-
క్రూడాయిల్ ధరలు అదే స్థాయిలో ఉంటే జీడీపీపై ప్రభావం..
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి (2022అక్టోబర్–2023 మార్చి) మెరుగుపడతాయన్న ఆశాభావాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ మంగళవారం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్ను తగ్గింపుతో సహా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రైవేట్ రంగం నుండి పెట్టుబడులు గత పలు సంవత్సరాలుగా ఊపందుకోని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) బ్యాంకింగ్ రుణం పుంజుకోవడం ప్రారంభమైంది. అందువల్ల, బహుశా రెండవ త్రైమాసికం చివరి నాటికి లేదా సంవత్సరం రెండవ అర్ధభాగంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం భారీగా పెరుగుతాయని నేను భావిస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (మూలధన వ్యయం)ను 35.4 శాతం పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ. 5.5 లక్షల కోట్లు. ఇది పెట్టుబడుల పురోగతికి దారితీసే అంశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సర్వే ప్రకారం పరిశ్రమ సామర్థ్య వినియోగం 68% నుంచి 74 శాతానికి పెరిగింది. పలు రంగాల్లోని తొలి దిగ్గజ నాలుగు సంస్థలు ఇప్పటికే 80 శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక ఆకాంక్షలు, స్థూల ఆర్థిక స్థిరత్వం, వివేకవంతమైన బడ్జెట్, పారదర్శకత, మూలధన వ్యయంపై దృష్టి వంటి పలు అంశాలు ఎకానమీని తగిన బాటలో సమతౌల్యతతో నడుపుతూ వృద్ధికి దోహదపడతాయి. పేదలకు ఉపశమనం కలిగించేందుకు, ప్రభుత్వం ఉచిత ఆహార కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. దీని వల్ల ఖజానా నుంచి దాదాపు రూ. 80,000 కోట్లు (జీడీపీలో 0.65 శాతం) వ్యయం అవుతుంది. పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సంస్థ ఇటీవలే విశ్లేషించింది. ఈ పథకం వల్ల కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్ పేపర్లో పేర్కొంది. మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. సాధారణ కోటా కంటే ఎక్కువగా అదనపు ఉచిత ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద అందించడం జరుగుతోంది. కిలోగ్రాముకు రూ. 2 నుంచి రూ.3 వరకూ అధిక సబ్సిడీ రేటుతో ఈ ప్రయోజనాన్ని పేదలకు కేంద్రం అందిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ ఈ పథకాన్ని పొడిగించింది. ప్రైవేట్ రంగంలో బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటి ప్రతికూలాంశాలను ఇది భర్తీ చేస్తుంది. 2022–23 ద్వితీయార్థంలోకి వెళుతున్నప్పుడు, మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. 2003–2012 మధ్య కాలంలో మనం సాధించిన అధిక వృద్ధిని మరింత స్థిరమైన రూపంలో మళ్లీ చూడగలుగుతామన్న విశ్వాసం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానాన్ని కఠిన తరం చేయడం ప్రస్తుతం ప్రధాన సవాళ్లు. మొండిబకాయిల సమస్య పరిష్కారం దిశలో చర్యలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రస్తుతం దృష్టి సారించాల్సిన అంశాలు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు పన్నుల రూపంలో ఖజానాకు రూ.27.07 లక్షల కోట్లు (అంచనాలు రూ. 22.11 లక్షల కోట్లు) వచ్చి చేరాయి. బడ్జెట్ అంచనాలను మించి ఇవి నమోదు కావడం విశేషం. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం. చమురు ధరలు దీర్ఘకాలం పాటు బ్యారల్కు 100 డాలర్ల పైనుంటే, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలపై దీని ప్రభావం పడే వీలుందని సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ అంచనాలను తగ్గించాల్సి రావచ్చని కూడా సూచించారు. ఎకనమిక్ సర్వే ప్రకారం, 2022–23లో ఆర్థికాభివృద్ధి 8 నుంచి 8.5 శ్రేణిలో ఉండవచ్చని(ఇంతక్రితం అంచనా 9.2 శాతం) ఆయన అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాల కొరతల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్రితం 7.8 శాతం అంచనాలను గత వారం ఆర్బీఐ పాలసీ సమావేశాలు 7.2 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. -
ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు.. మళ్ళీ పెంచారు
-
భారత్కు భారీ తగ్గింపుతో ముడిచమురును ఆఫర్ చేసిన రష్యా
ఉక్రెయిన్-రష్యా యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఇక ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ప్రారంభించినప్పటీ నుంచి అమెరికాతో సహా పలు యూరోపియన్ దేశాలు కూడా ఆంక్షలను విధించాయి. దీంతో రష్యాలో ముడిచమురు నిల్వలు భారీగా పెరుకుపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా భారత్కు భారీ తగ్గింపుతో ముడిచమురును ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో... బ్యారెల్ క్రూడాయిల్పై భారత్కు ఏకంగా 35 డాలర్ల తగ్గింపును రష్యా ఆఫర్ చేసిందని బ్లూమ్బర్డ్ నివేదించింది. అంతేకాకుండా రష్యాకు చెందిన అత్యంత విలువైన యూరల్స్ గ్రేడ్ క్రూడాయిల్ అందించినట్లు తెలిపింది. క్రూడాయిల్ను దిగుమతి చేసుకునేందుకుగాను భారత్ను రష్యా ప్రోత్సహించింది. ఈ ఏడాది 15 మిలియన్ బ్యారెల్స్తో ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యా కోరినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. చదవండి: హల్చల్ చేస్తోన్న టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే..? -
షాకింగ్:రాకెట్లా పెట్రోల్,డిజీల్ ధరలు..రూ.15 నుంచి రూ.20కి పెరిగే ఛాన్స్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయాయి. ఈ మూడు సంస్థల ఎబిట్డాలో ఇది 20 శాతానికి సమానం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు నాలుగు నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించకుండా ఒకే ధరను కొనసాగించడం తెలిసిందే. 137 రోజుల పాటు ధరలను సవరించలేదు. బ్యారెల్ క్రూడ్ 82 డాలర్ల వద్ద చివరిగా ధరలను సవరించగా.. 120 డాలర్లకు పెరిగిపోయినా కానీ, అవే రేట్లను కొనసాగించాయి. నిత్యం రూ.525 కోట్ల నష్టం.. ‘‘ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బ్యారెల్ చమురుపై 25 డాలర్ల ఆదాయాన్ని, పెట్రోల్, డీజిల్ విక్రయంపై 24 డాలర్ల నష్టాన్ని చూస్తున్నాయి. ఒకవేళ చమురు ధరలు బ్యారెల్కు సగటున 111 డాలర్ల వద్ద కొనసాగితే, పెరిగిన ధరల మేరకు విక్రయ రేట్లను సవరించకపోతే.. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ రోజువారీగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై 65–70 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు) నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. మూడున్నర నెలల విరామం తర్వాత మార్చి 22 నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాన్ని ప్రారంభించడం తెలిసిందే. మరింత పెంచాల్సిందే..! ‘‘ముడి చమురు బ్యారెల్ ధర 110–120 డాలర్ల మధ్య కొనసాగితే ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్పై రూ.13.10–24.90 మేర.. లీటర్ పెట్రోల్పై 10.60–22.30 చొప్పున ధరలను పెంచాల్సి వస్తుంది’’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. క్రిసిల్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం చూసినా.. ముడి చమురు బ్యారెల్ 100 డాలర్ల వద్ద సగటున ఉంటే పెట్రోల్, డీజిల్కు లీటర్పై రూ.9–12 మేర, 110–120 డాలర్ల మధ్య ఉంటే రూ.15–20 మధ్య పెంచాల్సి వస్తుంది. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఒక్కటే 1–1.1 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోగా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ 55–560 మిలియన్ డాలర్ల మేర 2021 నవంబర్ – 2022 డిసెంబర్ మధ్యకాలంలో నష్టాన్ని చవిచూసినట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా. ‘‘ఆదాయంలో ఈ మేరకు నష్టం స్వల్పకాల రుణ భారాన్ని పెంచుతుంది. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నంత వరకు మూలధన నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. కొంత కాలానాకి చమురు ధరలు దిగివస్తే అప్పుడు ఆయిల్ కంపెనీలు కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
రష్యన్ చమురు కంపెనీలు భారత్ కు భారీ బంపర్ ఆఫర్..!!
-
అబ్బే..అలాంటిదేం లేదు! రష్యా వార్నింగ్తో మాట మార్చిన అమెరికా?
