం, అధికంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువగా మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మరుసటిరోజు శరీరం ఉత్సాహంగా గడిపేందుకు సహకరించడం లేదు. నిరుత్సాహం, నిస్సత్తువ ఆవహిస్తున్నట్టు ఉంటుంది. ఫలితంగా వీరికి గ్యాస్ట్రబుల్, గుండె దడ, ఊబకాయం, మలబద్దకం, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు కొత్తగా తలెత్తుతాయి. మానసిక ఆరోగ్యానికి సూత్రాలు » ఇష్టమైన పనులు చేయాలి » బాధలు, కష్టాలను కుటుంబసభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి » భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకూడదు » ఉదయాన్నే వాకింగ్ చేయడం, ధ్యానం, యోగా చేయాలి. దీనివల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిడి అదుపులోకి వస్తాయి. » వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర, సినిమాలు, షాపింగ్కు వెళ్లాలి. » అందుబాటులో ఉంటే రోజులో ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు »తెలివి తక్కువ, బుద్దిమాంద్యంతో కూడిన మానసిక వ్యాధులు » చదువుపై ఏకాగ్రత లేకపోవడం, ఎక్కువగా బయట తిరగటం, బంధువులతో కలవలేకపోవడం, తనలోకంలో తానుండటం » చదువులో వెనుకబడటం, చెడు సహవాసాలు, చెడు అలవాట్లకు గురవడం నిద్రలో మల, మూత్ర విసర్జనాలు చేయడం తినకూడని పదార్థాలు తినడం (ఉదా: మట్టి, సున్నం మొదలైనవి)మానసిక వ్యాధుల లక్షణాలు» ఆందోళన, భయం, గుండెదడ, అధికంగా చెమట పట్టడం, కాళ్లు, చేతులు వణకడం » గుండె ఆగినట్లు అనిపించడడం, ఛాతినొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, భయం, ఆందోళన » అనవసర ఆలోచనలు మళ్లీ మళ్లీ రావడం, అనవసర పనులు మళ్లీ మళ్లీ చేయడం, చేతులు అదే పనిగా కడగటం » అకస్మాత్తుగా మాట రాకపోవడం, కాళ్లు చేతులు పడిపోవడం, మూర్ఛలాగా రావడం » విచారంగా, పనిలో ఉత్సాహం లేకపోవడం » ఆకలి, నిద్ర లేకపోవుట, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం » మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గటం, ప్రవర్తనలో మార్పు, సంధి ప్రేలాపనలు » అధికంగా ఆల్కహాల్, మాదకద్రవ్యాల అలవాటు » మూర్ఛ వ్యాధితో వచ్చే మానసిక, దీర్ఘకాక వ్యాధులతో బాధలు, పక్షవాతం తర్వాత వచ్చే మార్పులు » తనలో తాను నవ్వుకోవటం, మాట్లాడుకోవడం, చెవిలో మాటలు వినబడటం, ఇతరులను అనుమానించడం, భర్తలేక భార్య శీలాన్ని శంకించడం » ఎక్కువగా మాట్లాడటం, తిరుగుట, అతి ఆనందం, అతి ధైర్యం లేదా అతికోపం, అతిగా డబ్బు ఖర్చు చేయడం » పూనకాలు రావటం, తనకు తాను గుర్తుకు లేకుండా తిరుగుట » ముసలితనంలో వచ్చే అనారోగ్య సమస్యలు » అనవసరంగా భయాలు, అనుమానాలు పెంచుకోవడం » అకస్మాత్తుగా గతంలో జరిగిన ఘటనలు మరిచిపోవడం » బహిష్టు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు » కాన్పు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు »ఆకలి లేకపోవడం, నాజూకుతనానికై తినకపోవడం, అదుపు లేకుండా తినడం »కలత నిద్ర, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్రవిసర్జన చేయడం, భయంకర కలవరింతలు, అతి నిద్ర, నిద్రలో పళ్లు కొరకడం » నిగ్రహ శక్తి కోల్పోవడం, జూదానికి బానిసవటం, పరుల వస్తువులను అపహరించడం, అదే పనిగా షాపింగ్ చేయడం మానసిక రోగుల సంఖ్య పెరిగిందికొంతకాలంగా మానసిక వ్యాధుల విభాగానికి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్–19 పరిస్థితుల అనంతరం మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల, జన్యుపరంగా, వ్యక్తిగత సమస్యల వల్ల, సమాజంలో పలు కారణాల వల్ల స్క్రిజోఫీనియా, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం అన్నిరకాల మానసిక సమస్యలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నాం. అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నాం. – డాక్టర్ గంగాధర్నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్, కర్నూలు -
పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్!
