-
Lalu Prasad Yadav: కుల గణన చేయాల్సిందే
పట్నా(బిహార్): కేంద్ర ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించాలని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. కుల గణన తర్వాత మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉందని తేలితే ఆ మేరకు రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత దక్కాలని ఆయన అభిలషించారు. మొత్తం జనాభా కంటే ఈ వర్గాల జనాభా సగం కంటే ఎక్కువగా ఉంటే ఇప్పుడు అమలవుతోన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఆర్జేడీ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. ‘ స్వాతంత్య్రం రాక ముందు నాటి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కోటాలను అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం. వేర్వేరు సామాజిక వర్గాల తాజా జనాభాలను లెక్కించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై నిర్ణయాలు తీసుకోవాలి. కుల గణన చేపట్టాలని తొలిసారిగా డిమాండ్ చేసింది నేనే. ఈ డిమాండ్ను పార్లమెంట్ వేదికగా గతంలోనే నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడున్న కోటా ప్రస్తుత అవసరాలకు సరిపోదు. రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు’ అని లాలూ వ్యాఖ్యానించారు. లాలూ చిన్న కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం కుల గణన అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ఇటీవల ప్రస్తావించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక త్వరలోనే బిహార్లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని లాలూ చెప్పారు. దాణా కుంభకోణం, తదితర కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తూ, మరి కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. అనారోగ్యం, మెరుగైన చికిత్స కారణాలతో బెయిల్ లభించడంతో ఈ ఏడాది జైలు నుంచి బయటికొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. చదవండి: Farmers Protest: రైతు నిరసనలకు 300 రోజులు -
50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బుధవారం బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీఈడీ, డీఈడీ, పీఈటీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్న మాదిరిగానే టీచర్ పోస్టులను భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను తీ ర్చిదిద్ది పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారని, వేలకోట్లను వెచ్చిస్తున్నా రని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకెన్సీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయన్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో లాల్కృష్ణ, లక్ష్మణ్యాదవ్, అంజి, సత్యనారాయణ, అనంతయ్య, సతీశ్, చంటి ముదిరాజ్, సుచిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు.. -
స్టీల్ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్
-
‘విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి’
ముషీరాబాద్ (హైదరాబాద్): రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి, ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్లోని రాష్ట్ర బీసీ భవన్లో తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం వ్యవస్థాపకుడు సుతారపు వెంకట నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. విద్యారంగ సమగ్ర వికాసానికి ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ గా ఉన్న 40 వేల టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలన్నారు. రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక.. తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుతారపు వెంకట నారాయణ, ఉపాధ్యక్షుడిగా పరంకుశం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు మధుకర్, సం యుక్త కార్యదర్శిగా కె.శ్రీనివాస్, కోశాధికారిగా నరేందర్లు ఎన్నికయ్యారు. -
కరోనా మూలాలు తేలాల్సిందే!
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై తన దాడిని ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు కోవడానికి ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మహమ్మారి విజృంభించకుండా, ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోరిసన్ మాట్లాడుతూ శనివారం ఈవ్యాఖ్యలు చేశారు. కరోనా మూలలపై విచారణ చేస్తేనే మానవాళికి మరో ప్రపంచ మహమ్మారి ముప్పు తప్పుతుందన్నారు. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) టెలికాన్ఫరెన్స్ వీడియో లింక్ ద్వారా ఐరాస్ 75 వ వార్షికోత్సవ సమావేశాల్లో ప్రసగించిన మోరిసన్ ప్రపంచ దేశాలను కరోనా వణికించిందని, మానవాళిని విపత్తులో ముంచిందని వ్యాఖ్యనిచారు. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ మూలాన్ని, అది మానవులకు ఎలా వ్యాపించిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరు టీకాను కనుగొన్నారో వారు ప్రపంచ దేశాలతో తప్పక పంచుకోవాలని ఇది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్త్రేలియా వాగ్దానం చేస్తోందిని అలాగే అన్ని దేశాలు అలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ప్రధాని దాడి తరువాత ఆస్ట్రేలియా చైనా మధ్య సంబంధాలు, వాణిజ్య యుధ్దం సెగలకు మోరిసన్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా విలయాన్ని సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తరువాత ఆస్ట్రేలియా డ్రాగన్ను టార్గెట్ చేసింది. అప్పటి నుండి చైనా ఆస్ట్రేలియాపై వాణిజ్య ఆంక్షలు విధించింది. బీఫ్ దిగుమతులను నిలిపివేసింది. వైన్ దిగుమతులపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది. చైనాలోని వుహాన్ సిటీలోని ఓ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందంటూ ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని పుట్టు పూర్వోత్తరాలపై ఓ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెరుగుతోంది. (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు) -
తప్పుడు కేసులు దుర్మార్గ చర్య
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రేరేపకులుగా ఆరోపిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేఎన్యూ ప్రొఫెసర్ జయతీ ఘోష్, మరికొందరు మేధావులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులైన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతరుల పేర్లు, వివరాలు పత్రికల్లో వచ్చినా వారిపై చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, ఈ తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ చేస్తున్న కుట్రను ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీమాకోరేగావ్లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న సంఘ్పరివార్కు చెందిన నిందితులను వదిలేసి, ఈ ఘటనతో సంబంధం లేని మేధావులు, వామపక్ష భావాలు కలిగిన వారిని తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి రెండేళ్లు అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా, బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. సీపీఎం అగ్రనేత ఏచూరి, మరో 8 మంది మేధావులపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు నిరసనలు.. ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి తదితరులపై పోలీసులు చార్జిషీటును ఫైల్ చేయడంపై సోమవారం సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీజేఎస్, టీటీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్రోడ్డులో చేపడుతున్న కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులు పాల్గొంటారని సీపీఎం తెలిపింది. -
అధికారికంగా ‘విమోచన’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తాము 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ కూడా విస్మరించారన్నారు. కేసీఆర్ సర్కార్.. మజ్లిస్పై ప్రేమతో తెలంగాణ అమరవీరుల త్యాగాలను విస్మరిస్తోందన్నారు. ఈనెల 17న అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని లేకుంటే.. బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. ఈనెల 7 నుంచి 17 వరకు పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆదుకోవాలన్న సోయిలేదా?.. ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని సంజయ్ పేర్కొ న్నారు. వారిని ఆదుకోవాలన్న సోయి ప్రభు త్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. -
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
జనగామ: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. జనగామలోని జిల్లా ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిని చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు స్కానింగ్ సేవలు లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రోజువారీ కూలి చేసుకుంటేనే కడుపు నిండే పేదలు కరోనా బారిన పడితే ఆస్పత్రుల్లో ఐసోలేషన్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇంట్లో సౌకర్యాల లేమితో పాజిటివ్ రోగులు వేరుగా ఉండాలంటే బాధిత కుటుంబాలు నరకం చూస్తున్నాయని, దీంతో మిగతా వారికి సైతం వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కరోనాపై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే పారాసిటమాల్ సరిపోతుందని, మాస్క్ ఎందుకని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు మాస్క్ లేకుండా ఒక్క బాధితుడినైనా పరామర్శించారా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేసి, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరా బాద్): ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఆదివారం బీసీ భవన్లో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్, 12 బీసీ కులాల ఫెడరేషన్ల ద్వారా మూడేళ్ల క్రితం తీసుకున్న 5.77 లక్షల దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తుదారులందరికీ రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వాటిని పెండింగ్లో పెట్టారని విమర్శించారు. వెంటనే రుణాలు మంజూరు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ప్రతి బీసీ కులానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ చొప్పున 52 బీసీ కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న 12 బీసీ కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. పాత ఫెడరేషన్లకు, కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. -