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగడంతో చమురు ధరలు మండిపోతున్నాయి. ఈ మంటను చల్లార్చేందుకు అమెరికా ఆచితూచీ వ్యవహరిస్తోంది. సున్నితమైన అంశం కావడంతో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతోంది. తాజాగా రష్యా దిగుమతుల విషయంలోనూ స్వరం తగ్గించి మాట్లాడుతోంది అమెరికా. పది రోజులు గడిచినా ఉక్రెయిన్పై దాడుల విషయంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికాతో పాటు యూరప్లో ఉన్న దాని మిత్రదేశాలు రష్యాను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు రష్యా నుంచి ముడి చమురు, దిగుమతిని నిషేధించాలని చర్చించాయి. ఈ సమావేశానికి సంబంధించిన వార్తలు బయటకి పొక్కడంతో ఒక్కసారిగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 140 డాలర్లను టచ్ చేసింది. మరోవైపు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ మాట్లాడుతూ.. యుద్ధ అనంతర పరిణామాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. రష్యా నుంచి చమురు, ఆయిల్ దిగుమతి చేసుకోకూడదని యూరప్ దేశాలు భావిస్తే .. దాని వల్ల వారికే నష్టమంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు బ్యారెల్ చమురు ధర 300 డాలర్లకు పెరగొచ్చంటూ బాంబు పేల్చారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం రష్యాకు మరో ప్రత్యామ్నాయ చమురు ఉత్పత్తి దేశం ఏదీ కనుచూపు మేరలో కనిపించకపోవడంతో అమెరికా దాని మిత్రదేశాలు పునరాలోచనలో పడ్డాయి. లిబియా, వెనుజువెలా, ఇరాన్లలో ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెరిగే అవకాశం లేకపోవడంతో రష్యా దిగుమతుల విషయంలో అమెరికా దూకుడు తగ్గించింది. తాజగా వైట్హౌజ్ మీడియా ప్రతినిధి జేన్సాక్ మాట్లాడుతూ... రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులపై నిషేధం విధించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే నిషేధం అంశంపై మిత్రపక్ష దేశాలతో చర్చలు జరిగిందని తెలిపింది. రష్యా దాడులను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెబుతూనే చమురు దిగుమతులపై కఠిన వైఖరి తీసుకోవడానికి అమెరికా మీనమేషాలు లెక్కపెడుతోంది. చదవండి: రష్యా బెదిరింపులు.. పెట్రోల్ రేట్లు ఊహించనంత పెరుగుతాయ్! -
పెట్రోల్ రేట్లు ఊహించనంత పెరుగుతాయ్! మీ వాళ్లకి ముందే చెప్పండి
ఉక్రెయిన్ దాడిని నిరసిస్తూ ప్రపంచ దేశాలు చెబుతున్న హిత వ్యాఖ్యలను రష్యా బేఖాతర్ చేస్తోంది. అంతేకాదు మా మీద ఆంక్షలు పెట్టుకుంటూ పోతే మీకే నష్టమంటూ దబాయిస్తోంది. తాము అన్నింటికీ సిద్ధపడే ఉన్నమని.. ఆంక్షల వల్ల తలెత్తే పరిమాణాలకు మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ యూరప్ దేశాలను ప్రశ్నిస్తోంది. ప్రపంచ ఆయిల్ సరఫరాలో రష్యాది 10 శాతం వాటాగా ఉంది. ఇక యూరప్ గ్యాస్ అవసరాల్లో 40 శాతం రష్యా నుంచే సరఫరా అవుతోంది. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు దాని మిత్రపక్ష దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు వరుసగా ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మరో అడుగు ముందుకు వేసి రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు ఆపేస్తామనే వరకు హెచ్చరికలు వెళ్లాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ను దిగుమతి చేసుకోకూడదని యూరప్ దేశాలు భావిస్తే నిక్షేపంగా ఆ పని చేయవచ్చంటూ తమకేమీ అభ్యంతరం లేదని చెబుతున్నాడు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్. రష్యా దిగుమతులు వద్దని మీరు భావిస్తే బ్యారెల్ ముడి చమురు ధర పెరుగుదలకు అంతే ఉండదు. ఒక్క బ్యారెల్ ధర 300 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ యూరప్ దేశాలను భయపెట్టే ప్రయత్నం చేశారు. యుద్ధం వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని. కానీ రష్యాపై విధించే ఆంక్షల కారణంగా వచ్చే పరిణామలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు నోవాక్. పెరిగే పెట్రోలు, డీజిల్ ధరలపై ఇప్పుడే మీ దేశ ప్రజలకు, వినియోగదారులకు చెప్పండి అంటూ సూచిస్తున్నారు నోవాక్. యూరోపియన్ యూనియన్ ఆంక్షలకు భయపడేది లేదంటూ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారాయన. గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ ఉద్రిక్తలకు ముందు బ్యారెట్ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్ల నుంచి 80 డాలర్ల మధ్య ట్రేడయ్యింది. ఇక యుద్దం మొదలై ఊపందుకున్న తర్వాత బ్యారెల్ ధర ఏకంగా 140 డాలర్లకు కూడా టచ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్యారెల్ ధర ఏకంగా 300 డాలర్లకు చేరుకోవచ్చంటూ రష్యా ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చదవండి: Russia Ukraine War Impact: ఇటు రష్యా అటు నాటో.. ఇబ్బంది పడుతున్న ప్రపంచ దేశాలు -
ఇటు రష్యా అటు నాటో.. చుక్కలు చూపిస్తోన్న ముడి చమురు ధరలు
-
చుక్కలు చూపిస్తోన్న ముడి చమురు ధరలు.. చిక్కుల్లో ప్రపంచ దేశాలు
ప్రపంచ దేశాలను ముడి చమురు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతుండటం మిగిలిన దేశాలకు చిక్కులు తెస్తోంది. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు ధర రెండో గరిష్ట స్థాయిని అందుకుంది. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తుందంటూ రష్యా చేపట్టిన దండయాత్ర పది రోజులు దాటినా అనుకున్న ఫలితాలు సాధించలేదు. ఓవైపు ఉక్రెయిన్లో ఒక్కో నగరానికి కీలక స్థావరాలను రష్యా స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నాటోతో పాటు ఈయూ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలా రెండు వైపులా ఒత్తిడి పెరిగిపోవడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దిగుమతి చేసుకోం? ప్రపంచ ఆయిల్ మార్కెట్లలో గల్ఫ్ తీరంలో ఉన్న ఒపెక్ దేశాల తర్వాత వెనుజువెలా, రష్యాలదే అగ్రస్థానం. రష్యా ఒక్కటే ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో 10 శాతం వాటాను కలిగి ఉంది. నిన్నా మొన్నా వరకు ఆర్థిక ఆంక్షలు తప్ప ఆయిల్పై నాటో, ఈయూ దేశాలు ఆంక్షలు విధించలేదు. యుద్ధం జరుగుతున్నా రష్యా ఆయిల్ దిగుమతిపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కానీ నో ఫ్లైజోన్ విషయంలో నాటో దేశాలు లక్ష్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చేస్తోన్న విమర్శలు ఆ దేశాల అధినేతలను చుట్టుముడుతున్నాయి. ఫలితంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతిపై ఆంక్షలు విధిస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అమెరికాకే ఇబ్బంది పెట్రోలు దిగుమతిలో అమెరికా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. గతంలో అణ్వాయుధాల తయారీ నెపంతో ఇరాన్పై ఆంక్షలు విధించింది అమెరికా. తాజాగా రష్యాపై కూడా ఆయిల్ ఆంక్షలు అమలు చేయనుంది. ఇదే జరిగితే అతి పెద్ద ఆయిల్ వినియోగదారైన అమెరికా కేవలం ఒపెక్ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఉన్న పళంగా డిమాండ్ పెరిగిపోనుంది. ముడి బిగుస్తోంది పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా అధికంగా ఆయిల్ను ఉత్పత్తి చేసేందుకు ఒపెక్ దేశాలు సుముఖంగా లేవు. దీనికి తోడు మరో ఆయిల్ ఉత్పత్తి దేశమైన లిబియాలోనూ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఆయిల్ ఉత్పత్తి పెంచొద్దంటూ సాయుధ దళాల నుంచి బెదిరింపులు రావడంతో అక్కడ రెండు చోట్ల ముడి చమురు వెలికి తీత ఆగిపోయింది. మండుతున్న ధర డిమాండ్కు తగ్గస్థాయిలో చమురు లభ్యత తగ్గిపోవడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఆదివారం 139 డాలర్లకు చేరుకుంది. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా బ్యారెల్ ధర 143 డాలర్లుగా పలికింది. ఆ తర్వాత ఇదే అత్యధికం. సోమవారం బ్యారెల్ ధర కొంత తగ్గి 129 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. కానీ యుద్ధం తెచ్చిన ఉద్రిక్తతలు అలాగే ఉండటం కలవరం కలిగిస్తోంది. శాంతి నెలకొనని పక్షంలో ఏ క్షణమైనా మరోసారి ఆయిల్ ధరలు ఆకాశం తాకడం గ్యారెంటీ అనే భయం నెలకొంది. చిక్కులు వెరసి ఉక్రెయిన్ను కేంద్రంగా చేసుకుని రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు మొదలు పెట్టిన ఆధిపత్య పోరు సెగ ప్రపంచ దేశాలను తాకుతోంది. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుత్ను దేశాలకు చమురు ధరల పెరుగుదల వణికిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ద్రవ్యోల్బణం తప్పని దుస్థితి ఎదురుకానుంది. చదవండి: ఉక్రెయిన్ - రష్యా వార్ ఎఫెక్ట్.. లబోదిబోమంటున్న బిలియనీర్స్! -