గుద్దింది ఎవరు?.. మైనరేనా? డ్రైవరా?పోయింది మాత్రం రెండు ప్రాణాలుప్రమాదానికి కారణం ఆ మైనరే!పైగా మద్యం సేవించి ఉన్నాడుతండ్రి బిల్డర్.. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తిఅందుకే కేసును తారుమారు చేసే ప్రయత్నాలుఈ క్రమంలోనే రోజుకొక ట్విస్ట్ తెరపైకి పుణె పోర్షే కారు ప్రమాదం.. రోజుకో ట్విస్ట్తో థ్రిల్లర్ కథను తలపిస్తోంది. తాజాగా నిందితుడైన మైనర్ రక్త నమూనాల రిపోర్టులను తారుమారు చేసినందుకు పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. సాసూన్ ఆస్పత్రిలోని డా. అజయ్ తావ్రే, డా. శ్రీహరి హార్నర్ పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎందుకంటే..ప్రభుత్వ ఆస్పత్రిలో డా. అజయ్ తావ్రే ఫొరెన్సిక్ హెడ్గా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటన రోజు నిందిత మైనర్ బాలుడు తన స్నేహతులతో మద్యం చేవించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కన్పించిన విషయం తెలిసిందే. అయితే మైనర్ బాలుడి రక్త పరీక్షలో మాత్రం మద్యం సేవించనట్లుగా లేకపోవటం, ఆ రిపోర్టు నెగిటివ్ రావటం గమనార్హం. దీంతో రక్త నమూనాలను తారుమారు చేసిన ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.అంతకు ముందు పుణె పోలిసు కమిషనర్ అమితోష్ కుమారు మాట్లాడారు. ‘మద్యం మత్తులో కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదం కాదు. మైనర్ బాలుడికి తన ప్రవర్తనపై పూర్తి అవగాహన ఉంది. మైనర్,అతని స్నేహితులు కలిసి రెండు బార్లలో పార్టీ చేసుకున్నారు. తర్వాత ఇరుకైన వీధిలో నంబర్ ప్లేట్ లేని కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. అందుకే మేము దీనిపై దృష్టి పెట్టాము. అతను పూర్తిగా అవగాహనతో ఉన్నాడు. తన చర్యల వల్ల ఎదుటువారి ప్రాణాలు పోతాయని తెలుసు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు వేర్వేరు సమయాల్లో బ్లడ్ను పరీక్ష చేయించాము. రెండు ఒకేలా కచ్చితంగా ఉన్నాయి’అని అమితోష్ కుమారు తెలిపారు.పోలిసులు వివరాల ప్రకారం.. మొదటి రక్త నమూనాలో మద్యం తాగినట్లు రాలేదు. రెండో నమూనాలో మద్యం సేవించినట్లు పాజిటివ్ రావటం గమనార్హం. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. డీఎన్ఏ టెస్ట్లో సాంపిళ్లు వేరుగా ఉన్నాయి. మైనర్ రక్త నమూనా మరోక వ్యక్తి రక్త నమూనాతో తారుమారు అయింది.దీంతో మైనర్ రిపోర్టులో నెగటివ్ వచ్చింది.ఆదివారం (మే 26): ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లుగా డ్రైవర్ అంగీకరించేందుకు డ్రైవర్ కుటుంబానికి.. మైనర్ తాత పెద్దమొత్తంలో డబ్బు, బహుమతులు ఆశ చూపించారని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అతడిని బెదిరించారని తెలిపారు. బాలుడి తాతపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బాలుడి తాతకి ఈనెల 28 వరకు రిమాండు విధించింది.శనివారం( మే 25):రోడ్డు ప్రమాదం ఘటనకు కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్ బ్రాంచ్.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. అలా ఈ కేసులో మూడో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.శుక్రవారం( మే 24): ప్రమాదం గురించి వైర్లైస్ కంట్రోల్రూమ్కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.#PorscheAccident: #Pune Police Obtain CCTV Showing Teenager Frequently Drove Cars#Pune Police have acquired #CCTV footage revealing that a teenager involved in a recent Porsche accident often drove cars. pic.twitter.com/SO2qoALTzA— Punekar News (@punekarnews) May 27, 2024గురువారం( మే 23): పోర్షే కారు ప్రమాద ఘటన జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్ను తప్పించేందుకే డ్రైవర్ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.బుధవారం( మే 22): రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.మంగళవారం( మే 21): రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సోమవారం( మే 20): తన ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులు చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ఆదివారం(మే 19): ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. ఓ బైక్ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హైపర్టెన్షన్కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?
రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మే 17 నుండి 25 వరకు ‘హైపర్టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ హైపర్టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్టెన్షన్ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్ సీసీఎం విభాగం హెచ్ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్టెన్షన్ సమస్య తలెత్తుతున్నదన్నారు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం, ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
నిజ జీవితంలోని కొన్ని ఘటనలు సినిమా సీన్లను తలపిస్తాయి. ఇటువంటి ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఉత్తరాఖండ్లోని రిషికేశ్కు సంబంధించినది. ఈ వీడియోలో ఆసుపత్రిలోకి పోలీసుల వాహనం దూసుకువెళ్లడం కనిపిస్తుంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.రిషికేశ్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తమవాహనంతో సహా ఆసుపత్రిలోనికి దూసుకువచ్చారు. ఆ నిందితుడు అదే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలిని వేధించాడని పోలీసులకు ఫిర్యాదు అందించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆసుపత్రిలోకి వాహనంతో సహా వచ్చిన పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేసి, అదే వాహనంలో తీసుకువెళ్లారు.దీనికి ముందు ఆ నిందితుని చర్యను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది డీన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆస్పత్రికి తమ వాహనంలో చేరుకున్నారు. ఈ సమయంలో వారు సినిమా తరహాలో వాహనంతో సహా ఆసుపత్రిలోనికి వచ్చి, నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే ఇంతకీ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వాహనంతో సహా లోనికి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.The cops drove their car inside AIIMS Rishikesh.pic.twitter.com/rZDkCvHipM— Divya Gandotra Tandon (@divya_gandotra) May 22, 2024 -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళకు ఐదేళ్ల తరువాత న్యాయం లభించింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన నాగపూర్ కోర్టు ప్రభుత్వ వైద్యశాల డీన్ రాజ్ గజ్భియేతో సహా 11 మంది వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగ్పూర్లోని అజ్ని పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే 2019లో నాగపూర్కు చెందిన కేవల్రామ్ పాండురంగ్ పటోలే భార్య పుష్ప తన గొంతులో చిన్నపాటి గడ్డకు చికిత్స కోసం నాగ్పూర్లోని మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఈ సమయంలో సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ గజ్భియే బాధిత మహిళ భర్త కేవల్రామ్ పాండురంగ్ పటోలేతో శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గడ్డను తొలగించవచ్చని తెలిపారు. ఆ వైద్యుని సలహా మేరకు పటోలే తన భార్య పుష్పను 2019 జూలై 5న ఆసుపత్రిలో చేర్చారు. 