విద్యుత్ చట్ట సవరణలు వెంటనే ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం చేసే ఈ సవరణలను వెనక్కు తీసుకోకపోతే గతంలో విద్యుత్ ఉద్యమ షాక్ తగిలి ఏపీ ప్రభుత్వం కూలిపోయిన మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా షాక్ తగులుతుందని హెచ్చరించారు. కేంద్రం విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్లోని షహీద్చౌక్ వద్ద విద్యుత్ ఉద్యమ అమరులు బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్లకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అమరవీరుల 21వ సంస్మరణ సభలో కేంద్ర విద్యుత్ చట్టాల సవరణకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. గతంలో జరిగిన ‘బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం’మహత్తరమైన ఉద్యమమని, ఆ ఉద్యమం కారణంగానే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలను పెంచే సాహసం చేయలేదని, పైగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించాయని వక్తలు పేర్కొ న్నారు. ఒకే దేశం–ఒకే పన్ను తదితర నినాదాలతో బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలను సవరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ముందుకు రావాలని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్రెడ్డి కోరారు. నాడు ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను అమలు చేసిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఉధృతంగా ప్రపంచ బ్యాంకు, పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కార్యక్రమంలో అజీజ్పాషా, పశ్య పద్మ (సీపీఐ), జి.నాగయ్య, డీజీ నరసింహారావు, బి.వెంకట్, టి.సాగర్ (సీపీఎం), ఎం.సుధాకర్ (ఎంసీపీఐ–యూ), కె. మురహరి (ఎస్యూసీఐ–సీ), అచ్యుత రామారావు, ఎస్.ఎల్.పద్మ (న్యూడెమోక్రసీ) తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి
హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సోమవారం అఖిలపక్ష నేతలు కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకట్రెడ్డి తదితరులు కింగ్కోఠి కోవిడ్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సలపై సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కింగ్కోఠి ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆసుపత్రిలో 200 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అయినా అధికారులు బెడ్లు ఖాళీ లేవని రోగులను వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోతోందన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని ఆయన సూచించారు. టీటీడీపీ నేత ఎల్.రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లనే ప్రజలు సర్కారు ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలను దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. -
వీవీ ప్రాణాలు కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విజ్ఞప్తిచేశారు. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని కోరారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడే బెయిల్ ఇచ్చి ఉంటే ఆయనకు కోవిడ్ సోకేది కాదన్నారు. వెంటనే ఆయనను విడుదల చేసి డాక్టర్లు, కుటుంబసభ్యుల సంరక్షణలో హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), డీజీ నర్సింహా రావు, బి.వెంకట్ (సీపీఎం), కె. గోవర్థన్. కె.రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), ఉపేందర్ రెడ్డి (ఎంసీపీఐ–యూ), సీహేచ్ మురహరి (ఎస్యూసీఐ–సీ),డి.రాజేశ్ (లిబరేషన్) పాల్గొన్నారు. ప్రజాసంఘాల ర్యాలీ విరసం నేత వరవరరావుతోపాటు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని పీడీఎస్యూ, పీవోడబ్లు్య, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్, ప్రజా సంఘాలు శుక్రవారం విద్యానగర్ నుంచి హిందీ మహావిద్యాలయ వరకు ర్యాలీ నిర్వహించాయి. పీవోడబ్లు్య జాతీయ అధ్యక్షురాలు వి.