ప్రధాని మోదీ కీలక భేటీ.. భయపెడుతున్న చమురు ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ వార్పై ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పెరుగుతున్న ముడి చమురు ధరలపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా అధికారులతో పలుమార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రష్యా- ఉక్రెయిన్ యుద్దం వేళ గురువారం క్వాడ్ దేశాధినేతలు వర్చువల్ విధానంలో భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సమావేశమై కీలక చర్చలు జరుపనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలపై కీలక చర్చలు జరిగే అవకావం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎనిమిది రోజులుగా ఉక్రెయిన్పై రష్యా బలగాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రష్యా వార్ ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 117 డాలర్లకు చేరుకుంది. వారం రోజుల్లో ముడి చమురు ధరలు దాదాపు 20 శాతానికిపైగా పెరిగాయి. పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం భారత్పై కూడా పడే అవకాశం లేకపోలేదు. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర 80 డాలర్ల లోపు ఉన్న సమయంలోనే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. ఈ సంక్షోభం కారణంగా ఇప్పటికే శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 204కు చేరుకున్న విషయం తెలిసిందే. -
భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్.. పెరిగిన బల్క్ డీజిల్ ధరలు.. ఛార్జీల పెంపు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై ఏ క్షణమైనా రష్యా మరింత భీకర దాడులు జరపవచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజీలో క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జెట్ స్పీడ్తో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 10 డాలర్లలకు పైగా పెరిగి (10 శాతం పైగా అప్) 111.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసింది. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. అదే బాటలో బంగారం ఇక బంగారం ఔన్స్ (31.1 గ్రాములు) ధర 36 డాలర్లు పెరిగి, 1,938 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ ఒకశాతం లాభంతో 97.50 వద్ద ట్రేడవుతుండగా, డాలర్తో రూపాయి విలువ భారీ నష్టంతో 76కు చేరువలో ఉంది. ప్రపంచ మార్కెట్లు క్రాష్ ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. యూరప్లో బ్రిటన్ మార్కెట్ రెండు శాతం క్షీణించింది. జర్మనీ, ఫ్రాన్స్ స్టాక్ సూచీలు నాలుగు శాతం నష్టపోయాయి. అమెరికా నాస్డాక్ ఇండెక్స్ ఒకశాతం, యూఎస్ 500 సూచీ రెండు శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను కట్టడి చేసేందుకు రష్యా బ్యాంకులకు అమెరికా, దాని మిత్ర దేశాలు స్విఫ్ట్ సేవలను నిలిపివేశాయి. ఫలితంగా ఆ దేశ కరెన్సీ రూబెల్ మరోసారి తాజాగా కనిష్టానికి పతనమైంది. బల్క్ డీజిల్ ధరల పెంపు నవంబరు మొదటి వారం నుంచి రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు నుంచి సామాన్యులకు ఊరట లభిస్తోంది. కానీ ఉక్రెయిన్ ఉద్రికత్తత మొదలైనప్పటి నుంచి క్రూడ్ అయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం, ఆయిల్ కంపెనీలు రిటైల్ చమురు ధరల పెంపును వాయిదా వేస్తున్నాయి. కానీ ఈ లోటును భర్తీ చేసుకునేందుకు బల్క్ డీజిల్ ధరలను భారీగా పెంచాయి. రిటైల్ కంటే ఎక్కువ 2022 ఫిబ్రవరి వరకు కూడా రిటైల్ డీజిల్తో పోల్చితే బల్క్ డీజిల్ ధర లీటరుకు కనీసం రూ. 4 తక్కువకే లభించేంది. అందువల్లే ఆర్టీసీ వంటి కార్పోరేట్ సంస్థల తరహాలో అనేక కంపెనీలు, అపార్ట్మెంట్ సొసైటీలు భారీగా బల్క్ డీజిల్ని కొనుగోలు చేసేవి. ఆయిల్ కంపెనీలు సైతం ముందుస్తు ఆర్డర్లపై బల్క్ డీజిల్ను ట్యాంకర్ల ద్వారా హోం డెలివరీ చేసేవి. కానీ గత కొన్ని వారాలుగా బల్క్ డీజిల్ ధరలను ఇష్టారీతిన పెంచుతూ పోతున్నారు. ఫలితంగా లీటరు రిటైల్ డీజిల్ కంటే బల్క్ డీజిల్ ధరనే ఎక్కువ అయ్యే స్థాయికి చేరుకుంది. మారిపోతున్నారు ప్రస్తుతం హైదరాబాద్లో రిటైల్ డీజిల్ లీటరు ధర రూ.94.62లు ఉండగా బల్క్ డీజిల్ 103.70కి చేరుకుంది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ ధరనే ఒక లీటరకు రూ.9 ఎక్కువగా ఉంది. దీంతో బల్క్ డీజిల్ కొనాలంటే కార్పోరేట్ సంస్థలు బడా వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. శ్రమతో కూడిన వ్యవహారమైనా రిటైల్ బంకుల దగ్గరే డీజిల్ పోయించుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బల్క్ డీజిల్కి స్వస్తి పలికి రిటైల్ బంకుల దగ్గర డీజిల్ పోయించుకుంటోంది. రైల్వే సైతం ఇదే బాట పట్టింది. ఒక్క తెలంగాణనే పరిశీలిస్తే ప్రతీ నెల 67,800 లీటర్ల బల్క్ డీజిల్ అమ్ముడవుతోంది. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరం వాటానే 40,680 లీటర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలతో ఈ డిమాండ్ మొత్తం హుష్ కాకి అయ్యే పరిస్థితి నెలకొంది. బల్క్ డీజిల్ కస్టమర్లు రిటైల్ బంకులకు మళ్లడంతో అక్కడ రద్దీ పెరిగిపోతోంది. ధరల పెంపు బల్క్డీజిల్ ధరల పెంపు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ధరల పెంపు అంశాన్ని తెలంగాణ ఆర్టీసీ పరిశీలిస్తోంది. యుద్ధం తీవ్రత పెరగడం రష్యాలపై ఆంక్షలు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీనికి తగ్గట్టు దేశీయంగా రేపోమాపో ధరల సవరణ గ్యారెంటీ అనే అభిప్రాయం నెలకొంది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు ముందుగానే పెంపు దిశగా ఆలోచన చేస్తోంది ఆర్టీసీ. ప్రస్తుత అంచనాల ప్రకారం కిలోమీటరుకు సగటున 40 పైసల వంతున ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. వంటగ్యాస్ కూడా రష్యా చేపట్టిన దండయాత్ర ఎఫెక్ట్తో గ్యాస్ , పామాయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను 105 రూపాయలు పెంచాయి ఆయిల్ సంస్థలు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత 14.2 కేజీల వంట గ్యాస్సిలిండర్ ధర 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సన్ఫ్లవర్, పామాయిల్ వంటనూనె ధరలు లీటరకు సగటున 20 రూపాయలు పెరిగాయి. చదవండి: Russia: ఆర్థిక ఆంక్షలు.. ప్రభావితమయ్యే రష్యన్ కుబేరులు -