6న ఉదయం 8 గంటలకు ఆమెకు ఆపరేషన్ జరిగింది.ఈ ఆపరేషన్ తర్వాత పుష్ఫ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్సనందించారు. అయితే జూలై 7న ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పుష్ఫ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆపరేషన్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పటోలే 2020 జూన్ 30న డాక్టర్ గజ్భియేతో పాటు ఇతర వైద్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వైద్యాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికలో బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిందని కమిటీ పేర్కొంది.అయితే పటోలే దీనిపై రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వైద్యశాఖ ఈ ఉదంతంపై విచారణకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధితురాలికి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా పటోలే నాగపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఆ వైద్యులపై కేసు నమోదు చేయాలని అజ్ని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీకి జంతువుల పట్ల అమితమైన ప్రేమ ఉందని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మరోసారి ఆయనకున్న జంతు ప్రేమను నిరూపించుకున్నారు.త్రిపురలోని కైలాషహర్ ప్రాంతంలో ఒక ఏనుగు అనారోగ్యంతో బాధపడుతోంది. దానికి సహాయం చేయాలని అనంత అంబానీని కోరారు. దీనికి సంబంధించిన వీడియో 'కుంతల సిన్హా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి అనంత్ అంబానీ స్పందించారు.అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు సహాయం చేయడానికి అనంత్ అంబానీ.. వైద్యుల బృందాన్ని అక్కడకు పంపారు. వైద్యుల బృందం సుమారు 3500 కిమీ ప్రయాణించి అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు చికిత్స చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.Hats off to #AnantAmbani who acted promptly to save life of elephant and sent #Vantara medical team within 24 hours to Tripura.#Jamnagar #animallove pic.twitter.com/nvva96W6wm— AkashMAmbani (@AkashMAmbani) May 12, 2024 -
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అనుకోకుండా చిన్న ఎల్ఈడీ బల్బు మింగాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బల్బు బాలుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు.బాలుడు దగ్గుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆపరేషన్ చేసి బల్బు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. రెండుసార్లు బ్రాంకోస్కోపి సర్జరీ చేసినప్పటికీ బల్బు బయటికి తీయడం వీలు కాలేదు. దీంతో డాక్టర్లు బాలుడి ఛాతి ఓపెన్ చేసి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.మేజర్ సర్జరీ అని భయపడ్డ తల్లిదండ్రులు బాలుడిని శ్రీరామచంద్ర మిషన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీటీ స్కాన్తో బల్బును గుర్తించి బ్రాంకోస్కోపి సర్జరీ ద్వారా తీసివేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం కుదుటపడింది. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపారు. -
నిజంగానే మైదాపిండి మంచిదికాదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
పరోటాలు దగ్గర నుంచి పిజ్జా, బర్గర్, కేక్స్, గులాబ్ జామున్, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను మైదాతోనే తయారు చేస్తారు. ఆఖరికి సాయంత్రం వేళ్ల టీ తాగుతూ తినే బిస్కెట్లు, సమోసాల్లో కూడా మైదా ఉంటుంది. రోగులకు ఇచ్చే బ్రెడ్లలో కూడా మైదా ఉంటుంది. అంటే మన నిత్య జీవితంలో ఏదో రకంగా తెలియకుండానే మైదాను తీసుకుంటున్నాం. అలాంటిది మరీ మైదా మంచిదికాదని చాలామంది చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం? వైద్యులు ఏమంటున్నారు ? ఎవరెవరు తినకూడదు అంటే.. మైదాని ఎలా తయారు చేస్తారంటే.. బియ్యంలో మూడు దశలు ఉంటాయి. ఊక, బ్రాన్, బియ్యం. ఊకను తొలగించాక పైపొర (బ్రాన్)తో ఉండే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. ఈ పైపొరను కూడా తొలిగిస్తే పాలిష్డ్ రైస్ అని అంటారు. అలాగే గోదుమల విషయానికొస్తే పైపొట్టు (ఊక), పైపొర(బ్రాన్)తో కూడిన గోదుమ, పాలిష్డ్ గోదుమ అనే మూడు దశలు ఉంటాయి. ఊకను తొలగించి బ్రాన్తో కూడిన ధాన్యాన్ని గోదుమలుగా పిలుస్తారు. గోదుమ నుంచి బ్రాన్ను కూడా తీసేసి బాగా మెత్తగా పిండిలా చేస్తే దాన్నే మైదా అని అంటారు. విదేశాల్లో దీన్నే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని పిలుస్తారనిని న్యూట్రీషియన్లు వివరించారు. గోధమ రవ్వకు, మైదాకు తేడా ఏంటంటే.. బ్రాన్ను తొలగించిన గోదుమ నుంచే రవ్వ తయారవుతుంది. కాకపోతే మైదాలా దీన్ని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తారు. కాబట్టి, ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. రెండూ పైపొర తీసేసిన గోదుమ నుంచే తయారవుతాయి. అందువల్ల మైదాను ఎక్కువగా తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. అలా అని చెప్పి మైదా విషయంలో అతిగా భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. తెలుపు రంగుకి కారణం.. మైదాకు తెలుపు రంగు రావడం కోసం బ్లీచ్ను వాడతారు. బ్లీచ్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. బ్లీచ్ అనేది ఆక్సీకరణ (ఆక్సిడేషన్) ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి మనం స్కూల్లోనే నేర్చుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా గోదుమల నుంచి బ్రౌన్ రంగును తొలగించవచ్చు. బ్లీచ్ ప్రక్రియలో బ్లీచింగ్ ఏజెంట్లుగా క్లోరిన్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను వాడతారు. ఈ రసాయనాలను ఎంత మోతాదులో వాడాలనే అంశంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సరైన పరిమాణంలో ఈ రసాయనాలను వాడాలి. బ్లీచింగ్ ప్రక్రియ అంతా పూర్తిచేసుకొని వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మైదాలో ఎలాంటి రసాయనాలు ఉండవని ఆహార నిపుణులు చెబుతున్నారు మైదా వల్ల షుగర్ వస్తుందా.. మైదాను బ్లీచింగ్ చేసినప్పుడు, అలోక్సాన్ అనే రసాయనం కలుస్తుంది. ఈ రసాయనం వల్ల డయాబెటిస్ వస్తుందని చెబుతారు. నిజానికి అలోక్సాన్ విషయానికొస్తే, మైదా బ్లీచింగ్ ప్రక్రియలో అదనంగా దీన్ని కలపరు. ఆక్సీకరణ ప్రక్రియలో భాగంగా బై ప్రోడక్ట్గా అలోక్సాన్ ఉత్పత్తి అవుతుంది. మైదాలో చాలా స్వల్ప పరిమాణంలో అలోక్సాన్ ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా ఎలుకల్లో ఈ అలోక్సాన్ రసాయనాన్ని వాడి కృత్రిమంగా మధుమేహాన్ని ప్రేరేపిస్తారు. దీని కారణంగా మనకు కూడా షుగర్ వస్తుందేమో అని భయపడతారు. కానీ, అధ్యయనాల్లో వాడే అలోక్సాన్, మైదాలో ఉండే అలోక్సాన్ కంటే 25 వేల రెట్లు శక్తిమంతమైనదని గ్రహించాలి. అందువల్ల ఈ రెండింటిని పోల్చకూడదు. మైదాలో ఏముంటాయంటే.. ‘గోదుమ నుంచి తయారు చేసిన మైదాలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల ఫైబర్, 74.27 గ్రాముల స్టార్చ్ ఉంటుందని చెబుతున్నారు న్యూటిషియన్లు. (చదవండి: అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?) -
సీఎం జగన్ దాడిపై డాక్టర్ సంచలన విషయాలు
-
సీఎం జగన్కు తీవ్ర గాయం.. విశ్రాంతి అవసరం: వైద్యులు
సాక్షి, విజయవాడ: బస్సు యాత్రలో జరిగిన దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై తీవ్ర గాయమైందని, గాయానికి మూడు కుట్లు వేశామని జీజీహెచ్ డాక్టర్లు తెలిపారు. సీఎం జగన్ ముఖంపై వాపు ఉందని, విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు వైద్యులు సూచించారు. సీఎం జగన్పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్క్రైబ్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇక సీఎం జగన్తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు. నేడు యాత్రకు విరామం యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్ జగన్కు లోకల్ అనస్తీషియా ఇచ్చి.. కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. -
చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజేఎంఆర్లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు. జలుబుకు ఇన్ని మందులా..! సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్ట్రోమితార్పాన్,రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్ కోవిడ్కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు. నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్+డోంపెరిడోన్ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. రియాక్షన్లు..దుష్ప్రభావాలు కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. డోసులు ఎక్కువ తక్కువ! నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్ మందులు, హార్మోన్ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు. డాక్టర్లకు అవగాహన కల్పించాలి ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్ తీసుకువచ్చిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కేవలం వెబ్సైట్కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త -
జర జాగ్రత్త.. అవి ఓఆర్ఎస్లు కాదు.. ప్యాకేజ్డ్ జ్యూస్లే!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. అయితే దీని చికిత్సకు తక్షణ పరిష్కారంగా బాధితులు మెడికల్ షాపుల నుంచి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్)ను పోలిన వాటిని వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్న ఉదంతాలు హైదరాబాద్లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోంది. దీనికి కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్ఎస్లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులు వినియోగిస్తున్న వాటిలో అనేకం నిజానికి ఓఆర్ఎస్లు కావని... అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేమితో వాటిని వినియోగించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయమే.. ఆకస్మిక అనారోగ్యం తద్వారా నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరం నుంచి లవణాలు,నీరు అధికంగా కోల్పోవడాన్నే డీహైడ్రేషన్గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల శరీరంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. అది అనంతరం ఫిట్స్ రావడానికి లేదా కిడ్నీ ఫెయిల్ కావడం వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయొచ్చు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి బాధితులకు వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్ ద్వారా మనం కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసేదే ఓఆర్ఎస్. అలవాటులో పొరపాటుగా... కానీ భాగ్యనగరంలో అనేక మంది డీహైడ్రేషన్కు గురవగానే ఓఆర్ఎస్లుగా భావించి వాటిని పోలిన పేర్లతో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో కనిపించే వాటిని ఓఆర్ఎస్ఎల్ అని, రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ మొదలైన పేర్లతో కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిని ఓఆర్ఎస్గా వాడకూడదని చిన్న అక్షరాల్లో ఓ మూలకు రాస్తుండటంతో చాలా మంది వాటిని గమనించక ఓఆర్ఎస్గా భావించి వాడుతున్నారు. రివర్స్ రిజల్ట్... పండ్ల రసాలను ఓఆర్ఎస్గా భ్రమింపజేసేలా లేబుల్ అతికించి విక్రయించడంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి అధిక చక్కెరను కలిగి ఉంటాయని, అతిసారాన్ని తగ్గించే బదులు మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర శాతం అధికంగా ఉండే జ్యూస్ల వాడకం వల్ల మనం ఏ ప్రయోజనం ఆశించి వాటిని తీసుకుంటున్నామో వాటికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంటే విరేచనాలు, వాంతులు మరింతగా పెరుగుతాయని వివరిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా కీలకం... కేవలం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్ఎస్లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాíÙయం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని... కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే నిర్జలీకరణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కల్పించాలి.. ఈ సమస్యపై కొన్నేళ్లుగా రకరకాల వేదికలపై పోరాడుతున్నా. అసలైన ఓఆర్ఎస్ను పోలిన లేబుల్స్తో ఉన్న ప్యాకేజ్డ్ జ్యూస్లను వాడటం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలు -
Cooking Oil: ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే..