సంధ్య మాట్లాడుతూ వరవరరావు, సాయిబాబాలకు కరోనా సోకడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుత రామారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి. అనురాధ, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్, నగర అధ్యక్షుడు రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లోకి జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, బంధువులు దాడికి పాల్పడటంతో నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. తమ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెంటనే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ ఆస్పత్రి విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నా... కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేస్తున్నామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగుల బంధువులు తమపై దాడులకు దిగడం ఏమిటంటూ జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక భద్రత అందించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను ఏర్పాటు చేయడంతోపాటు ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలనే డిమాండ్ను మంత్రికి వివరించారు. అలాగే సకల సౌకర్యాలున్న గాంధీ ఆస్పత్రిని కేవలం కరోనా చికిత్సకే పరిమితం చేయకుండా అన్ని రకాల రోగులను అనుమతించాలని కోరారు. ప్రస్తుతం పడకల సంఖ్య ఆధారంగా పోస్టులు మంజూరు చేసినప్పటికీ 30% అదనపు పోస్టులు మంజూరు చేసి వాటిని భర్తీ చేయాలన్నారు. రిజర్వ్ స్టాఫ్ ఉంటేనే వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి ఉండదని, దీనివల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా చికిత్సలను గాంధీ తదితర ఆస్పత్రులకే పరిమితం చేయకుండా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ప్రారంభిస్తే గాంధీ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గుతుందని కోరారు. వైద్యులు, సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, ఇతరాలను జూనియర్ డాక్టర్ల సమ్మతితో కొనుగోలు చేయాలని సూచించారు. పక్షం రోజుల్లో రోడ్మ్యాప్... జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్లపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కరోనా అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఆందోళన విరమించాలని సూచిస్తూనే వారి డిమాండ్ల పరిష్కారం కోసం 15 రోజుల్లో మార్గం చూపిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. చర్చల తాలూకూ అంశాలను సీఎం కేసీఆర్కు వివరించిన తర్వాత కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, ఈలోగా విధుల్లో చేరి వైద్యసేవలను ప్రారంభించాలని కోరారు. దీంతో సమ్మతించిన జూనియర్ డాక్టర్ల సంఘ ప్రతినిధులు విధుల్లో చేరేందుకు సముఖత చూపారు. పక్షం రోజుల్లో పరిష్కారం చూపకుంటే మాత్రం మళ్లీ ఆందోళన చేపడతామని జూనియర్ డాక్టర్ల సంఘం పేర్కొంది. -
ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అనైతికం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్లోని బీసీ భవన్లో శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్రావు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ రాములు, తెలంగాణ జనసమితి నగర అధ్యక్షులు ఎం.నర్సయ్యలతో పాటు వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ...గత 14 ఏళ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించడం అనైతికమని, ఏ కారణం చేత వారిని తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జీతాలు పెంచాలని సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేసే 7,500 మంది ఉద్యోగులలో 7,450 మంది అంటే 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమ తొలగింపుపై జాతీయ బీసీ,ఎస్సీ, ఎస్టీ కమిషన్లు జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు సత్యాగ్రహదీక్షలో పాల్గొన్నారు. దీక్షకు జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణతో పాటు ఇతర బీసీ నాయకులు మద్దతు తెలిపారు. బీసీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఆర్.కృష్ణయ్య. పక్కన చాడ వెంకట్రెడ్డి, ఎల్.రమణ తదితరులు -
ఉండలేము.. వెళ్లలేము!
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన కల్లోలంతో స్వరాష్ట్రానికి రావాలనుకుంటున్న గల్ఫ్ వలస కార్మికులకు విమాన ప్రయాణ ఖర్చు, క్వారంటైన్ ఖర్చు గుదిబండగా మారింది. విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పో యి ఇంటి బాట పట్టిన వారికి ఆర్థికంగా భారంగా పరిణమించింది. ఇతర రాష్ట్రాలు ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం పెయిడ్ క్వారంటైన్ తప్పనిసరి చేయడంతో లబోదిబోమంటున్నారు. గల్ఫ్ నుంచి తిరుగుముఖం పట్టేవారి ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జేఏసీ పోరుబాట పట్టింది. వలస కార్మికులకు సంఘీభావంగా వందేభారత్ గల్ఫ్ భరోసా దీక్షలు చేపడుతోంది.ఉచిత విమాన టికెట్టు, ఉచిత క్వారంటైన్ను కల్పించాలని కోరుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి గల్ఫ్ జేఏసీ రంగం సిద్ధం చేస్తోంది. గల్ఫ్ యుద్ధ సమయంలో... గల్ఫ్ యుద్ధ సమయంలో అక్కడి నుంచి 1.70 లక్షల మంది భారతీయులను మన దే శానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. వీరి విమాన ప్రయాణ ఖర్చులను అప్పటి ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే భరించింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న జేఏసీ.. రెక్కాడితేగానీ డొక్కాడని వలస కార్మికుల ప్రయాణ, క్వారంటైన్ ఖర్చులను కూడా ప్ర భుత్వాలే భరించాలని డిమాండ్ చేస్తున్నాయి. 