ముడి చమురు మంటలు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడులు.. ముడి చమురు మంటలకు ఆజ్యం పోశాయి. క్రూడాయిల్ ధరలు ఎకాయెకిన ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. బ్యారెల్ రేటు 104 డాలర్లపైకి చేరింది. 2014 ఆగస్టు 14 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ రేటు 150 డాలర్లకు కూడా వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం.. 2020 ఏప్రిల్–డిసెంబర్ మధ్య ముడిచమురు రేటు బ్యారెల్కు 39.3 డాలర్లుగా ఉండేది. మరోవైపు, రష్యా నుంచి భారత్కు పెద్దగా క్రూడాయిల్ సరఫరాలు లేకపోవడం వల్ల ఈ వివాదం మరింతగా ముదిరినా మనకు సరఫరా పరంగా పెద్ద సమస్యలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా రేట్లు భారీగా ఎగిసినా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు .. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను కట్టడి చేస్తుండటంతో ప్రస్తుతానికైతే వినియోగదారులపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ఆయన వివరించారు. కానీ, ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒక దశలో రేట్లు పెరగక తప్పదని పేర్కొన్నారు. ‘రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా సరఫరా వ్యవస్థలేమీ దెబ్బతినలేదు. మనకు సరఫరా చేసే దేశాలపై ప్రభావమేమీ లేదు. ఉద్రిక్తతలు మరింత ఉధృతమైనా ఈ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. అయితే, ప్రస్తుతానికి రిటైల్ ధరలను అదుపులోనే ఉంచినప్పటికీ.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగితే ఏదో ఒక దశలో వాటిని పెంచక తప్పకపోవచ్చు‘ అని అధికారి వివరించారు. ధరల మోత భయాలు... సరఫరాపరమైన సమస్యలు లేకపోయినప్పటికీ.. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్త పరిణామాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగిపోతే ఆ ప్రభావం దేశీయంగా గట్టిగానే కనిపించనుంది. చమురు రిటైల్ రేట్లు పెరిగి .. తత్ఫలితంగా మిగతా ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతాయనే భయాలు పెరుగుతున్నాయి. దేశీయంగా ఇంధనాల ధరలు .. అంతర్జాతీయ ఆయిల్ రేట్లకు అనుగుణంగా ప్రతి రోజూ మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా ధర పెరుగుతున్నా.. వివిధ కారణాల రీత్యా రికార్డు స్థాయిలో దేశీయంగా దాదాపు 113 రోజులుగా దేశీయంగా మాత్రం రిటైల్ రేట్లు మారలేదు. బ్యారెల్ 82–83 డాలర్ల రేటు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ .. ధరలను అదుపులో ఉంచుతున్నాయి. వచ్చే నెల ఎన్నికలు ముగిసిపోతే చాలు ఇక రేట్లకు రెక్కలొస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో 2018 మే నెలలో కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంధన రిటైల్ సంస్థలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు బ్యారెల్కు 5 డాలర్ల పైగా పెరిగినా.. 19 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచలేదు. ఎన్నికలు అలా ముగిశాయో లేదో ప్రతిరోజూ పెంచుకుంటూ పోయాయి. 16 రోజుల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 3.8, డీజిల్ రేటు రూ. 3.38 మేర పెరిగిపోయింది. 2020లో పెట్రోల్పై లీటరుకు రూ. 10, డీజిల్పై రూ. 13 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో ఇంధనాల రేట్లు పెరిగిపోయాయి. ప్రజా వ్యతిరేకత భయంతో మధ్యలో ఒకసారి సుంకాన్ని కొంత తగ్గించినప్పటికీ దేశీయంగా రేటు మాత్రం భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. మనకు క్రూడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే.. చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్.. ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. దేశీయంగా క్రూడాయిల్ లభ్యత నామమాత్రమే కావడం వల్ల ఏకంగా 85 శాతం ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దిగుమతి చేసుకున్న ముడిచమురును పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఉత్పత్తుల కింద మారుస్తారు. భారత్ దిగుమతి చేసుకునే ఆయిల్లో 63.1 శాతం భాగం సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి వస్తోంది. ఆ తర్వాత ఆఫ్రికా వాటా 14 శాతం, మరో 13.2 శాతం వాటా ఉత్తర అమెరికా నుంచి ఉంటోంది. భారత్ కొనుగోలు చేసే ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ రేటు నవంబర్లో 80.64 డాలర్లుగా ఉండగా, డిసెంబర్లో 73.30 డాలర్లకు తగ్గింది. జనవరిలో 84.87 డాలర్లకు, అటుపైన ఫిబ్రవరి 16 నాటికి 94.68 డాలర్లకు ఎగిసింది. రష్యా నుంచి చమురు దిగుమతులు నామమాత్రమే.. యూరప్లో సహజ వాయువు ఉత్పత్తిలో రష్యాకు మూడో వంతు వాటా ఉంటుంది. అంతర్జాతీయంగా ఆయిల్ ఉత్పత్తిలో దాదాపు 12 శాతం వాటా ఉంటుంది. ప్రపంచ ఇంధన రంగంలో రష్యా ముఖ్య పాత్ర వహిస్తున్నప్పటికీ .. సంక్లిష్టమైన క్రూడాయిల్ రకం, వ్యయాలు తదితర కారణాల రీత్యా ఆ దేశం నుంచి భారత్కు చమురు దిగుమతులు నామమాత్రంగానే ఉంటున్నాయి. భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా ఆయిల్ పరిమాణం కేవలం ఒక్క శాతం స్థాయిలో ఉంటుంది. 2021లో ఇది 43,400 బ్యారెళ్లుగా ఉంది. అలాగే, గతేడాది రష్యా నుంచి భారత్ 1.8 మిలియన్ టన్నుల బొగ్గు కొనుగోలు చేసింది. ఇది మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం మాత్రమే. ఇవి కాకుండా ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ధ్రువీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఏయే ఉత్పత్తుల ధరలు పెరగవచ్చంటే .. టోకు ధరల సూచీలో క్రూడాయిల్ సంబంధిత ఉత్పత్తుల వాటా తొమ్మిది శాతం పైగా ఉంటుంది. చమురు రేట్లు 10 శాతం మేర పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 0.9 శాతం మేర పెరగవచ్చని అంచనా. ఇంధనాల రేట్లు పెరగడం వల్ల రవాణా వ్యయాలు పెరుగుతాయి. ఫలితంగా కూరగాయలు మొదలుకుని తయారీ ఉత్పత్తుల వరకూ అన్నింటి ధరలూ పెరుగుతాయి. క్రూడ్ సంబంధిత ముడిపదార్థాలు వాడే పెయింట్లు, టైర్లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, కేబుల్స్ మొదలైన వాటి ధరలూ ఎగుస్తాయి. విద్యుదుత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. మొత్తం మీద చమురు రేట్ల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల వంట నూనెలు, కిరోసిన్, ఎల్పీజీ, విద్యుత్, గోధుమలు, లోహ ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయని పరిశ్రమ వర్గాల అంచనా. ముడిచమురు కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల క్రూడాయిల్ రేట్లు పెరిగితే దిగుమతుల బిల్లు, వాణిజ్య లోటు, ద్రవ్య లోటు మొదలైనవి కూడా పెరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో 85.54 బిలియన్ డాలర్ల విలువ చేసే క్రూడాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధితో పోలిస్తే ఇది ఏకంగా 121 శాతం అధికం. ప్రస్తుతం ఇంధన రిటైల్ రేట్లు ఇలా దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాలు, వ్యాట్ రేటును తగ్గించిన తర్వాత ప్రస్తుతం అక్కడ పెట్రోల్ రేటు లీటరుకు రూ. 95.41గా, డీజిల్ ధర రూ. 86.67గా ఉంది. 2021 అక్టోబర్ 26 నాటి క్రూడాయిల్ ధర 86.40 (బ్యారెల్కు) స్థాయికి ఇది అనుసంధానమై ఉంది. ముడిచమురు రేటు డిసెంబర్లో 68.87 డాలర్లకు పడిపోయినా ఆ తర్వాత నుంచి క్రమంగా పెరగడం మొదలైంది. ఫిబ్రవరిలోనే 12 శాతం పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికే ఇంధనాల రేటులో లీటరుకు రూ. 10 పైగా వ్యత్యాసం ఉందని, ఎన్నికల తర్వాత ధరల పెంపుతో ద్రవ్యోల్బణం భారీగా ఎగుస్తుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మొత్తం మీద చూస్తే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ రేట్లు 18–20 శాతం మేర పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
సామాన్యుడికి మళ్లీ షాక్ !.. కారణాలు ఇవే
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగుదల భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ భరోసా ఇచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడి–ఎకానమీ పురోగతి లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతక్రితం ఆర్బీఐ బోర్డును ఉద్దేశించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. బడ్జెట్ లక్ష్యాలను వివరించారు. వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ బోరŠుడ్డను ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి నెలకు సంబంధించి సోమవారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతం కాగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండంకెలపైన 12.96 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి ధరల స్పీడ్) నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6–2 శ్రేణిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఈ స్థాయిని దాటి జనవరి గణాంకాలు నమోదుకావడం గమనార్హం. మా అంచనాలు బలమైనవే.. కానీ: శక్తికాంతదాస్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం దిగువముఖంగా పయనిస్తోందని అన్నారు. తమ అంచనాలు ‘‘బలమైనవే’’, కానీ ప్రపంచ ముడిచమురు ధరల కదలికతో ముడిపడి ఉన్న ప్రతికూలతలు, సంబంధిత సమస్యలపై ఇవి ఆధారపడి ఉన్నాయని అన్నారు. ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రాతిపదికన, ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ ఒక నిర్దిష్ట శ్రేణిని ఇప్పటి వరకూ పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. అయితే ఈ అంచనాలు అన్నీ చివరకు క్రూడ్ ధరలు, సంబంధిత ప్రతికూల అంశాలపై ఆధారపడి ఉంటాయని వివరించారు. ‘‘మా ద్రవ్యోల్బణం అంచనాలు చాలా పటిష్టంగా ఉన్నాయని నేను ఇప్పటికీ చెబుతాను. మేము దానికి కట్టుబడి ఉన్నాము. పూర్తిగా ఊహించనిది ఏదైనా జరిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీకూ తెలుసు. ఇది ఎవ్వరూ ముందుగా ఊహించిలేని ఆకస్మిక స్థితి. ప్రస్తుతం ప్రతికూలాంశం ముడిచమురు ధరలే అని మీకు తెలుసు’’ అని గవర్నర్ తెలిపారు. ధరల స్థిరత్వం అంటే ప్రాథమికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కొనసాగించడమేనని పేర్కొన్నారు. దీనికి కట్టుబడి ఉండాలన్నదే తమ సంకల్పని పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణం పట్ల తన నిబద్ధత ఎలా ఉండాలన్నది రిజర్వ్ బ్యాంక్కు పూర్తిగా తెలుసునని దాస్ ఉద్ఘాటించారు. లోబేస్ ఎఫెక్ట్ ‘‘ద్రవ్యోల్బణం ధోరణిని పరిశీలిస్తే, 2020 అక్టోబర్ నుంచి 2021 అక్టోబర్ వరకూ ఈ రేటు దిగువముఖంగానే పయనించింది. అయితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఇది తీవ్రంగా కనబడుతోంది. దీనికి లోబేస్ ఎఫెక్ట్ కారణం. రానున్న నెలల్లో కూడా ఈ లోబేస్ ఎఫెక్ట్ గణాంకాలపై విభిన్న రీతుల్లో కనబడుతుంది‘‘ అని గవర్నర్ వివరించారు. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. కాగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. వచ్చే నెలలో గ్రీన్ బాండ్లు సావరిన్ గ్రీన్ బాండ్స్ జారీపై వచ్చే నెల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రూ.11.6 లక్షల కోట్లు మార్కెట్ రుణ సమీకరణలో భాగంగా కేంద్రం మొట్టమొదటిసారి 2022–23 వార్షిక బడ్జెట్లో ‘సావరిన్ గ్రీన్ బాండ్ల’ జారీ ప్రతిపాదన చేసింది. ఈ బాండ్ల ద్వారా సమీకరించే నిధులను పర్యావరణ సానుకూల ప్రభుత్వ మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు వినియోగించుకోవాలన్నది కేంద్రం లక్ష్యంమని బడ్జెట్ పేర్కొంది. ఏడు నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆర్బీఐ రెపో రేటు నిర్ణయానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం. దాదాపు 18 నెలల నుంచి ఇది ఇదే స్థాయిలో కొనసాగుతోంది) ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం జనవరిలో ఏకంగా 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఇది ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం (2021 జూన్లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఈ నెల మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. ధరల స్పీడ్ ఇలా... - తాజా సమీక్షా నెల్లో ఒక్క ఫుడ్ బాస్కెట్ చూస్తే ద్రవ్యోల్బణం 5.43 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.05 శాతం. - కూరగాయల ధరలు 2021 డిసెంబర్లో అసలు పెరక్కపోగా 2.99 శాతం క్షీణించాయి. అయితే 2022 జనవరిలో ఏకంగా 5.19 శాతం పెరిగాయి. - ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరల పెరుగుదల తీవ్రంగా 18.7 శాతంగా ఉంది. - తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరల పెరుగుదల డిసెంబర్లో 2.62 శాతం ఉంటే, జనవరిలో 3.39 శాతానికి ఎగశాయి. - మాంసం చేపలు ధరలు ఇదే కాలంలో 4.58 శాతం నుంచి 5.47 శాతానికి చేరాయి. - ఇంధనం–లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం డిసెంబర్లో 10.95 శాతం ఉంటే, జనవరిలో 9.32 శాతానికి తగ్గింది. - దుస్తులు, పాదరక్షలు, రవాణా, కమ్యూనికేషన్లసహా వివిధ ఇతర విభాగాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతంపైన నమోదయ్యింది. - కాగా, డిసెంబర్ 2021 ద్రవ్యోల్బణాన్ని కూడా 5.59 శాతం నుంచి ఎగువముఖంగా 5.66 శాతంగా గణాంకాల కార్యాలయం సవరించింది. టోకు ధరలు.. రెండంకెలపైనే.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్లో 13.56 శాతం ఉంటే, 2022 జనవరిలో 12.96 శాతానికి తగ్గింది (2021 జనవరి నెల టోకు ధరలతో పోల్చి). టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఒక ఆందోళనకరమైన అంశంకాగా, ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుండడం గమనించదగిన మరో ప్రతికూల అంశం. గడచిన పది నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 జనవరిలో ఈ రేటు 2.51 శాతం. అప్పటిలో బేస్ తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. కొన్ని కీలక విభాగాలు చూస్తే.. - ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ధరలు 2021 డిసెంబర్లో 9.56 శాతం పెరిగితే, 2022 జనవరిలో (సమీక్షా నెల) 10.33 శాతానికి ఎగశాయి. ఇందులో ఒక్క కూరగాయలను ధరల స్పీడ్ భారగా 31.56 శాతం నుంచి 38.45 శాతానికి చేరింది. - ఫుడ్ ఆర్టికల్స్లో పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, ధాన్యం నెలవారీగా పెరిగాయి. గుడ్లు, మాసం, చేపల ధరలు 9.85 శాతం ఎగశాయి. ఆలూ, ఉల్లి ధరలు మాత్రం 14.45 శాతం, 15.98 శాతం చొప్పున క్షీణించాయి. - మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, బేసిక్ మెటల్స్, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు ధరలు పెరిగాయి. - మొత్తం టోకు ధరల సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగానికి సంబంధించి ధరల స్పీడ్ 10.62 శాతం (2021 డిసెంబర్) నుంచి 9.42 శాతానికి తగ్గింది. - ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ధరల స్పీడ్ డిసెంబర్లో 32.30 శాతం ఉంటే, సమీక్షా నెల జనవరిలో 32.27 శాతానికి స్వల్పంగా తగ్గింది. -
దూసుకెళ్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఏడేళ్లలో మొదటిసారి బేరల్కు 93 డాలర్లు చేరడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధ్యతాయుత, సహేతుక ధరను భారత్ కోరుకుంటున్నట్లు రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. ఈ కమోడిటీ విషయంలో తీవ్ర ఒడిదుడుకులను నిరోధించాలని తాము చమురు ఉత్పత్తి దేశాలను కోరుతున్నట్లు తెలిపారు. దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు రేట్లకు అనుగుణంగా ఉంటాయి. దీనికితోడు దేశంలో పన్నుల భారం తీవ్రంగా ఉండడం ద్రవ్యోల్బణంపై ఒత్తిడులను పెంచుతోంది. ‘‘ముడిచమురు ధరల అస్థిరతపై భారతదేశం తన తీవ్ర ఆందోళనలను ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం), ఇతర అంతర్జాతీయ వేదికల చీఫ్ల దృష్టికి ద్వైపాక్షింగా తీసుకువెళుతోంది’’ అని తెలిపారు. మరో ప్రశ్నకు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానం చెబుతూ, 2021 డిసెంబర్ 1వ తేదీన బేరల్కు అంతర్జాతీయంగా 71.32 డాలర్లు ఉంటే, జనవరి 31వ తేదీ నాటికి 18.09 డాలర్లు పెరిగి 89.41 డాలర్లకు చేరిందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో రూపాయికి తొలి లాభం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుస నాలుగురోజుల ట్రేడింగ్ సెషన్లలో తొలిసారి లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు లాభపడి 74.44 వద్ద ముగిసింది. అయితే ఈ లాభం ధోరణి తాత్కాలికమేనని రూపాయి భారీగా బలపడిపోయే పరిస్థితి లేదన్నది నిపుణుల అభిప్రాయం. క్రూడ్ ఆయిల్ ధరలు, ఈక్విటీల బలహీనత, ద్రవ్యోల్బణం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాల వంటి సవాళ్లు రూపాయికి ప్రతికూలమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. రూపాయి మంగళవారం ముగింపు 74.58. బుధవారం ఉదయం ట్రేడింగ్లో 74.70 కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74.32 గరిష్ట స్థాయిని చూసింది. ఈ వార్త రాస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.36 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95.52 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్!
ముంబై: ఈ ఏడాది చివరి వారం స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో పాటు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు అంశాలతో అప్రమత్తత చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘రక్షణాత్మక రంగాలైన ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారంలో సాంకేతికంగా నిఫ్టీ 17,000 స్థాయిని నిలుపుకుంది. మార్కెట్ కరెక్షన్ కొనసాగితే దిగువ స్థాయిలో 16,700 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,650 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తే 17,150–17,200 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. గతవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.., రక్షణాత్మక రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 113 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు స్వల్ప లాభంతో గట్టెక్కాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రభావం ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. దేశంలో శనివారం నాటికి 150 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో సహా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. వైరస్ కట్టడికి అనేక పలు దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలను, కర్ఫ్యూలను విధిస్తుండటం వల్ల ఆర్థిక రివకరీకి ప్రతికూలం కావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలతో ట్రేడర్లు తమ పొజిషన్లను పరిమితం చేసుకుంటున్నారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 30న) నిఫ్టీ సూచీకి చెందిన డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో మూడు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,825 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఏడాది ముగింపు వారంలో అమ్మకాల తీవ్రత తక్కువగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అస్థితరత తగ్గితే ఎఫ్ఐఐల విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. సూక్ష్మ ఆర్థిక గణాంకాలు నవంబర్ నెల ద్రవ్యలోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలతో పాటు సెప్టెంబర్ క్వార్టర్కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లెక్కలు శుక్రవారం విడుదల కానున్నాయి. అదేరోజున డిసెంబర్ 17తో ముగిసిన వారం డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి, డిసెంబర్ 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను గణాంకాలను ఆర్బీఐ విడుదల చేయనుంది. మూడు లిస్టింగ్లు ఇటీవల ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన మూడు కంపెనీల షేర్లు ఈ వారంలో లిస్ట్ కానున్నాయి. హెచ్పీ అడెసివ్స్ షేర్లు సోమవారం(27న).., సుప్రియ లైఫ్సైన్సెన్స్ షేర్లు మంగళవారం(28న), సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు ఏడాది చివరిరోజున(డిసెంబర్ 31న) లిస్ట్కానున్నాయి. ఈ అంశమూ ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చు. -
ముడి చమురు మహా యుద్ధం!
చమురు విపణి చరిత్రలో తొలిసారిగా ఒక పక్క అమెరికా, చైనా, జపాన్, భారత్, దక్షిణా కొరియా, బ్రిటన్లు. మరోపక్క సౌదీ అరేబియా సారథ్యంలోని ‘పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య’ (ఒపెక్) ప్లస్. ఒకవైపు ప్రపంచమంతటా పెరుగుతూ, మూడేళ్ళ అత్యధికానికి చేరిన ముడి చమురు ధరలకు పగ్గం వేయడానికి ఉత్పత్తి, సరఫరాలు పెంచాలంటున్న అమెరికా తదితర ఆసియా దేశాలు. మరోవైపు పెడచెవిన పెడుతున్న ఒపెక్ ప్లస్ సభ్యులు. అందుకే, 50 మిలియన్ బ్యారళ్ళ ఆయిల్ అమెరికా, 5 మిలియన్ బ్యారళ్ళు భారత్ తమ అత్యవసర నిల్వల నుంచి విడుదల చేస్తామంటూ ప్రకటించడం కీలక పరిణామం. కొన్ని ఆసియా దేశాలు కలిసొస్తున్నాయి. ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపు కావడం కోసమే ఇలా రిజర్వుల నుంచి ఆయిల్ను విడుదల చేస్తు్తన్నట్టు దేశాల మాట. కానీ, ఈ నిర్ణయంతో ఆశించినట్టు చమురు ధరలు తగ్గుతాయా అన్నది ప్రశ్న. పైగా, ఒపెక్ ప్లస్ దేశాల వ్యతిరేక కూటమి అన్నట్టుగా మారిన ఈ చమురు వినియోగ దేశాల చర్యకు ‘ఒపెక్’ ప్లస్ నుంచి ప్రతిచర్య తప్పకపోవచ్చు. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య అక్షరాలా ఇది ముడి చమురు యుద్ధమే! దీనికి దారి తీసిన పరిస్థితులు అనేకం. కరోనా తారస్థాయికి చేరినవేళ చమురు సరఫరాలను ‘ఒపెక్’ ప్లస్ దేశాలు తగ్గించాయి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, చమురు డిమాండ్ పెరిగింది. ఆయిల్ ధరలేమో ఈ ఏడాది 50 శాతానికి పైగా పెరిగాయి. ద్రవ్యోల్బణం భారమైంది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి పెంచి, త్వరితగతిన మునుపటి స్థాయికి సరఫరాలు తీసుకురమ్మని ఒపెక్ ప్లస్ను వివిధ దేశాలు కోరాయి. అయినా లాభం లేకపోయింది. దాంతో, కలసికట్టుగా చమురు ధరకు చెక్ చెప్పడానికి అమెరికా అభ్యర్థనతో ఇతర దేశాలూ కదిలాయి. మునుపెన్నడూ లేనంత అత్యధికంగా అమెరికా విడుదల చేస్తున్న నిల్వలు ఈ డిసెంబర్ మధ్య నుంచి చివరిలోగా మార్కెట్లోకి రానున్నాయి. దీని వల్ల అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ నిలకడగా మారుతుందన్నది ఆశ. నిజానికి, చమురు సంక్షోభం తలెత్తిన 1973–74లో స్వతంత్ర సంస్థ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ’ (ఐఈఏ) ఏర్పాటైంది. 30 సభ్యదేశాల ఈ సంస్థ అప్పటి నుంచి ఆర్థిక సంపన్న దేశాల పక్షాన ప్రపంచవ్యాప్త ముడిచమురు సరఫరాలను పర్యవేక్షిస్తోంది. ఈ ఏజెన్సీ ఏర్పాటయ్యాక ఇప్పటిలా కొన్ని దేశాలు కలిసి ఓ సమన్వయంతో అత్యవసర నిల్వల నుంచి ఆయిల్ విడుదల గతంలో మూడేసార్లు జరిగింది. అవి – 1991లో గల్ఫ్ యుద్ధం, 2005లో కత్రినా – రీటా తుపాన్లతో మెక్సికో గల్ఫ్లో చమురు వసతులు దెబ్బతిన్న సందర్భం, 2011లో లిబియాలో యుద్ధంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయం! ఇప్పుడిది నాలుగోసారి. క్రిస్మస్ సెలవులు దగ్గర పడుతున్న అమెరికాలో ఇంధనం సగటున గ్యాలన్ 3.41 డాలర్లు పలుకుతోంది. 2014 నుంచి ఇదే అత్యధికం. గ్యాసోలిన్ రేటూ గత ఏడాది కన్నా 1.29 డాలర్లు పెరిగింది. అనేక సవాళ్ళతో ప్రతిష్ఠ దెబ్బతిన్న బైడెన్కు.. ఈ ప్రయాణాల సీజన్లో సగటు అమెరికన్ల కోసం నిల్వల విడుదల తప్పలేదు. ప్రపంచ చమురు వినియోగంలో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం భారత్దే. తర్వాతి స్థానాలు జపాన్, దక్షిణ కొరియాలవి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 99 మిలియన్ బ్యారళ్ళ చమురు సరఫరా అవుతుంది. వీటన్నిటి అత్యవసర నిల్వలు కలిపినా, 15 రోజుల ప్రపంచ సరఫరాకే సరి. వీటిలో అత్యధికంగా 714 మిలియన్ బ్యారళ్ళ అత్యవసర నిల్వలున్నవి అమెరికా వద్దే! 39 మిలియన్ బ్యారళ్ళ నిల్వలు మన దగ్గరున్నాయి. ఇంధన ధరలు తగ్గేందుకు నిల్వలను విడుదల చేయాలని మునుపెన్నడూ లేని రీతిలో అమెరికా గత వారం అభ్యర్థించింది. ఆ ప్రతిపాదనను భారత్ మొదట ప్రశ్నించింది. చివరకు రోజువారీ దేశీయ వినియోగానికి సమానమైన మొత్తంలో 5 మిలియన్ బ్యారళ్ళ నిల్వల విడుదలకు సై అంది. ప్రతీకాత్మకమే అయినా, ఈ చర్య వల్ల మనకు లాభం కన్నా నష్టమనే వాదనా ఉంది. ఇక ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగుమతిదారు చైనా. తమ దేశంలో ఆయిల్ ధరకు కళ్ళెం వేయడానికి ఈ ఏడాది ఇప్పటికే చాలాసార్లు నిల్వలు విడుదల చేసింది. వివరాలు వెల్లడించనప్పటికీ, తాజా కలసికట్టు ప్రయత్నానికీ బాసటగా నిలుస్తానంటోంది. 1100 బిలియన్ బ్యారళ్ళ నిల్వలున్న ఒపెక్ ప్లస్కు, మరెన్నో లక్షల బ్యారళ్ళ మిగులు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయినా సరే, డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి పెంచడం లేదు. యూరప్లోని తాజా లాక్డౌన్లు సహా అనిశ్చిత పరిస్థితులను సాకుగా చూపుతోంది. ఉత్పత్తిని తగ్గించి, ధరలు పెరిగేలా చేస్తోందనే అనుమానానికీ తావిచ్చింది. ఇక తప్పక... ‘ప్రపంచ చమురు విపణి వేదికపై మీరే కాదు.. మేమూ ఉన్నామ’న్నట్టు ఒపెక్ ప్లస్కు కొన్ని దేశాలు పరోక్షంగా సవాలు విసిరినట్టయింది. డిసెంబర్ 2న సమావేశమయ్యే ఒపెక్ ప్లస్ దీనికెలా స్పందిస్తుందో, పరిణామాలెలా ఉంటాయో చూడాలి. ఇప్పటికైతే నిల్వల విడుదల ప్రకటన ప్రభావం లేదు. బుధవారం ఆయిల్ ధరలు వారంలోకెల్లా గరిష్ఠానికి చేరాయి. ఒకవేళ రేపు ధరలు తగ్గినా, అదీ తాత్కాలికమే. సరఫరాల్లో సమస్యలు తలెత్తితే తట్టుకోవడానికని పెట్టుకున్న నిల్వలతో అధిక ధరలను నియంత్రించాలనుకోవడం చురకత్తితో పెనుయుద్ధం చేయాలనుకోవడమే! తాజా చమురు పోరుతో అమెరికా, సౌదీ అరేబియా సంబంధాలూ మరింత దెబ్బతినవచ్చు. కానీ ఇప్పటికీ భయపెడుతున్న కరోనా నుంచి కొన్ని దేశాలు, ఆర్థిక మందగమనం నుంచి మిగతా దేశాలు బయటపడడమే ప్రస్తుతం కీలకం! ఒపెక్ చేతిలో ఆటబొమ్మ కాకూడదంటే, సౌరశక్తి లాంటి తరగని ఇంధన వనరుల వైపు మళ్ళడమే ఎప్పటికైనా శరణ్యం!! -
చమురు ధరలకు భారత్ చెక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా మండుతున్న ముడిచమురు ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అత్యవసర వినియోగానికి పక్కనపెట్టే చమురు నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారళ్లను విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా యూఎస్, చైనా, జపాన్ బాటలో నడవనుంది. దేశ చరిత్రలోనే తొలిసారి కేంద్ర ప్రభుత్వం 3.8 కోట్ల బ్యారళ్ల(5.33 మిలియన్ టన్నులు) ముడిచమురును నిల్వ చేసింది. ఇందుకు తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో ఏర్పాటు చేసిన భూగర్భ బిలాలను వినియోగించుకుంది. వీటి నుంచి తాజాగా నిర్ణయించిన 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో 1.33 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నులు, పాడూర్లో 2.5 మిలియన్ టన్నులు చొప్పున చమురు స్టోరేజీలున్నాయి. కాగా.. దేశీయంగా రోజుకి 4.8 మిలియన్ బ్యారళ్ల చమురును వినియోగిస్తుండటం గమనార్హం! అమెరికా రెడీ ప్రపంచ ఇంధన ధరలు తగ్గేందుకు వీలుగా నిల్వల నుంచి చమురును విడుదల చేయవలసిందిగా గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో గత వారం యూఎస్ ప్రభుత్వం అభ్యర్థించింది. ఇందుకు ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు చైనా, ఇండియా, జపాన్ తదితరాలనుద్ధేశించి కలసికట్టుగా వ్యవహరించాలంటూ సూచించింది. చమురు ఉత్పత్తిని పెంచమంటూ పలుమార్లు చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్), తదితర దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో యూఎస్ వినియోగ దేశాలకు చమురు విడుదలకు సూచించింది. ఇందుకు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ 50 మిలియన్ బ్యారళ్లను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బాటలో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వుల నుంచి 5 మిలియన్ బ్యారళ్ల విడుదలకు భారత్ సైతం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇతర ప్రధాన వినియోగ దేశాలతో చర్చల ద్వారా భారత్ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వివరించాయి. చమురు వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో పెద్ద దేశంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా 72.7 కోట్ల బ్యారళ్ల చమురును నిల్వ చేయగా.. జపాన్ 17.5 కోట్ల బ్యారళ్ల చమురును రిజర్వులో ఉంచుతోంది. సహేతుకంగా లిక్విడ్ హైడ్రోకార్బన్ల ధరలు సహేతుకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మార్కెట్ శక్తులు ధరలను నిర్ణయించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. చమురు ఉత్పాదక దేశాలు డిమాండ్ కంటే తక్కువగా సరఫరాలను కృత్రిమంగా సర్దుబాటు చేయడంపై పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఇది ధరల పెంపునకు దారితీస్తున్నట్లు పేర్కొంది. అయితే చమురు విడుదల తేదీని వెల్లడించనప్పటికీ రానున్న 7–10 రోజుల్లోగా నిర్ణయానికి వీలున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మక రిజర్వుల నుంచి పైపులైన్లు కలిగిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్(ఎంఆర్పీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్పీసీఎల్)కు చమురును విక్రయించనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా ప్రకటన... వాషింగ్టన్: దేశ వ్యూహాత్మక రిజర్వుల నుంచి 5 కోట్ల బ్యారళ్ల చమురు విడుదలకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా నిర్ణయించినట్లు వైట్హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా అమెరికన్ల ఇంధన వ్యయాలను తగ్గించనున్నట్లు తెలియజేసింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఇండియా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూకేలతో సంప్రదింపుల తదుపరి బైడెన్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడుతున్న సమయంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి ఇతర దేశాలతో బైడెన్ చర్చలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఈ అంశంపై కొద్ది వారాలుగా ఇతర దేశాలతో నిర్వహిస్తున్న చర్చలు వెల్లడవుతున్న నేపథ్యంలో ధరలు 10% దిగివచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేసింది. ఇటీవల గ్యాస్ ధరలు గ్యాలన్కు 3.4 డాలర్లను తాకినట్లు పేర్కొంది. ఇది ఏడాదిక్రితం ధరలతో పోలిస్తే 50% అధికమని తెలియజేసింది. ధరలు దిగివస్తాయ్.. ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు యూఎస్, చైనా, భారత్ తదితరాలు చేతులు కలపడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాల్లో కోతలకు వ్యతిరేకంగా యూఎస్, భారత్ అత్యవసర నిల్వల నుంచి చమురును దేశ వ్యవస్థలలోకి విడుదల చేయనుండటంతో ధరలకు కొంతమేర చెక్ పడే వీలున్నట్లు తెలియజేశాయి. చమురు సరఫరాలు పెరిగితే.. దిగుమతులను తగ్గించుకోవలసి ఉంటుంది. దీంతో ముడిచమురుకు తాత్కాలికంగా డిమాండ్ తగ్గనుంది. వెరసి ధరలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు కోవిడ్–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడం పలు దేశాలలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు యూఎస్ ప్రభుత్వం తాజాగా వ్యాఖ్యానించింది. డిమాండుకు తగిన రీతిలో సరఫరాలను పెంచమంటూ చమురు ఉత్పత్తి, ఎగుమతి(ఒపెక్) దేశాలను అభ్యర్థించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇంధన వినియోగ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఏకంకావడంతో ధరలు బలహీనపడే అవకాశమున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
బుల్ బౌన్స్బ్యాక్
ముంబై: మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడితో తడబడిన బుల్ శుక్రవారం లాభాల బాటలో దూసుకెళ్లింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలను ఆసరాగా చేసుకొని ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ భయాలను విస్మరించి కొనుగోళ్లు చేపట్టారు. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల్లో షార్ట్ కవరింగ్ చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్లు మూడు శాతం మేర రాణించి సూచీల రికవరీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు అంతుకు ముందు కోల్పోయిన కీలకమైన 60వేలు, 18వేల స్థాయిని తిరిగి అందుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మీడియా షేర్లు మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూశాయి. మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 767 పాయింట్లు పెరిగి 60,687 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 18,103 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.511 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.77 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడ్డాయి. నిరాశపరిచిన ఫినో పేమెంట్స్ బ్యాంక్... లాభాల మార్కెట్లోనూ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.577 కాగా.., రూ.548 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 11 శాతం వరకూ పతనమై రూ.534 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి ఐదున్నర శాతం నష్టంతో రూ.545 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజ్లో 6.24 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ విలువ రూ.4,537 కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► విదేశీ పెట్టుబడులకు ప్రామాణికంగా భావించే ఎంఎస్సీఐ ఇండెక్స్లో చోటు దక్కించుకోవడంతో జొమాటో షేరు ఇంట్రాడేలో పది శాతం పెరిగి రూ.155 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి రూ.153 వద్ద ముగిసింది. ► విమాన ప్రయాణికుల రద్దీ అక్టోబర్లో పెరగడం ఇండిగో షేరుకు కలిసొచ్చింది. బీఎస్ఈ లో ఏడు శాతం లాభంతో రూ.2305 వద్ద స్థిరపడింది. ఏకంగా 929.57 కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. ► నైకా షేరుకు డిమాండ్ తగ్గడం లేదు. ఇంట్రాడేలో తొమ్మిది శాతం పెరిగి రూ.2410 వద్ద ఆల్ టైం హైని నమోదుచేసింది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.2359 వద్ద స్థిరపడింది. -
ప్రపంచ రికవరీకి చమురు మంట
న్యూఢిల్లీ: ముడి చమురు ధరల తీవ్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ ఎకానమీ రికవరీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగ దేశమేకాకుండా, దిగుమతుల విషయంలోనూ ఇదే స్థానాన్ని ఆక్రమిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ బేరల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయిలో 80 డాలర్లపైన స్థిరంగా కదలాడుతుండడం, దేశీయంగా పెట్రో ధరలు మండిపోతుండడం, దీనితో ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో సీఈఆర్ఏవీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరమ్లో భారత్ చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► కోవిడ్–19 వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్రూడ్ ధరల తీవ్రతతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రికవరీకి తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. ► క్రూడ్ ధరల ఒడిదుడుకుల పరిస్థితిని అధిగమించాల్సి ఉంది. ఇందుకు దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులు అవసరం. స్థిర ధరల వ్యవస్థకు ఇది దోహదపడుతుంది. ► చమురు డిమాండ్, ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం) వంటి ఉత్పత్తిదారుల సరఫరాలకు మధ్య పొంతన లేదు. ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ► క్రూడ్ ధరల పెరుగుదల వల్ల వర్థమాన దేశాలకే కాకుండా, పారిశ్రామిక దిగ్గజ దేశాలకూ కష్టాలు తప్పవు. ప్రపంచ ఆరి్థక వ్యవస్థ స్థిరంగా వృద్ధి బాటన పయనించేలా చూడ్డం అందరి బాధ్యత. ఇతర దేశాల మంత్రులతో సమావేశాల సందర్భంగా నేను ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ► 2020 జూన్లో 8.8 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ చమురు దిగమతుల బిల్లు, 2021లో సగటున 24 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాంట్రాక్ట్ విధానం మారాలి: తరుణ్ కపూర్ ఇదే సమావేశంలో పెట్రోలియం వ్యవహారాల కార్యదర్శి తరుణ్ కపూర్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి ఒపెక్ దేశాల నుండి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం వంటి దిగుమతి చేసుకునే దేశాలు ప్రస్తుతం ‘వన్–టర్మ్ కాంట్రాక్ట్’ను కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ తరహా ఒప్పందాలు సరఫరాలకు సంబంధించి పరిమాణం స్థిరత్వాన్ని మాత్రమే అందిస్తాయని తెలిపారు. డెలివరీ సమయంలో అంతర్జాతీయ మార్కెట్ను అనుసరించి ధరల విధానం ఉంటోందన్నారు. ఈ సమస్య తొలగాలంటే ఒక బెంచ్మార్క్గా ధరలకు అనుసంధానమయ్యే దీర్ఘకాలిక కాంట్రాక్ట్ అవసరమని సూచించారు. భారత్ తన మొత్తం క్రూడ్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గ్యాస్ విషయంలో ఇది 55 శాతంగా ఉంది. భారత్లో చమురు డిమాండ్ కూడా అధికంగా ఉంది. భారత్ ఎకానమీ రికవరీకి దెబ్బతగిలితే, అది చమురు ఉత్పత్తిదారులకూ నష్ట మేనని భారత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఆర్థిక రికవరీకి చమురు రేట్ల ముప్పు
న్యూఢిల్లీ: భారీగా పెరిగిపోతున్న ముడి చమురు రేట్లు .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీని దెబ్బతీసే ప్రమాదముందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలు సహేతుక స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియాతో పాటు చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ను కోరింది. ‘ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం పాటించే విధంగా చమురు రేట్లు ఉండాలి. ప్రస్తుతం సరఫరా కన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో రేట్లు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాలకు మరింత వేగంగా మళ్లే అవకాశం ఉంది. కాబట్టి అధిక ధరలనేవి ఉత్పత్తి దేశాలకు కూడా ప్రతికూలంగానే పరిణమించగలవని ఒపెక్ కూటమికి భారత్ తెలియజేసింది‘ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలే సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, రష్యా తదితర దేశాలతో సమావేశాల సందర్భంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలపై చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. చమురు ధరలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు సాధించిన రికవరీ దెబ్బతినే అవకాశం ఉందని ఆయా దేశాలకు మంత్రి స్పష్టం చేసినట్లు అధికారి తెలిపారు. బ్యారెల్ ధర 65–70 డాలర్ల స్థాయి పైగా ఉండటం వల్ల దిగుమతి దేశాలకు సమస్యాత్మకంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. చమురుకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న ఏకైక దేశమైన భారత్ పక్కకు తప్పుకుంటే .. ఉత్పత్తి దేశాలకు కూడా సమస్యేనని అధికారి పేర్కొన్నారు. ధర మాత్రమే కాకుండా సరఫరా కాంట్రాక్టులు, చెల్లింపుల్లోనూ వెసులుబాట్లు కావాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం భాగాన్ని భారత్ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అలాగే 55 శాతం గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది. -
ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..!
ఇంధన ధరల పెరుగుదల పలు దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆయా దేశాల్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్ లాంటి దేశాల్లో ఇంధన ధరలు సామాన్యుడి నడ్డిని విరుస్తున్నాయి. ఇప్పటికే భారత్లో పెట్రోల్ సెంచరీ దాటి పెరుగుతూనే ఉంది. కరోనా రాకతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గిపోయింది. కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. గత కొద్ది రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. చదవండి: చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! బ్యారెల్ ధరలు 100 డాలర్లకు..! ఇంధన ధరల పెరుగుదలతో సతమతమౌతున్న ప్రపంచదేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిడుగు లాంటి వ్యాఖ్యలను చేశాడు.అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లకు కచ్చితంగా చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం డబ్యూటీఐ ప్రకారం బ్యారెల్ ముడిచమురు ధర 80 నుంచి 83 డాలర్ల వద్ద కొనసాగుతుంది. రష్యా, ఒపెక్ దేశాలతో ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో నిలకడగా ఉంచేందుకు ప్రయత్నాలను చేస్తామని పుతిన్ అన్నారు. పెరుగుతున్న ముడిచమురు ధరలకు ప్రత్యామ్నాయంగా యూరప్ దేశాలకు నేచురల్గ్యాస్ను అందించడానికి రష్యా సిద్దంగా ఉందని పేర్కొనడం గమనార్హం. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్న్యూస్...! -
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఆలస్యం చమురు కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై నేరుగా మోపాయి. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్పై 32 పైసల వంతున ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.106.73లకు చేరుకోగా లీటరు డీజిల్ ధర రూ. 99.33గా నమోదు అయ్యింది. ఇకపై బాదుడే నవంబరు వరకు ముడి చమురు ఉత్పత్తిని పరితంగానే చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ అయిల్కి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో నవంబరు వరకు ముడి చమురు ధరలు తగ్గే అవకాశం లేదు. దీంతో మరో రెండు నెలల వరకు ప్రలజకు పెట్రో వడ్డన చేయనుంది ప్రభుత్వం. వెనువెంటనే జులై చివరి వారం నుంచి ఆగస్టు, సెప్టెంబరు వరకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. బ్రెండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 75 డాలర్ల నుంచి 56 డాలర్ల వరకు పడిపోయింది. ఆ సమయంలో ధరల స్థిరీకరణ పేరుతో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు చమురు కంపెనీలు ఆసక్తి చూపించలేదు. కంటి తుడుపు చర్యగా కేవలం రూపాయికి అటుఇటుగా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించారు. కానీ గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర పెరగడం ఆలస్యం ఆ భారాన్ని వెంటనే సామాన్యులపై మోపింది ప్రభుత్వం. చదవండి : పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు! -
పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు!
ఫ్రాంక్ఫర్ట్: నవంబరు వరకు పెట్రో బాదుడు తప్పేలా లేదు. చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలతో పాటు వాటి మిత్ర కూటమి తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఫలితంగా గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. సోమవారమయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. ఒపెక్ నిర్ణయాలు కోవిడ్ మహమ్మారి సమయంలో తగ్గిన ఉత్పత్తిని పునరుద్ధరించే క్రమంగా నెమ్మదిగా ఉండాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం నవంబర్లో రోజుకు 400,000 బారెళ్ల మేర మాత్రమే ఉత్పిత్తిని పెంచాలని ఒపెక్, ఈ కూటమి మిత్ర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే చమురు ఉత్పత్తి పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. ఐనప్పటికీ గ్లోబల్ మార్కెట్లలోకి భారీ సరఫరాలను పెంచరాదని ఒపెక్ కూటమి నిర్ణయించింది. ఫలితంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్వీట్ క్రూడ్ బేరల్ ధర 3 శాతంపైగా లాభంతో 78 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 3 శాతం లాభంతో 82 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. చదవండి :పెట్రోల్ సెంచరీ..మరీ ఈవీ ఛార్జింగ్ కాస్ట్ ఎంతో తెలుసా ?