ఆయా ప్రాంతాల్లోని వాతావరణాన్ని అనుసరించి ఆయా నూనెలు వాడటం జరుగుతుంది. మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, ఆలివ్ ఆయిల్ వంటి రకరకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల రుచి కూడా నూనెపైనే ఆధారపడి ఉంటుంది. కొవ్వు గురించి భయపడి చాలామంది ఆహరంలో తక్కువ నూనె వాడకానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. నలభై ఏళ్లు దాటినవారు ఆయిల్ ఫుడ్కు చాలా దూరంగా ఉంటారు. ఇంతకీ ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? రిఫైన్డ్ ఆయిల్స్ కంటే గానుగ నూనె బెటరా అంటే.. గానుగ నూనె చాలా పురాతన నూనె. ఎద్దులను ఉపయోగించి గానుగపట్టి నూనె గింజల నుంచి నూనె తీసే విధానం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. కొన్నిదేశాల్లో గుర్రాలు, ఒంటెలను కూడా అందుకోసం ఉపయోగిస్తారు.గానుగలో తిప్పడం ద్వారా లభించే నూనెను 'కోల్డ్ ప్రెస్డ్' ఆయిల్ అంటారు. అంటే ఇక్కడ.. గానుగపట్టే సమయంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. నూనె గింజలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద గానుగలో తిప్పడం వల్ల ఆ నూనెలో సహజ విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వాటి అసలు రూపంలో ఉంటాయి. ఇవి నూనెను మరింత రుచికరంగా ఉంచుతాయి. ఆ కారణంగానే గానుగ నూనె శరీరానికి మేలు చేస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. కానీ, ఈ నూనె తయారీకి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే, విత్తనాల నుంచి 30 - 40 శాతం నూనె మాత్రమే వస్తుంది, అందువల్ల వ్యర్థాలు ఎక్కువ. అయితే, ఎక్స్పెల్లర్ ప్రెస్డ్ ఆయిల్ మెషీన్ ద్వారా 80 నుంచి 90 శాతం నూనెను తీయవచ్చు. కానీ, మెషీన్ ద్వారా ఆయిల్ తీసే ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థాయిలు 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల నూనె సహజ స్వభావం మారుతుంది. ఆ తర్వాత వంట నూనె రిఫైనింగ్ (శుద్ధి) ప్రక్రియ జరుగుతుంది. మెత్తగా నూరిన విత్తనాల చూర్ణానికి హెక్సేన్ అనే రసాయనాన్ని కలుపుతారు. విత్తనాల నుంచి 100 శాతం నూనెను తీసేందుకు ఈ హెక్సేన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాతి దశలో నూనెతో కలిపిన హెక్సేన్ను వేరుచేస్తారు. అలా వచ్చిన నూనెను వివిధ రసాయనిక పద్ధతుల్లో రిఫైన్ చేస్తారు. చివరగా, నీళ్లలా శుద్ధంగా కనిపించే రుచీపచీ లేని నూనె వస్తుంది.గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్ హెక్సేన్ ఉపయోగించి రిఫైన్ చేసే నూనెలే. ఏది బెటర్ అంటే.. చివరిగా అన్ని రకాల నూనెల్లోనూ మంచి కొవ్వులు ఉంటాయి. అవి శరీరానికి అవసరం కూడా. అయితే మనం ఎంత నూనె తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. గుండె జబ్బులు, ఊబకాయం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలుంటే నూనె తీసుకోవాల్సిన పరిమాణంలో మార్పులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యితో పాటు ఆలివ్ ఆయిల్ను కొద్దిగా తీసుకోవచ్చు. వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనెను వాడొచ్చు. కొబ్బరినూనె, పామాయిల్ వంటి వాటిని కొద్దిమొత్తంలో తీసుకోవచ్చు. అందువల్ల ఒకటే నూనె కాకుండా, అన్ని నూనెలను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవడం మంచిది. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తికి రోజుకు 15 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. అంటే.. నెలకు సుమారు 450 నుంచి 500 మిల్లీలీటర్లు చాలు అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్! ఇక ఆ వ్యాధి..) -
5,348 పోస్టుల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా, ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ ఉండొచ్చని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం పరిధిలో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,255, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 575, డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలో 11, ఆయుష్ విభాగంలో 26, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 34, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో 212 పోస్టులు భర్తీ చేస్తారు. వివిధ విభాగాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు ► ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 351, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 193, స్టాఫ్నర్స్– 31 ► డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలోజూనియర్ ఎనలిస్ట్ – 11 ► ఆయుష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (ఆయుర్వేద)– 6, టెక్నికల్ అసిస్టెంట్ (యునాని) – 8, లెక్చరర్ (ఆయుర్వేద) –1, లెక్చరర్ (హోమియో) –10, మెడికల్ ఆఫీసర్ (యు) లీవ్ రిజర్వుడు–1 ► ఐపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 4, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 లోకల్ క్యాడర్ –6, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 స్టేట్ క్యాడర్ –1, లేబరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్– 7, వ్యాక్సినేటర్ –1, స్టాఫ్నర్స్–1, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) –1, జూనియర్ అనెలిస్ట్ (లోకల్ క్యాడర్)–2, జూనియర్ అనెలిస్ట్ (స్టేట్ క్యాడర్) – 11 ► డీఎంఈ పరిధిలో సీటీ స్కాన్ టెక్నీషియన్–6, డెంటల్ హైజినిస్ట్– 3, ఈసీజీ టెక్నీషియన్ – 4, ఈఈజీ టెక్నీషియన్ – 5, అనెస్థిషియా టెక్నీషియన్ – 93, ఆడియో విజువల్ టెక్నీషియన్ – 32, ఆడియో మెట్రీ టెక్నీషియన్– 18, బయో మెడికల్ ఇంజనీర్–14, బయో మెడికల్ టెక్నీషియన్– 11, డెంటల్ టెక్నీషియన్– 53, రేడియోగ్రఫీ టెక్నీషియన్– 19, ఆప్తోమెట్రిస్ట్– 20, స్టెరిలైజేషన్ టెక్నీషియన్–15, ఫిజియోథెరపిస్ట్–33, అసిస్టెంట్ ప్రొఫెసర్లు– 555, నాన్ మెడికల్ అసిస్టెంట్లు (జి)–17, రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్– 5, పర్ఫ్యూజనిస్ట్–3, లైబ్రేరియన్–14, ఫిజికల్ డైరెక్టర్ – 5, క్లినికల్ సైకాలజిస్ట్ – 2, స్పీచ్ పాథాలజిస్ట్– 1, చైల్డ్ సైకాలజిస్ట్– 21, ఇమ్యునోలజిస్ట్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు–80, మెడికో సోషల్ వర్కర్ (గ్రేడ్–2)– 95, స్టాఫ్నర్సులు–1,545, స్టాటిస్టిషియన్–20, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) – 125, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 420 ► తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఫిజియోథెరపిస్ట్– 13, ఏఎన్ఎంలు– 85, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు– 617, స్టాఫ్నర్సులు– 332, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు – 6, ల్యాబ్ టెక్నీషియన్లు– 136, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2)– 66 ► ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అనెస్థీషియా– 4, బయో కెమిస్ట్రీ –1, డెంటల్ సర్జరీ –1, ఈఎన్టీ– 1, గైనిక్ అంకాలజీ– 2, మెడికల్ ఆంకాలజీ (పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజీతో కలిపి)– 4, మైక్రోబయోలజీ – 1, మాలిక్యులర్ అంకాలజీ –1, న్యూక్లియర్ మెడిసిన్– 2, ఆప్తమాలజీ – 1, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్– 2, పాథాలజీ– 2, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ – 2, రేడియోలాజికల్ ఫిజిక్స్ – 4, రేడియాలజీ – 2, రేడియో థెరపీ – 4, సర్జికల్ అంకాలజీ – 6, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్–1. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్) – 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనెస్థీషియా)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సైటో పాథాలజీ)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పాథాలజీ) –2, లెక్చరర్ (న్యూక్లియర్ అంకాలజీ) – 1, లెక్చరర్ (న్యూక్లియర్ మెడిసిన్/న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)– 3, బయోమెడికల్ ఇంజనీర్ – 2, స్టాఫ్నర్స్–80, ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్–2 – 8, మౌల్డ్ టెక్నీషియన్ – 1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ – 2, రేడియోథెరపీ టెక్నీషియన్ – 10, టెక్నీషియన్లు–5, టెక్నీషియన్లు (మెడికల్ ఇమేజింగ్)– 5, థియేటర్ అటెండెంట్లు–5, డెంటల్ టెక్నీషియన్ –1, ఈసీజీ టెక్నీషియన్– 2, ల్యాబ్ టెక్నీషియన్– 8, మెడికల్ ఫిజిసిస్ట్– 5, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్– 3, రేడియోగ్రాఫర్ సీటీ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ టెక్నీషియన్–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ ఆర్టీ టెక్నీషియన్– 5, రేడియోగ్రాఫర్–6, సోషల్ వర్కర్–6. -
మమతా బెనర్జీ గాయంపై వైద్యుల అనుమానాలు
సాక్షి, కోల్కతా : తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడలేదని, గుర్తు తెలియని అంగతకులు వెనుక నుంచి నెట్టడం వల్ల ఆమె తల, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు ఎస్కేఎం ప్రభుత్వ ఆస్పత్రి డైరెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం 7.30 గంటలసమయంలో మమతా బెనర్జీ కాళీగట్లో తన నివాసంలో కింద పడ్డారు. అయితే సిబ్బంది అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలోని వుడ్బర్న్ వార్డ్లో చేర్చారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు దీదీ నుదిటిపై 3కుట్లు, ముక్కుపై ఒక కుట్టు వేశారు. మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సిఫార్సు మేరకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రాత్రి 9:45 గంటలకు, ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ సీఎం ఇంట్లో పడిపోవడం వల్లే గాయమైందని అందరూ అనుకున్నారు. కానీ మమతా బెనర్జీ తీవ్ర గాయాలు పాలు కావడం వెనుక కోట్ర దాగినట్లు సమాచారం. ఎస్ఎస్కేఎం డైరెక్టర్ మణిమోయ్ బంద్యోపాధ్యాయ ఈ సంఘటనకు గల కారణాల్ని వెల్లడించారు. సీఎం తనకు తానుగా పడిపోవడం వల్ల జరిగే గాయాలకంటే.. ఆమె వెనుక నుంచి ఎవరో బలవంతంగా నెట్టడం వల్లే నుదిటికి, ముక్కుకి గాయాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ ప్రమాదానికి గల కారణాల్ని నిర్ధారించలేదు. ఈ సందర్భంగా ఈసీజీ, సిటిస్కాన్ చేసినట్లు చెప్పిన ఆయన.. వైద్యుల పర్యవేక్షణ కోసం ఆస్పత్రిలో ఉండాలని సూచించామని, కానీ ఆమె ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడినట్లు తెలిపారు. ఇక శుక్రవారం వరకు ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు మమత కోడలు, తృణమూల్ కౌన్సిలర్ కజారీ బెనర్జీ దీదీకి గాయాలు కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీదీ పడిపోయింది అని విన్నాను. ఎవరో నెడితేనే తీవ్రగాయాయ్యాయని అన్నారు. కాగా, గురువారం సాయంత్రం, దివంగత తృణమూల్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆమె కాళీఘాట్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న దక్షిణ కోల్కతాలోని గరియాహట్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆమె కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. -
Hyderabad: కిడ్నీలో 418 రాళ్లు!