3 రాష్ట్రాల్లో ఉచితంగానే క్వారంటైన్... విదేశాల నుంచి వచ్చే తమ రాష్ట్రాల వారికి ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ఉచితంగానే క్వారంటైన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వలస కార్మికులకు ఉచిత క్వారం టైన్ కల్పిస్తామని, ఏర్పాట్లు కూడా చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎందుకోగానీ పక్కనపెట్టేశారు. అంత ఎలా భరించాలి... ప్రవాసీలకు విమాన ప్రయాణం, క్వారంటైన్ ఫీజు భారంగా మారింది. విమాన టిక్కెట్ రెట్టింపు చేయగా, క్వారంటైన్కు రూ.15 వేల ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే విమానాలను నడుపుతోంది. ఇతర సంస్థలు నడపకపోవడంతో ఇండియన్ ఎయిర్లైన్స్ నే ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఆ సంస్థ నిర్దేశించిన భారీ చార్జీలను చెల్లించాల్సివస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతా ల్లో హోటళ్లలోగాకుండా.. స్వస్థలాలకు చేరువల్లోని హోటళ్లలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కొంతమేర భారం తగ్గుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వాలు స్పందించే వరకు పోరాటం గల్ఫ్ నుంచి రావాలనుకుంటున్న కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే విమాన టికెట్లు, క్వారంటైన్ సౌకర్యం కల్పించాలి. ఈ అంశాలపై ప్రభుత్వాలు స్పందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. – గుగ్గిళ్ల రవిగౌడ్, గల్ఫ్ వర్కర్స్ జేఏసీ కన్వీనర్ ప్రవాసీయుల్లో చైతన్యం కోసం కృషి... గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలపై అందరిలో చైతన్యం తీసుకురావడం కోసం జిందగి ఇమేజెస్ ఫేస్బుక్ పబ్లిక్ గ్రూప్ను ఏర్పాటు చేశాం. కార్మికుల సమస్యలపై ఫేస్బుక్ ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి సమస్యలపై చర్చలను కొనసాగిస్తున్నాం. – చేగొండి చంద్రశేఖర్, జిందగి ఇమేజెస్ ఫేస్బుక్ పబ్లిక్ గ్రూప్ వ్యవస్థాపకులు -
ఇడిసిపెడితే నేను పోత సారు..
గోల్కొండ/గచ్చిబౌలి/శంషాబాద్: వలస కార్మికులు రోడ్డెక్కారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్లోని టోలిచౌకీ, గచ్చిబౌలి, శంషాబాద్లో ఆందోళనకు దిగారు. లాక్డౌన్ కారణంగా చేసేందుకు పని లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా, జార్ఖండ్, కర్ణాటకలతో పాటు బిహార్ రాష్ట్రాలకు చెందిన వేల మంది కార్మికులు హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం వలస కూలీలకు అందిస్తున్న సాయం తమకు అందడం లేదని, ఉండటానికి స్థలం లేక పడరాని పాట్లు పడుతున్నామని బిహార్కు చెందిన అభయ్ అనే భవన నిర్మాణ కార్మికుడు వెల్లడించాడు. రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడటంతో నో వర్క్, నో పే అంటూ వాటి యజమానులు తమను గెంటేశారన్నారు. పోలీసులు పుట్పాత్లపై పడుకోనివ్వడం లేదని, టోలిచౌకీ పరిసరాల్లో ఒక్క నైట్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్అండ్టీ లేబర్ కాలనీలో కార్మికులు సైతం ధర్నాకు దిగారు. తమకు జీతాలిచ్చి, బస్సులు ఏర్పాటు చేస్తే సొంతూళ్లకు వెళ్లిపోతామంటూ ఆందోళన చేశారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయంలోని విస్తరణ పనులు చేస్తున్న వలస కార్మికులు కూడా తమను సొంతూళ్లకు పంపించాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయాచోట్లకు వెళ్లి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తామని.. త్వరలోనే ప్రత్యేక వాహనాల ద్వారా స్వస్థలాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇక్కడ ఉండలేం.. రోడ్డెక్కిన గ్రానైట్ కార్మికులు.. సర్దిచెప్పిన అధికారులు ‘లాక్డౌన్తో పనుల్లేక 40 రోజులుగా అవస్థలు పడుతున్నాం. ఇక ఇక్కడ ఉండలేం. మా రాష్ట్రాలకు తిరిగి వెళ్తాం. వెంటనే అనుమతి ఇవ్వండి’ అంటూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతంలో వందలాది మంది కార్మికులు ఆదివారం రోడ్డెక్కా రు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మ ధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వందల సంఖ్యలో గ్రానైట్, వాటికి అనుబంధంగా ఉన్న అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పనులు లేకపోవడంతో ప్రభుత్వం, దాతలు అందించే ఆహారం, వితరణతో నెట్టుకొస్తున్నారు. ఇక పరిశ్రమలు తెరుస్తారో.. లేదోనని కార్మికులు ఆందోళన చెందారు. తమ ప్రాంతాలకు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకున్న కార్మికులు ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ నాగండ్ల కోటి, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ రాజేష్, వీఆర్వో బాలయ్య, అర్బన్ సీఐ వెంకన్నబాబు, మైనింగ్ ఏజీ గంగాధర్ కార్మికులకు నచ్చజెప్పారు. గ్రానైట్ పరిశ్రమలను నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సోమవారం నుంచి పనులు చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని సర్ది చెప్పారు. అప్పటి వరకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో శాంతించారు. ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రోడ్డుపై ఆందోళనకు దిగిన గ్రానైట్ కార్మికులు -
రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1,500 సరిపోవట్లేదని, వారికి రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఉత్తమ్ నేతృ త్వంలోని అఖిలపక్ష బృందం గురువారం స చివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. కోదండరాం (టీజేఎస్), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్.రమణ (టీడీపీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లు సీఎస్ను కలసి పలు సూచనలతో కూడిన వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. 40 రోజుల లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అనివార్యమైన ఇబ్బందులను స్ఫూర్తితో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష నేతలు ఎవరేమన్నారంటే రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు. గాంధీ, ఉస్మానియాలో మిగతా ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలి.’ –చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసిన వారికి కూడా రేషన్ బియ్యం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు ఇవ్వాలి. సంగారెడ్డిలో నిరసన తెలిపిన కార్మికులకు జీతం ఇప్పించాలి. చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ‘రేషన్లో బియ్యంతో పాటు, పప్పు, నూనె ఇవ్వాలి. వాహనాల పన్నును 3 నెలల పాటు రద్దు చేయాలి. కోదండరామ్, టీజేఎస్ ‘రైతు రుణమాఫీ చేయాలి. సూరత్, భివండి, ముంబైలలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలి. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు -
గిట్టుబాటుకోసం.. రైతు కంటనీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించాలని, గిట్టుబాటు ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఒక రోజు ఉపవాస దీక్షను చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బీజేపీ కార్యాలయంలో దీక్షను నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన తన దీక్ష ప్రారంభించారు.«ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు, నిరసనగా రైతులకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుల విషయం, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై కనీసం కేబినెట్లో చర్చించకపోవడం దారుణమన్నారు. తాము సూచనలు చేసినా, సలహాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. లాక్ డౌన్ కాలంలో ఐకేపీకి తెచ్చిన ధాన్యం తిరిగి తీసుకెళ్లాలంటే రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఎక్కడా ఎలక్ట్రానిక్ కాంటాలు లేవన్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించనే లేదన్నారు. ఈ పరిస్థితులతో రైతులు లాభాలు ఆశించడం లేదని, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అంటున్నారని, గిట్టుబాటు లేక వారు కన్నీరు పెడుతున్నారన్నారు. రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటున్న ప్రభుత్వం ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితులు,అధికారులు, మిల్లర్లకు కొమ్ము కాస్తున్నారని, బ్రోకరిజం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే అన్ని జిల్లాల్లో బీజేపీ నేతలు ఒక్క రోజు ఉప వాస దీక్షలో పాల్గొన్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు. రాజకీయ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని మాట్లాడు తున్నారని, మోనార్క్ పాలన సాగుతోందన్నారు. సమస్యలు పరిష్కరించమంటే విమర్శలు చేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని, బీజేపీ అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఎవరి చేతిలో అధికారం ఉండకూడదో వారి చేతిలోకి వెళ్లిందన్నారు. ప్రతీ గింజ కొంటా అన్న కేసీఆర్ క్షేత్రస్థాయి పరిస్థితి ఏందో చూడాలన్నారు. ఈ దీక్షలో మాజీ మంత్రులు విజయ రామారావు, పెద్దిరెడ్డి, బీజేపీ నేతలు పేరాల శేఖర్రావు, జి.ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి కాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన పార్లమెంటు ఆవరణ లో మీడియాతో మాట్లాడారు. రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఏదైనా ఇబ్బందులుంటే స్పష్టత ఇవ్వా లని, కనీసం పీపీపీ పద్ధతిలోనైనా కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని వివరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహ దారి వెంట రైల్వే లైన్ వేస్తే ప్రయాణ సమయం చాలా తగ్గుతుందని పేర్కొన్నారు. రెండు రాజ ధానుల మధ్య హై స్పీడ్ ట్రైన్ వేస్తే 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. -
పసిడిపై దిగుమతి సుంకాలు తగ్గించాలి..
భారత్ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా 1.5 శాతం క్షీణించి 20.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో పసిడి, వజ్రాభరణాల వ్యాపార సంస్థలు కేంద్ర ప్రభుత్వం ముందు పలు విజ్ఞప్తులు ఉంచాయి. ►బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకాల (జీఎస్టీ అదనం)తో ఆభరణాల కొనుగోలు భారీ వ్యయాలతో కూడుకున్నదిగా మారిపోయింది. దీన్ని 6 శాతానికి తగ్గించాలి. కట్, పాలిష్డ్ డైమండ్స్పై సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలి. ►కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వినియోగించిన పక్షంలో బ్యాంక్ కమీషన్లు తొలగించాలి. లేదా ప్రస్తుతమున్న 1–1.5 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గించాలి. ►ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల్లో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలి. ►పసిడి పరిశ్రమ మరింత పారదర్శకంగా పనిచేసే విధంగా తగిన ఇన్ఫ్రా, ప్రమాణాలను నెలకొల్పాలి. భారీ స్థాయి గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజ్, బులియన్ బ్యాంకింగ్ మొదలైనవి పటిష్టం చేయాలి. -
ఎల్టీసీజీ రద్దు చేయాలి...
ఎల్టీసీజీ ఎత్తివేత వంటి డిమాండ్లను కేంద్రం ఈసారైనా పరిగణనలోకి తీసుకోవాలని మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమ కోరుతోంది. వీటితో దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు తోడ్పాటు లభించడంతో పాటు ఎకానమీని పటిష్టంగా చేసేందుకు, బాండ్ మార్కెట్ మరింతగా విస్తృతి చెందేందుకు, ఇన్ఫ్రా వృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రాతిపదికన నిధుల లభ్యత పెరగగలదని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ పేర్కొంది. అలాగే, పెట్టుబడులను భౌతికరూపంలో పసిడి నుంచి గోల్డ్ ఈటీఎఫ్లకు కూడా మళ్లించేలా చర్యలు తీసుకుంటే ద్రవ్య లోటు కూడా కట్టడి కాగలదని తెలిపింది. ►తక్కువ వ్యయాలు, తక్కువ రిస్కులతో పాటు పన్ను మినహాయింపుల ప్రయోజనం ఉండే డెట్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్ను అనుమతించాలి. ►పన్ను విషయంలో యులిప్స్, ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్ను సరిసమానంగా పరిగణించాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ని రద్దు చేయాలి. రిడెంప్షన్ సమయంలో ఈక్విటీ ఫండ్స్పై విధిస్తున్న ఎస్టీటీని రద్దు చేయాలి. ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్ చెల్లించే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ను తొలగించాలి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో అటూ, ఇటూ మారేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలి. ►మ్యూచువల్ ఫండ్స్ను స్పెసిఫైడ్ లాంగ్ టర్మ్ అసెట్స్గా పరిగణించాలి. ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 54 ఈసీ కింద ఎల్టీసీజీ నుంచి మినహాయింపునివ్వాలి. ►లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల తరహాలోనే ఎల్టీసీజీ విధింపునకు సంబంధించి బంగారం, కమోడిటీ ఈటీఎఫ్లలో హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించాలి. ►డెట్ స్కీమ్లపై డీడీటీని తగ్గించాలి. -
జనరల్ నర్సింగ్ కోర్సు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సుకు ప్రభుత్వం ముగింపు పలికింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి జీఎన్ఎం కోర్సు నిర్వహించేదిలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లల్లో 6 వేలకు పైగా జీఎన్ఎం సీట్లు ఉన్నాయి. ఇన్ని వేల సీట్లను ఒకేసారి రద్దు చేస్తుండటంతో నర్సింగ్ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదముంది. కొన్ని రాష్ట్రాల్లో జీఎన్ఎం కోర్సు రద్దు చేసినా, వాటి స్థానే బీఎస్సీ నర్సింగ్ కోర్సు నిర్వహించేందుకు అనుమతించారు. దీంతో జీఎన్ఎం సీట్లు పోయినా బీఎస్సీ నర్సింగ్ సీట్లు వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం జీఎన్ఎం అర్హత కలిగినవారే ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్లకంటే, జీఎన్ఎం చేసిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఎస్సీ వాళ్ల కంటే తక్కువ వేతనాలకు పని చేయడమే ఇందుకు కారణమని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. నైపుణ్యం ఉండటం లేదు.. డీఎంఈ పరిధిలోకి జీఎన్ఎం కోర్సులు వస్తాయి. కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోకి బీఎస్సీ నర్సింగ్ కోర్సులు వస్తాయి. జీఎన్ఎం చేసినా చాలామంది నర్సుల్లో నైపుణ్యం ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పైగా జీఎన్ఎం డిప్లొమా కోర్సుగా కొనసాగుతోంది. ఈ కోర్సుతో నైపుణ్యం రావడం లేదన్న ఆరోపణలతోనే కోర్సు రద్దు చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక ‘నర్సింగ్’ వైపు కష్టమే.. ప్రస్తుతం రాష్ట్రంలో నర్సుల కొరత విపరీతంగా ఉంది. కానీ రాష్ట్రంలో 80 ప్రైవేటు, 6 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో కలిపి బీఎస్సీ నర్సింగ్ సీట్లు 5 వేల లోపే ఉన్నాయి. ప్రైవేటు బీఎస్సీ నర్సింగ్లో కన్వీనర్ కోటా సీట్లు రాని విద్యార్థులంతా జీఎన్ఎం కోర్సుల్లో చేరుతున్నారు. జీఎన్ఎం కోర్సు ఎత్తేస్తుండటంతో నర్సింగ్ చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని నర్సింగ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో జీఎన్ఎం కోర్సులు అందించే నర్సింగ్ స్కూళ్లను, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయా లని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరుతోంది. -
ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు
ఉట్నూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్తోపాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంట నే పరిష్కరించాలంటూ ఆదివాసీ మహిళాలోకం కదంతొక్కింది. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదువేలకు పైగా ఆదివాసీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉట్నూర్ ప్రధానవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయడం.. గేటుకు తాళం వేయడం తో ఆదివాసీలు కోపోద్రిక్తులయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి రావాల్సిందేనంటూ.. లోపలికి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఆదివాసీలు భారీ సంఖ్యలో ఉండటంతో చేతులెత్తేయాల్సి వచ్చింది. పలువురు ఆదివాసీలు గోడపై నుంచి దూకి కార్యాలయం లోపలికి వెళ్లారు. అదనపు ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్ ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసమేనని, తమను ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దంటూ నినదించారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలిచ్చిన తహసీల్లార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 25 మందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ నేతలపై పెట్టిన కేసుల ను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం నాయకులు గోడం రేణుకాబాయి, సోయం లలితాబాయి, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం మొండివైఖరి విడనాడాలి: సురవరం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మొండివైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం ద్వారా సమ్మెకు తెరదించాలని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమస్యను రెండు వారాల్లోగా ముగించాలని కార్మికశాఖను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానం చెప్పినా సీఎం వినడం లేదని, ఇందుకు కేసీఆర్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం మఖ్దూంభవన్లో పార్టీ నేతలు అజీజ్ పాషా, కూనంనేని సాంబశివరావులతో కలసి సురవరం మీడి యాతో మాట్లాడారు. సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తూ కార్మికులపై పగ సాధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ విలీన అంశాన్ని జేఏసీ వాయిదా వేసుకుని, మిగతా సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ప్రజారవాణా నిలిచిపోవడంతో పేదలు, విద్యార్థులు, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. సీఎంకు నచ్చజెప్పి సమ్మె పరిష్కారానికి టీఆర్ఎస్ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నాక కూడా ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని సీఎం ఎందుకు భయపడుతున్నారని కూనంనేని ప్రశ్నించారు. సర్కార్ను కూల్చాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఒకవేళ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వస్తే టీఆర్ఎస్లోని నాయకుల ద్వారానే జరుగుతుందని చెప్పారు. -
ఆర్టీసీ విలీనంపై చర్చలు జరపాలి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను జేఏసీ పక్కన పెట్టిన నేపథ్యంలో వెంటనే చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియా తో మాట్లాడుతూ.. ప్రధాన డిమాండ్ను కార్మికులు పక్కన పెట్టినందున, హైకోర్టు సూచనలు గౌరవించి ప్రభుత్వం కూడా వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.