-
డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలో రోజుకు 28 కేసులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అధిక వర్షాలు.. వాతావరణ మార్పులు.. పెరుగుతున్న దోమలతో డెంగీ పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తుండడంతో పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ప్రతీఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. రెండు నెలలుగా జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా పీహెచ్సీలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రులలో ఓపీ, ఐపీ కోసం రోగులు బారులు తీరుతున్నారు. ఆగస్టు, సప్టెంబర్లో విజృంభణ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అనారోగ్య వాతావరణం నెలకొంది. ఈ వాతావరణమే వైరల్ ఫీవర్ల వ్యాప్తికి కారకంగా మారుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో జ్వరాల ప్రభావం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే డెంగీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో 181 కేసులు, సెపె్టంబర్ (15 నాటికి)లో ఇప్పటి వరకే 422 కేసులు నమోదుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రులు కిటకిట సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల అనధికారికంగా పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదు కావడంతో జ్వరం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వస్తే చాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా రోగులు వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ప్రతి రోజు 2 వేలకుపైగా నమోదవుతుండగా, ఇన్పేషెంట్లకు సరిౖయెన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో జ్వరాల బారినపడిన పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ డెంగీ ప్రయివేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా తర్వాత అంతటి సంపాదన తెచ్చే అస్త్రమైంది. డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం. ప్లేట్లెట్స్ సాకుగా చూపుతూ ప్రయివేటు ఆసుపత్రులు పేషెంట్లను వారి బం«ధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకుండా ప్లేట్లెట్స్ పరీక్ష చేయడం, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ పేషెంట్ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు. ఇక ఆంటిబయోటిక్స్, సెలాయిన్స్ పెట్టుకుంటూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. అవకాశం వచి్చందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని అందుకు ఖర్చు రూ.వేలల్లో ఉంటుందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు డబ్బులకు వెనుకాడకుండా పేదలు జేబులను గుల్ల చేసుకుంటున్నారు. రోజుకు 28 కేసులు ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి లేదా రెండుకు మించి కేసులు నమోదు కాలేదు. తాజాగా సెప్టెంబరులో డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా రోజుకు 28 కేసులు చొప్పున నమోదవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. దోమల సంఖ్య పెరగడమే ఈ వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. గతంతోపోలిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలు, చెరువులు, కుంటలు నిండాయి. ఈ కారణం వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ విషయానికి వస్తే.. చుట్టూ హారంలా జలాశయాలు, కాలువలు ఉండటంతో దోమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఇదీ చదవండి: వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం -
10 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం చేసి ఆదుకోరూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్ హైదరాబాద్లో నివసిస్తున్నారు. కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు తీవ్రమైన ఇన్ఫనైట్ డెంగ్యూ, హైపర్ ఫెరిటినిమా, ట్రాన్స్మినిట్స్, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప పేరు: ఆర్ హన్విక తండ్రి పేరు: రవి కిరణ్ తల్లి: దీప్తి గూగుల్ పే నంబర్: 8019872446 బ్యాంక్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్: 403901502892 బ్యాంక్ - ఐసీఐసీఐ, సేవింగ్స్ ఖాతా ఖాతాదారుని పేరు: ముసిలమ్మోళ్ల దీప్తి సాయి ఐఎఫ్ఎస్ఈ కోడ్: ICIC0000008 -
డెంగ్యూతో ఉక్కిరిబిక్కిరి, అయినా సెట్స్కు వచ్చిన కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ డెంగ్యూబారిన పడింది. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ ఆమె సెట్స్లో అడుగుపెట్టడం విశేషం. ఇప్పటివరకు హీరోయిన్గా అలరించిన ఆమె ఎమర్జెన్సీ మూవీతో దర్శకురాలిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే కదా! ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె ఇటీవల అస్వస్థతకు లోనైంది. పరీక్షలు చేయించుకోగా సోమవారం నాడు ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా తను సినిమా పనుల్లో నిమగ్నమైంది. ఈమేరకు కొన్ని ఫొటోలను ఆమె సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలింస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 'డెంగ్యూ వచ్చి తెల్ల రక్తకణాలు తగ్గిపోయి, జ్వరంతో ఒళ్లంతా కాలిపోతున్నా మీరు మాత్రం పని చేయడం ఆపడంలేదు. దీన్ని ప్యాషన్ కాదు పిచ్చి అంటారు. కంగనా రనౌత్ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం' అని రాసుకొచ్చింది. దీనిపై సదరు కథానాయిక స్పందిస్తూ.. 'థ్యాంక్ యూ టీమ్.. అయినా బాడీకి జబ్బు వచ్చింది కానీ నా ఆశయానికి కాదు' అని రిప్లై ఇచ్చింది. కాగా కంగనా ఎమర్జెన్సీ మూవీలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించనుంది. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ డేవిడ్ మలినోస్కి ఈ సినిమాకు పని చేస్తున్నాడు. చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ సోనమ్.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? -
సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు
తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. చిత్తూరు రూరల్ : వర్షాకాలంలో ప్రజలు అధికంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. వాతావరణ మార్పులతో తరచుగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. రోగాల వ్యాప్తికి ప్రధానంగా దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్ల వద్ద, వీధుల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయని వివరిస్తున్నారు. వైరల్ జ్వరాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ► తేలికపాటి జ్వరం.. జలుబు: సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి . ఈ వైరల్ ఫీవర్ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జాగ్రత్తలు: భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్ర పరుచుకోవాలి. నిల్వ పదార్థాలు తినకూడదుౖ తాజా పండ్లు తీసుకోవాలి . వర్షంలో తడవకూడదు . తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండ కూడదు. మాస్క్ తప్పనసరిగా ధరించాలి. ► చికెన్ గున్యా: దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం , కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్ష ణాలు , ఇది సోకితే మొదటి రెండు , మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది . జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి . కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి . ► మలేరియా: తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు . జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది . ఆడ దోమ కాటుతో మలేరియా జిరమ్స్ శరీరంలో లోపలికి వెళ్తాయి . 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది . ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: దోమతెరలు వినియోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ చేరితే అందులో కిరోసిన్ గాని పురుగు మందుగాని పిచికారీ చేయించాలి. ► డెంగీ: వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది . ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు , చేతులు , ముఖం , వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి . ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది . ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇళ్లలోని కుండీలు , ఓవర్ హెడ్ ట్యాంక్లు , ఎయిర్ కూలర్లు , పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు , ప్లాస్టిక్ కప్పులు , పగిలిన సీసాలు , టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి . చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి . దోమ తెరలు వాడడం శ్రేయస్కరం . వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి . ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు , పాత టైర్లు , ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి . ఎయిర్ కూలర్లు , ఎయిర్ కండిషన్లు , పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి. ► హెపటైటిస్–ఏ: వర్షాకాలంలో హెపటైటిస్– ఎ ( కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉంది . ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కలుషితమైన ఆహార పదార్థాల నుంచి , తాగునీటి నుంచి రోగ కారకక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి . కాలేయ వ్యాధి కారణం గా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి. జాగ్రత్తలు: శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఆహారం తినకూడదు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. ► టైఫాయిడ్: వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది . ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది . కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్తలు: కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి. ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది. అప్రమత్తత తప్పనిసరి వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్ర జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. – శ్రీనివాసులు, డీఎంఓ -
జలుబు లాగే కరోనా
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా కథ ముగిసింది. అది ఎండమిక్ (వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం) దశకు చేరుకుంది. ఇక నుంచి అది కేవలం సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉండనుంది. ఒక సీజనల్ వ్యాధిగా మారిపోయింది. దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఇది వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమైందని, కాబట్టి టీకా తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ కరోనా కొత్త వేరియంట్ వస్తే మాత్రం ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు. శ్రీనివాసరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేలకు పైగా క్రియాశీలక కేసులుంటే, అందులో 50 మంది వరకు మాత్రమే ఆసుపత్రుల్లో ఉన్నారన్నారు. మరణాలు సున్నా స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కరోనా, టీబీ సహా జలుబు, జ్వరం, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించాలని సూచించారు. లక్షణాలున్నవారు ఐదు రోజులు ఐసోలేషన్లో ఉండాలని, తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవచ్చని, కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసిందన్నారు. వర్షాలు తగ్గాక వ్యాధులు విజృంభిస్తాయి రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం పెరగడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు. ‘వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత వ్యాధులు విజృంభిస్తాయి. ఇప్పటికే డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 516, కరీంనగర్లో 84, ఖమ్మంలో 82, మహబూబ్నగర్లో 54, మేడ్చల్లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97 చొప్పున దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ వ్యాప్తి చెందుతోంది. ఒక్క జూన్లోనే 565 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. అంతేగాక జూలైలో తొలి పది రోజుల్లోనే 222 కేసులొచ్చాయి. 2019 తర్వాత మళ్లీ 2022లో డెంగీ కేసుల్లో పెరుగుదల ఉంది. దీంతోపాటు జనవరి నుంచి ఇప్పటివరకు 203 మలేరియా కేసులూ తేలాయి’ అని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమ తెరల పంపిణీని ప్రారంభించిందన్నారు. నీళ్ల విరేచనాల కేసులు 6 వేలు నమోదయ్యాయని, జిగట విరేచనాల కేసులు ఈ నెలలో 600 నమోదయ్యాయని తెలిపారు. టైఫాయిడ్ కేసులూ భారీగా వచ్చాయన్నారు. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ తినడం వల్ల వచ్చినవేనని స్పష్టంచేశారు. అన్ని సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేలా.. కరోనా సహా అన్ని రకాల సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేవిధంగా ఉంటాయని, ఏమాత్రం అనుమానమున్నా పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలను బట్టి వైద్యం తీసుకోవాలని శ్రీనివాసరావు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉండాలని, తద్వారా ఇతరులకు వ్యాపించకుండా చూడాలన్నారు. 10–20 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా రోగిని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపట్టాలని కోరారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు. నీరు రంగు మారితే తప్పక కాచి చల్లార్చాకే తాగాలన్నారు. నిర్దేశిత తేదీ కంటే ముందే గర్భిణులు ఆసుపత్రుల్లో చేరాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవద్దని హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తే వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పామని, ఇప్పుడు కూడా 9154170960కు ఫిర్యాదు చేయాలని కోరారు. అవసరమైతే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తయిందని, సీఎం ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వారందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. -
Telangana: టైఫాయిడ్ విజృంభిస్తోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై టైఫాయిడ్ పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతీ జిల్లాలోనూ కేసులు వెలుగుచూడటంతో స్థానిక అధికారులను అప్రమత్తం చేసింది. ఈ ఏడాది మే, జూన్, జూలైల్లో ఇప్పటివరకు 5,549 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అందులో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 908, మంచిర్యాల జిల్లాలో 658 కేసులు నమోదయ్యాయి. డెంగీ కంటే ఐదురెట్లు ఎక్కువగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు కారణంగా టైఫాయిడ్ పెరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. మరోవైపు ఇదేకాలంలో నీళ్ల విరేచనాల కేసులు(అక్యూట్ డయేరియా) 12,620 మేర నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్లోనే 2,089 కేసులు ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరం లక్షణాలు టైఫాయిడ్ను కలిగించే బ్యాక్టీరియా పేగునాళాల ద్వారా వ్యాపించి పేగు గోడలలోకి చొచ్చుకొని పోయి రక్తంలో కలుస్తుందని, మలం, రక్త నమూనాల ద్వారా రోగనిర్ధారణ చేయవచ్చని వైద్యులు అంటున్నారు. పిల్లలు ఎక్కువగా దీనికి ప్రభావితమవుతుంటారని, మెరుగైన పారిశుధ్యం, వ్యాధికి యాంటీబయాటిక్స్ తప్పనిసరి అని పేర్కొంటున్నారు. ఇది అంటువ్యాధి అయినందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టైఫాయిడ్ వచ్చినప్పుడు జ్వరం 104 డిగ్రీల ఫారిన్హీట్ వరకూ చేరుకుంటుందని, విపరీతమైన చమటలు, గాస్ట్రో ఎంటిరైటిస్, విరేచనాలు కూడా సంభవిస్తాయని చెబుతున్నారు. రెండు వారాల తర్వాత శరీరంపై ఒక్కోసారి దద్దుర్లు, గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయని, కడుపునొప్పి కూడా రావచ్చని, ఈ వ్యాధి సోకినవారు ఎక్కువగా మగతగా ఉంటారని, మూడోవంతు రోగులకు ఛాతీ కింద, పొట్ట మీద గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయని చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో సరైన సమయంలో చికిత్స పొందకపోతే టైఫాయిడ్ జ్వరం వల్ల మరణం కూడా సంభవించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అప్రమత్తం చేశాం రాష్ట్రంలో డెంగీ కంటే అధికంగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. టైఫా యిడ్ ప్రధానంగా కలుషిత ఆహారం, నీరు వల్లే వస్తుంది. వీధుల్లో తోపుడుబండ్లపై ఉండే ఆహార పదార్థాలు, పానీపూరీ తినడం వల్ల టైఫాయిడ్ సంభవించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యే టైఫా యిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. టైఫాయి డ్ రాకుండా ఉండాలంటే ఆహారం వేడిగా తినాలి. మంచినీళ్లను కాచి వడపోసిన తర్వా తే తాగాలి. పానీపూరీ బండ్లు, తోపుడుబండ్లపై అమ్మే ఆరుబయట ఆహార పదార్థాల ను తినకూడదు. టైఫాయిడ్ లక్షణాలుంటే తక్షణమే వైద్యం తీసుకోవాలి. –డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
డెంగీ, చికున్గున్యా వ్యాధులకు చెక్.. ఐసీఎంఆర్ శుభవార్త
పుదుచ్చేరి: డెంగీ, చికున్గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్ ఈజిప్టీ జాతి దోమలను ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాధికారక వైరస్లు ఉన్న మగ దోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో వైరస్లు ఉండవుకనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగీ, చికున్గున్యాలను వ్యాపింపచేయడం అసాధ్యం. డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్ ఈజిప్టీ దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇందుకోసం వీరు గత నాలుగు సంవత్సరాలుగా పరిశోధనలో మునిగిపోయారు. అయితే, ఈ ప్రయోగానికి జనబాహుళ్యంలోకి తేవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డెంగీ, చికున్గున్యా వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న జనావాసాల్లో ప్రతీ వారం ఈ రకం ఆడదోమలను వదలాల్సి ఉంటుందని ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి) డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ చెప్పారు. చదవండి: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో.. -
తెలంగాణలో డెంగీ కేసులు 6,284
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ నాటికి 6,284 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఈ మేరకు వివిధ సంవత్సరాల్లో దేశంలో డెంగీ కేసులు ఏస్థాయిలో నమోదయ్యాయో సమగ్ర నివేదిక విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కేసుల విషయంలో పదో స్థానంలో ఉందని వివరించింది. అత్యంత ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో 27,506 డెంగీ కేసులు నమోదు కాగా, అత్యంత తక్కువగా అరుణాచల్ప్రదేశ్లో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక లడఖ్, లక్షద్వీప్లో డెంగీ కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. గతేడాది దేశవ్యాప్తంగా 44,585 డెంగీ కేసులు నమోదు కాగా, 66 మంది చనిపోయారు. ఈ ఏడాది 1.64 లక్షల కేసులు నమోదు కాగా, 146 మంది చనిపోయారు. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 70 మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. -
విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై..
సాక్షి, పెదకూరపాడు: అతను గ్రామ వలంటీర్.. పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజిగా ఉన్నారు.. ఒకసారిగా జ్వరం, వాంతులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఇరువైపుల పెద్దలు పెళ్లిని ఈనెల 20వ తేదీకి వాయిదా వేసుకున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల గ్రామానికి చెందిన రావెల నాగచైతన్య(26) గ్రామ వలంటీర్గా పనిచేస్తున్నాడు. అతనికి నరసరావుపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 14న పెళ్లి ముహూర్తం. రెండు రోజులుగా చైతన్య జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణ జ్వరంగా భావించిన అతను పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముందు రోజు ఒకసారిగా జ్వరం తీవ్రం కావడంతోపాటు వాంతులు అవుతుండడంతో గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డెంగీతోపాటు కామెర్ల లక్షణాలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు తండ్రి శివయ్య కూడా పదిరోజుల నుంచి డెంగీ లక్షణాలతో బాధపడుతూ గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొంది పెళ్లికి నాలుగు రోజుల ముందుగా డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగచైతన్య తల్లి వెంకాయమ్మ అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతుంది. ఒక కుమారుడు కావడంతో పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. పలు శాఖల ప్రభుత్వ అధికారులు, రాజకీయపార్టీ నేతలు నాగచైతన్యకు నివాళులర్పించారు. -
AP: డెంగీ కట్టడికి స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డెంగీ కేసులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డెంగీ జ్వరాల బారిన పడిన వారికి ఓ వైపు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ.. కేసుల నియంత్రణకు కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ చర్యల ఫలితంగా కేసుల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోంది. నియంత్రణ చర్యలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు 13 జిల్లాలకు 13 మంది సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాలను ర్యాండమ్గా ఎంపిక చేసి డ్రై డే, ఇంటింట సర్వే, ఫాగింగ్ తదితర కార్యక్రమాలు సక్రమంగా చేపడుతున్నారా లేదా అన్నది పరిశీలించి లోటుపాట్లను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. తదనుగుణంగా తదుపరి చర్యలు ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. మూడు రోజులు డ్రై డే డెంగీ కారక దోమల నివారణకు ప్రస్తుతం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం అమలవుతోంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది తమ పరిధిలోని ప్రజలకు దోమల నివారణపై చైతన్యం కల్పిస్తున్నారు. ఆ రోజు నీటి నిల్వలున్న బాటిళ్లు, టైర్లు, ప్లాస్టిక్ కుండీలు, ట్యాంకులను శుభ్రం చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కలి్పస్తారు. ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజులో ప్రభావవంతంగా చేపట్టడానికి వీలు పడటం లేదు. దీంతో మూడు రోజులపాటు (శుక్ర, శని, ఆది) ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తద్వారా సచివాలయాల పరిధిలోని అన్ని ఇళ్లకు సిబ్బంది కచ్చితంగా వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,986 సచివాలయాల పరిధిలో 1.62 కోట్ల గృహాల వారికి అవగాహన కల్పిస్తారు. ఇప్పటివరకూ 2,92,283 గృహాల్లో దోమలు గుడ్లు పెట్టినట్టు గుర్తించి నిర్మూలించారు. 3,006 నీళ్ల ట్యాంక్లను శుభ్రం చేయించారు. ఏఎన్ఎంలు తమ పరిధిలో ఎక్కడైనా మురుగు కాలువలు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్ ద్వారా పంచాయతీ, మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ ఏఎన్ఎంలు 1,60,453 సమస్యలను లేవనెత్తారు. వీటిలో 1,14,464 సమస్యలు పరిష్కారం కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు డెంగీ నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేలా రాష్ట్ర స్థాయిలో స్పెషాలిటీ వైద్యులతో 6 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్(ఆర్ఆర్టీ)లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్టోబర్ 25 నుంచి 31 వరకూ రాష్ట్రంలో 193 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క విశాఖపట్నంలోనే 43, తూర్పు గోదావరిలో 38, గుంటూరులో 20 చొప్పున.. మూడు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. శ్రీకాకుళంలో 19, ప్రకాశం జిల్లాలో 16 మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో కేసుల నమోదు తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కేసుల నమోదుపై ప్రభుత్వం ఎంటమలాజికల్ స్టడీ చేపడుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న విశాఖపట్నం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు, మిగిలిన జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఎంటమలాజికల్ స్టడీ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు మురుగు నీటి కుంటలు, కాలువల్లో దోమ లార్వాలను తినే 24.75 లక్షల గంబూషియా చేప పిల్లలను వదిలారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రులు ఉండేవి. వీటిలోనే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ప్రభుత్వం వీటి సంఖ్యను 54కు పెంచింది. ఈ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 58,949 డెంగీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, డెంగీ బారిన పడిన వారికి వైద్యం, మందులు ఈ ఆస్పత్రుల్లో అందిస్తున్నారు. విష జ్వరాలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. ప్రతి కేసూ సూక్ష్మ పరిశీలన రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ, మలేరియా ప్రతి కేసును సూక్ష్మంగా పరిశీలిస్తున్నాం. కేసు నమోదు కావడానికి కారణాలేమిటనేది అన్వేషించి నివారణ చర్యలు చేపడుతున్నాం. కేసులు నమోదైన ప్రాంతాలను వైద్యుల బృందం పరిశీలించి మునిసిపల్, పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైనన్ని టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకూ నమోదైన కేసులు ఇలా.. జిల్లా కేసుల సంఖ్య శ్రీకాకుళం 120 విజయనగరం 177 విశాఖపట్నం 899 తూర్పు గోదావరి 506 పశ్చిమ గోదావరి 221 కృష్ణా 153 గుంటూరు 565 ప్రకాశం 134 నెల్లూరు 46 చిత్తూరు 98 వైఎస్సార్ 27 కర్నూలు 181 అనంతపురం 154 మొత్తం 3,281 -
Hyderabad: వ్యాధుల రొద.. రోగుల వరద!
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా మహమ్మారి జడలు విప్పి నాట్యం చేస్తుంటే.. దీనికి తోడు ఇతర వ్యాధులూ నగర వాసుల్ని పట్టిపీడిస్తున్నాయనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. డెంగీ, మలేరియా, డయేరియా, విష జ్వరాలు జనాలను భయకంపితుల్ని చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్తో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. వందల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు దవాఖానాలకు పోటెత్తుతున్నారు. సోమవారం గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చికిత్స కోసం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించడం వ్యాధుల తీవ్రతకు దర్పణం పడుతోంది. చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్పై ఇద్దరు బాలింతలు.. ఫీవర్ ఆస్పత్రిలో క్యూలైన్.. నిలోఫర్ ఆవరణలో కిక్కిరిసి.. -
డెంగ్యూపై మాండవీయ సమీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీసహా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న డెంగ్యూ వ్యాధి కట్టడిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన వ్యక్తంచేశారు. దోమకాటుతో ప్రభలే ఈ వ్యాధి కారణంగా ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఇప్పటికే 1,530 డెంగ్యూ కేసులు వెలుగుచూశాయి. గత నాలుగేళ్లలో ఢిల్లీలో ఇంత ఎక్కువ కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన సంబంధిత వైద్య అధికారులతో మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మన్సుఖ్ మాట్లాడారు. కేసులు ఎక్కువ అవుతోన్న రాష్ట్రాలను గుర్తించి, ఆయా రాష్ట్రాలకు సంబంధిత నిపుణులను పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్కు సూచించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందనుందని భరోసా ఇచ్చారు. -
ఢిల్లీలో డెంగీ తొలి మరణం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో డెంగీ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది ఇదే తొలి మరణమని వెక్టార్ డిసీజ్ పౌర నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సరితా విహార్కు చెందిన మమత(35) డెంగీ బారిన పడి సెప్టెంబర్ 20న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె సెప్టెంబర్ 25న మృతి చెందారని వివరించింది. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో 723 డెంగీ కేసులు నమోదు అయ్యాయని, గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9 వరకూ 480 కేసులు వెలుగులోకి రాగా ఒక్క వారంలోనే 243 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. గడిచిన 2 వారాలుగా ఢిల్లీలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి పేర్కొన్నారు. 2020లో 1,072 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారని, 2019లో ఇద్దరు, 2018లో నలుగురు, 2017లో 10 మంది, 2016లో 10 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు, మార్చిలో ఐదు, ఏప్రిల్లో పది, మేలో 12, జూన్లో ఏడు, జూలైలో 16, ఆగస్ట్లో 72, సెప్టెంబర్లో 217 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో మలేరియా కేసులు 142, చికున్గున్యా కేసులు 69 నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. (చదవండి: కోవాగ్జిన్పై అదనపు సమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ) -
చిన్నారుల్లో ‘డెంగీ’ కలవరం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి గ్రేటర్ వాసులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజాగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, చికెన్గున్యా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు...వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల వల్ల అనేక మంది విషజ్వరాల బారినపడు తున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రస్తుతం ఏ ఇంట్లోకి చూసినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ జ్వరపీడితుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి ఐదుగురు జ్వరపీడితుల్లో ఒకరికి డెంగీ పాజిటివ్ రిపోర్ట్ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. బస్తీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో శివారు ప్రాంతాల్లోని బాధితులంతా మెరుగైన వైద్యం కోసం నగరంలోని బోధనాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ సహా నల్లకుం ట ఫీవర్ ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్సలు అందించాల్సి వస్తుంది. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన నిలోఫర్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1,200 మంది చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిటకిటలాడుతున్న పెద్దాసుపత్రులు.. హైదరాబాద్ జిల్లాలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 40పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 36 ఉన్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో 200పైగా బస్తీ దవాఖానాలతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదు. సాధారణ రక్త, మూత్ర పరీక్షలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రిలో రోజు సగటు ఓపీ 1,200 ఉండగా, ప్రస్తుతం 1,800 నుంచి 2,000పైగా నమోదవుతోంది. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో సగటు ఓపీ 350 ఉండగా, ప్రస్తుతం వెయ్యి దాటింది. ఇక నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 900 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 1,500 దాటింది. ఈఎన్టీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి వైద్యసేవలు అందిం చాల్సి వస్తుంది. ఓపీకి వస్తున్న వారిలో ఎక్కువగా జ్వరపీడితులే. కరోనా భయం ఇంకా పోకముందే, డెంగీ జ్వరాలు వెంటాడుతుండటంతో నగరవాసులు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుంది. కరోనా, డెంగీలోనూ ఒకే లక్షణాలు ఉండటంతో ఈ జ్వరాల గుర్తింపు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వర పీడితులకు డెంగీ బూచీ.. ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడికి వచ్చిన బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపుతున్నారు. రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో జ్వరం తీవ్రత మరింత పెరిగి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విధిలేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కరోనా, డెంగీ పరీక్షల పేరుతో ఆయా కేంద్రాలు రోగుల నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లపై సరైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ, కరోనా జ్వరాలుగా పేర్కొంటూ అత్యవసర చికిత్సలను సిఫార్సు చేస్తున్నారు. ఐసీయూ చికిత్సల పేరుతో పేదలను దోచుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరం లోని కొంత మంది వైద్యులు డెంగీ మరణాలను బూచిగా చూపించి..ప్లేట్లెట్ కౌంట్స్ చికిత్సల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు డెంగీ కేసుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉన్నా.. అనుమానం రాకుండా సస్పెక్టెడ్ డెంగీ కేసుగా అడ్మిట్ చేసుకుని చికిత్సలు చేస్తుండటం విశేషం. డెంగీకి కారణాలివే – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా ►ఎడిస్ ఈజిప్టే (టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. సాధారణంగా ఇది పగలు మాత్రమే కుడుతుంది. ►కేవలం పగలు మాత్రమే కుట్టే డెంగీ దోమలు లైట్ల వెలుగులు విరజిమ్ముతుండటంతో రాత్రి వేళలోనూ కుడుతున్నాయి. ►ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బోండాలు, సీసాలు, డబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూసుకోవాలి. ►వర్షపు నీరు వీటిలో చేరి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయంగా మారి వీటిలో గుడ్లు పెడుతుంటాయి. ►ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టి ఉంచాలి. సీజన్ మారుతుండటం వల్లే – డాక్టర్ వెంకటి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్ జిల్లా వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేదు. సీజన్ మారిన ప్రతిసారీ దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలు సర్వసాధారణం. భయపడాల్సిన పనిలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు బదులుగా అప్పుడే వండిన తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం, గోరు వెచ్చని మంచినీరు తాగడం; తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకాలు వేసుకోవాలి. -
ఖమ్మం ఉమ్మడి జిల్లాపై డెంగ్యూ పంజా
-
విజృంభిస్తున్న విషజ్వరాలు: డెంగీ..మలేరియా..టైఫాయిడ్!
అంబర్పేట: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. నిత్యం 40 నుంచి 50 ఉండే ఓపీ.. ప్రస్తుత సీజన్లో 70 నుంచి 80కి పెరిగింది. నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నాలుగు బస్తీ దవాఖానాలకు సామాన్య రోగుల సంఖ్య తాకిడి ఎక్కువైంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జ్వరాల భారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకూ పరుగులు తీస్తున్నారు. ఈ సీజన్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యంతోనే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండగా బస్తీ దవాఖానాలు సీజన్ వ్యాధులు ప్రబలుతుండటంతో బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు బస్తీ దవాఖానాల్లో వైద్యులు ఓపీ చూస్తున్నారు. సాధారణ జనంతో పాటు ఇతర జ్వరాలను గుర్తించి చికిత్స అందించడంతో పాటు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేస్తున్నారు. నియోజకవర్గంలో అంబర్పేట మున్సిపల్ కాలనీ, బాగ్ అంబర్పేట అయ్యప్ప కాలనీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెహ్రూనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫీవర్ ఆసుపత్రిలో వెనుకాల ఉన్న తిలక్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యానగర్ డీడీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓపీతో పాటు వైద్య పరీక్షల శాంపిళ్లు సేకరించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయా డివిజన్లలో ఉన్న బస్తీ దవాఖానాల్లో సైతం వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి పంపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో తేలిన ఫలితాన్ని బట్టి కోవిడ్కు చికిత్సను అందిస్తున్నారు. దోమల నియంత్రణలో విఫలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా దోమలను నియంత్రించడంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం విఫలమవుతున్నది. దోమల లార్వా, దోమల విజృంభణలను నివారించడంలో ఎంటమాలజీ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూ.. తూ.. మంత్రంగా ఫాగింగ్ చేపట్టి చేతులు దులుపు కుంటున్నారే తప్ప వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. లార్వా నిర్మూలనలో సైతం పై పై చర్యలు తీసుకొని మిన్నకుండి పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్య విభాగాన్ని సమాయత్తం చేశాం సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. సీజనల్ వ్యాధులను అరికడుతూనే విస్తృతంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతున్నాం. సీజనల్ వ్యాధులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. – డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ హేమలత -
యూపీని వణికిస్తున్న విష జ్వరాలు.. హెమరాజిక్ డెంగీ కాటు వల్లే
ఫిరోజాబాద్/లక్నో: ఉత్తరప్రదేశ్లో డెంగీతోపాటు విష జ్వరాలు చిన్నారుల ప్రాణాలను కబళిస్తున్నాయి. జ్వరాల కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 50కి చేరిందని, మృతుల్లో 40 మంది చిన్నారులు ఉన్నారని ప్రభుత్వ అధికారులు శుక్రవారం ప్రకటించారు. జ్వరాల కాటుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజధాని లక్నోలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆగ్రా, ఫిరోజాబాద్ జిల్లాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, జ్వర పీడితులకు వైద్య సాయం అందించాలని, మరణాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆక్సిజన్ సదుపాయం ఉన్న ఐసోలేషన్ పడకలు కేటాయించాలన్నారు. కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను జ్వర పీడితుల వైద్యం కోసం వాడుకోవాలని చెప్పారు. ఫిరోజాబాద్లో జ్వరాల తీవ్రతపై కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్కు చెందిన నిపుణులను ఫిరోజాబాద్కు పంపించింది. మథుర, ఆగ్రా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయని యూపీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ కుమార్ ప్రేమీ చెప్పారు. ఫిరోజాబాద్ జిల్లాలో ప్రస్తుతం 3,719 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. హెమరాజిక్ డెంగీ కాటు వల్లే.. ప్రమాదకరమైన హెమరాజిక్ డెంగీ కాటు వల్లే చిన్నారులు ఎక్కువగా బలవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం తెలియజేసిందని ఫిరోజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్రవిజయ్ సింగ్ అన్నారు. ఈ రకం డెంగీ వల్ల బాలల్లో ప్లేట్లెట్ల సంఖ్య హఠాత్తుగా పడిపోతుందని, రక్తస్రావం అవుతుందని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ముగ్గురు వైద్యులను ఆయన సస్పెండ్ చేశారు. -
దోమకాటు: బోదకాలు, చికున్ గున్యా, కాలా అజర్.. ఇంకా
వానాకాలం వచ్చిందంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ ఇదే సమయంలో మనిషికి ప్రమాదకరమైన దోమల్లాంటి కీటకాల విజృంభణ పెరుగుతుంది. అనాది కాలంగా దోమకాటు మనిషికి ప్రాణాంతకంగా ఉంటోంది. ఆధునిక యుగంలో వైద్య విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అందుకే దోమలే కదా, అని తీసిపారేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ లాంటి ఉష్ణమండల దేశాల్లో, జనాభా అధికంగా ఉండే దేశాల్లో దోమలు పలురకాలుగా చెలరేగుతుంటాయి. వీటివల్ల రకరకాల వ్యాధులు సంభవించడమే కాకుండా, వీటిలో కొన్ని వ్యాధులు ప్రాణాంతకాలు కూడా! ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం దోమకాటుకు భారత్తో సహా దక్షిణాసియాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సో.. అజాగ్రత్త అస్సలు పనికిరాదు. దోమలు.. వ్యాధులు మనిషి రక్తాన్ని నేరుగా పీల్చే దోమలు అదే రక్తంలోకి పలురకాల సూక్ష్మ క్రిములను ప్రవేశపెడతాయి. దీంతో మనిషిలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. భారత్లో దోమల ద్వారా వ్యాపించే కొన్ని ప్రమాదకరవ్యాధుల వివరాలు ఇలా ఉన్నాయి.. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వ్యాపిస్తుంది. ఉదయం, సాయంత్ర వేళ్లలో అనాఫిలస్ దోమకాటు వల్ల ప్లాస్మోడియం సోకుతుంటుంది. సోకిన తర్వాత అధిక జ్వరం, విపరీతమైన చలి, తలనొప్పి, విపరీతమైన చెమటలు, కండరాల నొప్పి లాంటి లక్షణాలు బయటపడతాయి. పిల్లలు, గర్భిణులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు, తరచూ ప్రయాణాలు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం అతం్యంత ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. తగ్గడానికి క్లోరోక్వినాన్ మందును వాడతారు. బోదకాలు ఒకప్పుడు భారత్లో పలు ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేది. వుచరేరియా అనే పరాన్నజీవి వల్ల, క్యూలెక్స్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. మనిషి లింఫాటిక్ వ్యవస్థలో పరాన్న జీవి చేరుకొని రక్తం నిండా దాని లార్వాని కోట్ల సంఖ్యలో విడుదల చేస్తుంది. దీనివల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతిని కణజాలాలు వాయడం, చర్మం బిరుసెక్కడం, అవయవాల్లో అనవసర ద్రవాలు చేరడం సంభవిస్తుంది. దీనివల్ల క్రమంగా వైకల్యం వస్తుంది. చికున్ గున్యా ఇది కూడా వైరస్ ద్వారా సోకుతుంది. ఏడిస్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. తలనొప్పి, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు వారం పాటు ఉండి తగ్గినా, నొప్పులు మాత్రం నెలల పాటు కొనసాగుతాయి. డెంగ్యూతో ఈ వ్యాధి లక్షణాలకు పోలిక ఉంటుంది. రక్తపరీక్షద్వారా నిర్ధారిస్తారు. కాలా అజర్ లెస్మోనియాసిస్ పరాన్నజీవి వల్ల సాండ్ఫ్లై కాటుతో సంక్రమిస్తుంది. వారాల పాటు తగ్గని జ్వరం, ప్లీహం ఉబ్బడం, రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటాయి. తొందరగా చికిత్స అందకపోతే రెండేళ్లలో మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ జ్వరం తగ్గిన తర్వాత చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇది వైరస్ ద్వారా క్యూలెక్స్ దోమ కాటు వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు వస్తాయి. ముదిరినప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో మూర్చరోగం కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. డెంగ్యూ వైరస్ ద్వారా సోకుతుంది. సోకిన 3–14 రోజుల్లో అధిక జ్వరం, వాంతులు, కీళ్లనొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు బయటపడతాయి. తగ్గడానికి నిర్దిష్టమైన మందులు లేవు. లక్షణాలను బట్టి మందులు వాడతారు. దాదాపు వారంలో తగ్గుతుంది. కానీ ఒక్కోసారి జ్వరం చాలా ఎక్కువైతే చర్మం కింద రక్తనాళాలు చిట్లడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు ఆస్పత్రిలో చేరాల్సిఉంటుంది. దోమల ద్వారా వచ్చే వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు. ఉదాహరణకు మలేరియా దాదాపు 90కిపైగా దేశాల్లో కనిపిస్తుంది. ఏటా దాదాపు 50 కోట్లమంది దీని బారిన పడుతుంటే, వీరిలో 27 లక్షల మంది మరణిస్తుంటారు. దోమల ద్వారా ఏటా 250 కోట్ల మంది పలు వ్యాధులబారిన పడుతున్నట్లు అంచనా. అందువల్ల ఇవి సోకిన తర్వాత చికిత్స కన్నా నివారణే మంచి మార్గమని నిపుణుల సలహా. చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే! -
కరోనానా? సీజనల్ జ్వరమా?
సాక్షి,విజయవాడ: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రజల్లో ఫోబియో నెలకొంది. ఏ జ్వరం వచ్చినా.. జలుబు, చిన్నపాటి దగ్గు వచ్చినా నిర్ధారణ పరీక్షలు కూడా లేకుండా కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తెలియని వారు చేస్తే ఏదో అనుకోవచ్చు.. విద్యావంతులు సైతం ఇదే విధంగా మందులు వాడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకొంటుండటం ఆందోళనకర పరిణామం. ఇవే నిదర్శనాలు.. ∙నగరానికి చెందిన ఒక సూపర్స్పెషాలిటీ వైద్యురాలికి తీవ్రమైన జ్వరం వచ్చింది. స్వయాన వైద్యురాలు అయినప్పటికీ ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించకుండానే కరోనాగా భావించి మందులు వాడేశారు. యాంటీ కోయాగ్యులేషన్(రక్తం పలుచన చేసేవి) మందులు కూడా వినియోగించారు. వారం రోజుల తర్వాత ఓ రోజు వేకువజామున ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా డెంగీగా నిర్ధారణయ్యింది. సహజంగా డెంగీ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గి రక్తం గడ్డకట్టే గుణం కోల్పోతారు. దానికి తోడు ఆమె రక్తం పలుచన చేసే మందులు కూడా వాడటంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. ∙నగరానికి చెందిన విద్యావంతుడైన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గక పోవడంతో, కరోనాగా భావించి మందులు వాడేశారు. మూడు రోజులకు జ్వరం తీవ్రం కావడంతో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా, టైఫాయిడ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుడు టైఫాయిడ్కు మందులు ఇవ్వడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతోంది.. ఇప్పుడు సమాజంలో చాలా మంది చిన్న పాటి జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు వచ్చినా, లక్షణాలను బట్టి కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అది సరైన విధానం కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఏ మందు అయినా అవసరం వచ్చినప్పుడు, ఆ మేరకు మాత్రమే వాడాలంటున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, అవసరమైనప్పుడు పనిచేయకుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ‘సీజనల్’ సమయం.. ప్రస్తుతం సీజనల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే జ్వరం వచ్చిన వెంటనే కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. దానిలో పాజిటివ్ వస్తేనే కరోనాకు మందులు వాడాలి. ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా జ్వరం తగ్గకుంటే, అప్పుడు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా, డెంగీ నిర్ధారణకు జ్వరం వచ్చిన ఒకటీ, రెండు రోజుల్లో పరీక్ష చేయొచ్చు. కానీ టైఫాయిడ్ నిర్ధారణకు వారం రోజుల తర్వాత చేయాల్సి ఉంటుంది. లక్షణాలు ఇవీ.. కోవిడ్: జ్వరం, ఒళ్లు నొప్పులు, పొడిదగ్గు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. టైఫాయిడ్: జ్వరం వచ్చిన రోజు నుంచి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లోనే అధికమవుతుంటుంది, జ్వరం వచ్చినప్పుడు చలి, వణుకు రావడం, విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. డెంగీ: అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, విపరీతమైన న డుం నొప్పితో పాటు, కీళ్ల నొప్పులు ఉంటాయి. మలేరియా: విపరీతమైన జ్వరం, చలి ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఆకలి మందగిస్తుంది. చదవండి:జర జాగ్రత్త!.. ఆహారం.. విరామం.. అతి చేస్తే హానికరం -
తెలంగాణను వణికిస్తున్న విష జ్వరాలు
-
విషమిస్తోంది.. కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో విష జ్వరాలు కమ్ముకుంటున్నాయి. పల్లెలు, ఆదివాసీ గూడేలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఊళ్లకు ఊళ్లు నీరసిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వేలాది మంది బాధితులు క్యూ కడుతున్నారు. పలుచోట్ల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇక చాలా ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ బాధితులకు ప్లేట్లెట్లు ఎక్కించే సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కొందరు పాత జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్కు వెళ్తున్నారు. ముందుగా గుర్తించలేక, సరైన సమయంలో చికిత్స అందక డెంగీ, ఇతర జ్వరాలబారిన పడ్డవారు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ డెంగీతో, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మరో యువకుడు టైఫాయిడ్తో ప్రాణాలు వదిలారు. మూడు ఊళ్లు.. 200 మంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం, ఇల్లందులపాడుతండా, తవిశలగూడెం గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొదట ఈ నెల 4న ఇల్లందులపాడుతండాలో డెంగీ లక్షణాలతో ఒకరిద్దరు మంచాన పడ్డారు. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు గ్రామాల్లో కలిపి 200మందికిపైగా డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు డెంగీ లక్షణాలతో చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరుగా.... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విష జ్వరాలు కమ్ముకున్నాయి. గత నాలుగైదు రోజుల్లోనే లైన్తండా గ్రామంలో 12 మంది జ్వరాల బారిన పడ్డారు. భూపతిపేట, మచ్చర్ల గ్రామాలు, మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోనూ ఇదే పరిస్థితి. విష జ్వరాల బాధితులతో గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పడకలన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత నెల వ్యవధిలో విషజ్వరాలు, మలేరియా, డెంగీతో 35 మందికిపైగా చనిపోయారు. అందులో 20 మంది డెంగీ బాధితులే ఉన్నట్టు సమాచారం. అధికారిక లెక్కల ప్రకారమే.. జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు 32 వేల మందికిపైగా విషజ్వరాల బారినపడ్డారు. ►ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి జ్వర పీడితులతో నిండిపోయింది. పిల్లల వార్డులోనే వంద మందికిపైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి రోజూ 100 మందికిపైగా విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్య సిబ్బంది చెప్తున్నారు. ►ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగీ, మలే రియా, ఇతర విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గిరిజన తండాలు ఎక్కువున్న దేవరకొండ ప్రాంతంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి. ►నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోయాయి. ఒక్కో ఆస్పత్రిలో పది నుంచి ఇరవై మంది డెంగీ, మలేరియా బాధితులున్నట్టు తెలిసింది. నిజామాబాద్ పట్టణంతోపాటు ఆర్మూర్, పోచంపాడ్, బాల్కొండ, భీంగల్, డిచ్పల్లి, సిరికొండ, నందిపేట, నవీపేట ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ►ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే.. 67 డెంగీ కేసులు, 2 చికున్గున్యా, 32 మలేరియా కేసులు నమోదయ్యా యి. అనధికారికంగా ఈ సంఖ్య వందల్లో ఉంటుందని స్థానిక అధికారులే చెప్తున్నారు. ►ఖమ్మం జిల్లాలో జూలైలో 42, ఈ నెలలో ఇప్పటివరకు 38 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో విషజ్వరాల బాధితులు కనిపిస్తున్నారు. డెంగీతో నాయబ్ తహసీల్దార్ .. నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నాయబ్ తహసీల్దార్గా పనిచేస్తున్న కొంతం శ్రీకాంత్(40) మంగళవారం డెంగీ బారినపడి మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని నాయుడివాడకు చెందిన ఆయన.. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలో వివిధస్థాయిల్లో పనిచేశారు. ఇటీవలే కలెక్టరేట్కు బదిలీపై వచ్చారు. నాలుగైదు రోజుల క్రితం తీవ్ర జ్వరంరాగా స్థానిక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. మంగళవారం వేకువజామున హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. శ్రీకాంత్కు భార్య జ్యోతి, కూతురు(12), కుమారుడు(10) ఉన్నారు. టైఫాయిడ్తో యువకుడు మృతి ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చెందిన అశోక్ (25) వారం కింద టైఫాయిడ్ బారినపడ్డాడు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మంగళవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కొమిలిపెంటకు చెందిన ఈ మహిళ పేరు జల్ల ముత్తమ్మ. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ.. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. వారమైనా జ్వరం అదుపులోకి రాకపోవడంతో మన్ననూరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. అడ్డగోలు వసూళ్లకు దిగిన ఆస్పత్రులు విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు పెరుగుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలు వసూళ్ల దందాకు దిగుతున్నాయి. అందులోనూ డెంగీ బారినపడ్డ వారి నుంచి రోజుకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. రోగులకు ప్లేట్లెట్లు ఎక్కిస్తూ.. ఒక్కో బ్యాగ్కు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. కన్సల్టేషన్, బెడ్, ఇతర చార్జీలు, మందుల పేరిట మరింతగా బిల్లులు వేస్తున్నారని బాధితులు చెప్తున్నారు. -
ఢిల్లీకి మరో ముప్పు.. అటు కరోనా.. ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. మరోవైపు దోమకాటు కారణంగా వచ్చే డెంగ్యూ వైరల్ జ్వరాల కేసులు ఢిల్లీలో పెరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్య నమోదైన డెంగ్యూ కేసులు 2018 నుండి వస్తున్న కేసులను అధిగమించాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత వారంలో, కొత్తగా నలుగురు డెంగ్యూ రోగులతో మొత్తం రోగుల సంఖ్య ఈ ఏడాది 13కి చేరుకుంది. అయితే జనవరి 1 నుంచి ఏప్రిల్ 17 మధ్య సమయంలో 2017 సంవత్సరంలో 18 మంది, 2018 సంవత్సరంలో 12 మంది, 2019 లో 8 మంది, 2020 లో 7గురు డెంగ్యూ రోగులను గుర్తించారు. అధికార గణాంకాల ప్రకారం మొత్తం 13 మంది డెంగ్యూ రోగుల్లో నలుగురు సౌత్ ఢిల్లీ కార్పోరేషన్ పరిధికి చెందిన వారుగా గుర్తించారు. అదే సమయంలో, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని కలిగి ఉన్న దోమలు ముఖ్యంగా పట్టణ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయని, వాటి పరిధి సమశీతోష్ణ ప్రాంతాల వైపు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు సైతం తెలిపారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది. ఈ అంటువ్యాధులను బాగా ఎదుర్కోవటానికి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, కీటక శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టుల బృందం గతంలో ఒక అధ్యయనం చేసింది. ఢిల్లీలో దోమ–లార్వా పెంపకాన్ని నివారించడానికి సుమారు 15వేలకు పైగా ఇళ్లను పురుగుమందులతో పిచికారీ చేశారు. బహిరంగ ఉష్ణోగ్రత తగ్గడంతో, దోమలు సాయంత్రం వేళల్లో ఇళ్ళలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి సూర్యాస్తమయం అనంతరం తలుపులు / కిటికీలు మూసివేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చదవండి: కరోనా టీకా సంస్థలకు బూస్ట్ లాక్డౌన్ భయం.. విచ్చలవిడిగా షాపింగ్ -
ఇటలీ పర్యటనకు మేరీకోమ్ దూరం
న్యూఢిల్లీ: భారత బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్ సన్నాహాలు మొదలు కానున్నాయి. నాణ్యమైన ప్రాక్టీస్ కోసం బాక్సర్లను ఇటలీ పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 28 మందితో కూడిన భారత బృందాన్ని ఎంపిక చేసింది. 10 మంది పురుషులు, ఆరుగురు మహిళా బాక్సర్లతో పాటు సహాయ సిబ్బంది వచ్చే వారం ఇటలీకి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు 52 రోజుల శిక్షణకు అవసరమయ్యే రూ. 1.31 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 5 వరకు ఇటలీలోని అసిసి నగరంలో జరిగే ఈ శిబిరానికి దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్తోపాటు మరో ఇద్దరు బాక్సర్లు పాల్గొనడం లేదు. డెంగ్యూ కారణంగా మేరీకోమ్, గాయం నుంచి కోలుకుంటోన్న మనీశ్ కౌశిక్ (63 కేజీలు) ... అమెరికాలో ప్రాక్టీస్ చేస్తోన్న కారణంగా వికాస్ (69 కేజీలు) ఈ పర్యటనకు గైర్హాజరు కానున్నారు. అనారోగ్యం తగ్గాక ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తానని మేరీకోమ్ చెప్పింది. ‘డెంగ్యూతో బాధపడుతున్నా. ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ ప్రయాణించే ఉద్దేశం లేదు. వచ్చే ఏడాది విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తా’ అని మేరీ తెలిపింది. ఒలింపిక్స్ పతకావకాశాలున్న అమిత్ పంఘాల్ (52 కేజీలు), ఆశిష్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు), సిమ్రన్ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. -
అంటువ్యాధులు పరార్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలతో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే జూన్, జూలై, ఆగస్టులో మలేరియా కేసులు సగానికి పైగా తగ్గగా డెంగీ, డయేరియా 10–20 శాతానికే పరిమితమైనట్లు పంచాయతీరాజ్ శాఖ పరిశీలనలో తేలింది. 13 వేల పంచాయతీల్లో పారిశుధ్య పనులు.. ► ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకు ముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్, పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. ► మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా మనం – మన పరిశుభ్రత పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా డెంగీ కేసులు... ► గత ఏడాది జూన్, జూలై, ఆగస్టులో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి ఇదే కాలంలో కేవలం 601 మాత్రమే నమోదైనట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. డెంగీ కేసులు గత ఏడాది మూడు నెలల్లో 944 కేసులు నమోదు కాగాఈసారి అదే వ్యవధిలో 24 మాత్రమే గుర్తించారు. ► గత ఏడాది 1,11,685 డయేరియా కేసులు మూడు నెలల్లో నమోదు కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో 20,355 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది 9,528 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 355 కేసులే నమోదయ్యాయి. -
ఏది డెంగీ.. ఏది కరోనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఓ వైపు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. మరోవైపు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో రాబోయే 15 రోజుల పాటు డెంగీ జ్వరాలు విస్తరించే అవకాశముందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే జ్వ రం వస్తే.. డెంగీదా? లేక కరోనాదా? తెలి యక జనానికి గందరగోళంగా మారింది. ము న్ముందు కరోనాతోపాటు డెంగీ కేసులు కూడా పెరిగే అవకాశం ఉండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కిందిస్థాయిలో ఇంటిం టి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే.. మరోవైపు డెంగీ, మలేరియా, చికున్ గున్యా తదితర వ్యాధుల ను నియంత్రించడంపై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. (చదవండి: బాధితులతో రాయ‘బేరాలు’) గతేడాది తీవ్రంగానే డెంగీ.. గతేడాది డెంగీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారమే అప్పుడు ఏకంగా 13వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డెంగీ వీరవిహారం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,100 వరకు డెంగీ కేసులు, 600 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. డెంగీకి, కరోనాకు కామన్గా రెండింటికీ ఒకే తరహా లక్షణాలుండటంతో ఏదేంటో అంతుబట్టడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసంగా ఉండటం డెంగీలో ఉండే సాధారణ లక్షణాలు. ఇవే కరోనాలో కూడా ఉండటంతో బాధితులు తమకు ఏది సోకిందో టెస్టులు జరిగి నిర్ధారణయ్యే వరకు తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రెండూ కలిసి వచ్చే అవకాశాలున్నాయా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవాల్సి రావడం వైద్య యంత్రాంగానికి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కరోనా కాలం కావడంతో ఉన్న సిబ్బంది అంతా దానికోసమే పనిచేయాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా తక్షణ నియామకాలు చేపట్టాలని సర్కారు ఆదేశించినప్పటికీ.. చాలాచోట్ల తాత్కాలిక నియామకాలకే నోటిఫికేషన్లు ఇవ్వడంతో భర్తీ ప్రక్రియ ముందుకుసాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 1682 కేసులు, 8 మంది మృతి) జిల్లాలకు ఇవే మార్గదర్శకాలు.. ⇒ ప్రతి జిల్లాలోనూ కరోనా కేసులు ఎక్కువున్న ప్రాంతాలు, తక్కువ ఉన్న ప్రాంతా లు, అసలు కేసులు నమోదు కాని ప్రాంతాలుగా వేర్వేరుగా విభజించాలి. ⇒ దోమల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతూనే కరోనా నిబంధనలను పాటించడంపై ప్రజలను చైతన్యం చేయాలి. ⇒ కరోనా జాగ్రత్తలతోపాటు ఇళ్లు, పరిసరా ల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ⇒ డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర నిర్ధారణ చేయాలి. ⇒ మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాల ను చేపట్టాలి. æ డెంగీ, కరోనా రెం డూ ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సమీపం లోని ఆసుపత్రికి సమాచారమివ్వాలి.