లక్డీకాపూల్: కేవలం 27 శాతం మాత్రమే కిడ్నీ పనితీరు ఉన్న ఓ వ్యక్తి మూత్రపిండాల నుంచి ఏఐఎన్యూ వైద్యులు ఏకంగా 418 రాళ్లను తొలగించారు. ఇదంతా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేయడం మరో విశేషం. 60 సంవత్సరాల వయస్సు గల మహేష్ కిడ్నీలో అసాధారణ సంఖ్యలో రాళ్లు ఉండటంటతో కిడ్నీ పనితీరు దెబ్బతినింది. ఆయనకు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్.టక్, డాక్టర్ దినేష్ నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. అందుకోసం పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్ఎల్) పద్ధతిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పరికరాలతో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా కిడ్నీలోకి ఒక సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్లను పంపారు. ఆ కెమెరా చూపించిన దృశ్యాలతో రాళ్లన్నింటినీ తొలగించగలిగారు. దీనివల్ల పెద్ద కోత అవసరం లేకపోవడంతో పాటు రోగికి నొప్పి అంతగా ఉండకపోవడం, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం వైద్య బృందం ప్రతి ఒక్క రాయినీ తొలగించి రోగికి ఊరట కలి్పంచింది. అద్భుతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు అత్యాధునిక పరికరాలు ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించాయి. దీంతో కిడ్నీ అతడి పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. ఇలా చిన్న రంధ్రం పెట్టి, దాని ద్వారానే మొత్తం 418 రాళ్లను తొలగించడం వైద్యపరమైన నైపుణ్యానికి ప్రతీక. వేసవిలో కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు ఉప్పు తక్కువగా, నీళ్లు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ఏఐఎ¯Œన్యూ వైద్య నిపుణులు సూచించారు. -
గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!
ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం అపేసింది.. ఇంకేముంది చనిపోయాడని అనుకున్నారందరూ. ఎలక్ట్రిక్ షాకిస్తే (డిఫిబ్రిలేషన్) గుండె మళ్లీ కొట్టుకుంటుందేమో అని ఆశించారు. వైద్యుల సాయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 షాకులిచ్చారు. అయినా... ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న వైద్యులు.. అంతా అయిపోయిందని బంధువులకు చెప్పాలని అనుకుంటున్న సమయంలో జరిగిందో అద్భుతం! పదిహేడు వరుస షాకులకూ స్పందించని ఆ గుండె మళ్లీ లబ్ డబ్ అనడం ప్రారంభించింది! ఏమా అద్భుతం.. ఎక్కడ జరిగింది? కారణాలేమిటో తెలిశాయా? ఇవేనా మీ అనుమానాలు. తీర్చుకోవాలంటే చదివేయండి మరి!!! గత ఏడాది జూన్లో యూకేలో జరిగిందీ ఘటన. ముప్ఫై ఒక్క ఏళ్ల పిన్న వయసులో బెన్ విల్సన్ రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయకుండా ఉండే పరిస్థితిని అనుభవించాడు. మొదటిసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వైద్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వరుసగా 11 షాకులిచ్చారు. ఇందుకు దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. హమ్మయ్యా బతికిపోయాడులే అనుకునేంతలోపే... విల్సన్కు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. వైద్యులు మళ్లీ డీఫిబ్రిలేటర్తో షాకులివ్వడం మొదలుపెట్టారు. పదంటే పది నిమిషాల్లో ఏకంగా ఆరు షాకులిచ్చారు. అప్పటిగానీ విల్సన్ గుండె సాధారణ స్థితికి రాలేదు.!! అంతేనా.. విల్సన్కు బాగైందా? అంటే అక్కడే ఇంకో ట్విస్టు ఉంది. పదిహేడు షాకులు తిన్న గుండె బాగా బలహీనంగా ఉండింది. పైగా గుండె పనిచేస్తోంది కానీ... మెదడుకు రక్తప్రసరణ జరగడం లేదు. పోనీ చికిత్స చేద్దామా అంటే తట్టుకునేంత శక్తి గుండెకు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ దశలో వైద్యులు ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. విల్సన్ను కోమాలోనే ఉంచేద్దామని తీర్మానించారు. కోమాలోనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేశారు. ఇలా ఐదు వారాలపాటు చికిత్స అందించిన తరువాత కానీ విల్సన్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మమదిగా నడవడం, మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం అతను కొద్దిపాటి జ్ఞాపకశక్తి సమస్యలను తప్పించి చాలావరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు అతడి భార్య రెబెక్కా హోమ్స్ మాట్లాడుతూ .. ఆ సమయంలో తాను విల్సన్ పక్కనే ఉండిపోయానని, "డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మి" అనే మా పాటను పాడుతూ ఉన్నానని నాటి విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. తన దిండుపై తాను ఉపయోగించే స్ప్రేని కొట్టి..అతడు తన కోసం కొన్న టెడ్డీని అతడి పక్కనే ఉంచి వెనక్కి వచ్చేయి విల్సన్ అంటూ అతడివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రేమే అతడిని ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడేలా చేపిందని ఆనందంగా చెబుతోంది. అతను తనను ఎంతగానో ప్రేమించేవాడిని, ఈ కష్టకాలంలో అతడి పక్కనే ఉండి ఆ ప్రేమనంత తాను తిరిగి అతడికి అందించానని ఉద్వేగంగా చెప్పింది రెబెక్కా. ఏదీఏమైన ఈ ఘటన మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్లో ఏది ఇష్టపడతారంటే..) -
వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ (ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు) విధానాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపడుతోంది. వైద్య విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్(ఏపీవీవీపీ) పరిధిలో 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి బుధ, శుక్రవారాల్లో ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ.. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాల్లో పోస్టులను బుధవారం భర్తీ చేయనున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, ఈఎన్టీ, ఆప్తమాలజీ, పాథాలజీ విభాగాల్లో పోస్టుల భర్తీకి శుక్రవారం వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించే వాకిన్ రిక్రూట్మెంట్కు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హాజరవ్వాల్సి ఉంటుంది. శాశ్వత, కాంట్రాక్ట్, కొటేషన్ విధానాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి స్పెషలిస్ట్ వైద్యులు ముందుకు రాకపోతుండటంతో కొటేషన్ విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి ఎంత వేతనం కావాలో వైద్యులు కొట్ చేయవచ్చు. ఆ కొటేషన్లను పరిశీలించి వైద్యులు కోరినంత వేతనాలను ఇచ్చి మరీ ప్రభుత్వం వైద్యులను నియమిస్తోంది. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/msrb/, https://hmfw.ap.gov.in వెబ్సైట్లను అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని అర్బన్ హెల్త్, వెల్నెస్ సెంటర్లలో 189 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేసన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. భర్తీ చేసే పోస్టుల్లో 102 మెడికల్ ఆఫీసర్లు, 87 స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయన్నారు. బుధవారం నుంచి మార్చి 10వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థులు https://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక సమగ్ర నోటిఫికేషన్ను https://apmsrb.ap.gov.in/msrb, https://dme.ap.nic.in వెబ్సైట్లను అభ్యర్థులు సంప్రదించాల్సి ఉంటుంది. -
Seoul: సౌత్కొరియాలో డాక్టర్ల పోరుబాట.. పేషెంట్ల విలవిల
సియోల్: సౌత్ కొరియాలో డాక్టర్లు వారం రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కోర్సుల్లో ఏడాదికి 2 వేల సీట్లు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో పేషెంట్లు డాక్టర్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని సియోల్లోని 5 పెద్ద ఆస్పత్రుల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన సగం సర్జరీలు రద్దవుతున్నాయి. దీనిపై దేశ వైద్యశాఖ సహాయ మంత్రి పార్క్ మిన్సూ స్పందించారు. డాక్టర్ల ప్రాథమిక కర్తవ్యం పేషెంట్ల ప్రాణాలు కాపాడటమని, నిరసనల కంటే వారు ఈ విషయానికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పనిచేసే చోటే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వల్ల ఇప్పటివరకు 7813 మంది డాక్టర్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, ఇందుకే మరింత మంది డాక్టర్లు అవసరమని చెప్పారు. అయితే స్టే ఎట్ వర్క్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచే బదులు వారి వేతనాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిండం కోసమే మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ఏప్రిల్లో జరిగే సాధారణ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ స్టంట్ ప్లే చేస్తోందని డాక్టర్లు అంటున్నారు. ఇదీ చదవండి.. అలెక్సీ నావల్ని కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ -
జంట జబ్బులను జయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశంలోనే మిన్నగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ..ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా వీరిలో 24% (1.81 కోట్ల మంది) మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపీ తర్వాత గోవాలో మొత్తం బాధితుల్లో 80% మంది, మధ్యప్రదేశ్లో 60% మంది వైద్య సంరక్షణలో ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో 37.51 లక్షల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా..వీరిలో 31.44 లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రమాదకర జబ్బుల బారినపడకుండా... దేశంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల కారణంగా 64.9% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలున్న బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, పరీక్షలు చేయించుకుని, మందులు సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర జబ్బుల బారినపడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పీహెచ్సీ వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్ ఎన్సీడీ బాధితులకు ఫాలో అప్ వైద్య సేవల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డ్ను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. డ్యాష్ బోర్డు ద్వారా ఫలానా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో బాధితులందరికీ వైద్యం చేశాడో లేదో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్ క్లినిక్స్లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన సీహెచ్వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్లో టెలీమెడిసిన్ సౌకర్యం ఉండటంతో అవసరమున్న సందర్భాల్లో హబ్లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. -
డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారా? కేంద్రం కీలక సూచనలు
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్యులు రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ రాసిస్తుంటారు. అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాశారు.. ఆవశ్యకత ఏంటన్నది సామాన్యులకు తెలియదు. డాక్టరు చెప్పారు కదా చాలామంది వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్యులకు పలు కీలక సూచనలు చేసింది. కారణం రాయాల్సిందే.. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించడానికి గల కారణాన్ని, ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలోని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఫార్మసిస్ట్లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయింవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు. వైద్య కళాశాలలు, మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ ఉద్దేశించి రాసిన జనవరి 1 నాటి లేఖలో యాంటీమైక్రోబయాల్స్ దుర్వినియోగం, మితిమీరిన వాడకం డ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ అతుల్ గోయెల్ ఉద్ఘాటించారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. దీనివల్ల 2019లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మరణాలు సంభవించాయన్నారు. ఇవికాక అదనంగా 49.5 లక్షల మరణాలు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు.